మొత్తం పేజీ వీక్షణలు

19, డిసెంబర్ 2017, మంగళవారం

మానవుని ఉత్కృష్టత


ఆహార నిద్రాభయమైథునం చ సామాన్య మేతత్‌ పశుభిర్నరాణామ్‌ ।
ధర్మో హి తేషామధికో విశేషో ధర్మేణ హీనాః పశుభిః సమానాః ॥
(హితోపదేశము, ప్రస్తావిక - 26)
శరీర పోషణకై ఆహారము తినుట, నిద్రా, భయము మరియు సంతానోత్పత్తి అను ఈ నాుగు గుణము పశువులోను, మనుష్యులోను సమానముగ కనిపించు సామాన్యగుణము. మనుష్యులో ధర్మమనునది విశేషగుణము. ధర్మాచరణలేని మనుష్యు పశువుతో సమానము.
ధర్మాచరణుడగుటకు మనుష్యుడు విద్యను - జ్ఞానమును సంపాదింపవసి యున్నది. విద్యవననే అతడు పదార్థముయొక్క యథార్థస్వరూపమును తెలిసికొనును. అప్పుడు వాటితో ఉచితరీతిలో వ్యవహరించి తన ముఖ్యోద్దేశ్యమైన మోక్షమును పొందుటకు ప్రయత్నించగడు. మోక్షమును పొందగ యోగ్యత కేవము మనుష్యునకే కదు. ఇదియే మానవుని ఉత్కృష్టత. ఈ మానవశరీరమందే పరమాత్మను సాక్షాత్కారము చేసికొనుటకు మీన్నది. మనుష్యుని నరుడు అని కూడ అంటారు. నృా నయే అను ధాతువుతో నర శబ్దమేర్పడును. నయతీతి నరః అని నిర్వచనము. నరుడనగా ఇతరుకు మార్గదర్శకుడు.
న రమతే ఇతి నరః అని కూడ ఒక పరిభాష. ఇంద్రియములో రమించనివాడు. అనగా వాటికి దాసుడు కాక వాటిని తన వశములో ఉంచుకొనువాడు.
విజ్ఞానసారథిర్యస్తు మనః ప్రగ్రహవాన్నరః ।
సో-ధ్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదమ్‌ ॥ (కఠోపనిషత్తు 3-9)
విశేష జ్ఞానమును సారథిగా గలిగి మనస్సును తన వశమందుంచుకొన్నవాడు నరుడు. అతడు జన్మమరణరూపకమగు మార్గముయొక్క అంతమును, వ్యాపకుడగు పరమాత్ముని పరమపదమును - మోక్షానందమును పొందగడు.
వైదిక సాహిత్యములో ఈ మానవశరీరము ఋషిభూమి, దేవపురి, బ్రహ్మపురి అని చెప్పబడిరది.  ఐదు జ్ఞానేంద్రియము, మనస్సు, బుద్ధి ఈ ఏడిరటిని ఋషుని అంటారు. ఇవి ఈ శరీరములో ఉంటాయి. కనుక ఇది ఋషిభూమి. ఇంద్రియముకు దేవతని పేరు. అందుచే ఇది దేవపురి. ఈ శరీరములోనే పరమాత్మ సాక్షాత్కారమవుతుంది. కావున ఇది బ్రహ్మపురి.


ఎవరిని ఆర్యులంటారు ?


1.     ఋ గతౌ అను ధాతువునకు ‘ణ్యత్‌’ ప్రత్యయము చేర్చినచో ఆర్య శబ్దమేర్పడును. ఈ ధాతువునకు జ్ఞానము, గమనము, ప్రాప్తి అని అర్థము. ఆర్య శబ్దమునకు ఈ క్రింది అర్థము కవు.
ఆర్యుడు    R    జ్ఞానవంతుడు.
        గతిశీుడు, కర్మశీుడు.
            ధర్మార్థకామమును త్రివిధపురుషార్థముచే
            ఉత్కృష్టమైన మోక్షమును పొందువాడు.
2.    శాంతిస్థితిక్షుర్దాన్తశ్చ సత్యవాదీ జితేన్ద్రియః ।
    దాతా దయాుర్నమ్రశ్చ ఆర్యః స్యాదష్టభిర్గుణైః ॥ (మహాభారతము)
1. శాంతగుణము, 2. సహనశీత, 3. మనోనిగ్రహము, 4. సత్యభాషణము, 5. ఇంద్రియ- జయత్వము, 6. దానశీత, 7. దయాగుణము, 8. నమ్రత - వినయము అను ఈ ఎనిమిది గుణము గ వ్యక్తిని ఆర్యుడని అంటారు.
3.    ఆర్య ఈశ్వరపుత్రః । (నిరుక్తము 6-26)
ఆర్య శబ్దము ఈశ్వరవాచకము. ఆర్యస్య అపత్యం ఆర్యః. ఆర్య శబ్దమునకు అపత్య (సంతానము) అర్థములో ‘అణ్‌’ ప్రత్యయము చేరి ఆర్యశబ్దము ఏర్పడును. అనగా ఈశ్వరుని కుమారుడు ఆర్యుడు అని అర్థము. ఈశ్వరుని గుణకర్మస్వభావముకు అతని ఆజ్ఞకు అనుకూముగ వ్యవహరించువాడు ఆర్యుడు.
4.    ఆర్యః R మాన్యః, ఉదారచరితః, శాన్తచిత్తః న్యాయపథావంబీ, ప్రకృతాచారశీః (శాస్త్రానుకూమైన ఆచారశీుడు) సతతకర్తవ్యకర్మానుష్ఠాతా. (ప్రాచీనకోశము)
5.    మహాకుకులీన (శ్రేష్ఠుడు) ఆర్యసభ్యసజ్జనసాధవః (అమరకోశము)
    ఇవి అన్ని సమానార్థక శబ్దము.
6.     అర్తుం ప్రకృతమాచరితుం యోగ్య ఆర్యః.
    శాస్త్రానుకూ ఆచారమునకు యోగ్యుడు ఆర్యుడు.
7.    ఆర్యాః శ్రేష్ఠగుణకర్మస్వభావయుక్తా మనుష్యాః (దయానంద సరస్వతి)
    శ్రేష్ఠమైన గుణకర్మస్వభావము కవారు ఆర్యు.
ఈ విధముగ మన ప్రాచీన భారతీయసాహిత్యమున ఆర్య శబ్దము గుణవాచకముగనే భించును. అందుచే ఈ భూగోళముపైననే కాదు ఈ విశ్వములో పైన చెప్పిన గుణము గ వ్యక్తి ఎచ్చటనున్నను ఆర్యశబ్ద వాచ్యుడే. అంతే కాని ఆధునికచరిత్ర ప్రకారము జాతివాచకము కాదు. కావున ఈశ్వరుడు వేదము ద్వారా కృణ్వన్తో విశ్వమార్యమ్‌ అని బోధించినాడు. అనగా విశ్వములోని మానవునందరిని ఆర్యుగా - శ్రేష్ఠుగా చేయుడు.

మానవుని జీవనోద్దేశ్యము


దీనిని పురుషార్థము అని కూడ అంటారు. అనగా ప్రతి మనుష్యుడు ప్రయత్నపూర్వకముగ క్రియాశీుడై సాధించవసినది - పొందదగినది. అది ధర్మము, అర్థము, కామము, మోక్షము - పరమాత్మ సాక్షాత్కారము అని నాుగు విధము. నాుగవదైన మోక్షమును అత్యంతపురుషార్థమని కూడా అంటారు.
ధర్మము: ప్రపంచములోని మానవుందరు ఆచరించదగినది. పక్షపాతములేని న్యాయము, అందరికి హితముచేయుట, భగవంతుని ఆజ్ఞను పాలించుట, అసత్యమును త్యజించుట, సత్యమును గ్రహించి ఆచరించుట.
అర్థము: మనము జీవించుటకు ఉపయోగపడే వస్తువు. ఆహార పదార్థము, వస్త్రము, గృహము, ధనము, గృహములో వాడుకొనే విభిన్న వస్తువు.
కామము: అనగా కోరిక. ధనసంపాదన, గృహనిర్మాణము, భూమును సంపాదించుట, కీర్తిప్రతిష్ఠను సంపాదించుట, ఉన్నత ఉద్యోగము కావానుకొనుట. ఈ కోరికు హద్దు దాటకూడదు.
మోక్షము: అన్నిరకము దుఃఖమునుండి విడిపోయి భగవంతునిలోని ఆనందమును - సుఖమును అనుభవించుట. అది భగవంతుని సాక్షాత్కారము వన కుగును. ఆ సుఖము ఎంత అనుభవించినను తనివితీరదు. లోకములోని ఇతర సమస్తసుఖము తాత్కాలికము. అవి సుఖముతో పాటు దుఃఖమును కలిగించును. వివేకవంతుని దృష్టిలో జగత్తులోని అన్ని పదార్థము దుఃఖమును కలిగించునవే. మోక్షమును పొందినవానికి శరీరము ఉండదు. సుదీర్ఘకాము వరకు ఆనందమునే అనుభవిస్తాడు. అతనికి ఏ విధమైన దుఃఖము ఉండవు. శరీరములో ఉన్నప్పుడే దుఃఖము ఉంటాయి. ధర్మము, అర్థము, కామము అను మూడు పురుషార్థము మోక్షమును పొందుటకు సాధనములే. మోక్షమే జీవితము యొక్క ముఖ్య ఆశయము - ఉద్దేశ్యము. అది మానవజన్మలోనే సాధ్యము. అదే మానవుని గమ్యము, పరమావధి.
ఇహ చేదవేదీదథ సత్యమస్తి న చేదవేదీన్మహతీ వినష్టిః ।
భూతేషు భూతేషు విచిన్త్య ధీరాః ప్రేత్యాస్మాల్లోకాదమృతా భవన్తి ॥
                    (కేనోపనిషత్తు 2-5)
ఈ మానవ శరీరమందున్న జీవుడు పరమాత్మను తెలిసికొని అతనిని సాక్షాత్కారము చేసికొన్నప్పుడు ఈ జన్మ సఫము. దానికై ప్రయత్నించక ఇంద్రియలోుడై విషయముందు చిక్కుకొన్నవానికి కుగు నష్టమును ఇంత అని చెప్పలేము. అది ఊహించడానికి మీలేనిది. అందుకే విద్వాంసు ధ్యానశీురై ఈ చరాచర జగత్తునందలి జడచేతనపదార్థములో అతి సూక్ష్మమై వ్యాపించియున్న పరమాత్మను నిశ్చయపూర్వకముగ తెలిసికొని జన్మ మరణరూపమైన బంధనమునుండి - దుఃఖమునుండి విడిపోయి బ్రహ్మానందమును అనుభవిస్తారు. పామయి విషయలోురై దుఃఖమును అనుభవిస్తారు.


సత్యము, అసత్యము


సత్సు తాయతే తత్‌ సత్యమ్‌ ।
విద్యమాన - ఈ సృష్టిలో ఉన్న వస్తువులో వ్యాపకమై ఉన్న గుణము సత్యము.
సత్యం కస్మాత్‌? సత్సు తాయతే, సత్ప్రభవం భవతీతి వా ।
                    (నిరుక్తము 3-13)
సత్పురుషులో విస్తరించుటచేత, సత్పురుషునుండి ఉద్భవించుట వన సత్యమనబడుచున్నది.
యత్‌ యథావత్‌ తత్త్వపదార్థం తత్‌ సత్యమ్‌ ।
ఏ వస్తువు ఎట్లుండునో దానినట్లే చెప్పుట సత్యము. పదార్థము-వస్తువు ఏ విధముగా ఉంటుందో దానిని అట్లే తెలిసికొనుట, దానిని అదేమాదిరిగా ఒప్పుకొనుట, ఇతరుకు దానిని గురించి అదేవిధముగా చెప్పుట, ఆ వస్తువుతో అలాగే వ్యవహరించుట, దాని ద్వారా పూర్ణలాభమును పొందుటను సత్యము అందురు. దానికి విపరీతమైనది అసత్యము.
సత్యము: సరళము, వస్తుస్థితికి అనుకూము. సత్యము గ చోట ఉత్సాహము, నిర్భయము ఉంటుంది. ఇది వజ్రము కన్న కఠినము. పుష్పము కంటె మృదువు. అభ్యాసము లేకపోవుటవన సామర్థ్యము లేకపోవుటవన సత్యభాషణము కఠినమనిపించును. నిజానికి సత్యమును సాధారణవ్యక్తియు, విద్వాంసుడును సుభముగ చెప్పగడు.
అసత్యము: వక్రము, వస్తుస్థితికి ప్రతికూము. అసత్యముగ చోట జ్జా, భయము ఉండును. అసత్యమును అతితెలివిపయి మాత్రమే చెప్పగరు. అసత్యభాషణమువన కష్టప్రాప్తియు కుగును.
న హి సత్యాత్పరో ధర్మో నానృతాత్‌ పాతకం పరమ్‌ ।
న హి సత్యాత్పరం జ్ఞానం తస్మాత్సత్యం సమాచరేత్‌ ॥
సత్యము కన్న ధర్మము అసత్యమునకు మించిన పాపములేదు. సత్యమును మించిన జ్ఞానములేదు. అనగా సత్యమే జ్ఞానము. కావున సత్యమునే ఆచరించుము.
నాస్తి సత్యవతామప్రాప్యమ్‌ ॥ (చాణక్య నీతి సూత్రము)
సత్యవంతుకు భించనిది లేదు.
సత్యప్రతిష్ఠాయాం క్రియాఫలాశ్రయత్వమ్‌ ॥ (యోగదర్శనము 2-36)
సత్యము సిద్ధించినవాని వాక్కు అమోఘము. అనగా అతని వచనము వ్యర్థము కాదు. అతడు యోగ్యతగ వానిని ‘ధార్మికుడవు కమ్ము’ అని ఆశీర్వదించినచో అతడు ధార్మికుడగును. ‘సుఖీభవ’ అని ఆశీర్వదించినచో అతని దుఃఖము దూరమగును.
సత్యం బ్రూయాత్‌ ప్రియం బ్రూయాత్‌ న బ్రూయాత్‌ సత్యమప్రియమ్‌ ।
ప్రియం చ నానృతం బ్రూయాత్‌ ఏష ధర్మః సనాతనః ॥
                    (మనుస్మృతి 4-138)
సత్యమునే చెప్పుము. ఆ సత్యమును ప్రియమైన మాటలో చెప్పుము. కఠినవచనముతో మనస్సును బాధించునట్లు చెప్పకుము. మరియు ప్రియమైన మాటతో అసత్యమును మాత్రము చెప్పకుము. ఇదియే అతి ప్రాచీన ధర్మము.
ఇది ఎట్లన మన మధ్య ఒక వ్యక్తి అంధుడై ఉన్నచో అతడా మాట అంగీకరించును. ఈ మాట సత్యము. మనమాతనిని మాటిమాటికి అంధుడని అనినచో అతని మనస్సుకు బాధ కుగును. దీనినే అప్రియసత్యము అందురు. దీనిని చెప్పుట యోగ్యము కాదు.
మనము లోకములో స్తుతి, నిందా అను శబ్దము వినుచున్నాము. ఆ శబ్దమును చాలావరకు తప్పు అర్థములో ప్రయోగిస్తారు. వీటి సరిjైున అర్థము ఇట్లున్నది.
పదార్థ గుణ సంకీర్తనం స్తుతిః ॥
పదార్థము యొక్క గుణమును చెప్పుటను స్తుతి అంటారు.
గుణేషు గుణారోపణం స్తుతిః । దోషేషు దోషారోపణం చ స్తుతిః ॥
పదార్థములో ఉన్న గుణమును ఉన్నవని చెప్పుటను మరియు లేని గుణమును లేవని చెప్పుటను స్తుతి అంటారు.
గుణేషు దోషారోపణమసూయా । దోషేషు గుణారోపణమప్యసూయా ॥
ఇక్కడ ‘అసూయా’ అనగా నిందా అని అర్థము. పదార్థములో ఉన్న గుణమును లేవనుటను మరియు లేని గుణము ఉన్నవనుటను నిందా అని అంటారు.
అనగా సత్యమును చెప్పుటను స్తుతి యనియు అసత్యమును చెప్పుటను నిందా అనియు చెప్పవచ్చును.

సత్యాసత్యమును నిర్ణయించు సాధనములు


మనము ప్రతినిత్యము సిద్ధాంతపరమైన శాస్త్రీయవిషయమును మరియు లౌకిక విషయము నెన్నింటినో వినుచుంటాము. అవి ఎంతవరకు సత్యము అను సందేహము కుగుటలో ఆశ్చర్యము లేదు.
దారిలో మనకు ఒక పసుపుపచ్చని ధాతువు ముక్క కనిపించినపుడు అది ఇత్తడియా లేక బంగారమా అనునది మనకు కాని కంసాలి (స్వర్ణకారుడు)  కన్నుకు గాని సరిగా తెలియదు. దానిని ఒరిపిడిరాయిపై గీచి చూచినపుడు అది ఇత్తడియో, బంగారమో, బంగారమే jైున దానిలో మిశ్రితమైన ఇతర పదార్థమెంత అనునది నేర్పరిjైున వ్యక్తి తెలిసికొనును. అట్లే మనము వినుచుండు సిద్ధాంత సంబంధమైన విషయము సత్యాసత్యమును నిర్ణయించుటకు మహర్షు ఒరిపిడిరాయి లాంటి కొన్ని పద్ధతు తెలిపినారు. విద్వాంసుడైన వ్యక్తి వాటి ఆధారముగ వినిన విషయములోని సత్యాసత్యమును నిర్ణయింపగడు. అవి ఈ విధముగ ఉన్నవి.
1.    సృష్టి క్రమమునకు అనుకూమైనది సత్యము, విరుద్ధముగా నున్నది అసత్యము.
2.    తన ఆత్మ పవిత్రతకు, విద్యకు అనుకూమైనది సత్యము. అనగా తనకెట్లు సుఖము ప్రియమో దుఃఖమప్రియమో అట్లే తాను ఇతరుకు సుఖమును కలిగించినచో ప్రసన్నుగను, దుఃఖమును కలిగించినచో అప్రసన్నుగను అగుదురని తెలియవలెను.
3.      ప్రత్యక్షాది ప్రమాణము కనుకూమైనది సత్యము, విరుద్ధమైనది అసత్యము.
ప్రత్యక్షానుమానోపమానశబ్దాః ప్రమాణాని । (న్యాయదర్శనము 1-1-3)
ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము అనునవి ప్రమాణము.
1. ప్రత్యక్షము :
ఇన్ద్రియార్థసన్నికర్షోత్పన్నం జ్ఞానమవ్యపదేశ్యమవ్యభిచారి వ్యవసాయాత్మకం ప్రత్యక్షమ్‌ ॥ (న్యా.ద.1-1-4)
జ్ఞానేంద్రియముకు భూతముయొక్క గుణముతో సంబంధమేర్పడినపుడు కుగు జ్ఞానమును ప్రత్యక్షము అంటారు.
జ్ఞానేంద్రియము : 1. నాసిక, 2. నాుక, 3. కన్ను, 4. చర్మము, 5. చెవు.
భూతము : 1. పృథివి, 2. జము, 3. అగ్ని, 4. వాయువు, 5. ఆకాశము.
భూతము గుణము (అర్థము) : 1. గంధము (వాసన) 2. రుచి 3. రూపము, రంగు 4. స్పర్శ 5. శబ్దము.
ఆ జ్ఞానము సంజ్ఞాసంజ్ఞి సంబంధము వన కలిగినది (ఇతయి చెప్పినది) కాకూడదు. మొదట ఒక జ్ఞానము కలిగి తరువాత దాని స్థానమున ఇంకొక జ్ఞానము కుగకూడదు. అంతేకాదు ఆ జ్ఞానము నిశ్చయాత్మకమైనదిగా (ఇది ఇదియే అని) ఉండవలెను.
2. అనుమానము :
అథ తత్పూర్వకం త్రివిధమనుమానం
పూర్వవచ్చేషవత్‌ సామాన్యతో దృష్టం చ (న్యా.ద. 1-1-5)
ఒకప్పుడు ఏదైన పదార్థము ప్రత్యక్షముగా తెలిసినదై ఇంకొకచోట ఆ పదార్థము యొక్క సహచరి ప్రత్యక్షమైనచో ఆ కనపడని పదార్థము యొక్క జ్ఞానము కుగుటను అనుమానము అని అంటారు. అది ఎట్లన పుత్రుని చూచి తండ్రిని, పొగను చూచి అగ్నిని, సుఖదుఃఖమును చూచి పూర్వజన్మమును తెలిసికొనుట. ఇది మూడు విధము.
(1)     పూర్వవత్‌ : కారణమును చూచినపుడు కార్యజ్ఞానము కుగుట. మేఘమును చూచి వర్షమును, చదువుచున్న విద్యార్థి తెలివితేటను చూచి విద్వాంసుడగునని నిర్ణయించుట.
(2)     శేషవత్‌ : కార్యమును చూచినపుడు కార్యజ్ఞానము కుగుట. నదీ ప్రవాహమును చూచి కురిసిన వర్షమును, కుమారుని చూచి తండ్రిని, సృష్టిని చూచి అనాది కారణమును, దాని కర్తయగు ఈశ్వరుని, సుఖదుఃఖమునుచూచి పాపపుణ్యమును తెలిసికొనుట.
(3)     సామాన్యతోదృష్టము : కార్యకారణ సంబంధము లేనిచోట ఒకానొక సమాన ధర్మము వన కుగు జ్ఞానము. ఎట్లన ప్రతి మనుష్యుడు తానున్న స్థానమునుండి కదక వేరొక స్థానమునకు చేరడు. ఇది అందరిలోను కనిపించు సమానధర్మము. మనము బొంబాయి వెళ్ళినపుడు అక్కడ బెంగుళూరులోని స్నేహితుడు కనబడినచో అతడు బెంగుళూరునుండి బయుదేరి బొంబాయికి వచ్చినాడనియే తెలిసికొందుము.
‘అను అర్థాత్‌ ప్రత్యక్షస్య పశ్చాత్‌ మీయతే జ్ఞాయతే’ ప్రత్యక్షమునకు పిమ్మట కుగునదని అనుమాన శబ్దార్థము.
3. ఉపమానమ్‌ :
ప్రసిద్ధసాధర్మ్యాత్‌ సాధ్యసాధనముపమానమ్‌ । (న్యా.ద. 1-1-6)
ప్రసిద్ధ ప్రత్యక్షసాధర్మ్యముచే సాధ్యమును - సిద్ధపరుపవసిన పదార్థము యొక్క జ్ఞానమును కలిగించు సాధనమును ఉపమానము అని అంటారు. ఒకడు తన నౌకరును విష్ణుమిత్రుని పిుచుకొనిరమ్మని,  ఆ నౌకరు విష్ణుమిత్రుని ఎన్నడును చూచియుండని కారణమున, అతనిని బోలిన దేవదత్తుని చూపించి అతడిట్లుండునని చెప్పును. అప్పుడా నౌకరు విష్ణుమిత్రుని గుర్తించి పిుచుకొని వచ్చును.
4. శబ్దము : ఆప్తోపదేశః శబ్దః । (న్యా.ద.1-1-7)
పూర్ణవిద్వాంసుడును, ధర్మాత్ముడును, పరోపకారప్రియుడును, సత్యవాదియు, పురుషార్థియు, జితేంద్రియుడును, తాను దేని వన సుఖమును పొందెనో దానిని ఇతరుకు చెప్పవలెనను కోరికతో ప్రేరితుడై తనకు తెలిసినట్లు సమస్త మనుష్యు కల్యాణార్థము (మేుకొరకు) బోధించువాడును, పృథివి మొదుకొని పరమేశ్వరుని పర్యంతమువరకు గ పదార్థము జ్ఞానముకలిగినవాడును అగు ఉపదేష్ట ఆప్తుడు. ఇట్టి పురుషుని ఉపదేశము మరియు పూర్ణాప్తుడగు పరమేశ్వరుని యుపదేశమగు వేదమును శబ్దప్రమాణమంటారు.
ప్రమా అనగా జ్ఞానము. ప్రమాకరణం ప్రమాణం. ఏ సాధనము ద్వారా వస్తువు యొక్క జ్ఞానము కుగుతుందో దానిని ప్రమాణమంటారు. ఈ విధమగు పరీక్షచే మనుష్యుడు సత్యాసత్యమును నిర్ణయించవలెను. ఇంకొక మార్గము లేదు.
క్షణప్రమాణాభ్యాం వస్తుసిద్ధిః ।
తాను నిరూపింపజేయు వస్తువునకు ప్రమాణమును, క్షణమును తొపవలెను. లేనిచో దానిని ఇతయి అంగీకరించనవసరము లేదు. ప్రమాణమును గూర్చి పైన చెప్పబడినది.
అసాథారణో ధర్మః క్షణమ్‌ ।
ఇతర వస్తువులో లేకుండ కేవమావస్తువులోనే గ గుణమును క్షణమంటారు. ఆ క్షణము అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవము అను దోషము లేకుండా యుండవలెను.
అతివ్యాప్తి : చెప్పిన క్షణము సిద్ధింపజేయు వస్తువుతో పాటు ఇతర వస్తువులో ఉండుట. ఉదా: ఆవుకు క్షణము నాుగు కాళ్లుండుననుట. నాుగు కాళ్లు ఆవుతోపాటు కుక్క, గుఱ్ఱము మొదగు ఇతర జంతువులో కనిపించుటచే ఈ క్షణమును అతివ్యాప్తి అంటారు.
అవ్యాప్తి : చెప్పిన క్షణము సిద్ధింపజేయుదానిలో కాకుండ ఇతర వస్తువులో ఉండుట. ఉదా: గుఱ్ఱమునకు క్షణము కాలిగిట్టు చీలియుండుననుట. ఈ క్షణము గుఱ్ఱములో కాకుండ ఆవు మొదగు ఇతర జంతువులో నుండుటచే దీనిని అవ్యాప్తి అంటారు.
అసంభవము : ఆకాశ కుసుమము, గొడ్రాలి సంతానము, కుందేటి కొమ్ము మొదగునవి.
ఆవుకు క్షణము గంగడోు.
ప్రమేయము (తెలిసికొనదగినవి) :
ప్రమాణము ద్వారా తెలిసికొనదగిన పదార్థమును ప్రమేయము అంటారు. వాటిని ఇచట సామాన్యముగ తొపుతున్నాను. వీటిని విశేషముగ తెలిసికొనుటకు న్యాయదర్శనభాష్యమును చదవవలెను.
1.     ఈ సృష్టికి కారణములైన మూతత్వము. అవి 1. పరమేశ్వరుడు 2. జీవు 3. ప్రకృతి.
2.     ఆత్మశరీరేన్ద్ర్రియార్థబుద్ధిమనఃప్రవృత్తిదోషప్రేత్యభావఫదుఃఖాపవర్గాస్తు ప్రమేయమ్‌ (న్యా.ద. 1-1-9)
1. జీవాత్మ, పరమాత్మ 2. శరీరము, 3. జ్ఞానేంద్రియము, కర్మేంద్రియము 4. అర్థము - భూతము గుణము 5. బుద్ధి, 6. మనస్సు, 7. ప్రవృత్తి, 8. దోషము 9. ప్రేత్యభావము - పునర్జన్మ, 10. ఫము, 11. దుఃఖము, 12. అపవర్గము - మోక్షము అనునవి ప్రమేయము.


వేదాది ఆర్షగ్రంథములు


వేదము స్వతః ప్రమాణము. అనగా వేదములో చెప్పబడిన విషయము ప్రామాణికతను గూర్చి ఆలోచించుటకు ఇతర ప్రమాణముతో పనిలేదు. యథా ప్రదీపవత్‌, అనగా మనము సూర్యుని చూచుటకు వేరే ప్రకాశమక్కరలేదు. సూర్యుని ప్రకాశమే సూర్యుని చూచుటకు ఉపయోగపడును. అంతేకాదు. ఆ ప్రకాశము వననే ఇతర వస్తువును చూడగము. వేదము కూడ ఇదేవిధముగ స్వతః ప్రమాణమై ఇతర గ్రంథము ప్రామాణికతను నిర్ణయిస్తుంది.
విద జ్ఞానే అను ధాతువునుండి వేదశబ్దమేర్పడును. వేదమనగా జ్ఞానమని అర్థము. మానవుకు ఆ జ్ఞానము సృష్ట్యాదిలోనే భించవలెను. కారణమేమన -
ఇప్పుడు ప్రపంచములోని కొన్ని దేశాు వైజ్ఞానికరంగములో ఎంతో ప్రగతిని సాధించాయి. ఈ దేశాలోని అడవులో నివసించువారు ఈనాటికి అజ్ఞానుగానే ఉన్నారు. మనము పాఠశాలో, కళాశాలో విద్యాభ్యాసము చేసిన తరువాతనే విద్యావంతుము, జ్ఞానుము అగుచున్నాము. ఇప్పుడు జన్మించిన బాురను ఏకాంత ప్రదేశములోనో, మూర్ఖుసాంగత్యములోనో ఉంచినచో వారు పెరిగి మూర్ఖులే అగుదురు. సృష్టి ఆదిలో భగవంతుడు వేదవిద్యను మానవుకు ఇవ్వనిచో, వారు ఆ విద్యను ఇతరుకు నేర్పకపోయినచో మనము అజ్ఞానుగానే ఉండెడివారము. ఆర్యావర్తమునుండి విద్వాంసు ఈజిప్టు, గ్రీసు, యూరోపు మొదగు దేశాలోని ప్రజకు విద్యనేర్పక పూర్వము అక్కడివారు విద్యావిహీనులై ఉండిరి. యూరోపు నుండి కొంబసు మొదగువారు అమెరికాకు వెళ్ళకపూర్వము అక్కడివారు అజ్ఞానుగానే ఉండిరి. ఆఫ్రికాలోని నీగ్రోు అమెరికాతో సంబంధము కలిగిన తరువాతనే విద్యావంతులైనారు. దీనివన మనుష్యుడు నైమిత్తిక జ్ఞానము లేకుండా విద్యావంతుడు జ్ఞానవంతుడు కాలేడు. జ్ఞానోన్నతిని పొందడు అని నిర్థారణ యగుచున్నది. కన్నుకు సూర్యుని ప్రకాశమునకు సంబంధము ఉన్నది. ఈ రెంటిలో ఏ ఒకటి లేకపోయినను రెండవది నిరర్ధకము. అటునే బుద్ధికి జ్ఞానమునకు సంబంధము ఉన్నది. జ్ఞానములేనిచో బుద్ధి నిరర్థకము. అందుకే మానవుని బుద్ధియొక్క సార్థకత కొరకు జ్ఞానము - వేదము అవసరము.
సృష్టి ఆదిలో సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు మానవుకు అవసరమైన నైమిత్తిక జ్ఞానమును వేదముద్వారా అగ్ని, వాయువు, ఆదిత్యుడు, అంగిరా అను యోగ్యులైన నుగురు ఋషు మస్తిష్కములో ప్రకాశింపజేసినాడు. వారి ద్వారా వేదము లోకమున ప్రచారము గావింపబడినది. అందుకే భగవంతుడు ఆదిగురువు.
స పూర్వేషామపి గురుఃకాలేనానవచ్ఛేదాత్‌. (యోగదర్శనము 1-26).
కాముచే ఛేదింపబడనివాడు - త్రికాములో నుండువాడు అయిన పరమేశ్వరుడు సృష్టి ఆదిలోనున్న మన పూర్వుకు గురువు.
వేదము ఈశ్వరీయ జ్ఞానమని ఆర్షసాహిత్యము స్పష్టముగ తెలియజేయుచున్నది. అలాగే మహమ్మదీయు కురాన్‌ షరీఫ్‌ను క్రైస్తవు బైబిల్‌ను ఈశ్వరీయ జ్ఞానమని ప్రచారము చేయుచున్నారు. శ్రోతకు నిజముగా ఈశ్వరీయ జ్ఞానమేది? అను సందేహము కుగును. అందుచే ఈశ్వరీయ జ్ఞానమేదియో నిర్ణయించవయును. లేనిచో మానవు సందేహమునకు గురిjైు సత్యమును తెలిసికొనక అసత్యమార్గము ననుసరించి దుఃఖము ననుభవింతురు. జీవిత క్ష్యమును పొందరు. ఈశ్వరీయజ్ఞానమును నిర్ణయించుటకు ఈ క్రింది హేతువు ఉపయోగపడును.
1.    ఈశ్వరీయజ్ఞానము సృష్టికి ఆరంభమున ప్రకాశింపజేయబడవలెను. లేకున్న ఈశ్వరుడు పక్షపాతి యగును.
2.    ఈశ్వరీయజ్ఞానము ఒకానొక దేశమునకు సంబంధించిన భాషలో ప్రసాదింపబడరాదు.
3.    ఈశ్వరీయజ్ఞానము సృష్టినియమముకు విరుద్ధముగ ఉండకూడదు.
4.    ఈశ్వరీయజ్ఞానమునందు సమస్త సత్యవిద్య మూసిద్ధాంతము ఉండవలెను.
ఈ హేతువుకు బైబిల్‌, కురాన్‌ు నిువలేవు. వేదములే ఈశ్వరీయముని నిర్థారణ యగును. ఈశ్వరుని రచను రెండు.
1.     దృశ్యకావ్యము - జగత్తు. 2. శబ్దకావ్యము - వేదము. ఈ రెండిరటియందు సమన్వయము కదు. అందుకే వేదము స్వతః ప్రమాణము.
ఋషు యోగమువన సమాధిస్థులై వేదమంత్రమును సాక్షాత్కారము చేసికొని - యథార్థముగ తెలిసికొని ఇతర గ్రంథమును - శాస్త్రమును ఉపదేశించినారు. అందుకే అవి పరతః ప్రమాణము. అనగా వాటిలో వేదానుకూమైనదే గ్రాహ్యము.
స్వతఃప్రమాణము :-
ఋషిణా ద్రష్టమార్షమ్‌. ఋషుచే దర్శించబడినవి ఆర్షము. అవి మూ వేదసంహితు.
1. వేదము - సంహితు (నాుగు) :
1. ఋగ్వేదము, 2. యజుర్వేదము, 3. సామవేదము, 4. అథర్వవేదము.
పరతః ప్రమాణము :-
ఋషిణా ప్రోక్తమార్షమ్‌. ఋషుచే ఉపదేశింపబడినవి. ఇవి వేద ప్రామాణ్యము నంగీకరించునవి.
2. వేదాంగము (ఆరు) :
1. శిక్షా    -    పాణిని మహర్షి ‘వర్ణోచ్ఛారణశిక్షా’.
2. క్పము    -    శ్రౌతసూత్రము (యజ్ఞసంబంధమైనవి), గృహ్యసూత్రము (సంస్కారముకు సంబంధించినవి), ధర్మ సూత్రము (వర్ణాశ్రమ వ్యవస్థననుసరించి మానవుని కర్తవ్యమును బోధించునవి).
3. వ్యాకరణము    -    పాణినిమహర్షికృత అష్టాధ్యాయీ సూత్రపాఠము, ధాతుపాఠము, ఉణాది కోశము, గణపాఠము, లింగాను శాసనము. వీటిని ఉపదేశముని అంటారు.
4.  నిరుక్తము    -    యాస్కమునికృత నిఘంటువు, నిరుక్తము.
5.  ఛన్దస్సు    -    పింగళాచార్యముని కృతము.
6.  జ్యోతిషము    -    వశిష్టఋషికృతము. దీనియందు అంక గణితము, బీజగణితము, రేఖా గణితము, భూగోళము, భూగర్భము, ఖగోళవిషయము గవు.
జ్యోతిః అనగా ప్రకాశవంతమైన పదార్థము. వాటికి సంబంధించినది జ్యోతిషము. గ్రహము (సౌరకుటుంబము) నక్షత్రము యొక్క స్థితిగతును తొపును. స్థితివన కాజ్ఞానము, గతివన ఋతు జ్ఞానము కుగును.
మానవ శరీరమునకు గ అంగముతో వేదమునకు వేదాంగమును అంకారికముగా పోల్చి ఇట్లు చెప్పినారు.
1.     చన్దః పాదౌతు వేదస్య హస్తో కల్పో-థ పఠ్యతే ।
    జ్యోతిషాం అయనం చక్షుః నిరుక్తం శ్రోత్రముచ్యతే ॥
2.     శిక్షా ఘ్రాణం తు వేదస్య ముఖం వ్యాకరణం స్మృతమ్‌ ।
    తస్మాత్సాంగమధీత్యైవ బ్రహ్మలోకే మహీయతే ॥
ఛందస్సు    -        పాదము
క్పము    -        చేతు
జ్యోతిషము    -        కన్ను
నిరుక్తము    -        చెవు
శిక్షా    -        ముక్కు
వ్యాకరణము    -        ముఖము
వేదమును వేదాంగము యుక్తముగ చదువుకొన్నవాడు విద్వాంసులో పూజనీయుడగును.
మనుష్యుడు తన అభిప్రాయమును-భావమును ముఖము ద్వారా ఇతరుకు తెలియజేస్తాడు. అదేవిధముగ వేదముయొక్క అభిప్రాయమును-అర్థమును స్పష్టము చేయునది వ్యాకరణము. అందుకే  వ్యాకరణము ముఖముతో ప్చోబడినది. వ్యాకరణమును సంపూర్ణముగా అధ్యయనము చేయని వ్యక్తికి వేదము బోధపడదు. వేదాంగము ఉద్దేశ్యము వేదమంత్రమును సరిగా అర్థము చేయుటయే.
3. ఉపాంగము (ఆరు)
వీటిని దర్శనము లేక శాస్త్రము అని కూడ అంటారు.
1. న్యాయ దర్శనము        -    గౌతమఋషి కృతము
                వాత్సాయన భాష్యము
2. వైశేషిక దర్శనము        -    కణాదఋషి కృతము
                ప్రశస్తపాద భాష్యము
3. సాంఖ్యదర్శనము         -     కపిఋషి కృతము
                బాగురుముని భాష్యము (అభ్యము)
                విజ్ఞాన భిక్షు భాష్యము (భ్యము)
4. యోగ దర్శనము         -     పతంజలిఋషి కృతము
                వ్యాసభాష్యము
5.     మీమాంసా దర్శనము     -     జైమినిఋషి కృతము
                వ్యాసభాష్యము (అభ్యము)
                శాభరభాష్యము (భ్యము)
6.     వేదాంత దర్శనము     -     వ్యాసమహర్షి కృతము
                బౌధాయనవృత్తి (అభ్యము)
                శాంకరభాష్యము (భ్యము)
సాంఖ్య, మీమాంస, వేదాంతదర్శనముకు సంబంధించిన ప్రస్తుతము భించు భాష్యములో సూత్రకారు అభిప్రాయమునకు భిన్నమైన భాష్యకారు అభిప్రాయము అప్రామాణికమని తెలియవలెను.
4.     ఉపవేదము (నాుగు)
1. ఆయుర్వేదము    -    చరకము, శుశ్రుతము, ధన్వంతరికృత నిఘంటువు.
2. ధనుర్వేదము    -    శస్త్రాస్త్ర సంబంధమగు రాజవిద్య. అంగిరసుడు, భరద్వాజుడు వ్రాసినవి పూర్వముండెడివి. ఇప్పుడు ుప్తము.
3. గాంధర్వవేదము    -    గానవిద్య, సామగానము, నారద సంహిత.
4. అర్థవేదము    -    శ్పివిద్య (జుఅస్త్రఱఅవవతీఱఅస్త్ర డ ్‌వషష్ట్రఅశీశ్రీశీస్త్రవ), విశ్వకర్మ, త్వష్ట, దేవజ్ఞుడు మయుడు వ్రాసిన సంహితు. (భరద్వాజుని విమానశాస్త్రము కొంతకాము క్రితము భించినది. ఇది ‘యంత్ర సర్వస్వము’ అను గ్రంథములో ఒక భాగము).
5.     బ్రాహ్మణ గ్రంథము (నాుగు)
వేదమునకు బ్రహ్మ అని కూడ పేరు. బ్రహ్మయొక్క వ్యాఖ్యానము బ్రాహ్మణము. వీటిలో అనేక విషయముతో పాటు యాజ్ఞిక ప్రక్రియకు ప్రాధాన్యత కదు.
1. ఐతరేయము, 2. శతపథము, 3. సామవిధానము - తాండ్యబ్రాహ్మణము, 4. గోపథము.
6.     ఉపనిషత్తు (పదకొండు)
వీటిలో అధ్యాత్మ (పరమాత్మ, జీవాత్మ, శరీరము) విద్య ఉన్నది. సాధారణముగ బ్రహ్మవిద్య అని అంటారు. ఉపనిషత్తు అను పేరుతో 108 గ్రంథము ఉన్నాయి. వాటిలో అల్లా - ఉపనిషత్తు కూడ ఒకటి. వాటన్నింటిలో ఈ క్రింది 11 మాత్రమే వేదానుకూముగ నున్నవని శిష్టు - విద్వాంసు అభిప్రాయము.
1. ఈశ, 2. కేన, 3. కఠ, 4. ప్రశ్న, 5. ముండక, 6. మాండూక్య, 7. ఐతరేయ, 8. తైత్తిరీయ, 9. ఛాందోగ్య, 10. బృహదారణ్యక, 11. శ్వేతాశ్వతర.
వీటిలో మొదటిదిjైున ఈశోపనిషత్తు యజుర్వేదము యొక్క చివరి (40వ) అధ్యాయము. తక్కినవి ఋషి ప్రోక్తము.
7. వేదశాఖు - 1127
8. ఇతిహాస గ్రంథము
వాల్మీకిరామాయణము, మహాభారతము. వీటిలో చాలా ప్రక్షిప్తము - ఇతరుచే చేర్చబడినవి ఉన్నవి. ఆ విషయము అప్రామాణ్యము.
9. స్మృతు
మనుస్మృతి, యాజ్ఞవ్క్య స్మృతి, పారాశరస్మృతి మొదగునవి. వీటన్నింటిలో మనుస్మృతి ప్రక్షిప్తమును వదలి, ప్రామాణికముగ గ్రహించబడును.
    చతుర్దశ విద్యు
    వేదము, బ్రాహ్మణ గ్రంథము.
    ఉపనిషత్తుతో కలిసి                -    4
    ఉపవేదము                    -    4
    వేదాంగము ఉపాంగము యుక్తముగా        -    6
    మొత్తము                        -    14
  బ్రాహ్మణానీతిహాసాన్‌ పురాణాని కల్పాన్‌ గాథా నారశంసీరితి. (అశ్వలాయన గృహ్యసూత్రము)
శతపథాది బ్రాహ్మణ గ్రంథముకే ఇతిహాసము, పురాణము క్పము, గాథా నారశంసీ అని పేర్లు. ప్రాచీన సాహిత్యమున పురాణమను శబ్దము బ్రాహ్మణగ్రంథముకే వర్తించును. నవీనములైన అష్టాదశ పురాణముకు కాదు.
ఆర్ష గ్రంథముకు అనార్ష గ్రంథముకు (ఋషు కానివారివి) చాలా భేదమున్నది. ఆర్ష సాహిత్యము తేలికగా ఉండి తక్కువ శ్రమతో ఎక్కువ లాభమును పొందగము. అనార్ష సాహిత్యము కఠినము. ఎక్కువ శ్రమతో తక్కువ లాభమును పొందుదుము. ఆర్షసాహిత్యపఠనము సముద్రమునందు మునిగి అమ్యూములైన ముత్యమును పొందునట్టిది. అనార్షసాహిత్య పఠనము పర్వతమును పగుగొట్టి గవ్వంత లాభమును పొందునట్టిది. ఇందుకొక ఉదాహరణ. గౌతమమహర్షి. న్యాయదర్శనమున ప్రతిజ్ఞా అనునది తొపుటకు ఈ సూత్రము రచించినాడు.
సాధ్యనిర్దేశః ప్రతిజ్ఞా । (న్యా.ద. 1-1-3)
గంగేషోపాధ్యాయుడను పండితుడు తత్వచింతామణి అను నవ్యన్యాయదర్శనమున అదే ప్రతిజ్ఞా అనునది తొపుటకు రచించిన వాక్యమిది. ‘‘సాధ్యతావచ్ఛేదకావచ్ఛిన్న సాధ్యప్రకారకః, పక్షతావచ్ఛేదకావచ్ఛిన్న పక్ష విశేషకః బోధజనకః శబ్దః ప్రతిజ్ఞా’’ దీనివన ఆర్ష సాహత్యమునకు అనార్ష సాహిత్యమునకు గ భేదము తెలిసికొనవచ్చును.

ఆర్ష గ్రంథములే శాస్త్రములు మనకి


శాసు అనుశిష్టౌ అను ధాతువునకు ‘ష్ట్రన్‌’ ప్రత్యయము చేర్చిన ‘శాస్త్రమ్‌’ అను శబ్దమేర్పడును. శాస్త్రమనగా 
1. శిష్యతే అనేన ఇతి శాస్త్రమ్‌. ఆజ్ఞాపించునది, విధినిషేధమును బోధించు గ్రంథము.
2. శాసనాత్‌ శంసనాత్‌ ఇతి శాస్త్రమ్‌. శాసించునది శాస్త్రము.
3. ప్రవృత్తిర్వా నివృత్తిర్వా నిత్యేన కృతకేన వా ।
  పుంసాం యేనోపదిశ్యేత తచ్ఛాస్త్రమభిధీయతే ॥
శ్రేష్ఠమైన కర్మలో ప్రవర్తింపజేయుదానిని, దుష్కర్మ నుండి దూరము చేయుదానిని నిత్య, అనిత్య పదార్థమును (నిత్య పదార్థము R కారణ పదార్థముÑ అనిత్య పదార్థము R కార్య పదార్థము) ఉపదేశించువానిని శాస్త్రమ్‌ అని అంటారు.
4. శాస్త్రప్రయోజనం తత్త్వదర్శనం (చాణక్య సూత్రము)
శాస్త్రము యొక్క ముఖ్యోద్దేశ్యము తత్త్వ పదార్థము (తత్త్వ పదార్థము R కారణ పదార్థము, మూపదార్థము) జ్ఞానము కలిగించుట. ఈ క్షణము వేదాది ఆర్ష గ్రంథములోనే కనిపిస్తాయి. కావున అవియే శాస్త్రపదవాచ్యము.
న వేదశాస్త్రాదన్యత్తు కిఞ్చిచ్ఛాస్త్రం హి విద్యతే ।
నిఃసృతం సర్వశాస్త్రం తు వేదశాస్త్రాత్‌ సనాతనాత్‌ ॥
                (యాజ్ఞవ్క్యస్మృతి 12-1)
వేదశాస్త్రముకు భిన్నమైనదింకొక శాస్త్రము లేదు. సమస్తశాస్త్రము సనాతనవేదము నుండియే ఆవిర్భవించినవి.

శాస్త్రముల మహత్యము


యోగిరాజగు శ్రీకృష్ణుడు శాస్త్రము యొక్క మహత్యమును గూర్చి అర్జునునితో ఈ విధముగ చెప్పినాడు.
1.     యః శాస్త్రవిధిముత్సృజ్యవర్తతే కామకారతః ।
        న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిమ్‌ ॥
2.    తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థిథౌ ।
    జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి ॥ (భగవద్గీత 16-23, 24)
శాస్త్రవిధిని విడిచి తన ఇష్టానుసారముగ వర్తించువాడు తన కార్యమున సిద్ధిని పొందడు. ఇహలోక సుఖమును గాని పరమగతి - మోక్షమును గాని పొందడు.
కావున ఓ అర్జున కర్తవ్యాకర్తవ్య నిర్ణయవిషయమున నీకు శాస్త్రము పరమప్రమాణము. ఈ విషయము నెరిగి శాస్త్రమున చెప్పబడిన కర్మను ఇహలోకమున - ఈ శరీరమున చేయుము.
ఇచ్చట శ్రీకృష్ణుని గొప్పతనమును గూర్చి ఒకమాట చెప్పుట ఆవశ్యకమనిపించుచున్నది. ఒక సందర్భమున కురుపితామహుడైన భీష్ముడు యుధిష్ఠిరునితో ఇట్లు చెప్పినాడు.
వేదవేదాంగ తత్త్వజ్ఞం బంచాప్యధికం తథా ।
నృణాం లోకే హి కో-న్యో-స్తి విశిష్టః కేశవాదృతే ॥
        (మహాభారతము సభాపర్వము 38 అ.)
వేదవేదాంగవిజ్ఞాని అధికబుడైన శ్రీకృష్ణుని మించినవాడు ఈ నరులో ఇంకెవడున్నాడు. దీనివన శ్రీకృష్ణుడు ఆనాటి రాజులో మహాజ్ఞానిగా, గొప్పవ్యక్తిగా గుర్తింపబడియున్నాడు.


ఋషులెవరు?


ఋషీ గతౌ అను ధాతువునకు ‘ఇగుపధాత్‌ కిత్‌’ (4-121) అను ఉణాది సూత్రముచే ‘ఇన్‌’ ప్రత్యయము చేర్చినచో ఋషి శబ్దమేర్పడును.
ఈ శబ్దార్థము -
1.     ఋషతి గచ్ఛతి ప్రాప్నోతి జానాతి వా స ఋషిః మన్త్రార్థద్రష్టా వా ॥
                (ఉణాదికోషము 4-121 వ్యాఖ్య)
క్రియాశీుడు, జ్ఞానవంతుడు, ఉన్నతాశయమును సాధించువాడు మరియు వేదమంత్రము అర్థమును దర్శించువాడు ఋషి.
2.     ఋషిర్దర్శనాత్‌ స్తోమాన్‌ దదర్శ ఇత్యౌపమన్యవః ॥ (నిరుక్తము 2-11)
ఋషి అనగా సమాధిస్థితి యందు వేదమంత్రమును సాక్షాత్కారము చేసికొనువాడు.
3. ఋషయో మన్త్రద్రష్టారః న తు మన్త్రకర్తారః ।
ఋషు వేదమంత్రమును దర్శించువారే కాని ఆ మంత్రముకు కర్తు కారు.
4.     సాక్షాత్కృతధర్మాణ ఋషయో బభూవుః । (నిరుక్తము 1-20)
ధర్మమును సాక్షాత్కారము చేసికొన్నవారు ఋషు.
5.     మహర్షయస్తే దదృశుర్యథావత్‌ జ్ఞానచక్షుషా ।
      సామాన్యం చ విశేషం చ గుణాన్‌ ద్రవ్యాణి కర్మ చ ॥ (చరకము)
మహర్షు జ్ఞానచక్షువు ద్వార ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయమును (వైశేషిక దర్శనమందు చెప్పబడిన) పదార్థమును సాక్షాత్కారము చేసిరి.
6.    రజస్తమోభ్యాం నిర్ముక్తాస్తపోజ్ఞానబలేన యే ।
      యేషాం త్రికామమం జ్ఞానమవ్యాహతం సదా ॥
    ఆప్తాః శిష్టాః విబుద్ధాస్తే తేషాం వాక్యమసంశయమ్‌ ।
    సత్యం వక్ష్యన్తి తే కస్మాదసత్యం నీరజస్తమాః ॥
    (చరకసంహితా, సూత్రస్థానము అ.11-18, 19)
ఎవరు రజస్తమోగుణమునుండి విముక్తులో (అనగా కేవము సాత్త్విక గుణము కవారు) తపోజ్ఞానబముచే ఎవరి జ్ఞానము త్రికాములో (భూత, వర్తమాన, భవిష్యత్‌ కాము) మరహితమై ఎ్లప్పుడు ఖండిరపబడనిదిగా ఉండునో వారు ఆప్తు, శిష్టు, విశిష్టమైన బుద్ధిగవారు. వారి వాక్యము సంశయరహితము. వారు సత్యమునే చెప్పుదురు. రజస్తమోగుణరహితు అసత్యమును చెప్పరు.
7.     ఆప్తః ఖు సాక్షాత్కృతధర్మా. యథా దృష్టస్యార్థస్య
    చిఖ్యాపయిషయా ప్రయుక్త ఉపదేష్టా । సాక్షాత్కరణమర్థస్య
    ఆప్తిః । తయా ప్రవర్తత ఇత్యాప్తః ॥ (న్యాయదర్శనము 1-1-7 వాత్సాయన భాష్యము)
ధర్మమును సాక్షాత్కారము చేసికొన్నవారు, ప్రమాణము ద్వారా అర్థమును - విషయమును నిశ్చయము చేసి వారు దానినేవిధముగ తెలిసికొన్నారో అదేవిధముగ దానిని ప్రసిద్ధము చేయు కోరికతో ప్రేరితులై ఇతరుకు ఉపదేశము చేయువారు ఆప్తు. అర్థము - విషయము యొక్క సాక్షాత్కరణము ఆప్తి. దానివన ప్రవృత్తుడగుట వన ఆప్తుడు.
8.    శిష్టాః ఖు విగతమత్సరా నిరహంకారాః కుమ్భీధాన్యా ।
    అలోుపా దమ్భదర్పలోభమోహక్రోధవివర్జితాః ॥
శిష్టులైనవారు నిశ్చయముగ మాత్సర్యములేనివారు, అహంకారరహితు, అపరిగ్రహు - ఆ రోజుకు సరిపడు పదార్థమును నిువ ఉంచుకొనువారు, ఇచ్ఛారహితు, దంభము, దర్పము, లోభము, మోహము, క్రోధము లేనివారు.

వర్ణాశ్రమ వ్యవస్థ


వర్ణవ్యవస్థ:
వర్ణ శబ్దమునకు రంగు, వర్ణన, ప్రశంసా, అక్షరము, స్వీకారము అను అర్థమున్నవి. ప్రస్తుత విషయంలో వృఞ్‌ వరణే అను ధాత్వర్ధములో వాడబడినది. వృణోతీతి వర్ణః వరించునది - స్వీకరించునది వర్ణము. మానవు వారి గుణకర్మస్వభావము ననుసరించి - వారి యోగ్యత కనుకూముగా స్వీకరించునది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుని వర్ణము నాుగు.
వర్ణమునకు సంబంధించిన విషయము యజుర్వేదమందలి పురుషసూక్తమున భిస్తుంది. దీనిలో మనుష్య సమాజము అంకారికముగ ఇట్లు వర్ణించబడినది.
ఓం యత్పురుషం వ్యదధుః కతిధా వ్యక్పయన్‌ ।
ముఖం కిమస్యాసీత్కిం బాహూ కిమూరూ పాదా-ఉచ్యేతే ॥
                (యజుర్వేదము 31-10)
ఏ పురుషుని వర్ణించిరో అతనినెన్నివిధము కల్పించిరి? అతనికి ముఖమేమి? బాహువులేమి? ఊరువులేవి? పాదములేవి? ఈ మంత్రములో అన్ని ప్రశ్నలే. వీటి సమాధానము తరువాత మంత్రములో నున్నవి.
ఓం బ్రాహ్మణో-స్య ముఖమాసీద్‌ బాహూ రాజన్యః కృతః ।
ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యాశూద్రో-అజాయత ॥
                (యజుర్వేదము 31-11)
ఆ కల్పిత పురుషునకు బ్రాహ్మణుడు ముఖము వంటివాడు. క్షత్రియుడు బాహువు వంటివాడు. వైశ్యుడు ఊరువు వంటివాడు. శూద్రుడు పాదమువంటివాడు. ఈ బ్రాహ్మణాది పదము గుణవాచకము. ఇప్పుడు వ్యవహారములో నున్నట్లు జన్మతో ఏర్పడునవి కావు. మానవుందర ఒకే జాతి. పురుషాకారమును తొపు శరీరములో ముఖమునందు జ్ఞానేంద్రియమున్నవి. కావున జ్ఞానము ఎక్కువగానుండు వాడు, బుద్ధిబముచే జీవించువాడు బ్రాహ్మణుడనబడును. ఇతడు వేదాధ్యయనము చేసి పరమేశ్వరప్రాప్తికి నిరంతరము ప్రయత్నము చేస్తాడు.
క్షాత్రంవైవీర్యమ్‌. క్షాత్రమనగా వీర్యము, బపరాక్రమము ఎక్కువగా గవాడు క్షత్రియుడు. ఇతనిలో జాతిని, దేశమును రక్షించు గుణము ఎక్కువగా ఉండును. అందుచే అతడు బాహువుతో ప్చోబడినాడు. శరీరము నకపాయము కలిగినపుడు చేతు సహాయమున శరీరమును రక్షించుకొనుట అందరికి తెలిసిన విషయమే.
శరీరమును స్థిరముగా ఉంచుటకు ఊరువు తోడ్పడును. తొడ బముతో ఎక్కువ సమయము కూర్చుందుము. మానవజాతి పోషణ కవసరమగు పదార్థమును ప్రోగుచేసి జాతిని పోషించువాడు వైశ్యుడు. పాదము శరీరమును నిబెట్టుటకు ఉపయోగపడును. అట్లే జాతి నికడకు జాతి జవసత్వమును కాపాడుటకు ఉపయోగపడువాడు శూద్రుడు.
శరీరములోని ముఖము మొదగు అవయవము భిన్నమైన గుణము కలిగి శరీరస్థితికి అన్నివిధము తోడ్పడును. అదేవిధముగ మానవజాతి పోషణకు దాని మనుగడకు అవసరమైన గుణము గవారు తోడ్పడుదురు. అందుకు అవసరమైన గుణవిశేషము ఆధారముగ మనుష్యు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రపదముచే వ్యవహింపబడుదురు. వీరిలో ఒకరు ఎక్కువ అని కాని తక్కువ అని కాని ఎంచకూడదు. అందుకని వేదము -
అజ్యేష్ఠాసో అకనిష్టాస ఏతే సంభ్రాతరో వావృధుః సౌభగాయ ।
                (ఋగ్వేదము 5-60-5)
మనుష్యులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని తంచకుడు మీరందరు సోదయి. సౌభాగ్యమునకై వృద్ధిచెందుడు అని ఉపదేశిస్తుంది.
జన్మనా జాయతే శూద్రః సంస్కారాద్ద్విజ ఉచ్యతే. జన్మతో అందరు శూద్రులే. సంస్కారము - విద్యాజ్ఞానాదు వన మనుష్యుడు ద్విజుడగుతాడు. ద్విజునగా బ్రాహ్మణక్షత్రియవైశ్యు.
పూర్వకామున గురుకుమునందు విద్యార్థి విద్యనార్జించి స్నాతకుడగునాడు గురువుతని గుణ కర్మస్వభావము బాగుగ నెరిగి బ్రాహ్మణాది పదముచే వ్యవహించుటకు అధికారమొసంగెడివారు. బ్రాహ్మణ క్షత్రియాది పదము గుణవాచకము. జాతివాచకము కావు. జాతి నిత్యము బ్రతికియున్నంతకాము జాతి మారదు. వర్ణము మారుచుండును. బ్రాహ్మణవర్ణుడు క్రైస్తవాది మతమును స్వీకరించినపుడు అతడు బ్రాహ్మణపదవాచ్యుడు కాడు. ఇది లోకవిదితమే.
వేదాధ్యయనాదు వన ఈ శరీరము బ్రాహ్మణ శరీరమగునని మనుస్మృతిలో నున్నది.
    స్వాధ్యాయేన వ్రతైర్హోమైస్త్రైవిద్యేనేజ్యయా సుతైః ।
    మహాయజ్ఞైశ్చ యజ్ఞైశ్చ బ్రాహ్మీయం క్రియతే తనుః ॥ (మనుస్మృతి 2-28)
అన్ని విద్యను చదువుట, చదివించుట, బహ్మచర్యసత్యభాషణాది నియమపాన, సత్యగ్రహణము, అసత్యత్యాగము, సత్యవిద్య దానము, అగ్నిహోత్రము, వేదమునందలి జ్ఞానకర్మోపాసన విద్య గ్రహణము, పక్షేష్టి మొదగువాటి అనుష్ఠానము, ధర్మపూర్వకముగ చక్కటి సంతానోత్పత్తి పంచమహాయజ్ఞము, అగ్నిష్టోమాది యజ్ఞము, శ్పివిద్య, విజ్ఞానాదుచే ఈ శరీరము బ్రాహ్మణశరీరమగును.
    శూద్రో బ్రాహ్మణతామేతి బ్రాహ్మణశ్చైతి శూద్రతామ్‌ ।
    క్షత్రియాజ్ఞాతమేవం తు విద్యాద్వైశ్యాత్తథైవ చ ॥ (మనుస్మృతి 10-65)
గుణకర్మ వన శూద్రుని సంతానము బ్రాహ్మణుడగును. అట్లే బ్రాహ్మణుని సంతానము శూద్రుడగును. అదేవిధముగ క్షత్రియ వైశ్యు సంతానము గుణకర్మ వన బ్రాహ్మణులో లేక శూద్రులో అగుదురు. అనగా ఏ వర్ణమువారి సంతానమైనను గుణకర్మ ననుసరించి ఇతర వర్ణము వారగుదురు.
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణము కర్తవ్యము గుణకర్ము ఈ విధముగ నున్నవి.

బ్రాహ్మణుని కర్మలేవి ?



    అధ్యాపనమధ్యయనం యజనం యాజనం తథా ।
    దానం పరిగ్రహశ్చైవ బ్రాహ్మణానామక్పయత్‌ ॥ (మనుస్మృతి 1-88)
వేదమును చదువుట, చదివించుట, యజ్ఞమును చేయుట చేయించుట శ్రేష్ఠమైన కర్మకై దానమిచ్చుట, తీసికొనుట. ఇవి బ్రాహ్మణుని కర్ము.
    శమోదమస్తపః శౌచం క్షాంతిరార్ణవమేవ చ ।
    జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజమ్‌ ॥ (భగవద్గీత 18-42)
శమము - మనస్సును నిగ్రహించుట, దమము - జ్ఞానకర్మేంద్రియమును నిగ్రహించుట, తపః- సుఖదుఃఖాది ద్వంద్వసహనము, శౌచము - శుచి, క్షాంతి - క్షమత, ఆర్జవము - కోమత, జ్ఞానము - వేదవేదాంగమును సంపూర్ణముగ నెరిగి ఇతరును చదివించు సామర్థ్యము కలిగియుండుట మరియు వస్తువు యొక్క యథార్థజ్ఞానము కలిగియుండు, విజ్ఞానము-పృథివి మొదు పరమేశ్వరుని పర్యంతము గ పదార్థమును విశేషముగ నెరిగి ఉపయోగమును పొందుట, అస్తిక్యము - పరమేశ్వరుని యందు భక్తిశ్రద్ధు కలిగియుండుట. ఇవి బ్రాహ్మణుని స్వభావానుగుణమైన కర్ము.

క్షత్రియుని కర్మలేవి



    ప్రజానాం రక్షణం దానమిజ్యాధ్యయన మేవ చ ।
    విషయేష్వప్రసక్తిశ్చ క్షత్రియశ్చ సమానతః ॥ (మనుస్మృతి 1-89)
న్యాయముగా ప్రజను రక్షించుట, దానము వన విద్యాధర్మమును ప్రచారము చేయుట, అగ్నిహోత్రాది యజ్ఞమును చేయుట, వేదమును చదువుట, విషయాసక్తుడు కాకుండ జితేంద్రియుడై ఆత్మను, శరీరమును బలిష్టముగ నుంచుట. ఇది క్షత్రియుని కర్ము.
    శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధేచాప్యపలాయనమ్‌ ।
    దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మస్వభావజమ్‌ ॥ (భగవద్గీత 18-43)
వీరత్వము, ప్రతాపము, ధైర్యము, వ్యవహార చతురత, యుద్ధమునందు వెన్నుచూపి పరుగిడకుండుట, దానశీత, అందరితో పక్షపాతరహితముగ వ్యవహరించుట, చేసిన ప్రతిజ్ఞను పూర్తిచేయుట. ఇవి క్షత్రియుని స్వాభావిక గుణకర్ము.

వైశ్యుని కర్మలేవి



    పశూనాం రక్షణం దానమిజ్యాధ్యయన మేవ చ ।
    వణిక్పథం కుసీదం చ వైశ్యస్య కృషిమేవ చ ॥ (మనుస్మృతి 1-90)
గోవు మొదగు పశువు పాన, దానమిచ్చుట, యజ్ఞము చేయుట, వేదశాస్త్రమును చదువుట, వ్యాపారము చేయుట, న్యాయసమ్మతమైన వడ్డీ తీసుకొని అప్పిచ్చుట, వ్యవసాయము చేయుట. ఇవి వైశ్యుని కర్ము.
కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజమ్‌ ॥ (భగవద్గీత 18-44)
వ్యవసాయము చేయుట, గోవు మొదగు పశువును పాలించుట, నానావిధులైన వ్యాపారము చేయుట మొదగు వైశ్యుని స్వభావ గుణకర్ము.

శూద్రుని కర్మలు


    ఏకమేవ తు శూద్రస్య ప్రభుః కర్మ సమాధిశత్‌ ।
    ఏతేషామేవ వర్ణాణాం శుశ్రూషామనసూయయా ॥ (మనుస్మృతి 1-91)
నింద, ఈర్ష్య, అభిమానాది దోషమును వదలి బ్రాహ్మణ, క్షత్రియ,    వైశ్యు సేవ యథారీతి చేయుచు జీవించుట. ఇదియే శూద్రుని కర్మ.
    పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్‌ ॥ (భగవద్గీత 18-44)
శూద్రుని స్వాభావికమైన కర్మ సేవాభావము.
ఆశ్రమవ్యవస్థ :
    బ్రహ్మచర్యాశ్రమం సమాప్య గృహీ భవేత్‌ ।
    గృహీ భూత్వా వనీ భవేత్‌ వనీ భూత్వా ప్రవ్రజేత్‌ ।
            (శతపథబ్రాహ్మణము. కాం.14)
బ్రహ్మచర్యాశ్రమము పూర్తిచేసి గృహాశ్రమములో ప్రవేశించవలెను. ఆ తర్వాత వానప్రస్థము పిదప సంన్యాసము గ్రహించవలెను. ఈ విధముగ ఆశ్రమము నాుగు.
1. బ్రహ్మచర్యము, 2. గృహాశ్రమము, 3. వానప్రస్థము, 4. సంన్యాసము.


బ్రహ్మచర్యము :


బ్రహ్మ, చర్యము అను రెండు శబ్దము కలిసి ‘‘బ్రహ్మచర్యము’’ అను శబ్దమేర్పడును.
బ్రహ్మశబ్దార్థము : బృహ వృద్ధౌ అను ధాతువు నుండి బ్రహ్మశబ్దమేర్పడును. బ్రహ్మ అనగా గొప్పది అని అర్థము.
జ్ఞానప్రదములైన సమస్త గ్రంథములో ఈశ్వరుని జ్ఞానమైన వేదము గొప్పది. అందుచే బ్రహ్మశబ్దమునకు వేదము అని అర్థము.
సృష్టియొక్క మూతత్వములైన ఈశ్వరజీవప్రకృతులో ఈశ్వరుడు గొప్పవాడు. కావున బ్రహ్మశబ్దమునకు ఈశ్వరుడని కూడా అర్థము.
శరీరధారకములైన రస రక్త మాంస మేద అస్థి మజ్జ వీర్యము అను సప్తధాతువులో వీర్యము ఉత్కృష్టమైనది. అది అన్ని ధాతువు సారము. అందుచే బ్రహ్మశబ్దము వీర్యవాచకము.
ఈ విధముగ బ్రహ్మశబ్దమునకు 1. వేదము 2. ఈశ్వరుడు 3. వీర్యము అని మూడర్థము.
చర్యమనగా ఆచరణ. అధ్యయనము, ఉపాసన, రక్షణ అని చెప్పవచ్చును.
కాబట్టి బ్రహ్మచర్యమునకు మూడర్థమును ఈ విధముగా చెప్పవచ్చును.
1. వేదాధ్యయనము, 2. ఈశ్వరోపాసన, 3. వీర్యరక్షణ
సాధారణముగ బ్రహ్మచర్యమనగా వీర్యరక్షణ మాత్రమే యని అనుకొందురు. వైదిక సాహిత్యములో పై మూడర్థములో గ్రహించబడును. బ్రహ్మచారి గురుకుములో ఈ మూడు పను చేయుచునే బ్రహ్మచర్యాశ్రమమును పాలించును.
    బ్రహ్మ వేదః. తదధ్యనార్థమ్‌ ఆచార్యమాచరణీయం
    సమదాధాన భైక్షచర్యోర్ధ్వరేతస్కత్వాదికం
    బ్రహ్మచారిభిరనుష్ఠీయమానం కర్మ బ్రహ్మచర్యమ్‌ ॥
    (సాయణాచార్య భాష్యము అథర్వవేదము 11-5-17)
బ్రహ్మ అనగా వేదము. దానినధ్యయనము చేయుటకై బ్రహ్మచారుచే అనుష్ఠింపబడు అగ్నిహోత్రము, భిక్షావృత్తి, ఊర్ధ్వవీర్యతాది కర్మను బ్రహ్మచర్యమంటారు.
ఛాందోగ్యోపనిషత్తు (3-16) నందు బ్రహ్మచర్యము కనిష్ఠ, మధ్యమ, ఉత్తమమని మూడు విధముగా ఉన్నది.
కనిష్ఠ బ్రహ్మచర్యము :
మనుష్యుడు 24 ఏండ్ల వరకు జితేంద్రియుడుగా బ్రహ్మచారిగా నుండి వేదాది విద్యను, సుశిక్షను గ్రహించవలెను. అటుపై వివాహము చేసికొన్నను విషయలోుడు కాకుండయున్నచో శరీరమునందు ప్రాణము బము కవై సమస్త శుభగుణమును వసింపజేయుము.
మధ్యమ బ్రహ్మచర్యము :
44 ఏండ్ల పర్యంతము బ్రహ్మచారిగ నుండి వేదాది శాస్త్రము నధ్యయనము చేయువానికి ప్రాణేంద్రియాంతఃకరణము, ఆత్మయు బయుక్తమై దుష్టును దండిరచి శిష్టును పాలించువాడగును.
ఉత్తమ బ్రహ్మచర్యము :
48 సంవత్సరము పర్యంతము బ్రహ్మచారిగా నుండువానికి ప్రాణమునుకూమయి అతడు సమస్త విద్యను గ్రహించును.
పూర్ణ విద్వాంసు, జితేంద్రియు, నిర్దోషు, యోగునగు స్త్రీపురుషు మరణపర్యంతము బ్రహ్మచాయిగ నుందురేని సంతోషముగ నుండవచ్చును. గృహాశ్రమము స్వీకరించు పురుషుడు 48 సం॥ స్త్రీ 24 సం॥ కన్నా నెక్కువ సంవత్సరము బ్రహ్మచర్యము పాలించరాదు. బ్రహ్మచారుకు బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞముకర్తవ్యము.



గృహాశ్రమము :


    వేదానధీత్య వేదౌ వా వేదం వా-పి యథాక్రమమ్‌ ।
    అవిప్ణుత బ్రహ్మచర్యో గృహస్థాశ్రమమావిశేత్‌ ॥ (మనుస్మృతి 3-2)
విధిపూర్వకముగ బ్రహ్మచర్యమునందు ఆచార్యునకనుకూముగ వర్తించి నాుగు వేదము గాని, మూడు కాని, రెండు కాని లేదా ఒక్క వేదము సాంగోపాంగముగ జదివి బ్రహ్మచర్యము ఖండితము గాని స్త్రీపురుషు గృహాశ్రమమున ప్రవేశించవలెను.
    గురుణానుమతః స్నాత్వా సమావృత్తో యథావిధిః ।
    ఉద్వహేత ద్విజో భార్యాం సవర్ణాం క్షణాన్వితామ్‌ ॥ (మనుస్మృతి 3-4)
గురువుయొక్క అనుమతితో స్నానము చేసి విధిపూర్వకముగ సమావర్తన సంస్కారము చేసికొని గురుకుమునండి వచ్చిన ద్విజుడు (బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు) తన వర్ణమునకు సమానమయిన క్షణవతిjైున కన్యను వివాహము చేసికొనవలెను.
    బ్రహ్మచర్యేణ కన్యా3 యువానం విన్దతే పతిమ్‌ ।
                (అథర్వవేదము. 11-5-18)
విధిపూర్వకముగ బ్రహ్మచర్యమును పాలించిన కన్య యువకుడైన భర్తను పొందును.
ఈ విధముగ స్వయంవర పద్ధతిన వివాహము చేసికొని ఒకరితో నొకరు ప్రసన్నుగా నుండి ధర్మార్థకామమోక్షమును పొందుటకై ఇరువురు కలిసి ప్రయత్నము చేయవలెను. ఋతుగాములై ఉత్తమ సంతానమును కనవలెను. వారిని వేదాది శాస్త్రమును చదివించి సమాజమునకు రాష్ట్రమునకు ఉపయోగపడు వారిగ తీర్చిదిద్దవలెను. వివాహ సమయమున స్త్రీపురుషు వయస్సు ఈ క్రింది విధముగా నుండవలెను.
పురుషుడు    25    30    36    40    44    48 సం॥
స్త్రీ        16    17    18    20    22    24 సం॥
గృహాశ్రమము స్వీకరించు స్త్రీపురుషు క్రమముగా 24 సం॥, 48 సం॥ కన్న ఎక్కువ సంవత్సరము బ్రహ్మచర్యము పాలింపరాదు. గృహాశ్రమమున పంచమహాయజ్ఞమును ప్రతినిత్యము చేయవలెను. గృహాశ్రమముతక్కిన ఆశ్రమముకు ఆధారము. ఈ ఆశ్రమములేకున్నచో తక్కిన ఆశ్రమము వ్యవహారము సిద్ధింపదు. సర్వప్రాణు వాయువు నాశ్రయించియుండునట్లు తక్కిన ఆశ్రమము గృహాశ్రమము నంటిపెట్టుకొని యున్నవి. అన్ని ఆశ్రమము వారికి ఆవశ్యకములైన అన్నాది సమస్త పదార్థమును గృహస్థు సమకూర్చవలెను. కావున దీనిని జ్యేష్ఠాశ్రమమని యందురు.
స్త్రీపురుషులిరువురు ప్రసన్ను, విద్వాంసు, పురుషార్థు, అన్ని విధము వ్యవహారము తెలిసినవారు అయినప్పుడు గృహాశ్రమములో సుఖము కుగును. గృహాశ్రమ సుఖమునకు ముఖ్యకారణము బ్రహ్మచర్యము స్వయంవరవివాహము.

వానప్రస్థము


    ఏవం గృహాశ్రమే స్థిత్వా విధివత్‌ స్నాతకో ద్విజః ।
    వనే వసేత్తు నియతో యథావద్విజితేంద్రియః ॥ (మనుస్మృతి 6-1)
స్నాతకుడైన ద్విజుడు గృహాశ్రమ కర్తవ్యమును పూర్తిచేసి నిశ్చితాత్ముడై ఇంద్రియమును జయించి వనమునందు నివసించవలెను. వానప్రస్థమునకు సరి అయిన సమయము -
    గృహస్థస్తు యదా పశ్యేద్‌ వలీపలితమాత్మనః ।
    అపత్యస్యైవ చాపత్యం తదారణ్యం సమాశ్రయేత్‌ ॥ (మనుస్మృతి 6-2)
గృహస్థుడు తన తవెంట్రుకు త్లెబడి చర్మము ముడుతు పడి తన కుమారునకు సంతానము కలిగిన పిమ్మట అరణ్యములో నివసించవలెను.
గ్రామసంబంధమగు ఆహారమును, వస్త్రమును, సమస్త ఉత్తమ పదార్థమును వదిలి భార్యను పుత్రునియొద్ద ఉంచి గాని లేదా వెంట తీసికొని గాని వనమునకు వెళ్లవలెను.
అగ్నిహోత్రమును వెంటతీసికొని గ్రామమునుండి వెడలి దృఢచిత్తుడై అరణ్యములో నివసించవలెను.
అన్నము, శాకము, ఫము కందమూము మొదగువానితో దేవయజ్ఞాది అతిథిసేవ చేయుచుండవలెను. ప్రతినిత్యము వేదశాస్త్రమును చదువుచు మనస్సును, ఇంద్రియమును తన అధీనమున నుంచుకొని మిత్రభావముతో వ్యవహరించవలెను. ప్రతిఫమాశింపక ఇతరుకు విద్యాదానము చేయుచు పరమేశ్వరుని ధ్యానము చేయుచు జీవించవలెను.
శారీరిక సుఖముకై ప్రయత్నింపక భార్యతో కలిసియున్నను పూర్ణబ్రహ్మచర్యమును పాటించవలెను. ఆశ్రితుయందును తన పదార్థము యందును మమతనుంచకూడదు. (మనుస్మృతి 6వ అధ్యాయము)
    తపఃశ్రద్ధే యే హ్యుపవసంత్యరణ్యే శాంతా విద్వాంసో భైక్షచర్యాం చరన్తః ।
    సూర్యద్వారేణ తే నిరజాః ప్రయాన్తి యత్రామృతః పురుషోహ్యవ్యయాత్మా ॥
                (ముండకోపనిషత్తు 1-2-11)
శాంతులైనవారు సాంసారిక సుఖదుఃఖము నభిషింపక విద్వాంసుయి భిక్షాటన చేయుచు అరణ్యములో శీతోష్ణాది ద్వంద్వమును సహించుచు వైదిక కర్తవ్యకర్ము చేయుదురో వారు పాపరహితులై ప్రాణనాడి మూమున నాశరహితుడు పూర్ణుడు అగు పరమాత్మను పొంది ఆనందము ననుభవింతురు.

సంన్యాసము :


యదహరేవ విరజేత్తదహరేవ ప్రవ్రజేత్‌, వనాద్వా, గృహాద్వా బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్‌ ॥
ఏ రోజు వైరాగ్యము కుగునో ఆ రోజే వనమునుండి గాని, గృహమునుండి గాని, బ్రహ్మచర్యమునుండి గాని సంన్యాసము గ్రహింపవలెను.
పూర్ణవిద్వాంసుడు, జితేంద్రియుడు, విషయభోగము కోరికలేనివాడు, పరోపకారము చేయు కోరిక గవాడు బ్రహ్మచర్యమునుండియే సంన్యాసమును గ్రహింపవచ్చును.
దురాచారి, శాంతిరహితుడు, మనస్సునేకాగ్రము చేయలేనివాడు సంన్యాసమునకు యోగ్యుడు కాడు.
ప్రాజాపత్యాం నిరూప్యేష్టిం సర్వవేదసదక్షిణామ్‌ ।
ఆత్మన్యగ్నీన్సమారోప్య బ్రాహ్మణః ప్రవ్రజేద్గృహాత్‌ ॥ (మనుస్మృతి 6-38)
ప్రజాపతి - పరమేశ్వరుని ప్రాప్తికొరకు యజ్ఞముచేసి యజ్ఞోపవీతశిఖాది చిహ్నమును వదలి ఆహవనీయము మున్నగు అగ్నును ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానమును పంచప్రాణముం దారోపించి బ్రాహ్మణుడు - బ్రహ్మవిదుడు ఇంటినుండి వెడలి సంన్యాసి కావలెను.
పక్షపాతరహిత న్యాయాచరణము, సత్యగ్రహణము, అసత్యపరిత్యాగము, వేదోక్తమగు ఈశ్వరాజ్ఞా పానము, సత్యభాషణము మొదగునవి అన్ని ఆశ్రమవాసుకు సమానమే. సంన్యాసి వీటి ఆచరణలో ఏమాత్రము పొరపాటు చేయరాదు.
ఉపదేశసమయమందు కాని, సంవాదమందు గాని, ఎవరైన కోపముతో సంభాషించినను తానతనిపై కోపింపక అతని కల్యాణార్థమై సదుపదేశము చేయవలెను.
రాగద్వేషరహితుడు ఇంద్రియమును అధర్మాచరణనుండి నిరోధించి అందరితో మిత్రభావముతో ప్రవర్తించుచు మోక్షము కొరకు యోగాభ్యాసము ద్వారా సామర్థ్యము వృద్ధిపరచుకొనవలెను.
దండము, కమండము, కాషాయవస్త్రము మొదగునవి ధరించుటయే ధర్మము కాదనియు పరిభ్రమణము చేయుచు మనుష్యుందరకు సత్యోపదేశ విద్యాదానముచే ఉన్నతి కలిగించుటయే సంన్యాసి ముఖ్యధర్మమని నిశ్చయముగా తెలియవలెను.
ఇచ్చట వర్ణాశ్రమము గురించి సంక్షిప్తముగా వ్రాయబడినది.

ధర్మము దాని స్వరూపము


ధృఞ్‌ ధారణే అను ధాతువునకు ఉణాది ‘మన్‌’ ప్రత్యయము చేర్చినచో ధర్మ శబ్దమేర్పడును.
1.    ధ్రియతే సుఖప్రాప్తయే సేవ్యతే స ధర్మః పక్షపాతరహితో
    న్యాయః సత్యాచారో వా ॥ (ఉణాదివ్యాఖ్య 1-40)
ధర్మమనగా సుఖప్రాప్తికై సేవించునది, పక్షపాతరహితమైన న్యాయము, సత్యాచారము.
2. ధరతీతి ధర్మః. ధర్మమనగా ధారణచేయునది. ఈ విషయము మహాభారతము - నందొకచోట ఇట్లు చెప్పబడినది.
    ధారణాద్ధర్మ ఇత్యాహః ధర్మో ధారయతే ప్రజాః ।
    యత్‌స్యాద్ధారణసంయుక్తః స ధర్మ ఇతి నిశ్చయః ॥
ధారణ చేయుటవన - ధరించుట వన ధర్మమని పేరు. ధర్మము ప్రజను ధరిస్తుంది. నిశ్చయముగా దేనివన ధారణ కుగునో అదియే ధర్మము.
3. మనుష్యుడు తనకన్న ఉన్నతమైన పదార్థమునందు విశ్వాసముంచి దానిచే ప్రభావితుడయి చేయు క్రియాకలాపముకు ధర్మమని పేరు.
4.     ధృతిక్షమాదమో-స్తేయం శౌచమిన్ద్రియనిగ్రహః ।
    ధీర్విద్యాసత్యమక్రోధో దశకం ధర్మక్షణమ్‌ ॥ (మనుస్మృతి 6-92)
1. ధైర్యము 2. క్షమాగుణము 3. మనోనిగ్రహము 4. చౌర్యము చేయకుండుట 5. శుచి - పవిత్రత 6. జ్ఞానకర్మేంద్రియమును వశమందుంచుకొనుట 7. బుద్ధి 8. విద్యా 9. సత్యభాషణము 10. కోపము లేకపోవుట - ఈ పది ధర్మక్షణము.
5.     వేదః స్మృతిః సదాచారః స్వస్యచ ప్రియమాత్మనః ।
    ఏతచ్చతుర్విధం ప్రాహుః సాక్షాద్ధర్మస్య క్షణమ్‌ ॥ (మనుస్మృతి 2-12)
1. వేదము 2. స్మృతి - వేదానుకూ మనుస్మృత్యాది శాస్త్రము. 3. సదాచారము 4. తన ఆత్మ పవిత్రతకు ప్రియమైనవి. ఇవి ధర్మక్షణము.
6.     ఆర్షధర్మోపదేశం చ వేదశాస్త్రావిరోధినా ।
    యస్తర్కేణానుసంధత్తే న ధర్మ వేద నేతరః ॥ (మనుస్మృతి 12-106)
వేదశాస్త్రముకు విరుద్ధముగా లేని ఋషుయొక్క ధర్మోపదేశము, తర్కమునకు నిుచునది ధర్మము. లేనిచో ధర్మము కాదు.
7.     వేదప్రతిష్ఠితం కర్మ ధర్మ స్తన్మంగం పరమ్‌ ।
    ప్రతిసిద్ధక్రియాసాధ్యః స గుణో-ధర్మ ఉచ్యతే ॥
వేదవిహితమైన పరమశుభకరమైన కర్మయే ధర్మము. దానికి విపరీతమైనది అధర్మము.
8.     మనుష్యుడు వర్ణాశ్రమవ్యవస్థననుసరించి చేయదగు కర్తవ్యము కూడ ధర్మమే. ఇది యంయు మనుస్మృతిలో విస్తారముగ నున్నది.
9.     యతో-భ్యుదయ నిఃశ్రేయససిద్ధిః స ధర్మః ॥
                (వైశేషిక దర్శనము 1-1-2)
దేనివన ఇహలోకసుఖము పరలోకసుఖము - ముక్తి సిద్ధించునో అది ధర్మము. ఇది పదార్థవిద్య.
10.     అర్థకామేష్వసక్తానాం ధర్మజ్ఞానం విధీయతే ॥ (మనుస్మృతి 2-13)
అర్థము - నానా విధములైన ధనము మరియు స్త్రీ సేవనాదుయందు ఆసక్తు కానివారికి మాత్రమే ధర్మము తెలిసికొను కోరిక కుగును.
11.     ధర్మ ఏవ హతో హన్తి ధర్మో రక్షతి రక్షితః ।
    తస్మాద్ధర్మో న హన్తవ్యో మా నో ధర్మో హతో-వధీత్‌ ॥ (మనుస్మృతి 8-15)
మానవుడు ధర్మమును నశింపజేసినచో అది అతనినే నష్టము చేయును. దానిని రక్షించినచో అది అతనిని రక్షించును. కావున ధర్మము నశింపబడరాదు. అని ముమ్మారు చెప్పబడినది. ధర్మరక్షణ ధర్మాచరణయే మన కర్తవ్యము.


కర్మ మరియు కర్మభేదము


ఓం     కుర్వన్నే నేహ కర్మాణి జిజీవిషేచ్ఛత సమాః ।
    ఏవం త్వయి నాన్యథేతో-స్తి న కర్మ లిప్యతే నరే ॥
                    (యజుర్వేదము 40-2)
ఓ మానవుడ! నీవు వంద సంవత్సరము కర్ము చేయుచు జీవింపకోరుము. కర్మరాహిత్యము కూడదు. ఈ వేదవిహత కర్మను కర్తవ్యబుద్ధితో చేయుము. మోహముతో వదు. ఇట్లు చేసినచో నీవు కర్మబంధనము లోనికి రావు. కర్మబంధనమునకు హేతువు కాని విధముగ నుండుటకు ఇంకొక పద్ధతిలేదు. నిష్కామబుద్ధితో కర్ము చేయుటయే ఉపాయము.
మానవు చేయు కర్ము ఎన్నోరకాు. వాటి భేదమును చూపు పద్ధతు కూడ కొన్ని రకాు. అందులో ఒక పద్ధతి ననుసరించి కర్ము నాుగు రకాు. 1. అకర్ము 2. కర్ము 3. కుకర్ము 4. సుకర్ము.
1. అకర్ము : మనుష్యుడు తన కొరకు చేయునవి. స్నానముచేయుట, తినుట, నీరు త్రాగుట, వస్త్రమును ధరించుట మొదగునవి వీటి ఫము సీమితము.
2. కర్ము : ఇతరు మేుకోరి చేయునవి. నిర్ధనుకు, వికలాంగుకు సహాయము చేయుట. ఇతరుకు శిక్షా, విద్యను నేర్పుట. దుఃఖితుకు ధైర్యము చెప్పుట, రోగుకు సేవచేయుట. దేశము మరియు తన జాతియొక్క ఉన్నతికై పురుషార్థము చేయుట. మానవకల్యాణమునకై ప్రయత్నము చేయుట.
3. కుకర్ము : ఇతరుకు మరియు స్వయముగా తనకు కూడ హాని కలిగించునవి. ఇవి ద్వేషబుద్ధితో చేయునవి. ఇతరుకు దుఃఖము, నష్టము కలిగించునవి.
4. సుకర్ము : ఆత్మోన్నతిని కలిగించునవి పరమాత్మ సాక్షాత్కారమునకు దోహదము చేయునవి.
ఇంకొక పద్ధతి ననుసరించి కర్ము మూడు విభాగము. అవి 1. నిత్యకర్ము. 2. నైమిత్తికకర్ము. 3. కామ్యకర్ము.

నిత్యకర్మలు



    పఞ్చ ర్ణప్తా మహాయజ్ఞాః ప్రత్యహం గృహమేధినామ్‌ ॥ (మనుస్మృతి 3-69)
ఐదు మహాయజ్ఞము గృహస్థుడు ప్రతినిత్యము చేయదగినవి. అవి 1. బ్రహ్మయజ్ఞము 2. దేవయజ్ఞము 3. పితృయజ్ఞము 4. అతిథియజ్ఞము 5. బలివైశ్వదేవయజ్ఞము.
1. బ్రహ్మయజ్ఞము : ప్రతినిత్యము ప్రాతఃకామున లేచి స్నానాదికములైన ఆవశ్యకమును పూర్తిచేసి జీవాత్మ పరమాత్మను విచారించుట. దీనిని సంధ్యోపాసన అనియు నందురు. మరియు వేదశాస్త్రము స్వాధ్యాయము.
    బ్రాహ్మే ముహూర్థే బుద్ధ్యేత ధర్మార్థౌచానుచింతయేత్‌ ।
    కాయక్లేశాంశ్చ తన్మూలాన్‌ వేదతత్త్వార్థమేవ చ ॥ (మనుస్మృతి 4-92)
ప్రతినిత్యము బ్రహ్మముహూర్తమున ఉదయము గం. 4-00 కు లేవవలెను. ధర్మార్థమును, శారీరిక క్లేశమును - దుఃఖమును, వాటి కారణమును మరియు సృష్టియొక్క మూతత్త్వమును విచారించవలెను - ఆలోచించవలెను. భగవంతుని ధ్యానము చేయవలెను.
2. దేవయజ్ఞము : అగ్నిహోత్రము మొదుకొని అశ్వమేధపర్యంతము గ యజ్ఞము చేయుట. శుద్ధ హవనకుండములో పవిత్ర ప్రజ్వలితాగ్నిలో ఆహుతిగా వేసిన హుతద్రవ్యము మూడు రూపముగా మారుతుంది. 1. అగ్నిలో కాలి కుండములో మిగిలిన బూడిద. 2. ఆ హుతద్రవ్యములో గ గుణము. అది అగ్నివన అతి సూక్ష్మముగా మారి సర్వత్ర వ్యాపించును. వాతావరణమును శుద్ధముగా చేయును.
అగ్నౌ ప్రాస్తాహుతిః సమ్యగాదిత్యముపతిష్ఠతే ।
ఆదిత్యాజ్జాయతే వృష్టిర్‌ వృష్టేరన్నం తతః ప్రజాః ॥ (మనుస్మృతి 3-76)
అగ్నిలో వేసిన ఆహుతి సూక్ష్మముగా మారి సూర్యమండము వరకు చేరును. అచ్చట సూర్యునిలో పరితప్తమై అతి సూక్ష్మముగా మారి ఎన్నోరెట్ల శక్తితో తిరిగి భూమిపైకి వచ్చును. దీనివన అగ్ని, జము, వాయువు, ఆకాశము, పృథివి, ఓషధు, వనస్పతు, చంద్రుడు, నక్షత్రము, సూర్యుడు మొదగు భౌతిక దేవతు శక్తివంతమగును. ఇవి తిరిగి మనకు ఎన్నో రెట్ల శక్తిని ప్రసాదించును. చక్కటి వర్షము కురియును. ఆ వర్షము వన శక్తివంతమైన పంటు పండును. ఆ పంట ఆహారము వన మానవు బమైన శరీరము కలిగియుందురు. ఇది అతి సూక్ష్మమైనది. యజమాని సూక్ష్మశరీరములో సంస్కారముగ చేరును. జీవాత్మ స్థూశరీరమును వదలి వెళ్ళినపుడు సూక్ష్మశరీరము జీవునితోనే ఉంటుంది. ఈ సూక్ష్మశరీరమున చేరిన ఆహుతు శ్రద్ధావిశ్వాసముగ మారి జీవుని సుందరమైన, సుఖప్రదమైన లోకములో - శరీరములో చేర్చును. చనిపోయిన పిమ్మట జీవుని వెంట వచ్చునవి కేవము ధార్మిక కర్మ సంస్కారము మాత్రమే.
3. పితృయజ్ఞము : గృహములోనున్న తల్లి, తండ్రి మరియు ఇతర వృద్ధు సేవచేయుట వారికి కావసిన ఆహారము, వస్త్రము మొదగు పదార్థమును సమకూర్చి వారికి దుఃఖము కుగకుండ చూచుట. అట్లే గురువు, సాధువు, మహాత్ము మొదగువారి సేవచేయుట. దీనివన వారి ఆశీర్వాదము దానివన ఉన్నతి కుగును.
    అభివాదనశీస్య నిత్యం వృద్ధోపసేవినః ।
    చత్వారి తస్య వర్ధన్త ఆయుర్విద్యాయశో బమ్‌ ॥ (మనుస్మృతి 2-121)
పెద్దను నమస్కారాదుచే గౌరవించు స్వభావము గవానికి నిత్యము వృద్ధును సేవించువానికి ఆయుష్షు, విద్యా, కీర్తి, బము పెరుగును.
4. అతిథియజ్ఞము : సూచన లేకుండ, ఆహ్వానము లేకుండ అపరిచిత విద్వాంసుడు, పరివ్రాట్‌ - సంన్యాసి మన ఇంటికి వచ్చినపుడు అతనికి స్వాగతమొసంగి సత్కరించి అన్నపానాదు నొసంగుట. ఇది భారతీయ సంస్కృతిలో ఉజ్జ్వమైన విధానము.
5. బలివైశ్వదేవయజ్ఞము : సమస్తప్రాణు మేుకొరకై ప్రయత్నము చేయుట. అందరిసుఖమునకై భగవంతుని ప్రార్థించుట. వంట పూర్తి అయిన పిదప మనము భుజింపకముందు ఉప్పు, కారము కవని పదార్థమును (తీపిగవి, అన్నము మొదగునవి) పొయ్యిలోని నిప్పులో ఆహుతుగా వేయుట. మనము పోషించు జంతువు ఆవు మొదగువానికి ఆహారము నొసంగుట.
2. నైమిత్తిక కర్ము:
ఇవి పర్వము - పండుగు మొదగు సందర్భములో చేయునవి. నూతన సంవత్సరము (ఉగాది), సంక్రాంతి, శ్రావణి, విజయదశమి, దీపావళి, హోళి మొదగు పర్వదినముందు పెద్ద పెద్ద యజ్ఞమును చేయుదురు.
3. కామ్యకర్ము :
విశేషకోరికతో చేయునవి. పుత్రేష్టి, వర్షేష్టి, ఇష్టాపూర్తము (వాపీకూపతటాకారామాదు). ఇవి సమాజము యొక్క శ్రేయస్సును కోరి చేయునవి.
కర్ము ఇంకొక పద్ధతిలో సంచితకర్ము, ప్రారబ్ధకర్ము, క్రియమాణ కర్ము అని మూడు విధము.
1. సంచిత కర్ము : పూర్వజన్మలో చేసిన కర్ము. వీటివన శరీరము, పరిచారము, బుద్ధి దేశము మొదగునవి భించును.
2. ప్రారబ్ధకర్ము : ఇవి సంచిత కర్మలోనివి ఈ జన్మలో మన భాగ్యము లేదా అదృష్టముగ మారునవి. లోకములో కొందరు మంచి కర్ము చేస్తున్నను దుఃఖమును పొందుటను చెడు కర్ము చేయుచు సుఖమును పొందుటను చూస్తుంటాము. ఈ సుఖదుఃఖము ప్రారబ్ధకర్మ ఫమే గాని వర్తమాన కర్మ ఫము కావు.
3. క్రియమాణకర్ము : ఈ జీవితములో చేయునవి ఈ కర్ము చేయుటలో జీవు స్వతంత్రు. ఫము ననుభవించుటలో పరతంత్రు. ఈ కర్మపైన ప్రారబ్ధకర్మ ప్రభావము ఉండును. మనము చేయు ప్రతి కర్మకు ఫము ననుభవింపక తప్పదు.
అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్‌.

పూర్వజన్మ మరియు పునర్జన్మ


లోకములో మనము ఎన్నో రకా మనుష్యును చూస్తుంటాము. ఒకే తల్లికి జన్మించిన నుగురు కుమారులో ఎంతో భేదము కనిపిస్తుంది. తల్లిదండ్రు వారిని ఒకేరీతిగ పోషించినను వారి బుద్ధి మరియు జ్ఞానములో సమానత కనిపించదు. పాఠశాలో ఒక తరగతిలో నున్న విద్యార్థుందరికి ఒకే ఉపాధ్యాయుడు విద్య నేర్పినను అందరు ఒకే విధముగ విద్య గ్రహించరు.
మంచి కర్ము చేసేవారికి మేు-సుఖము కగాని, దుష్కర్ము చేసేవారికి కీడు-దుఃఖము కగాని ప్రతి మనిషి ఆశిస్తాడు. కాని కొందరు దుష్కర్ము చేయుచున్నను వారికి సుఖము భించుటను శ్రేష్ఠకర్ము చేయుచున్నను దుఃఖితుగుటను చూస్తుంటాము. ఇట్టి స్థితిలో సాధారణ మనుష్యు భ్రమపడి శ్రేష్ఠకర్ము చేయుట వన మేలేమి లేదని నిరాశకు లోనవుతాడు. కాని జాగ్రత్తగ పరిశీలించినచో శ్రేష్ఠకర్ము చేయువారందరు దుఃఖితుగ లేరని, దుష్కర్ము చేయువారందరు సుఖపడుట లేదని తొస్తుంది. ఈ సుఖదుఃఖము వర్తమానకర్మ ఫము కాదని తెలియవలెను. అవి గత జన్మలో చేసిన కర్మ ఫమే. అందుకు సందేహము లేదు. మనుష్యులో కనిపించు అసమానత (బుద్ధిలోను, జ్ఞానములోను, సుఖదుఃఖములోను) పూర్వజన్మను నిరూపిస్తుంది.
పరమేశ్వరుడు న్యాయకారి. మానవుల్పజ్ఞుగుటచే పొరపడి ఎప్పుడైన న్యాయనిర్ణయము సరిగా చేయకపోవచ్చును. కాని సర్వజ్ఞుడగు పరమేశ్వరుడు అకారణముగ, అన్యాయముగ జీవును సుఖదుఃఖముకు గురిచేయడు. అతని న్యాయవ్యవస్థలో దోషము నాపాదించుట మన అవివేకము.
ప్రతి కర్మకు ఫము వెంటనే భించదు. అది ప్రత్యక్షముగా చూస్తున్నాము. పొములో విత్తనము వేసిన పిదప నాుగు నెలకు కాని వరివండదు. చెరుకునకు పదినెలైన కావాలి. సంతానమును కోరువారు గర్భాదాన సమయమునుండి పదిమాసము నిరీక్షించాలి. ఇట్టి పరిస్థితిలో ప్రతి కర్మకు వెంటనే ఫము భంచాని అనుకొనుట అజ్ఞానమే. ఈ సుఖదుఃఖరూపమైన కర్మఫము పరమేశ్వరుని న్యాయవ్యవస్థ ననుసరించి ఎప్పుడు ఏ విధముగ భించాలో అప్పుడే భిస్తుంది. మనము చేయు శ్రేష్ఠకర్మలెప్పుడు నిరర్థకము కావు.
అంతేకాదు మానవజీవితోద్దేశ్యమైన అత్యంతపురుషార్ధమగు మోక్షమును పొందుట ఒక జన్మలో సాధ్యము కాదు. ఈ జన్మలో చేసిన సాధన, ఆర్జించిన జ్ఞానము తరువాత జన్మలో తీవ్రగతిలో అభివృద్ధిచెందుటకు దోహదమగును. ఈ విధముగ ప్రతి జన్మలోను పురుషార్థమొనర్చుచు జన్మమరణబంధనము నుండి ముక్తుడయి పరమాత్మలోని ఆనందము ననుభవించుటకు వీగును.
ఈ జీవుడు నశింపడనియు, ఒక శరీరమునుండి మరియొక శరీరములోనికి వెళ్లునననుటకు శాస్త్రీయ ప్రమాణములెన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని ఇట వ్రాయబడినవి.
1.    మృతశ్చాహం పునర్జాతో జాతశ్చాహం పునర్మృతః ।
    నానా యోనిసహస్రాణి మయోషితాని యాని వై ॥ (నిరుక్తము 14-6)
నేను-జీవుడను చనిపోయి మళ్ళీ పుట్టాను. పుట్టి మర చనిపోయాను. ఈ విధముగ నేను ఎన్నో శరీరములో నిశ్చయముగ వాసము చేసినాను. పుట్టుట R జీవునకు శరీరముతో సంబంధమేర్పడుట. చనిపోవుట R జీవుడు శరీరమునుండి వెళ్లిపోవుట. ఈ విధముగ జీవుడు పాపపుణ్యకర్మ ఫము ననుభవించుచు ప్రకృతి పురుషవివేకఖ్యాతి కుగనంతవరకు జన్మలెత్తుచుంటాడు.
2.    న జాయతే మ్రియతే వా విపశ్చి న్నాయం
    కుతశ్చిన్న బభూవ కశ్చిత్‌ । అజో నిత్యః శాశ్వితో-యం పురాణో
    న హన్యతే హన్యమానే శరీరే ॥ (కఠోపనిషత్తు 1-2-18)
అయం విపశ్చిత్‌ R జ్ఞానవంతుడైన జీవుడుÑ న జాయతే మ్రియతే వా R పుట్టడు మరియు నశించడుÑ కుతశ్చిత్‌ న బభూవ R దేనినండియు పుట్టలేదుÑ కశ్చిత్‌ న R ఎవడును పుట్టలేదు. అజః R జన్మములేనివాడుÑ నిత్యః R పరిణామము లేనివాడుÑ శాశ్వతః R వృద్ధిక్షయము లేనివాడుÑ పురాణఃR ఎప్పుడు ఒకేరకముగ నుండువాడుÑ శరీరే హన్యమానే R శరీరము నశించిననుÑ న హన్యతే R ఇతడు చావడు, నశింపడు.
3.    జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ ।
    తస్మాదపరిహార్యే-ర్థే న త్వం శోచితుమర్హతి ॥ (భగవద్గీత 2-27)
పుట్టినవానికి చావు తప్పదు. అట్లే చచ్చినవానికి జన్మతప్పదు. కావున ఓ అర్జున మన ఇష్టానిష్టముతో సంబంధములేకుండ తప్పనిసరిగా జరుగు ఈ విషయమున నీవు దుఃఖించవదు.

కర్మానుసారముగ యోని ప్రాప్తి


పునర్జన్మ గురించి చెప్పబడినది. మానవుడు ఈ జన్మలో చేయు కర్మ ననుసరించి పునర్జన్మ భిస్తుంది. మనుష్యుడు చేయు కర్మన్నియు అతని మనోప్రవృత్తిపై ఆధారపడియుంటాయి. అది సాత్త్వికము, రాజసికము, తామసికము అని మూడు విధము. వీటిని గుణము అంటారు.
సత్త్వం జ్ఞానం తమో-జ్ఞానం రాగద్వేషౌ రజః స్మృతమ్‌ ॥
ఏతద్‌ వ్యాప్తిమదేతేషాం సర్వభూతాశ్రితం వపుః ॥ (మనుస్మృతి 12-26)
సత్త్వరజస్తమోగుణము ప్రపంచమందలి ప్రతిపదార్థములో వ్యాపించి ఉన్నవి. మనస్సు, బుద్ధియందు సత్త్వగుణమెక్కువగా నున్నపుడు జ్ఞానము, తమోగుణమెక్కువగా నున్నపుడు అజ్ఞానము, రజోగుణమెక్కువగా నున్నపుడు రాగద్వేషము కుగును.
వేదాభ్యాసస్తపో జ్ఞానం శౌచమిన్ద్రియనిగ్రహః ।
ధర్మ క్రియాత్మచిన్తా చ సాత్త్వికం గుణక్షణమ్‌ ॥ (మనుస్మృతి 12-31)
సాత్త్వికగుణమెక్కువగా నున్నప్పుడు మనుష్యునిలో ఈ క్షణము ఉంటాయి. వేదాభ్యాసము, ధర్మానుష్ఠానము, జ్ఞానవృద్ధి, పవిత్రత, ఇంద్రియనిగ్రహము, ధార్మికత, ఆత్మచింతనము.
    ఆరంభరుచితా-ధైర్యమసత్కార్యపరిగ్రహః ।
    విషయోపసేవా చౌజస్రం రాజసం గుణక్షణమ్‌ ॥ (మనుస్మృతి 12-32)
రజోగుణమెక్కువగా నున్నపుడు ఆరంభములో రుచి, అధైర్యము, అసత్కార్యము చేయుట, విషయసేవనమునందు ప్రీతియనునవి కుగును.
    లోభః స్వప్నో-ధృతిః క్రౌర్యం నాస్తిక్యం భిన్నవృత్తితా ।
    యాచిష్ణుతా ప్రమాదశ్చ తామసం గుణక్షణమ్‌ ॥ (మనుస్మృతి 12-33)
తమోగుణమెక్కువగా నున్నపుడు అన్ని పాపముకు మూమైన లోభము, అతినిద్ర, అధైర్యము, క్రూరత, నాస్తిక్యము - వేదము, ఈశ్వరునియందు అశ్రద్ధ, మనస్సునంది భిన్న భిన్న వృత్తు, ఏకాగ్రత లేకపోవుట, వ్యసనముందు చిక్కుకొనుట మొదగు క్షణము కనిపించును.
    తమసో క్షణం కామో రజసస్త్వర్థ ఉచ్యతే ।
    సత్త్వస్య క్షణం ధర్మః శ్రేష్ఠమేషాం యథోత్తరమ్‌ ॥ (మనుస్మృతి 12-38)
తమోగుణక్షణము కామము, రజోగుణక్షణము అర్థసంగ్రహము, సత్త్వగుణక్షణము ధర్మము. తమోగుణముకన్న రజోగుణము, రజోగుణముకన్న సత్త్వగుణము శ్రేష్ఠము.
ఇట్టి గుణముతో ప్రవృత్తుడయిన జీవునకు పునర్జన్మలో అతని గతి R యోనిప్రాప్తి (శరీరప్రాప్తి) ఈ విధముగా ఉంటుంది.
    దేవత్వం సాత్త్వికా యాన్తి మనుష్యత్వం చ రాజసాః ।
    తిర్యక్త్వం తామాసా నిత్యమిత్యేషా త్రివిధా గతిః ॥ (మనుస్మృతి 12-40)
సాత్త్వికుయినవారు దేవతు అగా విద్వాంసుగను, రజోగుణము కవారు మధ్యమ మనుష్యుగను, తమోగుణము గవారు నీచగతిని పొందుదురు.
    ఇంద్రియాణాం ప్రసంగేన ధర్మస్యాసేవనేన చ ।
    పాపాన్‌ సంయాతి సంసారానవిద్వాంసో నరాధమాః ॥ (మనుస్మృతి 12-52)
ఇంద్రియముకు దాసులై విషయముకు లోబడి ధర్మమును వదలి అధర్మము నాచరించు అవిద్వాంసు నీచజన్మను, దుఃఖరూపమగు హీనజన్మను పొందుదురు.
ఈ ప్రకారము సత్త్వరజస్తమోగుణయుక్త వేగముచే జీవుడేయే ప్రకారపు కర్ము చేయునో ఆయా ప్రకారపు ఫమును పొందును. ముక్తిని కోరువారు గుణాతీతులై - గుణస్వభావములో చిక్కుకొనక యోగుయి ముక్తికొరకు సాధన చేయవలెను.
సత్త్వధర్మము : ప్రీతి, ప్రసన్నత, లాఘవము, తితిక్షా, సంతోషము, ఆర్జవము, మృదుత, జ్జ, శ్రద్ధ, క్షమ, దయ, జ్ఞానము మొదగునవి.
రజోధర్మము : అప్రీతి, దుఃఖము, ద్వేషము, ద్రోహము, మత్సరము, నింద, వంచన, అశాంతి, యుద్ధము, కామక్రోధము, శోకము, ఆరంభరుచిత, పరాభవము మొదగునవి.
తమోధర్మము : మదము, మోహము, భయము, నాస్తిక్యము, కుటిత, కృపణత, ఆస్యము, నిద్ర, అకర్మణ్యత, అజ్ఞానము మొదగునవి.
బుద్ధి భేదము
సాత్త్వికబుద్ధి :
    ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే ।
    బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్త్వికీ ॥
ప్రవృత్తినివృత్తును, కార్యాకార్యమును భయాభయమును, బంధమోక్షమును ఎరుగుదానిని  సాత్త్వికబుద్ధి అంటారు.
రాజసబుద్ధి :
    యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ ।
    అయథావత్‌ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ ॥
ధర్మాధర్మమును, కార్యాకార్యమును ఉన్నవి ఉన్నట్లు గుర్తింపక విపరీతముగ నెరుగుదానిని రాజసబుద్ధి అంటారు.
తామసబుద్ధి :
    అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా ।
    సర్వార్థాన్‌ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ ॥
తమోగుణము - అజ్ఞానముతో ఆవరింపబడి అధర్మమును ధర్మముగ గుర్తించుచు సర్వ ప్రయోజనమును విపరీతముగ నెరుగుదానిని తామసబుద్ధి అంటారు.

కార్యకారణ సంబంధము


దార్శనిక భాషలో కార్యము, కారణము అను శబ్దము పారిభాషిక పదము. కార్యము ఏర్పడుటకు మూడు కారణముత్యవసరము.
1.     చేతన నిమిత్తకారణము
2.     ఉపాదనకారణము
3.     సాధారణకారణము
ఉదాహరణ వన ఈ విషయము స్పష్టమగును. ఘటము (మట్టికుండ) - కార్యము. ఇది ఏర్పడుటకు కావసిన మూడు కారణము -
1. కుమ్మరి - చేతననిమిత్తకారణము.
2. మృత్తిక (మట్టి) - ఉపాదానకారణము.
3. చక్రదండాదు, ప్రయోజనము - సాధారణకారణము.
ఈ విధముగ వస్త్రము, ఆభరణము, గృహము, గడియారము మొదగువెన్నియో కార్యము నబడును. వీటిని భావపదార్థముని కూడ అంటారు. అనగా పుట్టిన పదార్థము - తయారుచేయబడిన పదార్థము. ఈ కార్యపదార్థమున్ని ఒకప్పుడు లేక అవి నిర్మింపబడి కొంతకాము స్థితి - ఉనికిలో ఉండి పిదప నశించును. అందుచే పుట్టిన ప్రతి పదార్థము తప్పక నశించును అని దార్శనిక నియమము. అనగా ఆది (మొదు) క ప్రతిదానికి అంతము (చివర) తప్పకయుండునని చెప్పవచ్చును.
ప్రతి కార్యములో విక్షణమైన, నియమపూర్వకమైన పనితనము, సంయోజకత - కూర్పు కనిపిస్తుంది. పైనుదహరించిన ఘటాది కార్యములో ఈ నియమము కనిపిస్తుంది. అందుచే కార్యమనగా జ్ఞానపూర్ణమైన, నియమబద్ధమైన అనేక అవయవము కూర్పు అని చెప్పవచ్చును. ఆ కార్యము యొక్క విభిన్న అవయవమును విడదీసినచో దానిని ఆ కార్యము యొక్క నాశము అని అంటారు. ఘటమునందు మట్టిపరమాణువు, వస్త్రమునందు దారము, ఆభరణముందు స్వర్ణము, రత్నము మొదగునవి వాటి కార్యము అవయవము. కార్యమునందు ఉపాదానకారణము యొక్క గుణము ఉండును. చేతననిమిత్తకారణము లేదా సాధారణకారణము యొక్క గుణము ఉండవు.

చేతననిమిత్తకారణము :


ఇది ఉపాదానకారణమును కార్యరూపములోనికి మార్చునది. ఇది జ్ఞానవంతమైనది. అనగా ఉపాదానకారణమును కార్యముగా మార్చుటకు కావసిన జ్ఞానము కలిగినట్టిది. దీనిని కర్త అని కూడ అంటారు. ‘స్వతన్త్రఃకర్తా’ (1-4-54). ఇది పాణిని యొక్క వ్యాకరణసూత్రము. కర్తjైునవాడు ‘కర్తుమ్‌, అకర్తుమ్‌, అన్యథా కర్తుం సమర్థః’. (ఇచట ఒక విషయము గమనింపవలెను. ఈశ్వరునిలో కేవము కర్తృత్వము గదు. జీవునిలోనే ఈ మూడు గుణమున్నవి.) అనగా కర్త కార్యము చేయుటయందు స్వతంత్రుడు. కార్యము చేయుటను మానుకొనును లేదా విపరీతముగ గూడ చేయగడు. ఉదాహరణలో కుమ్మరి (కర్త) ఘటము చేయుటకై మృత్తికను సిద్ధముచేసికొని ఘటము చేయవచ్చును. లేదా మానుకొనవచ్చును లేదా విపరీత కార్యము చేయవచ్చును. అందుకతడు స్వతంత్రుడు, సమర్థుడు. కర్త కేవము నిర్మాతయే కాదు, దానినతడు రక్షించగడు, నాశము కూడ చేయగడు. అనగా కర్త నిర్మించుట, రక్షించుట, నశింపచేయుట అను మూడు పను చేయగడు.
కర్త ఉన్నచోటనే కార్యము ఏర్పడును. కర్తయొక్క గుణములైన కర్తృత్వము, జ్ఞానము మొదగునవి కార్యములో నుండవు.
ఉపాదానకారణము :
ఇది కార్యమేర్పడుటకు కావసిన ముడిపదార్థము. ఇది జడము - జ్ఞానము లేనిది.
కారణాభావాత్కార్యాభావః । (వైశేషిక దర్శనము 1-2-1)
అనగా ఉపాదాన కారణము లేనిచో కార్యమేర్పడదు. అంతే కాదు.
కారణగుణపూర్వకః కార్యగుణో దృష్టః । (వైశేషిక దర్శనము 2-1-24)
ఉపాదాన కారణములోని గుణము కార్యములో కనిపించును. ఉపాదాన కారణము కార్యరూపము లోనికి మారును. అపుడు కారణముండదు. కార్యము నశించినపుడు కార్యముండదు. అప్పుడు అది కారణరూపములో ఉండును.
న తు కార్యాభావాత్‌ కారణాభావః । (వైశేషిక దర్శనము 1-2-2)
కారణ భావాత్‌ కార్యభావః । (వైశేషిక దర్శనము 4-1-3)
కార్యము నశించినపుడు కారణముండదనుట సరిjైునది కాదు. కారణమున్నపుడు మాత్రమే కార్యమేర్పడును. ఉదాహరణలో ఉపాదాన కారణమైన మట్టి ఘటముగా ఏర్పడినపుడు కారణముండదు. ఘటమును ముక్కుగ, చూర్ణముగ చేసినపుడు అది కారణమైన మృత్తికగా మారి కార్యము (ఘటము) ఉండదు.
సాధారణ కారణము :
ఉపాదాన కారణమును కార్యముగా మార్చుటకు చేతన నిమిత్తకారణమునకు ఉపకరించు సాధనము, కాము, కార్యప్రయోజనము మున్నగునవి. ఉదాహరణలో కుమ్మరి కుండచేయుట కుపయోగించు చక్రదండాదు, అందుకు కావసిన కాము కుండ ప్రయోజనము మొదగునవి. ‘వినా ప్రయోజనం మందో-పి న ప్రవర్తతే’. ప్రపంచములో ప్రయోజనరహితమైన పనిని మూర్ఖుడు కూడ చేయడని లోకోక్తి. సాధారణ కారణము కార్యముకన్న భిన్నములే.
కేవము కుమ్మరిగాని, మృత్తిక గాని, చక్రదండాదు గాని ఘటమును చేయజావు. ఈ మూడు కారణమున్నపుడే కార్యమేర్పడును. ఇది నియమము - సిద్ధాంతము. ఇది కార్యకారణము సంబంధమున సంక్షిప్త వివరణ.

అనాదితత్త్వము


ఇంతకుముందు కార్యకారణము అననేమో వివరింపబడినవి. విభిన్న అవయవము జ్ఞానపూర్ణమైన, నియమబద్ధమైన, పనితనము గ కూర్పు - సంయోజకతను కార్యమని తెలిసికొన్నాము. అది దాని అవయవము వియోగము వన నశించునని కూడ తెలిసికొన్నాము. మనకు ప్రతిదినము ఉపయోగములోనికి వచ్చు లేదా దృష్టిలోనికి వచ్చు పదార్థములో పై గుణమున్నచో దానిని కార్యము అనవచ్చును. ఎవరైన మొదటిసారిగ తాజమహును చూచినపుడు దాని నిర్మాణములో కనబడు పనితనమును అందుకు ఉపయోగించిన పదార్థము విశిష్టతను, దానిని నిర్మించిన శిల్పియొక్క బుద్ధికుశతను, చాతుర్యమును ప్రశంసించకుండ యుండలేడు. దాని నిర్మాణములో ఎందరో వ్యక్తు పనిచేసియుందురనియు, దానికి కొన్ని సంవత్సరము కాము పట్టియుండుననియు తెలిసికొనును. అతడు ప్రత్యక్షముగా దాని నిర్మాణమును చూచి యుండనక్కరలేదు. అయినను అతనికి పైన చెప్పిన జ్ఞానము కుగును. ఆ జ్ఞానము దార్శనికభాషలో కార్యకారణసంబంధము వన కలిగినది. సాధారణ మానవుడీ విషయమును శాస్త్రీయముగ తొపలేకపోవచ్చును. ఇచ్చట
తాజమహు - కార్యము
దానికి రూపక్పనచేసి దానిని నిర్మించిన శిల్పి - చేతననిమిత్తకారణము. అందుకు ఉపయోగించిన పారాయి, సున్నము మొదగునవి - ఉపాదానకారణము. దాని నిర్మాణములో ఉపయోగపడిన పనిముట్లు, కూలీు, కాము, మొదగునవి - సాధారణకారణము.
ఇదేవిధముగ మనకు దృష్టిగోచరమగు జగత్తును పరీక్షించినచో ఇది నియమబద్ధముగ నున్నట్లు తెలియును. ఆధునికై వైజ్ఞానికు చేయుచున్న పని సృష్టిలోని నియమమును తెలిసికొనుటయే. దీనిలో ఎంతో జ్ఞానపూర్వకమైన పనితనము గోచరించును. సూర్యుని చుట్టు గ్రహము యొక్క నియమబద్ధ భ్రమణమే సృష్టిలోని కఠోర - అటమైన నియమముకు నిదర్శనము. లేనిచో వేదాంగములోని జ్యోతిశ్శాస్త్రమే వ్యర్ధమగును. అంతేకాదు ఆధునిక శ్పిజగత్తునకు (లిదీవీరిదీలిలిజీరిదీవీ తీరిలిజిఖి) మనుగడయే యుండదు.
అతి సూక్ష్మపరమాణువు సంయోగమే ఈ సృష్టి. మరియు వాటి వియోగమే నాశము - యము. కావున సృష్టి ఒక కార్యము. ఐనచో దీనికి మూడు మూకారణము తప్పనిసరిగా యుండును. అవి 1. చేతననిమిత్తకారణము - ఈశ్వరుడు 2. ఉపాదానకారణము - ప్రకృతి. 3. సాధారణకారణము - జీవు. వీటిని అనాదితత్త్వము అని అంటారు. ఇవి వేదములో ఆంకారికముగ ఇట్లు వర్ణింపబడియున్నవి.
ఓం     ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరి షస్వజాతే ।
    తయోరన్యః పిప్పం స్వాద్వత్త్యనశ్నన్నన్యో అభిచాకశీతి ॥
                (ఋగ్వేదము 1-164-20)
రెండు పక్షు-1. జీవాత్మ, 2. పరమాత్మ (ఈశ్వరుడు) చేతనత, పాన అను సమానగుణము కలిగి మిత్రభావముతో ఒక వృక్షమును (ప్రకృతిని) పరిష్వంగమొనర్చుచున్నవి. వాటిలో ఒకటి-జీవాత్మ వృక్ష ఫమును (కర్మఫమును) అనుభవించుచున్నది. రెండవది - ఈశ్వరుడు అట్లు అనుభవించకుండ సాక్షివలె అంతట ప్రకాశించుచున్నది.
ఈ మంత్రమునందు 1. ఈశ్వరుడు, 2. జీవుడు. 3. ప్రకృతి అను మూడు అనాది పదార్థము వర్ణింపబడియున్నవి. అనాది అనగా ఆది - ప్రారంభము లేనిది అని అర్థము. ఇవి మూకారణము. మూకారణముకు కారణముండవు. లేనిచో వానికి అనవస్థాదోషము ప్రాప్తించును. అనాది పదార్థముకు అంతము ఉండదు. అవి ఎ్లప్పుడు ఉండును.


ఈశ్వరుడు, జీవుడు మరియు ప్రకృతి


ఈశ్వరుడు    -    సృష్టికర్త
సత్‌    -    ఎ్లప్పుడు ఉండేవాడు
చిత్‌    -    చేతనము, జ్ఞానవంతము - సర్వజ్ఞుడు
ఆనందము    -    శాశ్వత సుఖముగవాడు
        అందుకని ‘సచ్చిదానందుడు’ అని అంటారు.
అపరిణామి, నిత్యుడు    -    మార్పుచెందనివాడు
బ్రహ్మ    -    అన్నింటికన్న గొప్పవాడు
పరమ్‌    -    అతిసూక్ష్ముడు
1.     జన్మాద్యస్య యతః (వేదాంత దర్శనము 1-1-2)
    అస్య జగతః జన్మాదిః సృష్టిస్థితియాః యతః భవన్తి తద్‌ బ్రహ్మ ।
మనకు కనిపించు ఈ జగత్తుయొక్క ఉత్పత్తి స్థితియము దేనిద్వారా జరుగునో అది బ్రహ్మ - ఈశ్వరుడు.
2.    యతో వా ఇమాని భూతాని జాయన్తే యేన జాతాని జీవన్తి ।   
    యత్‌ ప్రయన్త్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్య తద్‌ బ్రహేమతి ॥
                (తైత్తిరీయ ఉపనిషత్తు 3-1)
దేనివన ఇంద్రియముచే తెలియబడు ప్రాణు, పదార్థము పుట్టుచున్నవో, ఎవనిద్వారా పుట్టినవి జీవించుచున్నవో ప్రళయకామున దేనియందు ప్రవేశించుచున్నవో దానిని తెలిసికొనగోరును. అదియే బ్రహ్మ.
జగత్తును ఉత్పన్నము చేయుట, జీవుయొక్క పాపపుణ్యకర్మ ననుసరించి వారికి జన్మనిచ్చుట, పుట్టించినవానిని పోషించుట చివరకు జగత్తును ప్రళయము చేయుట - ఇవి ఈశ్వరుడు చేయు కర్ము.
3. ఓం    స పర్యగాచ్ఛుక్రమకాయమవ్రణమస్నావిర శుద్ధమపాప
    విద్ధమ్‌ । కవిర్మనీషీ పరిభూః స్వయమ్భూర్యాథాతథ్యతో-ర్థాన్‌
    వ్యదధాచ్ఛాశ్వతీభ్యః సమాభ్యః ॥ (యజుర్వేదము 40-8)
సః R ఆ పరమేశ్వరుడుÑ పర్యగాత్‌ R అంతట వ్యాపించియున్నాడుÑ శుక్రమ్‌ R శీఘ్రకారి, సర్వశక్తిమంతుడుÑ అకాయమ్‌ R స్థూ సూక్ష్మ కారణదేహరహితుడుÑ అవ్రణమ్‌ R ఛిద్రరహితుడు, ఛేదింప మీలేనివాడుÑ అస్నావిరమ్‌ R నాడ్యాది సంబంధ బంధనము లేనివాడుÑ శుద్ధమ్‌ R అవిద్యాదిదోషము లేనందున సదా పవిత్రుడుÑ అపాపవిద్ధమ్‌ R పాపకర్ము చేయనందున పాపబంధనములోనికి రానివాడుÑ కవిః R సర్వజ్ఞుడుÑ మనీషీ R జీవు మనోవృత్తును తెలిసికొనువాడుÑ పరిభూః R దుష్టును పరాభవించువాడుÑ స్వయంభూః R సంయోగాదు లేని అనాది స్వరూపుడుÑ మాతాపితయి, గర్భవాసము, జన్మ, వృద్ధి క్షయాదు లేనివాడుÑ శాశ్వతీభ్యః సమాభ్యః R సనాతనము, అనాది స్వరూపు, స్వరూపముతో ఉత్పత్తి వినాశము లేని జీవు కొరకు యాథాతథ్యతః R యథార్థభావముతోÑ అర్థాన్‌ R వేదము ద్వారా పదార్థము నన్నింటినిÑ వ్యదధాత్‌ R విశేషరూపమున చేయుచున్నాడు.
ఈ మంత్రమునందు పరమాత్మునిలోని సగుణము - ఉన్న గుణము కొన్ని, నిర్గుణము - లేని గుణము కొన్ని తొపబడినవి. అవి
సగుణము : 1. పర్యగాత్‌ 2. శుక్రమ్‌. 3. శుద్ధమ్‌. 4. కవిః. 5. మనీషీ. 6. పరిభూః. 7. స్వయంభూః.
నిర్గుణము : 1. అకాయమ్‌. 2. అవ్రణమ్‌. 3. అస్నావిరమ్‌. 4. అపాపవిద్ధమ్‌.
కొందరు గుణశబ్దమునకు ‘ఆకారమని’ అర్థము చెప్పి సగుణోపాసన - సాకారోపాసన, నిర్గుణోపాసన - నిరాకారోపాసన అని వ్యాఖ్యానింతురు. ఆకారము ఒక గుణము. అంతమాత్రమున గుణమునకు అర్థము ఆకారము కాదు. అది విజ్ఞుంగీకరింపరు. అది శబ్దార్థమునకు విరుద్ధము. అట్టివారు అవైదిక సిద్ధాంతమును ప్రచారము చేయుట కొరకు ప్రజను మభ్యపెట్టి వారిని తప్పుదారిన ప్రయాణింప జేయుదురు.
ప్రపంచములో ఏ వస్తువు కేవ సగుణము లేదా కేవ నిర్గుణముగా నుండదు. నిర్గుణములే ఒక పదార్థమునకు ఇంకొక పదార్థమునకు గ భేదమును చూపును. ఈ సగుణనిర్గుణము వైశేషిక దర్శనమునందు సాధర్మ్యము వైధర్మ్యము అని చెప్పబడినవి.
ఉదా: 1. ఇనుము : ఘనపదార్థము, సూదంటురాయిచే ఆకర్షింపబడును (సగుణము)
2. రాగి : ఘనపదార్థము (సగుణము)Ñ సూదంటురాయిచే ఆకర్షింపబడదు (నిర్గుణము)
3. ప్రాణవాయువు : ప్రాణు జీవించుటకు ఉపయోగపడును, మండుటకు సహకరించును. (సగుణము) రంగు, రుచి, వాసనలేనిది (నిర్గుణము)
4. ఓం    ఇన్ద్రం మిత్రం వరుణమగ్నిమాహరథో దివ్యః స
    సుపర్ణో గరుత్మాన్‌ । ఏకం సద్విప్రా బహుధా వదన్త్యగ్నిం
    యమం మాతరిశ్వానమాహుః ॥ (ఋగ్వేదము 1-164-46)
సత్‌ పదార్థమైన ఆ ఒకే పరమాత్మను విద్వాంసు ఎన్నియో నామముచే చెప్పుదురు. అవి ఇంద్రుడు, మిత్రుడు, వరుణుడు, అగ్ని, దివ్యుడు, సుపర్ణుడు, గరుత్మాన్‌, యముడు, మాతరిశ్వా. ఈ మంత్రము ఒకే ఒక భగవంతునకు ఎన్నో నామమున్నవని బోధించుచున్నది.
ఈశ్వరునకు గ నామమున్నియు అతని గుణకర్మస్వభావమును బోధించును. ప్రతినామము సార్థకము. నిరర్థకమైన దొక్కటి కూడ లేదు. వేదాది శాస్త్రములో ఈశ్వరునికై వాడబడిన పేర్లకు యౌగికార్థమును గ్రహించవలెను. అనగా వ్యాకరణానుసారముగ ధాతుప్రత్యయము ననుసరించి, ప్రకరణమును - సందర్భమును దృష్టిలోనుంచుకొని అర్థము చెప్పుకొనుట అత్యంతావశ్యకము. కారణమేమన శబ్దముకు నానార్థముండును.
5. ఈశ్వరునకు గ మరికొన్ని నామము. సచ్చిదానందస్వరూపుడు, నిరాకారుడు, సర్వశక్తిమంతుడు, న్యాయకారీ, దయాళువు, అజన్ముడు, అనంతుడు, నిర్వికారుడు, అనాది, అనుపముడు, సర్వాధారుడు, సర్వేశ్వరుడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, అజరుడు, అమరుడు, అభయుడు, నిత్యుడు, పవిత్రుడు, సృష్టికర్త. ఇతనినే ఉపాసింపవలెను.
6. సమస్త సత్యవిద్యకును, విద్యవన నెరుంగదగు సర్వపదార్థముకు ఆదిమూము పరమేశ్వరుడు.
7.    అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం
    నిత్యమగన్ధవచ్చ యత్‌ । అనాద్యనన్తం మహతః పరం
    ధ్రువం నిచాయ్య తం మృత్యుముఖాత్‌ ప్రముచ్యతే ॥ (కఠోపనిషత్తు 3-15)
ఆ ఈశ్వరునిలో శబ్దగుణము లేదు, స్పర్శగుణము లేదు, రూపగుణము లేదు. రసగుణము లేదు, గంధగుణము లేదు. ఇవి పృథివ్యాదిపంచభూతము గుణము. కావున మన జ్ఞానేంద్రియముచే అతడు తెలియబడడు. అతడు అవ్యయం R వికారము, పరిణామము లేనివాడు, నిత్యం R ఎ్లప్పుడు ఒకేరకముగ నుండువాడు, ఏకరసుడు, ఆది అంతము లేనివాడు, అన్నింటికన్న గొప్పవాడు, అన్నింటికన్న సూక్ష్ముడు, అంతట వ్యాపించియుండుటచే ధ్రువం R కదలిక లేనివాడు. పరమాత్మను ఈ విధముగ తెలిసికొన్నవాడు జన్మమరణరూప మృత్యువు (బంధనము) నుండి ముక్తుడగును.
8.    న తత్ర చక్షుర్గచ్ఛతి న వాగ్గచ్ఛతి ।   
    వో మనో న విద్మో న విజానీమో ॥ (కేనోపనిషత్తు 1-3)
ఆ పరమాత్మను చక్షుః R కన్ను (జ్ఞానేంద్రియము) చూడలేవు. వాక్కు (కర్మేంద్రియము) పట్టుకొనలేవు. అంతరింద్రియమైన మనస్సు కూడ తెలిసికొనలేదు.
మనమొక వ్యక్తిని దూరమునుండి చూచినపుడు అతడొక మనిషని తెలియును. అతడెవరో నిర్దుష్టముగ తెలియదు. ఇది సాధారణ జ్ఞానము. అతడు మనకు దగ్గరగా వచ్చినప్పుడు అతడెవరో స్పష్టముగ తెలియును. ఇది విశేష జ్ఞానము. ఈ విధముగ జ్ఞానకర్మేంద్రియముకు లేదా మనస్సుకు సాధారణముగ గాని విశేషముగా గాని తెలియునది భౌతిక పదార్థము. ఈశ్వరుడు అభౌతిక పదార్థము, చేతనము అందుచే ఈశ్వరుడు జ్ఞానకర్మేంద్రియముకు అందడు.
9.     యచ్చక్షుషా న పశ్యతి యేన చక్షూంషి పశ్యతి ।
తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం యదిదముపాసతే ॥ (కేనోపనిషత్తు 1-6)
యత్‌ R ఏదిÑ చక్షుషా R నేత్రముతో, న పశ్యతి R చూడదోÑ యేన R  దేని మూమునÑ చక్షూంషి R కన్నునుపయోగించి జీవుడుÑ పశ్యతి R చూచుచున్నాడోÑ తదేవ R అదియేÑ బ్రహ్మ R భగవంతుడనిÑ త్వం విద్ధి R నీవు తెలిసికొనుముÑ యత్‌ ఇదముపాసతే R కన్నుతో చూడబడుÑ ఇదమ్‌ R రంగు, రూపము గ ఈ జగత్తుÑ న R బ్రహ్మ కాదు.
రూపవంతమైన వస్తువును తెలిసికొనుటకు నేత్రము జీవునకు సాధనము. బ్రహ్మచే నిర్మింపబడిన కన్నుతో జీవు నానావిధ చిత్రవిచిత్రముగు వర్ణముతో, రూపముతో గ ఈ జగత్తును దర్శించుచుందురు. భగవంతుడు రూపవంతమగు భౌతికపదార్థము కాదు. అందుచే భగవంతుడు కన్నుకు కనిపించడు.
జ్ఞానేంద్రియము ఐదు. ఇవి పంచభూతముయొక్క గుణమును గ్రహించుటకు భగవంతుడు జీవునకు ఇచ్చిన సాధనము. వీటినే భగవంతుని తెలిసికొనలేము.
10.    కరణవచ్ఛేన్న భోగాదిభ్యః । (వేదాంతదర్శనము 2-2-40)
కరణవత్‌ చేత్‌ న భోగాదిభ్యః. ఈశ్వరునకు మానవుకు వలె ఉపకరణము - ఇంద్రియము ఉన్నవనుటకు మీలేదు. ఎందుకనగా అపుడు భగవంతుడు భోగి అగును. అప్పుడు అతనిలో ఈశ్వరత్వమే నశించి సాధారణ జీవుడగును.
11.    క్లేశకర్మ విపాకాశాjైురపరామృష్టః పురుషవిశేష ఈశ్వరః । (యోగదర్శనము 1-24)
ఈశ్వరుడు అవిద్యాది క్లేశము ధర్మాధర్మమునెడి కర్ము, కర్మఫముయిన జాతి, ఆయువు, భోగము అనెడి విపాకము, విపాకమున కనుగుణమయిన (ఆశయము) వాసను - సంస్కారము మొదగువాటితో సంబంధములేని పురుషోత్తముడు.
క్లేశాదు మనస్సునందుండి జీవునియందు చేరి వ్యవహరింపబడును. జీవుడు వానిననుభవించును. అట్టి అనుభవముతో సంబంధములేని పురుషుడు ఈశ్వరుడు.
12.    తత్ర నిరతిశయం సర్వజ్ఞభీజమ్‌ । (యోగదర్శనము 1-25)
ఈశ్వరునియందు పూర్ణమగు (దానికి మించి మరియొకచోట నుండని విధముగ) సర్వజ్ఞతకు నిమిత్తమగు జ్ఞానమున్నది.
13.    స పూర్వేషామపి గురుః కాలేనానవచ్ఛేదాత్‌ । (యోగదర్శనము 1-26)
ఈశ్వరుడు సృష్ట్యారంభమున వేదప్రకాశకుయిన పూర్వఋషుకు కూడ గురువు. ఎందుకనగా అతడు కాముచే ఛేదింపబడదు. ఆద్యంతము లేనివాడు.
14.    అపాణిపాదో జననో గ్రహీతా పశ్యత్యచక్షుః
    స సృణోత్యకర్ణః । స వేత్తి విశ్వం న చ తస్యాస్తి వేత్తా
    తమాహురగ్య్రం పురుషం మహాన్తమ్‌ ॥ (శ్వేతాశ్వతరోపనిషత్తు 3-10)
ఆ పరమేశ్వరుడు హస్తపాదాది కర్మేంద్రియము, కన్ను, చెవు మొదగు జ్ఞానేంద్రియము లేకయే ఆయా ఇంద్రియముచే చేయబడు కార్యమును చేయును. అతనికి జీవుకు వలె సాధనమువసరము లేదు. అతడీ విశ్వమునంతయు ఎరుగును. అతనిని సమగ్రముగా తెలిసినవాడు లేడు. అతడు అనాది, అనంతుడు, పూర్ణుడు అని బ్రహ్మజ్ఞు చెప్పుదురు.
15.     న తస్య కార్యం కరణం చ విద్యతే న
    తత్సమశ్చాభ్యధికశ్చ దృశ్యతే । పరా-స్య శక్తిర్వివిధైవ శ్రూయతే
    స్వాభావికీ జ్ఞానబక్రియా చ ॥ (శ్వేతాశ్వతరోపనిషత్తు 6-8)
ఆ పరమేశ్వరునకు శరీరరూపకార్యము గాని, చక్షురాదీంద్రియరూప కరణము - సాధనము గాని లేవు. అతనితో సమానుడు గాని, అతనికంటె అధికుడు గాని లేడు. అతని జ్ఞానము పరా - నిరతిశయమైనది. అతనిలోగ జ్ఞానము, క్రియ స్వాభావికము.
16.    యత్తదద్రేశ్యమగ్రాహ్యమగోత్రమవర్ణ మచక్షుఃశ్రోత్రం
    తదపాణిపాదమ్‌ । నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం
    తదవ్యయం యద్‌ భూతయోనిం పరిపశ్యన్తి ధీరాః ॥
                (ముండకోపనిషత్తు 1-1-6)
ఆ పరమాత్మతత్త్వము జ్ఞానేంద్రియముకు తెలియదు. కర్మేంద్రియముకు దొరకదు. దానికి వంశము, రంగు, నేత్రము, చెవు, కాళ్లు, చేతు లేవు. ఎ్లప్పుడు అంతటను, అన్నింటియందును ఉండునది. అది అతి సూక్ష్మము. నాశము లేనిది. విశ్వమునందలి సక పదార్థముకు మూకారణమైన ఆ తత్త్వమును ధ్యానశీురైన వివేకు అంతటను సాక్షాత్కారము చేసికొందురు.


జీవుడు - జీవాత్మ


సత్‌    -    ఎ్లప్పుడు ఉండేవాడు
చిత్‌    -    చేతనము, జ్ఞానవంతము, అ్పజ్ఞుడు
అపరిణామి    -    మార్పు చెందనివాడు
ఏకదేశి    -    అణుపరిమాణుడు
జీవునేకము.
1.     శరీరాదివ్యతిరిక్తః పుమాన్‌ । (సాంఖ్యదర్శనము 1-39)
పుమాన్‌ - జీవుడు శరీరము మొదు ప్రకృతి వరకు గ పదార్థమున్నింటి కంటె భిన్నుడు.
2.     ఇచ్ఛాద్వేషప్రయత్నసుఖదుఃఖజ్ఞానాన్యాత్మనో లిఙ్గమ్‌ ।
                (న్యాయదర్శనము 1-1-10)
1. ఇచ్ఛా - కావానుకొనుట, 2. ద్వేషము - వదనుకొనుట, 3. ప్రయత్నము, 5. సుఖము, 5. దుఃఖము, 6. జ్ఞానము ఈ గుణము ఎక్కడ కనిపించునో అక్కడ జీవుడున్నాడని గుర్తు.
3.     ప్రాణాపాననిమేషోన్మేషజీవనమనోగతీంద్రియాంతర్వికారాః ।
    సుఖదుఃఖేచ్ఛాద్వేషప్రయత్నాశ్చాత్మనో లింగాని ॥
                (వైశేషిక దర్శనము 3-2-4)
(ప్రాణ) వాయువును లోపనుండి బయటకు వదుట, (అపాన) బయటినుండి వాయువును లోపకు ప్చీుకొనుట (నిమేష) కన్ను మూసికొనుట, (ఉన్మేష) కన్ను తెరచుకొనుట, (జీవన) ప్రాణమును ధరించుట, (మన) మననము చేయుట, (గతి) కదుట, (ఇంద్రియము) ఇంద్రియమును విషయముయందు పోనిచ్చి విషయమును గ్రహించుట, (అంతర్వికార) ఆకలి, దప్పిక, జ్వరపీడాదు కుగుట, సుఖము, దుఃఖము, ఇచ్ఛా, ద్వేషము, ప్రయత్నము ఇవన్నీ జీవునియొక్క లింగము - గుర్తు - గుణకర్ము.
4.    నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః ।
    న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః ॥ (భగవద్గీత 2-23)
ఈ జీవాత్మను శస్త్రము ఛేదింపవు, అగ్ని దహింపదు, నీరు తడుపదు, వాయువు శుష్కింప చేయలేదు.
5.    వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని
    గృహ్ణాతి నరో-పరాణి । తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని
    సంయాతి నవాని దేహి ॥ (భగవద్గీత 2-22)
ఏ విధముగ మనుష్యుడు చిరిగిన వస్త్రమును విడిచి వేరే నూతన వస్త్రమును ధరించునో అదేవిధముగ జీవాత్మ జీర్ణ శరీరమును వదలి ఇతర కొత్త శరీరమును పొందును.

శరీరము


చేష్టేంద్రియార్థాశ్రయః శరీరమ్‌ । (న్యాయదర్శనము 1-1-11)
జీవుడు శరీరమునందుండి లోకమునందు వ్యవహరిస్తుంటాడు. ఈ శరీరము చేష్ట - క్రియ, ఇంద్రియము, అర్థముకు ఆశ్రయము.
ఇంద్రియము జీవునకు సాధనము. అవి జ్ఞానేంద్రియము, కర్మేంద్రియము, అంతరింద్రియము అని మువ్విధము.
జ్ఞానేంద్రియము : 1. ముక్కు, 2. నాుక, 3. నేత్రము, 4. చర్మము, 5. చెవు. వీటిద్వార జీవునకు పాంచభౌతికమైన ప్రపంచ జ్ఞానము కుగును. ఒక్కొక్క ఇంద్రియము దానికి సంబంధించిన భూతముయొక్క గుణమును మాత్రమే గ్రహించును. ఇతరభూతము గుణము దానికి తెలియవు. ఇది నిర్దుష్టమైన నియమము. అభౌతిక పదార్థము జ్ఞానము జ్ఞానేంద్రియముకు కుగదు.
కర్మేంద్రియము : 1. ముఖము, 2. హస్తము, 3. పాదము, 4. పాయువు 5. ఉపస్థ. వీటితో జీవుడు కర్ము చేయును.
అంతరింద్రియము - మనస్సు  : జీవుడు దీని సహాయమున సంక్ప వికల్పాదు నొనర్చును. మనస్సు ఒక సమయమున ఒక ఇంద్రియముతో మాత్రము సంబంధము కలిగియుండును. అప్పుడు మనస్సు ద్వారా ఆ ఇంద్రియము గ్రహించిన జ్ఞానమును తెలిసికొనును. కర్మేంద్రియమైనచో తత్సంబంధమైన కార్యము చేయును. జీవుడు శరీరమునందుండి పాపపుణ్యకర్ము చేయుచు వాటి ఫమును అనుభవించుచుండును. ఈ విధముగ జీవునకు శరీరముతో సంబంధము కుగటను బంధనము అంటారు. జీవునకు శరీరముతో సంబంధము తొగిపోవుటను ముక్తి అంటారు. బంధనముగాని ముక్తి గాని జీవునకు స్వాభావిక గుణము కావు. అవి నైమిత్తికము.
బంధో విపర్యయాత్‌ । (సాంఖ్యదర్శనము 3-24)
విపర్యయము - అవిద్యా - అజ్ఞాననిమిత్తముగా జీవునకు బంధనము కుగును.
జ్ఞానాన్ముక్తిః । (సాంఖ్యదర్శనము 3-23)
జ్ఞాన - విద్యానిమిత్తముగ జీవునకు ముక్తి కుగును.
అజ్ఞానము వన ప్రకృతి (శరీరము)తో సంబంధమేర్పడును. ప్రకృతిలో దుఃఖము మాత్రమే కదు. శరీర సంబంధమున్నంతవరకు జీవునకు దుఃఖము తప్పదు.
జ్ఞానము వన పరమాత్మతో సంపర్కమేర్పడును. పరమాత్మతో ఆనందము, పూర్ణశాశ్వతసుఖము కదు. ముక్తజీవుడు పరమాత్మలోని ఆనందము ననుభవించును.
జ్ఞానము, అజ్ఞానము అనునవి రెండు విభిన్న వస్తువు కావు. అదేవిధముగ ప్రకాశము, అంధకారము కూడ వేరు వేరు వస్తువు కావు. జ్ఞానము యొక్క అభావము అజ్ఞానము. ప్రకాశము యొక్క అభావము అంధకారము.


ప్రకృతి


సత్‌    -    ఎ్లప్పుడుండునది
జడము    -    జ్ఞానము లేనిది.
వికారి    -    మార్పు చెందు స్వభావము కది.
    పరమాణువు సమూహము
స్థము నాక్రమించు స్వభావము కది.
దీనికి అవ్యక్తమని కూడ పేరు. అనగా ఇంద్రియము ద్వారా తెలియబడనిది అని అర్థము. ఇది అతి సూక్ష్మము. సత్త్వగుణము, రజోగుణము, తమోగుణము యొక్క సమావస్థ. ఈశ్వరుడు ప్రళయానంతరము సృష్టి చేయదచుకొన్నప్పుడు (ఈక్షించినపుడు) నిశ్శబ్దము, అంధకారబంధరమైన ప్రకృతిలో క్షోభ-గతి కలిగించును. అప్పటినుండి సృష్టి రచనాక్రమము ప్రారంభమగును.
కొందరు ఆస్తికు ప్రకృతి యనబడు పదార్థము లేదంటారు. దానిని ఈశ్వరుడు తన సామర్థ్యముచే పుట్టించునని వారి వాదము. ఈ ఆలోచనా సరళి వైదిక సిద్ధాంతమునకు విరుద్ధము. ఎందుకనగా
నావస్తునో వస్తుసిద్ధిః । (సాంఖ్యదర్శనము 1-88)
అవస్తునః R లేని వస్తువు నుండిÑ వస్తుసిద్ధిః R పదార్థము యొక్క పుట్టుకÑ న R జరుగదు.
భగవద్గీతలో కూడ ఈ సిద్ధాంతప్రతిపాదన కదు.
నాసతో విద్యేతే భావో నాభావో విద్యతే సతః ।
ఉపయోరపి దృష్టో-న్తస్త్వనయోస్తత్త్వదర్శిభిః ॥ (భగవద్గీత 2-16)
అనగా లేని పదార్థమునకు పుట్టుక ఉండదు. ఉన్న పదార్థమునకు అభావము కుగదు. ఈ రెంటియొక్క సిద్ధాంతము తత్త్వజ్ఞానుచే తెలియబడినది.
అందుచే సృష్టికి ఉపాదానకారణమైన ప్రకృతి లేదనుట సత్యము కాదు.
ప్రకృతి యనబడు ఈ అతిసూక్ష్మ పదార్థముతో ఈశ్వరుడు సృష్టి రచన చేయును.
సత్త్వరజస్తమసాం సామ్యావస్థా ప్రకృతిః ప్రకృతేర్మహాన్‌
మహతో-హంకారః అహంకారాత్‌ పంచతన్మాత్రాణి ఉభయమిన్ద్రియమ్‌ ।
తన్మాత్రేభ్యః స్థూభూతాని పురుష ఇతి పంచవింశతిర్గణః ॥
                (సాంఖ్యదర్శనము 1-61)
సత్త్వరజస్తమోగుణము సమావస్థ ప్రకృతి (1) ప్రకృతి యందు ఈశ్వరుని ఈ క్షణమువన గతి కలిగి మహత్తు (1) అను పదార్థము పుట్టును.
ఈ మహత్తునుండి అహంకారము (1) పుట్టును. ఈ అహంకారము నుండి తన్మాత్రు (5), జ్ఞానేంద్రియము (5), కర్మేంద్రియము (5), మనస్సు (1) పుట్టును. తన్మాత్ర నుండి స్థూభూతము (5) పుట్టును. ఈ 24 ప్రాకృతిక పదార్థము. పురుషుడు అనగా చేతన తత్త్వము (జీవాత్మ, పరమాత్మ) 25వ పదార్థము. స్థూభూతము సంయోగము వన మనకు కనిపించు జగత్తు ఏర్పడుచున్నది.
మనుష్యునకు సృష్టిజ్ఞానము కుగుటకు జ్ఞానేంద్రియము ఉపయోగపడును. అవి
    ఘ్రాణరసనచక్షుస్త్వక్‌ శ్రోత్రాణీంద్రియాని భూతేభ్యః ।
            (న్యాయదర్శనము 1-1-12)
1. ముక్కు, 2. నాుక, 3. కన్ను, 4. చర్మము, 5. చెవు. ఈ ఐదు జ్ఞానేంద్రియము భూతమునుండి ఉత్పన్నమైనవి. ఆ భూతములేవన
    పృథివ్యాపస్తేజోవాయురాకాశమితి భూతాని ॥ (న్యాయదర్శనము 1-1-13)
1. పృథివి 2. జము 3. అగ్ని 4. వాయువు, 5. ఆకాశము. ఈ ఐదు భూతము వీటి గుణములేవన.
    గంధరసరూపస్పర్శశబ్దాః పృథివ్యాదిగుణాస్తదర్థాః ॥
(న్యాయదర్శనము 1-1-14)
1. గంధము, 2. రుచి, 3. రూపము, రంగు, 4. స్పర్శ, 5. శబ్దము. ఈ ఐదు పృథివి మొదగు భూతము గుణము మరియు ముక్కు మొదగు ఇంద్రియముకు అర్థము - విషయము.
అనగా (1) ‘గంధము’ పృథివిగుణము మరియు పృథివినుండి ఉత్పన్నమైన ముక్కునకు విషయము. (2) ‘రుచి’ జగుణము మరియు జమునుండి ఉత్పన్నమైన నాుకకు విషయము. (3) ‘రూపము - రంగు’ అగ్నిగుణము, అగ్ని నుండి పుట్టిన కన్నుకు విషయము. (4) ‘స్పర్శ’ వాయుగుణము. వాయువునుండి పుట్టిన చర్మమునకు విషయము. (5) ‘శబ్దము’ ఆకాశగుణము, ఆకాశము నుండి పుట్టిన చెవికి విషయము.
ఇంద్రియాదుగు ప్రాకృతికపదార్థము ఒకదానికన్న ఇంకొకటి సూక్షమము. ఆ క్రమమీవిధముగా ఉన్నది.
    ఇంద్రియేభ్యః పరాహ్యర్థాః అర్థేభ్యశ్చ పరం మనః ।
    మనసశ్చ పరా బుద్ధిః బుద్ధేరాత్మా మహాన్‌ పరః ॥ (కఠోపనిషత్తు 3-10)
    మహతః పరమక్తవ్యమవ్యక్తాత్‌ పురుషః పరః ।
    పురుషాన్న పరం కించిత్‌ సా కాష్ఠా స పరాగతిః ॥ (కఠోపనిషత్తు 3-11)
నేత్రాది ఇంద్రియము కంటె (అర్థాః) శబ్దస్పర్శాది విషయము సూక్ష్మము. ఆ విషయము కన్న మనస్సు సూక్ష్మము, మనస్సు కన్న నిశ్చయాత్మకమగు వృత్తి బుద్ధి సూక్ష్మము. ఆ వృత్తి కంటె మహత్తత్త్వము సూక్ష్మము.
మహత్తత్త్వము కంటె ప్రకృతి సూక్ష్మము. ప్రకృతి కన్న పురుషుడు - జీవాత్మ, జీవాత్మ కన్న పరమాత్మ సూక్ష్మము. పరమాత్మ కన్న సూక్ష్మమేదియు లేదు. అదియే అంతిమము, పరమావధి. అంతకన్న సూక్ష్మమింకొకటి లేదు.

ప్రకృతి కార్యమైన సృష్టి ప్రయోజనము.


ప్రకాశక్రియాస్థితిశీం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యమ్‌ ॥ (యోగదర్శనము 2-18)
సత్త్వరజస్తమోగుణము గ దృశ్యము - ప్రకృతి పృథివ్యాది భూతము, క్షమ, జ్ఞాన కర్మేంద్రియముగను మారుతుంది. ఇదే సృష్టి - జగత్తు. దీనికి రెండు ప్రయోజనమున్నవి.
1. భోగము    -    జీవు యొక్క సుఖదుఃఖానుభవము
2. అపవర్గము    -    ప్రకృతిపురుషవివేకఖ్యాతి పొందుట.

పరమాత్మ        జీవాత్మ            ప్రకృతి
ఒక్కడు            అనేకము            ఒక్కటి
సచ్చిదానందుడు        సచ్చిత్‌            సత్‌
నియంత            భోక్త            భోగ్యము
ఉపాస్యుడు        ఉపాసకుడు        సాధనము
సర్వాంతర్యామి        ఏకదేశి            విభు
చేతననిమిత్తకారణము    సాధారణకారణము    ఉపాదానకారణము
ఏకరసుడు        అవికారి            వికారి

విద్యా, అవిద్యా


విద్య అవిద్యను జ్ఞానము, అజ్ఞానము అని కూడా అంటారు. విద్య అనగా జ్ఞానము, అవిద్య అనగా అజ్ఞానము అని అర్థము.
    వేత్తి యథావత్‌ తత్వపదార్థస్వరూపం యయా సా విద్యా ।
మనుష్యుడు ఏ సాధనము ద్వారా తత్త్వపదార్థము స్వరూపమును యథార్థముగా - ఉన్నది ఉన్నట్లుగా తెలిసికుంటాడో దానిని విద్య లేక జ్ఞానము అని అంటారు. దానికి విపరీతమైన దానిని - వ్యతిరేకమైనదానిని అవిద్య లేక అజ్ఞానము అని అంటారు.
అవిద్య క్షణమును యోగదర్శనము నందు పతంజలిమహర్షి ఇట్లు సూత్రీకరించినాడు.
    అనిత్యాశుచిదుఃఖానాత్మసు నిత్యశుచిసుఖాత్మఖ్యాతిరవిద్యా. (యోగదర్శనము 2-5)
ఈ సూత్రమునందు జ్ఞాతవ్య - తెలిసికొనదగిన పదార్థమును నాుగు రకాుగ విభజించినాడు. 1. అనిత్యము, నిత్యము 2. అశుచి, శుచి 3. దుఃఖము, సుఖము 4. అనాత్మ - జడము, ఆత్మ - చేతనము.

అవిద్య - అజ్ఞాన క్షణము :


1. శరీరము, ధనము, సంపత్తి మొదగు అనిత్యపదార్థమును (ఎ్లప్పుడు ఉండనివి, నశించునవి) నిత్యపదార్థముగా (ఎ్లప్పుడు ఉండునవి, నాశము పొందనివి) భావించుట మరియు నిత్యములైన పరమాత్మ, జీవాత్మ, ప్రకృతును అనిత్యముని అనుకొనుట.
2. అశుచి, అపవిత్రత, అశుభ్రతను శుచి, పవిత్రత, శుభ్రతగా తెలిసికొనుట మరియు శుచిని అశుచిగా తెలిసికొనుట.
3. ఇంద్రియమును సంతృప్తిపరచు దుఃఖదాయకమైన విషయసేవనమును సుఖముగా తెలిసికొనుట మరియు సుఖమును దుఃఖముగా తెలిసికొనుట.
4. జడపదార్థములైన శరీరము, శిలు, లోహము మొదగు భోగ్యపదార్థమును చేతనముగా భావించుట మరియు చేతనములైన జీవాత్మపరమాత్మను జడపదార్థముగా తెలిసికొనుటను అవిద్య లేదా అజ్ఞానము అని అంటారు.
విద్య - జ్ఞాన క్షణము :
1. అనిత్యపదార్థమును అనిత్యముగా మరియు నిత్యపదార్థమును నిత్యముగా 2. అశుచిని అశుచిగా మరియు శుచిని శుచిగా 3. దుఃఖమును దుఃఖమనియు, సుఖమును సుఖమనియు, 4. జడమును జడముగా, చేతనమును చేతనముగా తెలిసికొని వాటితో అట్లే వ్యవహరించుటను  విద్య - జ్ఞానము అని అంటారు.
ప్రపంచములో ఎవరును దుఃఖాన్ని ఇష్టపడరు. దుఃఖము వదనుకొనువారు దాని కారణమును  దూరము చేసికొనుటకు ప్రయత్నిస్తారు. అట్టివారు దుఃఖరహితమైన శాశ్వత సుఖమును - ఆనందమును కోరుతారు. వారు ఆ ఆనందమును పొందుటకు కావసిన సాధనమును సాధించుటకు కూడ క్రియాశీురగుతారు. ఈ నాుగు పదార్థమును (1. దుఃఖము 2. దుఃఖ కారణము 3. సుఖము 4. సుఖ సాధనము) దార్శనిక భాషలో ప్రయోజనము - ఉద్దేశ్యము అని అంటారు. యోగదర్శనములో వీటని 1. హేయము. 2. హేయహేతువు. 3. హానము 4. హానోపాయము అని అంటారు.
హేయము :
    హేయం దుఃఖమనాగతమ్‌ ॥ (యోగదర్శనము 2-16)
భవిష్యత్తులో రాబోవు దుఃఖము దూరము చేసికొనతగినది. భూతకాలిక దుఃఖము భోగము - అనుభవము వన నశిస్తుంది. వర్తమానమున కుగు దుఃఖము భోగింపబడుచు కొంతకాము తర్వాత నశిస్తుంది. మిగిలినది రాబోవు దుఃఖము. ఆ దుఃఖము రాకుండా చేసికొనవలెను.
హేయ హేతువు :
    ద్రష్టృదృశ్యయోః సంయోగో హేయ హేతుః ॥ (యోగదర్శనము 2-17)
ద్రష్టా R జీవుడుÑ దృశ్యము R ప్రకృతి (సమస్త భోగ్యపదార్థము). ఈ రెంటి యొక్క సంయోగము - బంధనము హేయమైన సాంసారిక దుఃఖమునకు హేతువు - కారణము.
    తస్య హేతురవిద్యా ॥ (యోగదర్శనము 2-24)
జీవాత్మ ప్రకృతు సంయోగమునకు కారణము అవిద్య - అజ్ఞానము.
హానము :
    తదభావాత్‌ సంయోగాభావో హానం తద్‌దృశేః కైవ్యమ్‌ ॥
                (యోగదర్శనము 2-25)
అవిద్యనాశము వన కుగు జీవాత్మ ప్రకృతు సంయోగనాశమును హానము అని అంటారు. ఆ హానమే జ్ఞానస్వరూపుడైన పురుషుని (జీవాత్మ) యొక్క కైవ్యము - మోక్షము. అదే మానవుని ముఖ్య పురుషార్థము.


హానోపాయము :
    వివేకఖ్యాతిరవిప్లవా హానోపాయః ॥ (యోగదర్శనము 2-26)
నిర్మమైన వివేకఖ్యాతి - ప్రకృతిపురుషత్యంతభిన్నును జ్ఞానము హానోపాయము - మోక్షమునకు ఉపాయము.
వివేకఖ్యాతి కుగుటకు అనుష్ఠించవసినది - ఆచరించవసినది ఏమనగా
    యోగాంగానుష్ఠానాదశుద్ధిక్షయే జ్ఞానదీప్తిరావివేకఖ్యాతేః ॥
                (యోగదర్శనము 2-28)
యోగాంగమును అనుష్ఠించుటచే అవిద్యjైున అశుద్ధి నశించి వివేకఖ్యాతి పర్యంతమైన జ్ఞానము ప్రకాశిస్తుంది.
యోగాంగమును సాధించిన కొది అశుద్ధి - అవిద్య నశిస్తుంది. అవిద్య నశించినకొది సమ్యక్‌ జ్ఞానము పెరుగుతుంది. కాబట్టి సాంగయోగానుష్ఠానమే వివేకఖ్యాతిని కలిగిస్తుంది. ఆ యోగాంగము లేవన.
    యమనియమాసనప్రాణాయామప్రత్యాహారధారణా-
    ధ్యానసమాధయో-ష్టావంగాని ॥ (యోగదర్శనము 2-29)
అనుష్ఠించవసిన యోగాంగము ఎనిమిది. అవి 1. యమము 2. నియమము 3. ఆసనము. 4. ప్రాణాయామము 5. ప్రత్యాహారము 6. ధారణా 7. ధ్యానము 8. సమాధి. వీటిని గురించి విశేషముగ తెలిసికొనుటకు యోగదర్శనమును చదువవలెను.


బంధనము- అవిద్య-అజ్ఞానము


అవిద్య-అజ్ఞానము వన జీవునకు శరీరముతో సంబంధము కుగుతుంది. ఈ శరీరము జీర్ణమైనపుడు దీనిని విడిచి ఇంకొకశరీరములో ప్రవేశిస్తాడు. ఈ విధముగ అజ్ఞానములో నున్నంతకాము జన్మ, మరణము మర జన్మ, మరణము అను అవాగమనచక్రములో చిక్కుకొని దుఃఖమును అనుభవిస్తుంటాడు. దీనినే బంధనము అనిఅంటారు. బంధనములోనున్నంతవరకు దుఃఖము తప్పదు. దుఃఖము మూడురకము అవి.
1. ఆధ్యాత్మికదుఃఖము : వ్యాధు మొదగువాటివన కుగు శారీరిక బాధు. కామక్రోధాదు వన కుగు మానసిక బాధు. ఇవి జీవుడు తనకై తాను కలిగించుకున్నవి.
2. ఆధిభౌతికదుఃఖము : ఇది ఇతర ప్రాణు వన కుగునది. వ్యాఘ్రాది క్రూరమృగము వన, విషజంతువు వన, హంతకు చోరువన కుగు బాధు.
3. ఆధిదైవికదుఃఖము : దేవతనగా ప్రాకృతికములైన పంచభూతము. వీటివన కుగు భూకంపము, ఆశనిపాతము, అతివృష్టి, అనావృష్టి మొదగునవి. ఇవి కూడ దుఃఖమును కలిగించునవి.
ఇట్టి దుఃఖమున్నింటికి కారణము బంధనము.
అవిద్యాస్మితరాగద్వేషాభినివేశాః క్లేశాః ॥ (యోగదర్శనము 2-3)
అవిద్య, అస్మి, రాగము, ద్వేషము, అభినివేశము అను ఈ ఐదు క్లేశము - మిథ్యాజ్ఞానము, విపర్యయము. ఇవి కష్టమును, బాధను కలిగించునవి. వీటిలో అస్మిత మొదగు క్లేశము అవిద్య ఉన్నచో ఉండును. అవిద్య లేనిచో ఉండవు. కావున అస్మితాదుకు అవిద్య మూము.
క్లేశమూః కర్మాశయో దృష్టాదృష్టజన్మవేదనీయః ॥ (యోగదర్శనము 2-12)
ఈ జన్మలోను రాబోవు జన్మలోను అనుభవించదగు కర్మాశయము R పాపపుణ్యము సంస్కారము క్లేశము వన కుగును.
సతి మూలే తద్విపాకో జాత్యాయుర్భోగాః ॥ (యోగదర్శనము 2-13)
అవిద్యాది క్లేశమున్నంతవరకు కర్మాశయమునకు విపాకమైన - ఫరూపమైన జాతి-జన్మ, ఆయువు-జీవనకాము, భోగము-సుఖదుఃఖానుభవము అను ఈ మూడు ఉంటాయి.
తే హ్లాదపరితాపఫలాః పుణ్యాపుణ్యహేతుత్వాత్‌ ॥ (యోగదర్శనము 2-14)
ఆ జాతి, ఆయువు, భోగము పుణ్యకర్మ వన సుఖమును, పాపకర్మ వన దుఃఖమును కలిగిస్తాయి.
దుఃఖజన్మప్రవృత్తిదోషమిథ్యాజ్ఞానానాముత్తరోత్తరాపాయే తదనంత రాపాయాదపవర్గః ॥  (న్యాయదర్శనము 1-1-2)
దుఃఖమునకు కారణము జన్మ, జన్మకు కారణము ధర్మాధర్మప్రవృత్తి, ప్రవృత్తికి కారణము రాగ ద్వేషమును దోషము. ఆ దోషమునకు మూము మిథ్యాజ్ఞానము, అవివేకము, అవిద్య. ఈ విధముగ శాస్త్రములో దుఃఖభరితమైన బంధనమునకు కారణము అవిద్య, అజ్ఞానము, విపర్యయము, మిథ్యాజ్ఞానము, అవివేకము, ప్రకృతిపురుషవివేకజ్ఞానము లేకపోవుట అని చెప్పబడినది. బద్ధజీవుడు చేయు శుభాశుభకర్మ ఫమును అనుభవించకుండ తప్పించుకొనలేడు.
అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్‌.


ముక్తియందు జీవుని స్థితి

ముక్తి
‘ముచ్ఛ మోచనే’ అను ధాతువునకు ‘క్తిన్‌’ ప్రత్యయము చేర్చినచో ముక్తి శబ్దమేర్పడును. ముక్తి శబ్దమునకు విడిపోవుట అని అర్థము. మోక్షము, అపవర్గము, అమృతము, పరమపదము, అత్యంతపురుషార్థము, నిఃశ్రేయసము, కైవ్యము అనునవి పర్యాయపదము.
1.     దుఃఖజన్మప్రవృత్తిదోష మిథ్యాజ్ఞానానాముత్తరోత్తరాపాయే
    దనంత రాపాయాదపవర్గః ॥ (న్యాయదర్శనము 1-1-2)
ఇంతక్రితము బంధనము విషయమున దుఃఖమునకు మూము మిథ్యాజ్ఞానమని తొపబడినది. ఈ మిథ్యాజ్ఞానము తొగి యథార్థజ్ఞానము కలిగినపుడు దోషము (రాగద్వేషము) నశించును. అప్పుడు ధర్మాధర్మప్రవృత్తి ఉండదు. ప్రవృత్తిలేనిచో జన్మ ఉండదు, జన్మయే లేనిచో దుఃఖముండదు. ఆ స్థితినే అపవర్గమంటారు.
2.     బాధనాక్షణం దుఃఖమ్‌ ॥ (న్యాయదర్శనము 1-1-21)
    తదత్యన్తవిమోక్షో-పవర్గః ॥ (న్యాయదర్శనము 1-1-22)
బాధ- పీడ క్షణముగా కది దుఃఖము. ఇది అధర్మము వన కుగుతుంది. శరీరాదు దుఃఖముతో కూడియున్నట్టివి. జీవునకు శరీరసంబంధము వన కుగు దుఃఖమునుండి పూర్ణవిముక్తిని అపవర్గమంటారు.
3.    తదభావే సంయోగాభావో-ప్రాదుర్భావాశ్చ మోక్షః ॥
                (వైశేషిక దర్శనము 5-2-18)
తదభావే R అజ్ఞాననాశము వన రాగద్వేషాది దోషము నశించును. ఆ దోషము లేనప్పుడు ప్రవృత్తి-అదృష్టము నశిస్తుంది. అందువన సంయోగాభావః R జీవాత్మకు మనస్సుతో, శరీరముతో సంబంధము నశిస్తుంది. అప్పుడు అప్రాదుర్భావాః చ R జన్మ వన కుగు దుఃఖము ఉండదు. ఈ స్థితినే మోక్షము అని అంటారు.

 జీవుని స్థితి

    సమాధిసుషుప్తిమోక్షేషు బ్రహ్మరూపితా ॥ (సాంఖ్యదర్శనము 5-116)
సమాధియందు, సుషుప్తి-గాఢనిద్రయందు, మోక్షమునందు జీవుడు పరమాత్మ సమానముగా బ్రహ్మానందము ననుభవిస్తాడు. సమాధి, సుషుప్తియందు బ్రహ్మానందము ననుభవించినప్పటికి జీవునిలో బంధనహేతువులైన క్లేశాది వాసను - సంస్కారము ఉండును. మోక్షమునందు బంధవాసను లేని పరమాత్మ సారుప్యముంటుంది. అతడు అనంత వ్యాపక బ్రహ్మమందు స్వచ్ఛందంగా సంచరించును. సమస్త లోక లోకాంతరములో సంచరించును. శుద్ధజ్ఞానముచే సమస్త సృష్టిని చూచును. ఇతర ముక్తపురుషుతో కలియును. నిర్ముడగుటచే పూర్ణజ్ఞాని అగును. అతనికి సర్వపదార్థము జ్ఞానము యథార్థముగ కుగును. ఈ సుఖవిశేషమే స్వర్గము - ముక్తి.


పునరావర్తనము


    వేదాన్తవిజ్ఞానసునిశ్చితార్థాః సంన్యాసయోగాత్‌
    యతయః శుద్ధసత్త్వాః । తే బ్రహ్మలోకేషు పరాన్తకాలే
    పరామృతాః పరిముచ్యన్తి సర్వే ॥ (ముండకోపనిషత్తు 3-2-6)
యతయః R ఇంద్రియమును వారివశములో ఉంచుకొనినవారుÑ శుద్ధసత్త్వాః R నిర్మచిత్తులైన విద్వాంసు వేదాన్తవిజ్ఞానసునిశ్చితార్థాః R ఉపనషద్విజ్ఞానము వన నిశ్చితముగా పరమాత్మను తెలిసికొన్నవారుÑ ఎవరున్నారోవారుÑ పరామృతాః R ఉత్కృష్టమైన అమృతత్వమును పొందినవారై-మోక్షసుఖమును అనుభవించినవారైÑ తే సర్వే R వారందరుÑ పరాన్తకాలే R పరాంతకాము-మహా ప్రళయాంతమునÑ బ్రహ్మలోకేషు R పరమాత్మచే పునర్నిర్మిత పృథివ్యాది లోకములో పరిముచ్యన్తి R సర్గారంబున మర జన్మించుటకై విడువబడుదురు.
వేదాంత ప్రయోజనము బ్రహ్మపదార్థమును తెలిసికొనుట. జీవిత ప్రయోజనమును గుర్తించినవారు పరవైరాగ్యాదు నవరచుకొని సమస్త భోగాపేక్షాదును వదలి నియతేంద్రియులై బుద్ధిని శుద్ధము చేసికొనిన మహానుభావు పరమేశ్వర సాక్షాత్కారము చేసికొని ముక్తుగుదురు. వీరు పరమాత్మునియందుొక పరాంతకాము వరకు ఆనందము ననుభవింతురు. ఇది సుదీర్ఘ కాము. ఆ తర్వాత మహా ప్రళయాంతమున నూతన సృష్టియందు మర జన్మ నారంభింతురు. జీవు మోక్షమునకు ఆది-ప్రారంభము ఉండును. కావున దానికి అంతము కూడా ఉంటుంది.
పరాంతకాము :
కృతయుగము    :    17,28,000    సం ॥
            (మానవ సం ॥ు)
త్రేతాయుగము     :    12,96,000    సం ॥
ద్వాపరయుగము     :    8,64,000    సం ॥
కలియుగము     :    4,32,000    సం ॥
-------------------------------------        
ఒక చతుర్యుగము    R    43,20,000    సం ॥
ఒక సృష్టి సమయము    R    1000 చతుర్యుగము.
(బ్రహ్మ దినము)     R    1000 I 43,20,000    సం ॥
    R    4,32,00,00,000     సం ॥
ప్రళయకాము (బ్రహ్మరాత్రి) కూడ అంతే. ఒక సృష్టి, ఒక ప్రళయకాము R ఒక అహోరాత్రి.
ఒక అహోరాత్రి     R     2 I 4,32,00,00,000     సం ॥
    R    8,64,00,00,000    సం ॥
అనగా ఎనిమిది వంద అరువదినాుగు కోట్ల మానవసంవత్సరము.
30 అహోరాత్రు     R     ఒక నె.
12 నెలు     R     1 సంవత్సరము.
100 సంవత్సరము     R     1 పరాంతకాము.
కాబట్టి 1 పరాంతకాము     R     100 I 12 I 30
     R     36,000 అహోరాత్రము
    R     36,000 I 864 కోట్ల మానవ సం ॥
    R     3,11,04,000 కోట్ల మానవ సం ॥
అనగా (3 కోట్ల, 11 క్ష, 4 వే) కోట్ల మానవ సం ॥ ఈ సంఖ్య అవధిని ఊహించుట కూడ కష్టము. ఇంతటి సుదీర్ఘకాము ముక్తజీవుడు పరమాత్ముని యందు ఆనందమును అనుభవిస్తాడు. ఆ తర్వాత మర జన్మను పొందుతాడు. అందుకే ప్రతి మనుష్యుడు పురుషార్థము ద్వారా ముక్తుడగుటకు ప్రయత్నించవలెను.