మొత్తం పేజీ వీక్షణలు

27, జూన్ 2026, శనివారం

ఆధ్యాత్మిక చింతనా విధానం - దేవాలయాల ప్రస్తావన - లింగమూర్తి

  ప్రపంచ దేశాలకే మకుటాయమానం భారతీయుల ఆధ్యాత్మిక చింతనా విధానం. నిరంతరం తమ ఆరాధ్యదైవాన్ని ప్రార్థిస్తూ అచంచల భక్తి తత్వాన్ని ప్రబోధించి ప్రసిద్ధికెక్కిన వారు కొందరైతే...అద్భుతమైన శిల్పకళా సంపదతో ఆలయాలను నిర్మించి తమ భక్తి ప్రపత్తిని, కీర్తి ప్రతిష్ఠలను చిరస్థాయిగా నిలుపుకున్న వారు మరికొందరు, ఆనేపథ్యంలో సనాతన ధర్మాన్ని కాపాడుతూ ప్రజలను సన్మార్గంలో నడపడానికి ఆనాటి పాలకులు, మేధావులు ఎంచుకున్నమార్గం దేవాలయాల నిర్మాణం. 

ఆధ్యాత్మిక చింతనతో పాటు చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలను ఆనాటి నుండి ఈనాటి వరకు కాపాడుకుంటూ వస్తున్న వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఒక్క దేవాలయాలు మాత్రమే. అలాంటి ఆలయాల నిర్మాణానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు, స్థలపురాణాలు, ఐతిహ్యాలు, మౌఖిక సమాచారాన్ని bంతో శ్రమకోర్చి విషయ సేకరణ చేసి వ్యాసాల రూపంలో పాఠకులకు అందించిన సుప్రసిద్ధ కవి పండితులు స్వర్గీయ డా. కపిలవాయి లింగమÖర్తి గారు. తెలుగు సాహిత్యంలోని దాదాపు అన్ని ప్రక్రియలలో గ్రంధరచన చేసిన సాహితీ విద్వన్మూర్తి ఆయన. పద్యాన్ని ఎంత రసరమ్యంగా శిల్పించáగలరో వ్యాసాన్ని కూడా అంతే లయబద్ధంగా విరచించగల సుప్రతిష్ఠులు. ఏడు పదలకుపైగా సాగిన వారి సాహిత్య జీవితంలో అక్షర రూపం దాల్చిన ప్రతీ అంశం ఒక ఆణిముత్యం. అలా ఒక వ్యాసమహర్షిలా వందలాది వైవిధ్యమైన వ్యాసాలకు ప్రాణం పోసిన అక్షర తపస్వి.

వంశపారంపర్య శిల్పిగా దేవాలయాలంటే అభిరుచితో ఈ సదస్సులో ప్రసంగించడానికి నేను డా. కపిలవాయి లింగమÖర్తి గారు రాసిన వ్యాసాలలో దేవాలయాల ప్రస్తావనను ఎంచుకోవడం జరిగింది. నాకు లభించిన వ్యాసాలలో ఏవో రెండు మÖడు తప్ప మిగతా అన్ని కూడా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న దేవాలయాల గూర్చి రాసినవే ఉన్నాయి. ప్రతీ ఆలయానికి ఒక ప్రత్యేకమైన కథనం, చరిత్ర ఉంది. ఉమామహేశ్వరం, అలంపురం, జటప్రోలు, కురుమÖర్తి, మన్యంకొండ మొదలైనవి పురాణాంతర్గత క్షేత్ర ప్రాశస్త్యాన్ని కలిగి నిర్మించిన ఆలయాలు కాగా...ఆయా దేవతా మÖర్తులు స్వప్నంలో అగుపించి ఆలయనిర్మాణానికి ఆదేశించినవి మరికొన్ని, అలాగే ఆనాడు ఆయాప్రాంతాలను ఏలిన ప్రభువులు తమ కోరికలు నెరవేరగా కట్టినవి కొన్ని కాగా...ఏదో చిత్రం జరిగి...ఆవిచిత్రానికి భగవంతుడే కారణమని నమ్మి ఆ దైవం కోసం నిర్మించిన ఆలయాలు ఇంకొన్ని. ఇవేగాక స్వయంభూగా వెలసిన దేవతామÖర్తులకు కట్టించిన దేవాలయాలు కొన్నైతే...ప్రజలు తమ అభిష్టం మేరకు నిర్మించిన ఆలయాల వివరాలు కూడా ఈ వ్యాసాలలో ఉన్నాయి. అంతేగాక ఇలా వెలసిన ధూపదీపనైవేద్యాలకు చేసిన భూదాన, గోదానాది శాసనాల వివరాలు కూడా ఈ వ్యాసాలలో ఉన్నాయి. ఇక్కడ చెప్పుకోవలసిన మరో ముఖ్య విషయమేమంటే ఆయా ఆలయాల నిర్మాణ శైలిని బట్టి అవి ఎవరి కాలం నాటివో గుర్తించి ఎంత ప్రాచీనమైన కూడా తెలియజేశారు. 

శ్రీ కపిలవాయి లింగమÖర్తి గారు రాసిన ఈ వ్యాసాలు 1960 నుండి 2018 వరకు వివిధ పత్రికలలో ప్రచురింతమయ్యాయి. ఇందులో కొన్నిటిని తాను ప్రచురించిన “పాలమÖరు జిల్లా దేవాలయాలు” గ్రంథానికి ఉపయోగించుకోగా...చాలా వ్యాసాలు ఇంకా గ్రంథస్థం కాలేదు. చరిత్ర నిర్మాణానికి సైతం దోహదం చేసే వీరి వ్యాసాలలోని పలు దేవాలయాల వివరాలను రేఖా మాత్రంగా పరిచయం చేస్తాను. 

ఇక లభిస్తున్నంతో డా. కపిలవాయి లింగమÖర్తి గారు 1960 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో “స్వధర్మం” పత్రిక కోసం రాసిన “బెÂక్కేశ్వరుడు” వ్యాసం మొదటిది. దీనికి కొనసాగింపు వివరాలు మార్చి నెల సంచికలో కూడా ప్రచురింపబడ్డాయి. “బెక్కెం” ప్రస్తుతం వనపర్తి జిల్లాలో కృష్ణానది తీరంలో ఉన్న ప్రాచీన గ్రామం. శ్రీశైలం జలవిద్యుత్తు ప్రాజెక్టు కోసం నిర్మించిన ఆనకట్టవల్ల పాత బెక్కెం నీటిలో మునిగిపోయింది. బెక్కేశ్వర దేవాలయం నదికి చాలా దూరంగా ఉండటం వల్ల అది సురక్షితంగా ఉంది. 

బెÂక్కేశ్వరుడు వ్యాసంలో బెక్కెం గ్రామం ఏర్పడటానికి, అక్కడ బెÂక్కేశ్వరుడు ప్రతిష్ఠింపబడటానికి గల ఐతిహ్యం, అది ఎవరికాలంలో నిర్మించబడిందో, ఆ ప్రాంతాన్ని ఏలిన పాలకులు, వారు చేసిన దాన శాసనాది వివరాలు...శివకవిత్రయంలో ఒకరైన మల్లికార్జున పండితారాధ్యులు తమ సంచారవశంగా ఈ ప్రాంతాన్ని సందర్శించడం, ఇక్కడికి సమీపంలో ఉన్న “మÖకగుళ్ళ”ను చూసి ముగ్దుడై తన అంత్యకాలంవరకు ఇక్కడే ఉండి సమాధిగతులైన విషయాలు ఈ వ్యాసంలో ఉన్నాయి.

బెక్కెం, బెక్కేశ్వర ఆలయ సంబంధితమైన మరిన్ని వివరాలను “పరిశీలన” పత్రిక (మార్చి`1980)లో  “పెక్కు సమాధుల నిలయం`బెక్కెం”. “భారతి” (నవంబర్ 1990) పత్రికలో “బిక్కవోయిన బెక్కెంకథ”, “శ్రీశైల ప్రభ” (ఏప్రిల్`2004) పత్రికలో “కృష్ణాతీరక్షేత్రాలు`బెక్కెం” అను వ్యాసాలలో రాశారు. వీటితోపాటు “కృష్ణానది పుష్కరాల” సందర్భంగా ప్రచురించిన సంచికలలో కృష్ణా తీరం వెంట ఉన్న ఆలయాలేగాక ఈ “బెక్కేశ్వరాలయం” గూర్చి కూడా రాశారు. 

ఆ తర్వాత 1963 (జూన్ 19లో) “ఆంధ్రప్రభ” వారపత్రిక కోసం రాసిన వ్యాసం “శ్రీ రంగనాయకాలయం శ్రీరంగాపురం” వనపర్తి జిల్లా కేంద్రానికి 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న శ్రీరంగాపురం ప్రస్తుతం మండల కేంద్రం ఇక్కడి శ్రీరంగనాయకాలయం శిల్ప సౌందర్యంలో ప్రసిద్ధి. దీన్ని సూగూరును రాజధానిగా చేసుకొని వనపర్తి సంస్థానాన్ని ఏలిన అష్టభాషా బహిరీగోపాలరావు (1254`1676) కట్టించాడు. ఈ గోపాల రాయుడికి రంగనాయక స్వామి కలలో కనిపించి తాను ఫలాన చోట పుట్టలో ఉన్నాను వెలికి తీయించి ప్రతిష్ఠించ వలసిందని ఆదేశించాడట. మరునాడు మందిని తీసుకొని వెళ్ళి పుట్టను త్రవ్వింఛగా శ్రీదేవి, భూదేవి సమేతుడై శేషునిపై శయనించి నాభి పద్మంలో  బ్రహ్మతో కూడిన స్వామి మÖర్తి కనిపించింది. ఏ మాత్రం భిన్న కాకుండా లభించిన ఆ స్వామిని తెచ్చి ఆ గ్రామానికి “శ్రీరంగపురం” అని నామరకణ చేసి గుట్ట క్రింద “రంగ సముద్రం” అనే చెరువును త్రవ్వించాడు.

ఈ సంస్థానపు రాణీ శంకరమ్మ (1866`1892) ఈ ఆలయానికి విమానం, ముఖద్వారంపై గోపురం కట్టించి ఇక్కడి సమీపంలో ఆండాళును ప్రతిష్టించింది. చెరువు మధ్యలో “శ్రీ కృష్ణ విలాసమ”నే విశ్రాంతి భవనాన్ని నిర్మించింది. ఈమె తర్వాత ద్వితీయ రామేశ్వరరావు (1893`1922) ఈ ఆలయాన్ని మరింత విస్తృతపరిచి ప్రధాన గర్భగుడి పక్కన లక్ష్మీదేవి ఆలయాన్ని, కల్యాణ మంటపాన్ని నిర్మించాడు. ఇక్కడ దసరా నవరాత్రులు ముక్కోటి ఏకాదశి, ఫాల్గుణ మాసంలో ఉత్సవాలు పౌర్ణమికి రథోత్సవం జరిగే విషయాలు ఈ వ్యాసంలో వివరించారు. 1980 డిశంబర్‌లో వెలువడిని “మÖసీ” పత్రికకు “శ్రీరంగాపురం క్షేత్రం అనే ఈ ఆలయ సంబంధిత విశేషాలతో మరోవ్యాసం రాశారు. 

1970 జూలై మాసపు “పరిశీలన” పత్రిక కోసం సుప్రసిద్ధ శైవక్షేత్రమైన “శ్రీశైలక్షేత్రము” గూర్చి రాశారు శ్రీ లింగమÖర్తి గారు. ఇందులో శ్రీశైలక్షేత్ర స్థల పురాణం, స్థానిక ఐతిహ్యాలు, అక్కడగల ఆలయాలు, వాటి నిర్మాణ విశేషాలు, చరిత్ర మున్నగుల అంశాలను తమదైన పరిశీలనతో ఈ వ్యాసంలో తెలియజేశారు. 

మన తెలంగాణలో కనీసం ఒకటోరెండో నాగప్రతిమలు, నరనాగ విగ్రహాలు లేని గ్రామం ఉండదు. కానీ ఆలయంపై ఆపాదమస్తకం నాగ చిహ్నాలే ఉండటం అపురూపంగా చెప్పుకోవచ్చు. అలా ఒకప్పుడు ఈ ప్రాంతమంతా నాగ సర్పాలకు నిలయమై...శ్రీశైలం వెళ్ళే భక్తుల బసకు స్థావరమై...అనంతర కాలంలో ఊరుగా ఏర్పడిన గ్రామం “కొండనాగుల”. ఇది నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలంలో ఉంది. ఇక్కడ వెలసిన నాగలింగేశ్వర స్వామి వృత్తాంతాన్ని 1972 జూలైలో “ఆరాధన” పత్రికకోసం రాసిన వ్యాసం “నాగలింగేశ్వరాలయం కొండనాగుల”.

పూర్వం ఈ ప్రాంతాన్ని నాగవంశీయులు పాలించారు. వారే ఇక్కడి ఆలయాన్ని నిర్మించి ఉంటారని ఊహ. ఇక్కడ గుట్టవంటి రెండు పెద్ద గుండ్లు ఉన్నాయి. ఒక గుండుపై నాగలింగేశ్వరాలయాన్ని నలభై స్తంభాలతో కట్టి స్వామి ప్రతిష్ఠించారు. ఈ స్వామిని భక్తులు “రామలింగేశ్వరుడు” అని కూడా పిలుచుకుంటారు. డర్రన్న, బర్రన్న అనే సోదరులు మొదట ఇక్కడ నివాసం ఏర్పరుచుకొని అది గ్రామంగా విస్తరించడానికి ఆద్యులయ్యారని ఈ వ్యాసం ద్వారా తెలుస్తుంది. ఈ ఊళ్ళో గౌరీ, గంగాభవానీ, చెన్నకేశవ, హనుమదాలయాలు కూడా ఉన్నాయి. 

ఉమ్మడి పాలమÖరు జిల్లాలో 32 విధాల గ్రామ దేవతలు కొలువబడుతున్నారని, వారిలో ప్రతి వారికీ ఒక చరిత్ర ఉందని చెబుతూ 1975 డిశంబర్ “పరిశీలనర” పత్రికలలో వచ్చిన వ్యాసం. “మన జిల్లాలోని కొన్ని వీరగల్లులు”. గ్రామదేవతలు మనకు రామాయణ కాలం నుండే ఉన్నారని దీనివల్ల తెలుస్తుంది. ఇక్కడి గ్రామాలలో ఇదమ్మ,ఎల్లమ్మ,పోషమ్మ,మశమ్మ, మున్నగు గ్రామ దేవతలకు దేవాలయాలున్నాయని, పూర్వం కోటలు, చెరువుల నిర్మాణాలకు బలి ఇవ్వబడినవారు, బందిపోట్ల దాడిలో వీరోచితంగా పోరాడి మరణించినవారు, మత యుద్ధాలలో చచ్చిన వారి కోసం స్మృత్యర్థంగా ఆలయాలు నిర్మించి కొలిచిన వివరాలను ఇందులో ప్రస్తావించారు.

‘ఇంద్రకల్లు’ నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒక ప్రాచీన గ్రామం. ఈ ఊళ్ళో ఉన్న శివాలయాలలో ఈ శాన్యంగా ఉన్నదానికి నందీశ్వర, ఆగ్నేయంలో ముక్కంటీశ్వర, నైఋతిలో ఇంద్రేశ్వర, వాయవ్యంలో ఉన్నదానికి భీమేశ్వరాలయాలని పేర్లు. ఇప్పుడు ఇక్కడ ముక్కంటీశ్వర, ఇంద్రేశ్వరాలయాలు మాత్రమేమిగిలాయి. ఈ ఇంద్రేశ్వరాలయం గూర్చి రాసిన వ్యాసం “భారతి” పత్రిక (జనవరి 1977)లో ప్రచురితమైంది.

పూర్వ ఇంద్రకల్లు గ్రామంలో ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రమైన గంగాపురానికి యజ్ఞ వాటికగా ఉండేదట గంగాపురం మాదిరి ఇక్కడ కూడా జైన సంప్రదాయం వర్ధిల్లింది. రాష్ట్ర కూటులు జైనులు కాబట్టి వారిలో ఇంద్రనామం కలవారు ఉన్నందువల్ల ఈ గ్రామానికి “ఇంద్రకల్లు” పేరు వచ్చి ఉండవచ్చునని వివరించారు. ఇక్కడ పలు జైన పత్రిమలతో పాటు, నాగ శిల్పాలు కూడా ఉన్నాయి. ఆనాడు ఇదొక క్షేత్రంగానే గాక సామంత రాజధానిగా కూడా ఉన్న చిహ్నాలున్నాయి. అంతేగాక యుద్ధం జరిగిన స్థలం, రాణులు అగ్ని ప్రవేశం చేసిన అగ్ని గుండుం, వీర లింగన్న అనే ఒక యోధుని వీరగల్లు కూడా ఉన్నాయి. ఈ గ్రామంలో నేడు ఇంద్రేశ్వర, చెన్న కేశవాలయాలు మాత్రమే నిత్య పూజలందుకుంటున్నాయి. ఇదే అంశంపై శ్రీలింగమÖర్తిగారు “సుపధ” పత్రిక (నవంబర్ 2008)కు వ్యాసం రాశారు. 

కృష్ణానది తీరం వెంట ఉన్న దేవాలయాల గూర్చి ‘ఆంధ్రభూమి’ దినపత్రిక (15`1`1979)లో  వెలువడిన వ్యాసం “పాలమÖరులోని కృష్ణా తీరం క్షేత్రాలు”. ఇందులో కృష్ణానది తీరం వెంట ఉన్న గురజాల కాఢ లింగేశ్వరాలయం, ముడుమాల, మంత్రాలయ రాఘవేంద్రుని సహధ్యాయి అయిన “యాదవేంద్ర తీర్థుల” కొల్పూరులోని ఉత్తరాది మఠసంప్రదాయానికి చెందిన “సత్యతీర్థల మఠం” ఇందుపూర్‌లో శంకరానందుల వారి మఠం ఉన్నాయి. బ్రహూత్తర ఖండంలో కృష్ణానది మహాత్మ్యంలో ప్రస్తావింపబడిన గుడబల్లూరులోని శ్రీ వేîంకటేశ్వస్వామి దేవాలయం ప్రస్తావన, కురువపురంలో, దత్తావతారుడైన శ్రీపాదవల్లభుని” దేవాలయం, ధరూరు మండలంలోని చింతరేవులలో వెలసిన హనుమత్ క్షేత్రం, బీచుపల్లి క్షేత్రంలోని ఆంజనేయస్వామి ఆలయం, చిన్న అగ్రహారంలోని శివకేశవాలయాలు, యాపర్లలో ఉన్న శ్రీరామ వేంకటేశ్వర స్వామి దేవాలయం, ఆంజనేయస్వామి ఆలయం, మారమునుగాలలో మార్కండేయ చరిత్ర, బెక్కెంలోని బెక్కేశ్వరాలయం, మÖకగుళ్ళు, పెద్దమారురు, చిన్నమారు గ్రామాల ప్రస్తావన, జటప్రోలు మదనగోపాల ఆలయం, మంచాలకట్ట రామతీర్థ, గొందిమళ్ళ, అగస్తేశ్వరం, మల్లేశ్వరం, సోమశిల, మద్దిమడుగు, ఈగలపెంట మున్నగు చోట్ల వెలసిన ఆలయాల వివరాలు ఈ వ్యాసంలో ఉన్నాయి. 

1980 మార్చిలో “నృసింహప్రియ” పత్రికకు రాసిన వ్యాసం నృసింహాలయం మామిళ్ళపల్లి. ఈ దేవాలయాన్ని క్రీ.శ. 1136`76 నడుమ నల్లగొండ జిల్లా పానుగంటి నుండి రాజ్యపాలన చేసిన గోకర్ణం మహరాజు కట్టించినట్లు ఇక్కడి శాసనం వల్ల తెలుస్తుంది. ఇక్కడ శ్రీ వేంకటేశ్వర, సప్తమాతృకా,గణపతి ఆలయాలున్నాయి. ఇక్కడ నృసింహాస్వామిని ప్రతిష్ఠించేకంటే ముందు “శ్యామలపీఠం” ఉండేదట. ఫాల్గుణశుద్ధ పంచమి నుండి పున్నమి వరకు బ్రీVA్మత్సవాలు, వైశాఖలో నృసింహ జయంతి ఘనంగా జరుగుతాయి. ఇదే ఆలయాన్ని గూర్చి శ్రీ లింగమÖర్తిగారు 1981 మే,లో ఆరాధన పత్రికకు కూడా వ్యాసం అందించారు. 

పూర్వం ఒక ప్రసిద్ధ సౌరక్షేత్రంగా చెప్పబడిన గ్రామం కల్వకుర్తి మండలంలోని “తరణి కల్లు”. వర్ధమానపురం శాసనకర్తలైన అభినవ మయÖర సూరి వంశీయులు ఈ గ్రామ వాసులు మయÖరుడు సూర్యోపాసకుడు కనుక ఇక్కడి కవులు మయÖర నామాన్ని తమకు బిరుదుగా స్వీకరించినారు. ఈ గ్రామంలో శ్రీరామ, సూర్య, శివ, దేవి, భైరవ, వేణుగోపాల ఆలయాలున్నట్లు తెలిపే ఈ వ్యాసం అక్టోబర్ 1981 “మÖసీ” పత్రికలో వెలువడింది. 

అచ్చంపేట నియోజకవర్గంలోని వంకేశ్వరానికి సమీపంలో ఉన్న లక్ష్మీ పురాన్ని మరో అీVAబిలంగా పిలుచుకుంటారు. ఇక్కడ నవనారసింహ పత్రిష్ఠలుండేవట. కానీ ప్రస్తుతం నృసింహ, వరాహ, వృద్ధ, ఉగ్రయోగ నారసింహాలయాలతో పాటు హయగ్రీవ, హనుమంత, శివ, మహిషాసురమర్ధని, భైరవుల ప్రతిష్ఠలున్నాయి. ఇక్కడ ప్రధానాలయమైన యోగనరసింహ తదితర ఆలయాలను చాళుక్యులు కట్టి ఉండవచ్చునని తెలిపే ఈ వ్యాసం “ఆరాధన” పత్రిక (సెప్టెంబర్ 1982)లో ప్రచురింపబడింది.

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉన్న అవంచ ఒక ప్రాచీన గ్రామం. ఇది పశ్చిమ చాళుక్యుల రాజపత్రినిధి పురంగా ఉండేది. ఆవంచ అనగానే దాదాపు 20 అడుగుల ఎత్తున పెద్ద గుండుకు చెక్కుబడిన గణపతి విగ్రహం గుర్తుకొస్తుంది. ఇక్కడ చరిత్ర ప్రసిద్ధి పొందిన భైరవ, రాజగోపాల, హనుమ, భ్రమరాంబ ఆలయాలున్నాయి. ఇక్కడి భమరాంబదేవి స్వయం వ్యక్తమని “ఆవంచ భ్రమరాంబ పంచవింశతి” (పులిజాల పట్టాభికవి) వల్ల తెలిపే వ్యాసం మార్చి 1982 మÖసీ పత్రికలో వచ్చింది.

అలాగే డిశంబర్ 1982లో మÖసి పత్రికలో “కందూరు” వ్యాసం వెలువడింది. గొప్ప చరిత్ర కలిగిన ఈ గ్రామం మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలో ఉంది. చోళులు కోడూరును విడిచిన తర్వాత కందూరుకు చేరి “కందూరు చోళులైనారు. ఆనాడు వారు నిర్మించిన కట్టడాలు నేడు శిధిలాలుగా దర్శనమిస్తాయి. సాధారణంగా శివలింగం సోమసూత్రంపై ఉండటం చూస్తాం. కానీ ఇక్కడ మాత్రం శివలింగం రథ చక్రంలో ప్రతిష్ఠింపబడింది. ఈ స్వామిని “రామలింగేశ్వరుడు” అంటారు. ఈ ప్రదేశానికి ఒక ఐతిహ్యం ప్రచారంలో ఉంది. ఈ క్షేత్రం కదంబ వృక్షాలకు నిలయం. ఈ గ్రామంలో గౌరీ, ఆంజనేయ వీరభద్ర, చెన్నకేశవ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. 

నాగర్‌కర్నూల్ జిల్లాలోని సోమశిల క్షేత్రానికి అత్యంత సమీపంలో ఉన్న “సంగమేశ్వరక్షేత్రం” యొక్క పౌరాణిక, చారిత్రక, ఆలయవిశేషాలతో రాసిన వ్యాసం “సంగమేశ్వర స్థల పురాణం” “సంగమేశ్వర స్థలపురాణమను” గ్రంథాన్ని బెక్కె వాస్తవ్యులైన బలహరిసింహఠాకూరు 1982లో  ప్రచురించారు. ఇది పద్య రచన. ఈ గ్రంథానికి లింగమÖర్తి గారు రాసిన సమీక్ష “దుందుభి మాస పత్రిక (డిశంబర్ 1982)లో వచ్చింది. 

నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లికి ఆరు కిలోమీటర్ల దూరంలో “రామగిరి” ఉంది. దీనిపై ఉన్న ఆలయాన్ని ఏరువ వంశానికి చెందిన గోకర్ణ మహారాజు కట్టించాడు. ఈ వ్యాసంలోని కథనం ప్రకారం మొదటి ఇది పార్శ్యనాథ, తర్వాత శివ, శ్రీరామ ప్రస్తుతం శ్రీ రామలింగేశ్వరాలయంగా పిలువబడుతోంది. వీటితోపాటు లక్ష్మీ గణపతి, శ్రీ సీతారామలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాలున్నాయి. ఈ ఆలయాల సంబంధిత వ్యాసం 1983 అక్టోబర్ “ఆరాధన” మాసపత్రికలో వెలువడింది. 

అమరాబాదుకు సమీపంలోఉన్న రాయనిగండి ప్రాంతాన్ని చింతకుంట రంగారాయుడు పాలించాడు. క్రీ.శ. 1532లో ఈయన పల్నాటి బ్రహ్మనాయుడు, మలిదేవాదులతో శ్రీశైల అరణ్య ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు ఇక్కడ చెన్నకేశవస్వామిని ప్రతిష్ఠించాడనే ప్రతీతి ఉంది. రంగ రాయుడు వేయించిన ఒక శాసనం కూడా ఉంది. ఈ వివరాలతో కూడిన వ్యాసం “ఆరాధన” పత్రిక 1984 ఆగష్టులో ప్రచురితమైంది. 

నాగర్‌కర్నూల్ జిల్లాలో తీగలపల్లి ఒక ప్రాచీన గ్రామం. తీగన్న అనే యాదవుడు స్థాపించిన గ్రామంగా చెబుతారు. ఈ ఊరికి తూర్పున వీరన్న గుట్ట ఉంది. ఎవరో ఈ గుట్టపై ఆలయాన్ని కట్టి అందులో వీరభద్రున్ని నిలిపినారు. ఒకప్పుడు ఇక్కడ కాకతీయుల సైన్యవాసం ఉండేదట. స్వామికి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. మహిమాన్వితుడిగా చెప్పబడే ఈ వీరభద్ర స్వామితో పాటు శివాలయం, చెన్నకేశవాలయాలున్నాయి. వీటి వివరాలు “మÖసీ” పత్రికలో 1982 మేలో వచ్చాయి. 

ఎండవెట్ల గ్రామం నాగర్‌కర్నూల్‌కు దగ్గరలో ఉంది. ఈ ఊరికి దక్షిణాన గుట్టపై ప్రాచీన ఏకకూట నృసింహాలయం ఉంది. ఇది ఎవరు కట్టించారో తెలియదు. ఈ స్వామిపేర కేసరీ సముద్రమనే పెద్ద చెరువు కూడా త్రవ్వించారు. ఈ చెరువుకు మొదట “శిఖేశ్వర సముద్ర”మని పేరు. ఇక్కడికి సమీపంలో శిఖేశ్వరాలయం ఉంది. ఆ వివరాలు “నృసింహప్రియ” పత్రిక (జూలై 1985)లో “ఎండవెట్ల నృసింహాలయం” అనే శీర్షికన వచ్చింది. ఇదే పత్రికలో ఇదే సంవత్సరం సెప్టెంబర్‌లో “అంకూరు నృసింహాలయం” వ్యాసం వచ్చింది. స్వామి స్వప్నంలో అగుపించి ఆదేశించగా నిర్మించిన గుడి. గుడిలో మÖల విరాట్టు విగ్రహం కాకుండా భావనామÖర్తి శిల ఉండేది. మొదట మట్టితో కట్టబడిన ఈ ఆలయాన్ని వనపర్తి సంస్థానపాలకుడు రాజాకృష్ణ దేవరావు రాతితో నిర్మించాడు. ఈ గుడి ఒక పెద్ద గుండుపై ఉంది. ఇక్కడే శివాలయంతో పాటు వైవిద్యమైన దీపస్తంభపు వివరాలున్నాయి. 

సిరసవాడ దుందుభీ (డిండి) నది తీరంలోని ఒక ప్రాచీనగ్రామం. ఇక్కడే చెన్నకేశవాలయం. వేణుగోపాలాలయం అని రెండు విధాలుగా పిలువబడే ఆలయముంది. ఇందులో విగ్రహ ప్రతిష్ఠ ఎందుకు జరుగలేదో ఎవ్వరికీ తెలియదు. ఈ వ్యాసం “ఆరాధన” పత్రిక (1986 ఆగష్టులో వచ్చింది. ఇదే సంవత్సరం అక్టోబర్‌లో ఈ పత్రికలోనే ప్రచురింపబడిన వ్యాసం “కల్యాణ వేంకటేశ్వరుని కథ” ఇది కొత్తకోట మండలం అమడబాకుల గ్రామంలో స్వామి స్వప్నం చెప్పగా వెలసిన “స్వయంభూ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి” దేవాలయ కథనం. ఈ వృత్తాంతాన్ని గూర్చి ఇదే పత్రికలో ఫిబ్రవరి 1987లో రాగా, “సుపధ” పత్రికలో అక్టోబర్ 1987లో ప్రచురింపబడింది.

శ్రీ కపిలవాయి లింగమÖర్తిగారు దేవాలయ సంబంధితంగా 1987 సంవత్సరంలో రాసిన వ్యాసాల గూర్చి తెలుసుకుంటే... ‘ఆరాధన’ పత్రిక కోసం ఫిబ్రవరిలో రాసిన వ్యాసం “మాతంగిక్షేత్రం వెలికట్ట”. వెలికట్ట షాద్‌నగర్ పట్టణానికి సమీపంలో ఉన్న గ్రామం. ఇక్కడ అంబాభవానీ ఆలయం ప్రసిద్ధి. అతి పరాతనమైన ఈ ఆలయం విశేషాలు ఇందులో ఉన్నాయి. 

ఫిబ్రవరి, మార్చి మాసం “ఆంధ్ర పత్రిక భారతి, సారస్వతానుబంధం” సంచికల్లో “సహస్ర గణపతీశ్వరుడు, గణపురం” వ్యాసం వచ్చింది. గణపురం కకాకతీయ గణపతి దేవుని పేరున వెలసిన గ్రామం. వనపర్తి జిల్లాలో మండల కేంద్రంగా ఉన్న దీన్ని ప్రస్తుతం “ఖిల్లా ఘనపురం” అని పిలుస్తారు. గోనగణిపి రెడ్డి అక్కడ గల గుట్టపైన కోటను, గుట్ట క్రింద గణపతీశ్వరాలయాన్ని కట్టించాడన్న వివరాలు, ఇతర ఆలయాల గూర్చి ఇందులో ప్రస్తావించారు. 

జూన్ “సమాలోచన” పత్రికలో “గురుభక్త విజయం” పేరున వచ్చిన వ్యాసంలో వనపర్తి సంస్థాన పాలకులు నివాసమున్న ‘రాజనగరం’లో కట్టిన “రామకృష్ణాలయం” తదితర వివరాలున్నాయి. ఇదే పత్రికలో ఆగష్టు మాసంలో “గంగాపురం మాహాత్మ్యం” వ్యాసం వచ్చింది. ఇందులో గంగాపురం చెన్నకేశవ దేవాలయ నిర్మాణ నేపథ్యం, పౌరాణిక ప్రశస్తి, జైన బౌద్ధమతాల ప్రస్తావన, ఆ ప్రాంతాన్ని పాలించిన ప్రభువులు, అక్కడి ఉత్సవాలు, వారి దానశాసన వివరాలు ఉన్నాయి.  

1988వ సంవత్సరంలో దేవాలయ సంబంధితంగా రాసిన వ్యాసం ఒకటి మాత్రమే కనబడుతుంది. అది “అప్పాజిపల్లె, సింగన్న”ను గూర్చి ఏప్రిల్ “ఆరాధన” పత్రికలో వచ్చింది. అప్పాజిపల్లె నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని గ్రామం. ఈ ఊరి వెలుపల ఉన్న గుట్టపై గల చారికలో వెలసిన నృసింహ స్వామి గూర్చి రాసిన సమాచారం. 

1989వ సంవత్సరంలో రెండు వ్యాసాలొచ్చాయి. ఒకటి భారతి (మార్చి)లో వచ్చిన “నంది వనపర్తి” కాగా, మరొకటి “ఆరాధన” పత్రిక (ఆగష్టు)లో వచ్చిన “వీరన్న పేట గుడులు”. నందివనపర్తి రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని గ్రామం. ప్రాచీన చరిత్రగల గ్రామం. పూర్వం ఈ గ్రామానికి “ వహ్నిపురం” అనే వ్యవహారం ఉండేదట. ముస్లీం ప్రభువులు “వన్‌ఫర” అని, ప్రజలు “వనపర్తి” అని, ప్రజలు “వనపర్తి” అని పిలుచుకున్నారు. ఈ ఊళ్ళో సిద్దేశ్వర, నందీశ్వర, ఓంకారేశ్వరమును మÖడు ఆలయాలున్నవి. వీటిలో చెప్పుదగింది. “నందీశ్వరాలయం”. దానిలో ఉండే నంది విగ్రహాన్ని బట్టి ఈ గ్రామం “నందివనపర్తి” అయింది. ఈ నందిని గూర్చి ఇక్కడ రెండు మÖడు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వాటితోపాటు ఆనాడు ఇక్కడ జరిగిన ఉత్సవాలు, పలు చారిత్రక అంశాలు ఈ వ్యాసంలో ఉన్నాయి. రెండవది “వీరన్నపేట గుడులు” వ్యాసం, వీరన్నపేట`ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఒక కాలనీ చాలా కాలం కిందట ఇది మÖలికా వృక్షాలుగల ఒక అడవి. వీరన్న అనే భక్తుడు ఇక్కడ గల ఒక గుట్టపై నివసించి శివ, వీరభద్ర ఆలయాలతో పాటు మరికొన్ని గుళ్ళను నిర్మించిన సమాచారం ఇందులో ఉంది. అంతేగాక ఆనాటి ఐతిహ్యపు వివరాలుకూడా ఉన్నాయి. 

1990వ సంవత్సరంలో ఆలయాలకు సంబంధించి రాసిన రెండు వ్యాసాలు లభించాయి. అవి “60వ శివకోటి జపయజ్ఞ గీతాయజ్ఞ భక్త సమాజం వారు ప్రచురించిన షష్టిపూర్తి (అక్టోబర్) సంచికలో “ద్వాదశ జ్యోతిర్లింగముల చరిత్ర “వ్యాసం కాగా రెండోది “భారతి” (నవంబర్)లో వచ్చిన “బిక్కవోయిన బెక్కెం కథ”. మొదటి వ్యాసంలో ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్ర సమాచార ఉండగా, రెండోవ్యాసంలో బెక్కెం గ్రామం, అక్కడ ఉన్న “బెక్కేశ్వరాలయం” మున్నగు ఆలయాల ప్రస్తావన ఉంది. 

1992వ సంవత్సరంలో “కళామతల్లికి ఊయల సోమశిల” (ఆస్తికభూమి`పత్రిక), “అద్వితీయ జ్యోతిర్లింగ క్షేత్రం (సద్గురువాణి`జనవరి) అను రెండు వ్యాసాలు వచ్చాయి. “సోమశిల” నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉన్న సుప్రసిద్ధశైవ క్షేత్రం. ఇది కృష్ణానది తీరంలో ఉంది. ఇక్కడ కృష్ణానది “సప్తనదీ సంగమం” గా ప్రసిద్ధి. దీన్ని పూర్వం “సోమేశ్వరక్షేత్రం” అని పిలిచేవారు. లలితా, సోమేశ్వరులిక్కడ ప్రధాన దేవతలు. ఒకే కప్పు కింద 13 ఆలయాలున్నాయి. పాత గ్రామం శ్రీశైలం డ్యాం నిర్మాణం కోసం మునిగిపోగా ఈ దేవాలయాన్ని మరోచోటుకి తరలించారు. ఇక్కడ జరిపిన త్రవ్వకాలలో శాతవాహనుల కాలం నుండి విజయ నగర కాలం వరకు గల శిల్పావశేషాలు బయటపడ్డాయి. పలు పురాణ, చారిత్ర అంశాలతో ఈ వ్యాసం రాయబడింది. ఇదే క్షేత్రాన్ని గూర్చి 1993లో “సద్గురువాణి” పత్రిక (జనవరి)లో “మన పుణ్యక్షేత్రాలు`సోమేశ్వరం” అనే వ్యాసం వచ్చింది.

1994,95 సంవత్సరాలలో వ్యాసాలు అగుపించకపోగా...1996వ సంవత్సరంలో ఆం.ప్ర. ప్రభుత్వం ప్రకటించిన 8వ తరగతి “తెలుగువాచకం”తో “ఉమామహేశ్వరం” క్షేత్రం గురించి పాఠ్యాంశ ఉంది. ఇది నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇదే క్షేత్రాన్ని గురించి 2006వ సంవత్సరం ఫిబ్రవరి “వేదాంత భేరి” పత్రికలో, 2010 జూలై`సెప్టెంబర్ “సద్గురువాణి” పత్రికలో కూడా వ్యాసాలు రాశారు.

2001వ సంవత్సరంలో...“అలంపురం`ఆలయ సంపద” శీర్షికన “సుపధ” పత్రిక ఏప్రిల్‌లో వ్యాసం వెలువడింది. “అలంపురం” కృష్ణా తుంగభద్ర నదుల నడుమగల పుణ్యక్షేత్రం. ఇది భారతదేశంలోని పది భాస్కరక్షేత్రాలలో, పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటై`శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెంది జోగుళాంబ గద్వాల జిల్లాలో ఉంది. తెలుగు రాష్ట్రాలలో ఇక్కడ ఉన్నన్ని ఆలయాలు మరెక్కడాలేవు. ఇక్కడ నవబ్రహ్మల పేర ఆలయాలు వెలయటం ఈక్షేత్రం యొక్క ప్రత్యేకత.

జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరలు ఇక్కడి ప్రధాన దేవతలు. క్రీ.శ. ఏడవ శతాబ్ది వరకే ఈ బ్రహ్మేశ్వరాలయాలు ప్రసిద్ధి. ఈ వ్యాసంలో అలంపురంలోని కోట, డుంఠి గణపతి, కామాక్షిదేవి, రససిద్ధుడు, వేîంకటేశ్వర, దత్తాత్రేయ, నృసింహ, కోటమీది ఆంజనేయ, సూర్యనారాయణ, బసవేశ్వర, నీలకంఠేశ్వర స్వాముల ఆలయాల ప్రస్తావన, చారిత్రక విషయాలు ప్రస్తావించబడ్డాయి.

2003వ సంవత్సరంలో “(శ్రీ శైల ప్రభ” పత్రిక డిశంబర్)లో “ పీడలు తొలగించే బీచుపల్లి క్షేత్రం” అనే వ్యాసంరాగా, 2004వ సంవత్సరంలో “సుపథ” పత్రిక (మార్చి)లో, “యుగ యుగాలకృష్ణ” శ్రీశైల ప్రభ`ఏప్రిల్, మే, జూన్ సంచికలో వరుసగా కృష్ణాతీరక్షేత్రాలు బెక్కెం. కృష్ణాతీరక్షేత్రాలు కురవపురం వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. ఆగష్టు మాసంలో “ఆంధ్రభూమి” పుష్కరాల ప్రత్యేక సంచికలో “పాలమÖరు కృష్ణా తీరాలు`కృష్ణవేణి” శ్రీశైలప్రభ`ఆగష్టు, సెప్టెంబర్ మాసంలో “మహబూబ్‌నగర్‌లోని కృష్ణాతీర క్షేత్రాలు” వ్యాసాలు వెలువడ్డాయి.

2005వ సంవత్సరం నవంబర్ “విశ్వఐక్యత” మాసపత్రికలో “భైరవకోనక్షేత్రము” గూర్చి, 2008వ సంవత్సరం మే నెలలో ఆం. ప్ర హిందూ ధర్మ ప్రచార సమితివారి “పుణ్యక్షేత్ర సందర్శన రథయాత్ర స్మరణిక”లో “మహబూబ్‌నగర్ జిల్లాలో కొన్ని ముఖ్య దేవాలయాలు” వ్యాసం వచ్చింది. 2008 నవంబర్ “సుపథ” పత్రికలో “చరిత్రలో ఇంద్రకల్లు” వ్యాసం, కె.వి. సుందరాచార్యుల సంఫాదకత్వంలో 2009 జనవరిలో వెలువడిన “వాహనోత్సవ వైభవము” గ్రంథంకోసం “వాహనసేవ వాని తత్వము వైష్ణవాలయాలు” వ్యాసం రాశారు. 

2011వ సంవత్సరంలో నాగర్‌కర్నూల్ జిల్లాలో వట్టెం ప్రసిద్ధవైష్ణవక్షేత్రం. ఆ దేవస్థానం వారు ప్రచురించిన “పుష్కరశ్రీ” ద్వితీయ పుష్కర మీVAత్సవ విశేష సంచిక కోసం “వట్ట్టెం నాడు నేడు” అనువ్యాసాన్ని అందించారు. 

2012వ సంవత్సరంలో జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని “మహారాణి ఆది లక్ష్మీ దేవమ్మ ప్రభుత్వ డిగ్రి కళాశాల స్వర్ణోత్సవ సంచిక “స్వర్ణవాహిని”లో “గద్వాల తాలూకాలోని ఆలయాలు” అనువ్యాసం ప్రచురించపబడగా...ఆగష్టు మాస “సుపథ” పత్రికకు తక్షశిల నుండి తక్కశిల వరకు అను వ్యాసాన్ని అందించారు. ఈ వ్యాసంలో ఉత్తర భారతంలోని అయోధ్య,         ఉజ్జయిని, తక్షశిల నగరాలకు జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ ఉజ్జలి తక్కశిల అనేవి ప్రతిరూపాలుగా వెలయటం దీని ప్రత్యేకతగా చెప్పారు. తక్కశిల గ్రామంలో ఉన్న రామేశ్వర మున్నగు దేవాలయాల వివరాలు రాశారు. 

చివరగా 2016వ సంవత్సరంలో “బంగారు తంగేడు” ఆగష్టు మాస పత్రికకు “పాలమÖరులో కృష్ణాతీర క్షేత్రాలు” వ్యాసం ఇవ్వగా`ఇదే అంశంపై 2019 జనవరి మార్చి “పునాస” పత్రికలో వ్యాసం వెలువడింది. 


కొత్త పింఛన్ల దరఖాస్తు కోసం ఏ పత్రాలు కావాలి #pension #apply #new #telangana #government #scheme


 

గుడ్లతో పాటు తినకూడని ఆహారాలు ఏమిటి #eggs #combined #food #items #health #arogyam


 

26, జూన్ 2026, శుక్రవారం

దేవదాసు.....నిందాస్తుతి

వినోదా వారి ‘దేవదాసు’ విడుదలైన 58 సంవత్సరాలకు sTÖ కైవారగీతం పాడటానికి రెండు కారణాలు. షష్టిపూర్తి చేసుకొనే సమయంలో కూడా సర్వాంగసుందరంగా, సొగసుజూడతరమా అన్నట్లిది శోభిల్లడం. ఇప్పటికి అయిదు భాషల్లో తయారైన పదకొండు (G ఒక మÖకీ) చిత్రాలలో దీనికి వచ్చిన పేరూ ప్రతిష్ఠా మరే చిత్రానికీ రాకపోవడం.

నేనీ ‘దేవదాసు’ల్లో ఎనిమిదింటిని చూశాను. ప్రతిదానిలో ఏదో ఒక ప్రత్యేకాకర్షణ యిప్పటికీ సూదంటురాయిలా వుంది. ఒకదానిలో సంగీత సాహిత్యాలు (ఆరుద్ర - రమేశ్ నాయుడు / విజయనిర్మల-1974), యింకోదానిలో స్క్రీన్-ప్లే (పి.సి.బరువా/ పి.సి.బరువా-1935, హిందీ), ఛాయాగ్రహణం (కమల్ బోస్ / బిమల్ రాయ్-1955, హిందీ), మొట్టమొదటి టైటిల్ కార్డు నుంచి చిట్టచివరి సమాప్తం కార్డు వరకూ ప్రౌఢ స్ధాయిలో పటాటోపం (సంజయ్ లీలా భన్సాలి, 2002, హిందీ), భగవాన్-చునీలాల్‌గా అమోఘ నటన (ఉత్తమ్ కుమార్/దిలీప్ రాయ్-1979, బెంగాలీ)  యిలా అన్నిటిగురించీ ఒక ప్రత్యేక దీప్తిని ఎంచి చూపవచ్చు.

కాని sTÖ అన్ని పరిధులను దాటి, ప్రేక్షకుల మనసుపై చెరగని ముద్ర వేసింది వినోదా వారి ‘దేవదాసే’,  నిస్సంశయంగా. నేనీమాట ఒక ఆంధ్రుడిగా మాతృభాషాభిమానంతో చెప్పడంలేదు. అరవై అయిదు సంవత్సరాలుగా పలు భాషల్లో వేల సినిమాలు చూసి సినిమా కళ అంటే ఒక స్పష్టమైన దృష్టినేర్పరుచుకొని అంటున్నమాట.

స్వర్ణయోగం సిద్ధించటానికి కారణాలు సవాలక్ష. అలాగే sTÖ చిత్రమిలా బంగారమయిదంటే దాని వెనుకనున్న తారాబలం, సాంకేతిక బృందమే కాక మరొక అంశం అదృష్టం, అన్నీ అలా అందంగా కలిసిరావడం. ఆ యోగానికి ఒక్కరినే వేలెత్తి చూపమంటే, కాదు బలాత్కరిస్తే దర్శకుడు (వీరికి సంగీత, నృత్య, సాహిత్యాభినయాలు వంశపారంపర్యంగా వచ్చి, కృషితో చేతికందిన కల్యాణసౌగంధికాలు) వేదాంతం రాఘవయ్యనే పేర్కొనాలి. ఆ మరుసటి సంవత్సరమే వీరి దర్శకత్వంలోనే వచ్చి, అందరినీ నిరుత్సాహపరచిన ‘అన్నదాత’  మాటేమిటి అని అడిగితే నేనొక ఋషివాక్యాన్నే ఉదాహరించగలను: ‘చినికిన చినుకెల్ల మంచి ముత్యము కాదు’ (మల్లాది రామకృష్ణశాస్తి - చివరకు మిగిలింది/రామినీడు, 1960).

సాంకేతిక వర్గంలో ప్రతి ఒక్కరూ తాము చేయవలసింది నిష్కళంకంగా చేశారు. తేటతెల్లంగా కనబడే ఛాయ, కళ, మేకప్, వస్తాలంకరణలే కాక గాలి తెచ్చే గంధంలా తెలిసీ తెలియక అలముకొనే నృత్యరచన, నేపథ్య సంగీతము, కూర్పు కూడా ఒకదానికొకటి తోడైనాయి.

నేను మొట్టమొదట ‘దేవదాసు’ చూసింది మొదటి విడుదలకే, 1953లో  స్కూలు క్రికెట్టు జట్టు అఫీషియల్ ఫోటోగ్రాఫర్‌గా బెంగుళూరు వెళ్లినప్ప్పుడు. చివరనే కాదు ఎన్నో సన్నివేశాలలో కన్నీళ్లు కాలువలై ప్రవహించాయి. ఆ వయసు—నిండా నిండని పధ్నాలుగు—అటువంటిది. ముఖ్యంగా చంద్రముఖి-దేవదాసు వీడ్కోలు సన్నివేశం గుండెను పిండివేసింది. ఎన్నో సంవత్సరాల తరువాత విజయవాడ మాడర్న్ కఫేలో వుంటూ దగ్గరున్న ఎ.సి. హాలులో చూడని ‘సీతారామయ్యగారి మనవరాలి’ని వదులుకొని దూరంగా బెంజ్ సర్కిల్ అవతల వున్న పాత హాలులో, ఆ హోటలు మేనేజరు సైకిలు తీసుకొని వెళ్లి, రాత్రి ఆటను చూసినప్ప్పుడు - అదే ఉత్పాతం. అదే sTÖ ‘దేవదాసు’ గొప్పతనం.

ఒకటి రెండు ముచ్చట్లు అందరికీ తెలియనివి చెప్పి, sTÖ వందిమాగధీయాన్ని ముగిస్తాను.

‘దేవదాసు’ పాటల్లో మల్లాది వారి హస్తం ఉందనే మాట పాతదే. దీనికి ఉదాహరణగా ‘అందాల ఆనందం’, ‘కుడి యెడమైతే’ పాటలను పేర్కొంటారు. ‘తాగినోడి మాటకర్థం వెతకాలా’ అని ఒక రిక్షావాడడగడం కట్టుకథని ప్రతిభాశాస్తి నాతో స్వయంగా చెప్పారు. అవటుపెడితే, మÖడుచోట్ల సంభాషణల్లో నాకు ఆ రామకృష్ణుడే ప్రత్యక్షమౌతాడు.

“నువ్వెందుకే sTÖ గీత గోవిందం?” (నాయనమ్మ, పుట 25).

“నమస్కారం మహాప్రభో! నాకు సెలవిప్పించండి. ఇహ నేనీ ‘ప్రహ్లాద’ నాటకం ఆడలేను!” (బడిపంతులు, పుట 31).

“అయ్యయ్యో! అదేం పరధ్యానమే తల్లీ? నాకు తలంబ్రాలు పోస్తావేమే!” (నాయనమ్మ, పుట 38).

సినిమా రచయితగా సముద్రాల రాఘవాచార్యులు మల్లాది రామకృష్ణశాస్తి ప్రక్కన ఆచంట మల్లన్నే, సందేహం లేదు. కాని పై మÖడూ సముద్రాల కాదు గదా తన మగని నాలిక దిగివచ్చిన చదువులతల్లీ వ్రాయలేదు. కస్తూరి, పునుగు, జవ్వాదుల ఘాటు లేకపోవచ్చు. కాని వట్టి వేరు మట్టి వాసన, చల్లని పరిమళం, దానిదే. మల్లాది వారి సంభాషణలు పాత్రలకు సహజాతాలు.

‘దేవదాసు’ కోసం రికార్డు చేసి అందులో ఉపయోగించని పాట£కటున్నది. అది ‘వినవేడుక” (ఆర్కే బుక్స్, 2005, వెల రూ. 100/-) పుస్తకంలో 26వ పుటలో ఉంది.

ఏరు నవ్విందోయ్ ఊరు నవ్విందోయ్

ఏటిలోన చిట్టి చేప యిట్టే నవ్విందోయ్

గట్టున చిట్టి పాప అట్టే నవ్విందోయ్ ॥ఏరు॥

ఏరు మీద ఊరు, ఊరు మీద ఏరు

ఏరు మయాన పాలేరు

గరప చేనుమీద మిరపపండు చూసి

దొరబిడ్డ ఉలుకెత్తి దొండపండనుకుంటే ॥ఏరు॥

నిమ్మకు నీరెట్టి చేనుకు నారెట్టి

సమ్మతైనావోడు నిదరోతే

కంటినిద్దుర రాక ఒంటిపొద్దూ పోక

ఏమి తోచని పిల్ల ఏతామెక్కిందని ॥ఏరు॥

ఈ పాట వినోదావారి ‘దేవదాసు’ కోసం సి.ఆర్. సుబ్బురామన్‌కి పాడినట్లుగా మాధవపెద్ది సత్యం నోటు బుక్కులో వుంది. ఆ పాట బోళ్ల సుబ్బారావు ప్రథమ చిత్రం ‘పల్లెపడుచు’లో ఉపయోగించుకొన్నారు. ఈ సినిమా పాటలతోనే విడుదలలైన రికార్డు పైనా వినోదా వారి సౌజన్యంతో అనీ, రచన మల్లాది రామకృష్ణశాస్తి అనీ వుంది.

ఇదంతా నాకు తెలిసేటప్పటికి డి.ఎల్.నారాయణ, వేదాంతం రాఘవయ్య లేరు. ఉన్న ప్రతిభాశాస్తి, పేకేటి శివరాం, అక్కినేని నాగేశ్వరరావు sTÖ పాట సంగతే తెలియదన్నారు.

పాట రచన బట్టి ఏ సన్నివేశం కోసం చేశారా అని ఆలోచిస్తే, ఏదీ తేలడం లేదు. వరసా, వాద్యగోష్ఠి గమనిస్తే, ఒక పడవవాని పాటై వుండవచ్చు అనిపిస్తున్నది. ఒకవేళ బెంగాలులో చిన్న చిన్న నదులు చిలవలు పలవలుగా వుండటం దృష్టిలో పెట్టుకొని, తండ్రి చనిపోయిన తరువాత దేవదాసు సొంత వూరు వచ్చే తరుణంలో, పార్వతీ ప్రయాణం కట్టిన సన్నివేశానికా? ఇవన్నీ తలపోతలే.

చివరి మాట. విజయనిర్మల ‘దేవదాసు’తో బాటు వినోదా వారిది కూడా విడుదల చేయబడి బాగా ఆడటంతో అన్ని పాటలతో ఒక ఎల్.పి. కొలంబియా లేబిల్‌పైన సరస్వతీ స్టోర్స్ వారు విడుదల చేశారు. వివరాలన్నీ తప్ప్పుల తడకలు. ఆ పాటలు మొదట విడుదల చేసింది హెచ్.ఎం.వి. ఈ తప్ప్పులు దిద్దమని సరస్వతీ స్టోర్స్ కణ్ణన్‌ని అడిగితే, అవి మాకు హెచ్.ఎం.వి వాళ్లిచ్చారు, అవే కరెక్టు, మార్చడం కుదరదన్నారు. గ్రామకో మంగాపతినడిగితే అది కొలంబియా విడుదల, నేను చేయగలిగిందేమీ లేదు అని చేతులెత్తేశారు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడని బద్దెన యేనాడో అన్నాడు కదా తన సుమతీ శతకంలో! వసుదేవుణ్ణయినా ఫలితం లేకపోయింది.

అప్ప్పుడు మద్రాసు విజయ-వాహిని స్టూడియోలో షూటింగ్‌కని అక్కినేని వున్నారు. ఆయన చేతులు పట్టుకొన్నాను, మధ్యాహ్నం విశ్రాంతి వేళ భంగం కలిగించి. ‘మీరు రెండు మాటలు చెప్పిన దేవదాసు ఎల్.పి. యిన్ని తప్ప్పుడు వివరాలతో విడుదల చేశారు. నేను మర్యాదగా అడిగితే మాట వినడం లేదు ఆ గ్రామ, యింటి సింహాల వాళ్లు. ఏయే దిద్దుబాట్లు చేయాలో మీరు వ్రాసినట్లు ఆ కంపెనీల వారికి ఒక ఉత్తరం టైపు చేసి తీసుకువచ్చాను. మీరు సంతకం పెట్టండి’ అంటూ అభ్యర్థించాను.

ఒకసారి చదివి సంతోషంగా సంతకం పెట్టారు. ఆ ఉత్తరం చివరి పేరాలో ‘ఈ సరియైన వివరాలు వి.ఎ.కె. రంగారావు యిచ్చినవని కొత్త విడుదలపై వుండాలి’ అని వుంది. అలాగే ఆ ఈస్టిండియా కుంఫిణీ వారు బ్రతికినట్టు విడుదలైన కేసెట్టులో వేశారు. ఇప్ప్పుడా కౌటిల్యులా విషయం తొలగించే వుంటారు.

ఆ విజయం నాకు జరిగిన కనకాభిషేకంలో ఒక నాణెం. ఇప్ప్పుడీ లోకంలో లేనివారికి జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించడం కన్నా ఆనంద్‌కి ఆనందమేమున్నది! నాకీనాడు పేరుప్రతిష్ఠలున్నవంటే దీనికి కారణం వారు కట్టిన సరాగమాలలే కదా! 

ఇలాంటి పాత చిత్రాల సంభాషణలు నవలా రూపంలో రావడం ఆ కర్తలకు నివాళి. ఆ కార్యానికి దాఖలా. నేటి ప్రేక్షక పఠితలకు పచ్చకర్పూరం వేసిన కొఱ్ఱబియ్యపు పాయసం. ఎత్తండి. గుర్తించండి. ఆస్వాదించండి.

ఆంధ్ర నృత్య సంప్రదాయాలు - ఒకమాట

శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి ఆశీస్సులు, అలాగే ఆరుద్ర గారి శుభాకాంక్షలకు... విమర్శలను కూడా అర్హతలుగా మార్చే శక్తి ఉందన్నది నా దృఢ విశ్వాసం.

కొన్నేళ్ల క్రితం, ఒక రచయిత రచనలో నాకు అనేక వాస్తవ దోషాలు కనిపించాయి. నా శ్రమతో కూడిన పరిశోధనకు కృతజ్ఞతలు చెప్పడానికి బదులుగా, అదే పుస్తకం (అది కూడా తప్పులతో నిండినదే) రెండవ ముద్రణ ముందుమాటలో ఆయన నా గురించి "ప్రూఫ్ రీడర్ స్థాయికి దిగజారి..." అని అసహనంతో వ్యాఖ్యానించారు.

ఆ రోజు నుండి ఇప్పటి వరకు, నేను కనీసం డజను పుస్తకాలకు ప్రూఫ్ రీడింగ్ చేశాను. ముద్రణ దోషాలే కాకుండా ఇతర తప్పులను సరిదిద్దుతూ, నాకున్న సమాచారాన్ని పరిజ్ఞానంగా మలచుకునే క్రమంలో నేను ఎంతో నేర్చుకున్నాను.

ఆ అసంతృప్త రచయితను దేవుడు చల్లగా చూడాలి.

డాక్టర్ ఆరుద్ర గారి ఈ పుస్తకం కూడా దీనికి మినహాయింపు కాదు. 'ఆయన వ్యక్తిగత తోటలోని సంపద' వంటివారైన డాక్టర్ కె. రామలక్ష్మి గారు, ఈ పుస్తకాన్ని ప్రచురణకు సిద్ధం చేయడంలో కొన్ని బాధ్యతలు చేపట్టమని నన్ను కోరినప్పుడు, వారి విజ్ఞతకు మరియు నా అదృష్టానికి నేను ఎంతో సంతోషించాను. నాకంటే అర్హత కలిగిన వారు వారికి దొరకవచ్చు.

అది నిజమే కావచ్చు; కానీ అంత అంకితభావం కలిగిన వ్యక్తి? దొరకడం కష్టమే.

నా అంతర్గత అభిరుచులను నెరవేర్చుకునే మార్గాన్ని శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు సూచిస్తే, ఆ కఠినమైన మార్గంలో నన్ను నడిపించింది మాత్రం ఆరుద్ర గారే. కేవలం ప్రోత్సాహంతోనే కాకుండా, తప్పులను వెతికేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని నన్ను హెచ్చరిస్తూ, విమర్శల ద్వారా కూడా ఆయన నన్ను ముందుకు నడిపించారు.

సంస్కృత భాగాలను సరిచేయడానికి నేను డాక్టర్ ఎం. నరసింహాచార్య గారిని సంప్రదించాను. ఏవైనా తప్పులు మిగిలి ఉంటే, దానికి నేనే బాధ్యుడిని. నన్ను సరిదిద్దవచ్చు కానీ, ఎంత మంచి ఉద్దేశం ఉన్నా, నన్ను ఒక పండితుడిగా మార్చలేరు.

ఈ సందర్భంలోనే కాకుండా, నేను మార్గదర్శకత్వం కోరినప్పుడల్లా సహాయం చేసినందుకు వారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. వారి వంటి వారు ఇంకా ఎంతో మంది ఉండాలి.

ఈ ప్రాజెక్టులో డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం గారిని భాగస్వామిని చేయాలని నిర్ణయించింది డాక్టర్ రామలక్ష్మి గారే. భరతముని నిర్దేశించినట్లుగా నాట్య కళ పట్ల అంకితభావానికి నిలువుటద్దంలా నిలిచే ఆమె నా గురువు; నృత్యం, సంగీతం, సాహిత్యం మరియు శిల్పకళల వైభవాన్ని నాకు పరిచయం చేసినవారు ఆమె. ఆమె దృష్టిలో, ఈ ప్రదర్శన కళ అనే అమూల్యమైన వజ్రానికి అవి కేవలం వివిధ కోణాలు మాత్రమే. ఆమె చేసిన సవరణలు చిన్నవే అయినప్పటికీ, పాఠకులకు ఆ విషయాన్ని మరింత సులభంగా అర్థమయ్యేలా చేయడంలో అవి కీలక పాత్ర పోషించాయి.

నిజమే, ఒకవేళ ఆరుద్ర గారు స్వయంగా ఉండి ఉంటే ఇంకా బాగుండేది. కానీ అది సాధ్యం కాదు కాబట్టి, ఆ పరిస్థితులలో మేమందరం మా శాయశక్తులా కృషి చేశామని నాకు నమ్మకం ఉంది.

డాక్టర్ ఆరుద్ర గారి నోట్స్ ఆధారంగా డాక్టర్ రామలక్ష్మి గారు రూపొందించిన ఈ రచనపై నాకు ఎంతో నమ్మకం ఉండేది. ఆరుద్ర గారి అపార పాండిత్యం ఒక దిక్సూచిలా నిలిచి, బ్యాలె (నృత్య నాటిక) అభిమానులను అపోహల నుండి కాపాడాలని, నృత్యకారులకు మరియు గురువులకు వాస్తవ చరిత్రపై అవగాహన కల్పించాలని, అలాగే నాలాంటి సామాన్య పాఠకులను ఆంధ్ర నృత్య విశేషాలతో మంత్రముగ్ధులను చేయాలని నేను ఆశించాను; ఆ ఆశ ఇప్పుడు ఫలించింది.

యశోద ఇంటి ముంగిట వెలిసిన ఆ 'ముత్యం' (శ్రీకృష్ణుడు) మనల్ని ఆశీర్వదించుగాక.

జాతకంలో 12 రకాల కాలసర్ప దోషాలు ఏవి #jathakam #kalasarpa #dosham #astrology #vastu #hindu