ఈగ్రామం కొల్లాపురం తాలూకాలోనిది. చిక్కేపల్లినుండి తమ బాల్యంలో రామచంద్రరావు మరియు వారి సోదరులు చదువుకొఱకు కొల్లాపురం వచ్చే దినాలలో ఈ తెల్లరాళ్ళపల్లె దగ్గరగల ఊరిముందరి వాగు దగ్గర చద్ది తినేవారట. ఈ వాగు దగ్గర ఒక చిన్నగుట్ట దానిక్రింద ఒక మోస్తరు దరిఉంది. దాన్ని చూసినపుడు రామచంద్రరావుగారికి ఆనాడే ఎప్పటికైనా ఈ దరిక్రింద వేంకటేశ్వరస్వామిని ప్రతిష్ఠ చేయవలెనని అనిపించిందట. కనుక ఆబాల్యంనాటి కోరికను ఆయన నడివయస్సులో నాగర్కర్నూలులో పాండురంగ ప్రతిష్ఠచేసిన పిమ్మట తీర్చుకొని అక్కడ వేంకటేశ్వర ప్రతిష్ఠ చేసినాడు. అయితే ఆయన నాగర్కర్నూలులో పాండు రంగని ప్రతిష్ఠచేసిన పిమ్మట శతకం వ్రాయిస్తె, యిక్కడ అట్లాకాక దీన్ని ప్రతిష్ఠ నాటికే వ్రాయించి ముద్రింపించినాడు.
ఈ శతకానికాయన పాండురంగస్వామి ఆలయం ముందే కూర్చుని ఒక కాగితంపై నాకు శతకం వ్రాసిఈయవలసిందని ఆజ్ఞాపత్రం వ్రాసియిచ్చి ఈ శతకం పదేనుదినాలలో కావలె. నేను అక్కడ ప్రతిష్ఠ ఫలానానాడు అనుకు న్నాను కాబట్టి ఆనాటికి పుస్తకాలే రావలెనని అన్నాడు. అదివిని మొదటి శత కానికే ఎంతో తిప్పలయిందిగదా ! పదేనుదినాలే అంటున్నాడు మళ్ళి దీని కెంత తిప్పలౌతుందోనని ఆలోచనలో పడినాను.
ఈనాటికి జాతీయపాఠశాలకు ఇపుడున్న భవనం ఏర్పడింది. అది ఏర్పడిన క్రొత్తలో దాని ఎదురుగా ఈనాటి షాపింగ్కాంప్లెక్స్ వెనుక ఒక చిన్న పార్కు అభివృద్ధిచేయబడింది. అందువల్ల ఆనాడు లీజరుపీరియడులో అధ్యాపుకులు తరచుగా ధూమపానానికి ఆ పార్కులోనే ఉంటుండేవారు. అప్పటికి నేనుగూడ ధూమపాయినే. అందుచేత ఎవరు ఉన్నా లేకున్నా లీజరుపీరియడులో నేను మాత్రం స్టాఫురూముకంటె ఆ పార్కులోనే ఎక్కువగా ఉండేవానిని అపుడు ఊరక కూర్చునే బదులు ఏదైనా పద్యసాధనచేస్తె బాగని ఒక కందం, ఒక తేటగీతి, ఒక సీసం అనేవి సాధనగా పెట్టుకున్నాను.
మొలకమామిడిలో ఉన్నపుడు నేను చాలా పద్యాలే వ్రాసినాను కాని అప్పటికి నాకు ఛందోపరిచయంగాని యతిప్రాసల లక్షణాలుగాని తెలి యవు.శతకపద్యాలు బాగా కంఠతః వచ్చేవి కాబట్టి వానిని బట్టియే నాపద్యం ఎక్కడ కుంటుతుందో తెలిసి అక్కడ పదం మార్చుకునే వానిని. కాని యిపుడట్లాకాదు. ఓరియంటల్ పరీక్షల పుణ్యమా అని ఛందోపరిజ్ఞానం, యతిప్రాసల లక్షణం, అలంకారశాస్త్ర పరిచయం ఏర్పడినవి. కాబట్టి యిప్పటికి ప్రతిపద్యం సలక్ష ణంగానే ఉండేది.
భారతి విధిగా రెండుమÖడుసార్లు చదివేవానిని. ఇంకా యితర పత్రి కలు నేను కొనకున్నా స్టాఫులో ఎవరో ఒకరు ఏదో ఒకటి కొంటూనే ఉండే వారు. దీనికితోడు లైబ్రరీ నాచేతిలో ఉండేది. దినం ఒక క్రొత్తపుస్తకం ఏదైనా చదువవలెననే నియమం ఉండేది కాబట్టి నేను చదివినవానిలో కవితా భావన గల వాక్యాలు లేదా విషయాలు గుర్తుంచుకుని దానిని నేను నియమంగా పెట్టుకున్న కంద గీత సీసాలలో దేనిలో యిమిడితె ఆ విషయం ఆ పద్యంగా వ్రాసికునేవానిని. కందగీతాలు మÖడుపాదాలకే విషయం ముగించేవానిని. నాలుగవపాదం మకుటం కొరకు విడిచినాను. కాలాంతరంలో ఎవరైనా ఏదైనా శతకం కావలెనన్నపుడు వారికి వారు కోరిన మకుటంలో ఈ పద్యాలీయవచ్చు ననుకున్నాను.
సీసాన్ని నాలుగు పెద్దపాదాల పిమ్మట రెండు చిన్నపాదాలలో మాత్రమే ముగించి తక్కిన రెండు మకుటం కొరకు వదలినాను. కనుక చిక్కేపల్లివారి మాటలు విన్న పిమ్మట యింటికి వచ్చి ఆలోచనలోపడగా నా సీసాలు జ్ఞాపకం వచ్చి నవి. కాని అవి దేవతాస్తుతులు కావు పూర్తిగా సామాజికం. అందువల్ల అవి చిక్కేపల్లివారితో అంగీకరింపచేయటం ఎలా? అని మీమాంసలో పడి మిత్రుడు వెల్దండవెంకటరావుగారి దగ్గరకు వెళ్ళి విషయం మొత్తం వివరించి నా దగ్గర కొన్ని పద్యాలున్నవి వినండి. ఇవి వారికి సరిపోతె మకుటంకూర్చి యిస్తానన్నాను. ఆయన ఏదీ వినిపించుమన్నాడు. నేను వినిపించినాను. ఒకరకంగా ఇవి అధిక్షేపాలు. సంఘానికి పెట్టిన చురకలు. వెంకటరావుగారు ఆధునికభావాలు గలవాడు. ఆయనగూడ కవియే. కరణాలను గుఱించి వారి పరిభాషలో ఒక శతకం కరణాలచర్యలన్ని వివరిస్తూ వ్రాసినాడటగాని అది లభించకపోవటం దురదృష్టం. నా పద్యాలు విని ఆయన కొన్నిటికి నవ్వుకొని కొన్నిటికి సంతృప్తిపడి, భేష్ ఈ పద్యాలు బాగానే ఉన్నవి. నేను చిక్కేపల్లివారితో చెప్పి వీని నంగీక రింప చేస్తానన్నాడు. దానితో నాకు కొత్తగా వ్రాసే బెడద తప్ప్పుతున్నందుకు ధైర్యం వచ్చింది. కాని అవి అప్పటికి అరువదిమాత్రమే ఉన్నవి. వెంకటరావుగారు నాకు మాట యిచ్చినట్లుగానే చిక్కేపల్లివారితో లింగమÖర్తి దగ్గర ప్రస్తుతం ఒక శతకం ఉంది. పద్యాలమోఘంగా ఉన్నవి. అని చెప్పగా వారు నన్ను పిలిచిరి. వినిపించటానికి ఒక ఆదివారాన్ని నిర్ణ యించినాడు.
ఆనాడు చిక్కేపల్లివారింటిలో వెంకటరావుగారు, చెరువు రామా రావుగారు, వకీలు నరసింగరావుగారు సమావేశమై కూర్చుండి నన్ను పిలిపిం చగా కాపి తీసికుని వెళ్ళి వారికి వినిపించసాగినాను. వారిలో చెరువు రామారావుగారు ఉర్దూసాహిత్యంలో దిట్ట. రసహృదయం కలవాడు. కనుక నా పద్యాలు విని ఆ పదాలవెనుక ఉండే హాస్యాన్ని లేదా చురకను గమ నిస్తు చాలా బాగున్నవి చాలాబాగున్నవి అని వాహ్వాహ్ అన్నాడు. చిక్కేపల్లి వారు గూడ కొన్నిటికి నవ్వుకున్నారు. అయితె వానిలో నేను కొన్ని పద్యాలలో నీయకులే లంచాలు పడుతున్నారు. త్రాగుతున్నారు. ఇంక సామాన్యుల నెట్లనవలె ` అని చెప్పగా అటువంటివారిని రామచంద్రరావు గారాక్షేపించినారు. నాయకులే లంచగొండులైనారు నిజమే. కాని కాని మీరు అది నిరూపించగలరా ! త్రాగుబోతులు సరేకాని మీరు అదిగూడ నిరూపించి బహిర్గతం చేయగలరా అన్నాడు. అదివిని నేనవాక్కునైనాను. అపుడు వారు నాయకులవంటివారి దుశ్చర్యలు చెప్పవద్దు. సామాన్యజనులవి దుష్టులవి చెప్పవచ్చు కాబట్టి అవి తొలగించండి అన్నారు. నేను సరేనన్నాను. ఒకపెద్ద బరువు తీరి తృప్తిగా శ్వాసపీల్చుకున్నాను.
తరువాత యిల్లు చేరి ఇంక నలువది పద్యాలు కావలసి ఉన్నవి కాబట్టి వేర్వేరు విషయాలపై వ్రాసిన మరోపదేడుండగా వానిని కలుపుకొని తక్కినవి వ్రాసి అన్నీ ఒక్కముఖంచేసి 108 భర్తీచేసినాను. ఎవరైనా నా పుస్తకాన్ని వేయించినపుడు దానిలో వారి వంశాన్ని సమగ్రంగా చెప్పవలెనని నియమం పెట్టుకున్నాను. కనుక అది పాండురంగ శతకంలోనే చెప్పవలసింది. కనుక యిపుడైనా చెబుదామని దాన్ని నేను మళ్ళీ క్రొత్తగా వ్రాయటంకంటె రామచంద్రరావుగారు వెనుకట మందడి వెంకటకృష్ణకవిప పాండురంగభక్తవిజయం వ్రాయగా దాని ముద్రణ కానాడు 116/` లు యిచ్చినాడు కనుక ఆయన దానిలో అప్పటివరకు వర్ధిల్లిన రామచంద్రరావువంశాన్ని వర్ణించినాడు. నేను ఇది తెలసి దాన్ని సంపాదించి దానిలోనుండి రామచంద్రరావు వంశాన్ని ఉద్ధరించుకుని దాని తరువాయిగా ‘అనంతరాభ్యుదయం’ అనే పేరున ఆ వంశాన్ని శతకకాలంవరకు పూర్తిచేసి వారికీయగా వారు దాన్ని హైదరాబాదుకు కొనివెళ్ళి ఈ పర్యాయం వాన మామలై వరదాచార్యులతో పీఠిక వ్రాయించి శ్రీ ఎస్.వి. రామారావుగారు అప్పటికొక అచ్చుశాల నడుపుతుండగా దానిలో ముద్రణకు యిచ్చినాడు. ప్రతిష్ఠనాటికి పీఠికతప్ప విషయమంతా ముద్రణయింది. కాబట్టి ఆయన ఒకిరువది ముప్పది కాపీలు బైండుచేయించి యిచ్చినాడు. ఇట్లా మొదటిసారిగా నా పుస్తకం ఒకటి వారిచేతుల మీదుగా ముద్రణ జరిగి నేనెవరో రామారావుగారికి, నేనూ, నా చదువు తెలిసివచ్చింది.
రామచంద్రరావుగారు స్వామిప్రతిష్ఠనాడు నన్ను తోడ్కొని వెళ్ళినాడు. కొల్లాపురం లక్క్ష్మణాచార్యులు ప్రతిష్ఠాకార్యక్రమం నిర్వహించినారు. సాయం కాలం కావచ్చింది. అపుడు పుస్తకాలు స్వామి ముందుంచి పూజచేయించి లాంఛనంగా అక్కడనే ఆవిష్కరణ జరిపించినారు. ఇది జరిగిన అనంతరం అక్కడ శ్రీమాన్ రామారావుగారి ప్రెస్ ఏదో పేచీలోపడి పుస్తకా లాగిపోయినవి. నాలుగైదేండ్లు గడిచిన పిమ్మట వారు ప్రెస్ను అమ్మివేస్తూ తెల్లరాళ్ళపల్లి శతకం పాఠాలన్ని పుస్తకాలుగా బైండుచేయించి వానితోపాటు పోయింది అనుకున్న వానమామలైగారి పీఠినుగూడ మళ్ళీ భద్రంగా పంపినారు. ఈ తరువాత కీ.శ.1999 లో సీతారామచంద్రరావుగారి తండ్రిగారి శతజయంతి జరిపి పాండురంగ విఠ్ఠలశతకం, తెల్లరాళ్ళపల్లి తిరుమలేశ శతకం రెండు కలిపి ఒక్కటిగా ముద్రింపించినారు. అపుడు నేను దానిలో శ్రీమాన్ వానమామలవారి పీఠికను చేర్చినాను.