మొత్తం పేజీ వీక్షణలు

27, జులై 2026, సోమవారం

మల్లీశ్వరి సినిమా గొప్పతనం....

మల్లాది రామకృష్ణ శాస్త్రిగారన్నట్లు తెలుగు వారి ఇలవేలుపు సిగపాయ చేనంది చిడిముడి చేసే దివ్యమందహాసుడు  తిరుమలగిరివాసుడు. ఆంధ్రులకు చారిత్రాత్మక వ్యక్తులలో మహితాత్ముడు, మహోన్నతుడు శ్రీకృష్ణదేవరాయలు. అలాగే తెనుగువారి కళలెరిగిన వారికి, తెలుగు సినిమాలు చూసేవారికి “మల్లీశ్వరి” ఒక భవ్యానుభవం.

ఈ పరమపదం ఏ పూజ వలన సిద్ధించింది? సాహిత్యారాధన వలనా? నటనాభిషేకం వలనా? పాటల నోములతోనా? దర్శకత్వార్చనతోనా? కారణమే నాట్య నీరాజనం? ఏ కళాచందన చర్చ!

ఏ ఒక్కటీ కాదు. హృదయానికి హత్తుకొనే కథ, కథనం.  మల్లెపూరేకు బరువుతూగినా, అవసరాన మొగలి ఆకులా కోయగల మాటా, పాటా. నవభావాలను నవరసాలుగా చూపించిన నాట్య సంవిధానం. సన్నివేశానికి తగిన ధూపమైన సంగీతం. సాంబ్రాణి పరిమళంలా జ్ఞాపకాలలో పరివ్యాపించే సంగీతం. సంవత్సరాలు జరిగినా పట్టు సడలించని సంగీతం. సాధారణమనిపించక, సహజమనిపించే నటన. సాత్త్వికమైన నటన. ఆ కాలాన్ని, ఆ ప్రాంతాన్ని, ఆ జీవన విధానాన్ని కళ్లముందు నిలబెట్టే కళా దర్శకత్వం. నలుపు తెలుపుల్లో వెలుగు నీడలను చిత్రకారుని రంగుల్లా చూపిన ఛాయాగ్రహణం. గుళ్లలో  పావురాల కువకువలూ, పాడుబడిన సత్రాల్లో వలిపిరీ, తుంపర చినుకు పుణుకులూ, గుండెల్లోని వెక్కిళ్లూ, చూపులలోని కన్నీళ్లూ, కలవరమÖ, ఎదురుచూపుల్లోని సంకోచమÖ, ఆనందమÖ, మంగళ  తూర్యారవాలూ, తెగించిన బావ పట్టుబడిపోతాడేమో నన్న భయంతో గుండె చేసే చప్ప్పుళ్లూ, యింటివైపు పరుగులెత్తే పొగరుబోతు గిత్తల మెడగంటల సవ్వళ్లూ చెవులకు కట్టి మనసులో నిల్పిన శబ్దగ్రహణమÖ.

ఆంధ్రుని హృదయంలో “మల్లీశ్వరి” అధిష్టించిన సింహాసనానికి పైవన్నీ కారణాలే కాబట్టి “మల్లీశ్వరి” సినిమా నవలను నలభై యేళ్ల తరువాత తీసుకువచ్చే sTÖ ప్రయత్నం. విజయచిత్రలో ధారావాహికంగా వచ్చినప్ప్పుడు  వేలాది పాఠకులు చదివినదే. అయినా పుస్తకరూపంలో తేవడంలో ఒక పరమార్థమున్నది.

“మల్లీశ్వరి” గొప్పతనం తెలుసుకోవడానికి ఆ చిత్రం చూడటం ముఖ్యం . తెరమీద కాకపోయినా యింట్లో, విరివిగా విడియో సౌకర్యాలున్న sTÖ రోజుల్లో అదేమంత కష్టంకాదు. అయితే సినిమా దర్శకుడు నిర్ణయించిన ‘వడి’ తోనే నడుస్తుంది. నింపాదిగా నడపలేము. సినిమా నవల అలా కాదు  కావలసిన భాగం కావలసినన్ని మార్లు అవసరానికి తగిన పద్ధతిలో చదువుకోగలం. ఆ స్మృతులను మళ్లీ మళ్లీ నెమరు వేసుకుని దాని రసం తిరిగి తిరిగి ఆస్వాదించగలం. పుస్తకం అందుబాటులో ఉన్నట్లు వీడియో ఉండదు. వీడియోకున్న దృశ్యగుణం పుస్తకానికి లేదు. కాని రెండు మÖడు మార్లు సినిమా చూసుకున్న తరువాత నవల చదువుతుంటే మన జ్ఞాపకాలే మనోయవనికపై ఆ చిత్రాన్ని ప్రదర్శింపచేస్తాయి.

భారతదేశంలో యిన్ని సినిమాలు వచ్చినా, తెలుగులో యిన్ని సినిమాలు తీయబడినా వాటి డాక్యుమెంటేషన్ (విషయ సమీకరణ) గురించి ఎవరూ మొదట్లో పట్టించుకోలేదు. ఇటీవలి కాలంలో తెలుగులోనూ, ఆంగ్లంలోనూ రకరకాల పుస్తకాలు - ఎన్‌సైక్లోపీడియాల నుంచి ఆత్మకథలూ, కళాకారుల జీవితాలూ, అలనాటి చిత్రాల కొలుపులూ - వచ్చినా వాటిలో వాస్తవాలకంటె కల్పనలూ, ఉన్నదానికంటే ఊహా గానాలూ, కథలు చెప్పడంలో కకావికలూ పలికి చదువరినీ, ప్రేక్షకుడినీ, సినిమా అభిమానినీ, పరిశోధకునీ వెతలు పెట్టే కట్టుకతలైనవి. అన్నీనా అని అడిగితే కబళం అన్నాన్ని తినరానిదిగా చేయడానికి అయిదు బెడ్డలూ పదిరాళ్లూ చాలవూ?

సమగ్రత, నిర్దుష్టత అన్నవి అన్ని వేళలా అందరికీ సాధ్యంకావు. నిజం. ఈ ప్రయత్నంలోనూ లోపాలుండవచ్చు. “మల్లీశ్వరి”లోనూ ఉన్నవి (ఒకటి ‘మనసున మల్లెలు’ దృశ్యంలో ఎన్నిజాములు గడిచినా చంద్రుడొకడే చోట ఉండటం). ఉన్నవి చంద్రుని కళంకమాత్రంగానే, వెన్నెల తగ్గించని మోతాదులోనే ఉన్నవని నమ్మకం, ఆశయం.

“మల్లీశ్వరి” కథ మÖలం ఎక్కడిదని ఆలోచించాలి. చిత్రం క్రెడిట్స్‌లో, పాటల పుస్తకంలో, ఆనాడు పాత్రికేయులతో బి.ఎన్.రెడ్డి జరిపిన సమావేశాలలో దీని గురించి ఏ వివరమÖ యివ్వబడలేదు. 1964లో ప్రచురింపబడిన బుచ్చిబాబు నాటికలన్న పుస్తకంలో (విశ్వవాణి పబ్లికేషన్స్, విజయవాడ - 520 002  రూ. 2.50లు) నాలుగింటిలో మొదట యివ్వబడిన ‘రాయలవారి కరుణకృత్య’మనే నాటికకు పరిచయంగా ఇలా అన్నారు “ఈ నాటికలో యితివృత్తానికి మల్లీశ్వరి యితివృత్తానికి కొన్ని పోలికలు కనబడవచ్చు. ఈ నాటిక ‘భారతి’లో ప్రచురింపబడిన ఏడెనిమిది సంవత్సరాలకా చిత్రం విడుదలైందని పాఠకులు గుర్తుంచుకుంటే చాలు!”

ఈ విషయం రాండార్ గై ఏళ్ల తరువాత బి.ఎన్. గురించి వ్రాసిన మోనోగ్రాఫ్ (నేషనల్ ఫిల్మ్ ఆర్కైన్ ఆఫ్ ఇండియా, 1985, రూ. 30.00లు)లో ప్రస్తావించారు. కాని బి.ఎన్. దాని గురించి ఏమని వ్యాఖ్యానించారో దాఖలా లేదు.

మరొక చిన్న పిట్ట కథ. మద్రాసులో అనుకొంటాను ఒక యిరవైఏళ్ల క్రితం విజయనగరం వాస్తవ్యులు కుమ్మరి మాస్టారు ‘మల్లీశ్వరి’ కథ చెప్పారు. అందులో ‘పిలిచిన బిగువటరా’ పాటనొక్కదానినే పాడారు. తరువాత వెళ్లి అడిగితే - తక్కినవి పాడలేదేమన్న ధ్వనితో - ‘అంతకు ముందున్న కథే కదా!’ అన్నారు. దీని బట్టి నాకర్థమైనదేమిటంటే, సినిమాకు పూర్వం, బహుశ్ణ బుచ్చిబాబు నాటికకు పూర్వం sTÖ ప్రధానాంశం - శిల్పి ప్రేయసి రాయలవారి కొలువుకి పిలువబడటం, దొంగతనంగా యిద్దరూ కలుసుకొని పట్టుబడటం - ‘కళాప్రియులూ కరుణా సముద్రులూ అయిన రాయలవారి వాళ్లను క్షమించి వదిలివేయడం’ ప్రజలలో ఉందని తెలుస్తున్నది.

ఎలా? ఎక్కడ !! ఇవి sTÖ రెండు కథల గురించి పరిశోధనాంశాలే. ఒకటి మాత్రం చరిత్రకారులు సూత్రప్రాయంగా అంగీకరించిందే. అందమైన అమ్మాయిలను తమ ఆటవస్తువులుగా తెప్పించుకొని జనానాలలో జాగ్రత్త చేయడం ఎందరో రాజులు చేసిందే. ఇలా కృష్ణదేవరాయల గురించి చూపడం బాగుండదని చేయవలసిన మార్పు చేశారు.

ఇదంతా చెప్పడానికి కారణమొక్కటే. కాదేదీ పరిశోధన కనర్హం. ముఖ్యంగా యిలాటి చిత్రాల మÖలాలు తెలుసుకోవడం ఒక విధంగా చరిత్రాధ్యయనం చేయడమే.

శ్రీ రావి కొండలరావు రా.కు.మారుడుగా, నాటక కర్త - ప్రయోక్త - నటునిగా, పాత విషయాలను ఒళ్లు దగ్గర పెట్టుకొని తిరిగితోడే ఫిలిం జర్నలిస్టుగా, సినిమా సంభాషణల రచయితగా, స్నేహితునిగా నాకు తెలుసు. ఆయన నాటకాలలో నేను ఒకటిన్నర నిమిషాల వేషాల్లో నటించినప్పటి నుంచీ ఆయన కార్యతత్పరతంటే నాకు గౌరవం, అభిమానం. బహుశా అంతర్గతంగా పింగళి మాటల్లో కించి దీసునసూయలు కూడా!

ఈ పని జరుగుతున్నదంటే ఎంతో సంతోషించాను. ఇది యింతటితో ఆగకూడదు. విజయచిత్రలో వచ్చిన నవలీకరణలన్నీ యిలా పుస్తకాలుగా రావాలి. తెలుగు సినిమా చరిత్ర sTÖ మేరకింకా పటిష్టం కావాలి. ఆ చిత్రరాజాల్లో ఉన్న గుణరాసి తెలుగు తెలిసిన వారందరికీ చేతికందే చేమంతి, దిండుప్రక్క మల్లెచెండూ, ప్రియదూతిక తెచ్చిన కప్ప్పుర విడెమÖ కావాలి.

ఇలాగే “రేచుక్కా” “రాజునందినీ” “చిరంజీవులూ” రావి కొండలరావు తెస్తే అటు తెలుగు సినిమా సాహిత్యానికి మకుటాభిషేకమÖ నాకు కనకాభిషేకమÖ! త్వరలోనే ఆరోజు రావాలి. రప్పించేవారు మీరే! కొని చదివేవారు!!

సెన్సార్ బోర్డు సర్టిఫికెట్లు ఎన్ని రకాలుగా ఉంటాయి #cinema #certificates #censor #cbfc #censorboard #film


 

26, జులై 2026, ఆదివారం

పరాజయం పాలైన నాగార్జున సినిమాలు ఏవి #akkineni #nagarjuna #utterflop #flopmovies #disaster #movies #part 2


 

కాలసర్ప దోషం వల్ల కలిగే ఇబ్బందులు ఏమిటి #kalasarpa #dosham #effects #pariharam #results #jathakam #astrology #hindu


 

జాళ్ళపాలెం బ్రహ్మయానందుల పరమానంద భారతం

బ్రహ్మానందం పరమ సుఖదం

పూర్వం పల్లెటూళ్లలో విశ్వకర్మలను ఒజులు లేదా బ్రహ్మయగార్లు అని వ్యవహరించేవారు. ఇది జార్లపాలెంలో నివసించినటువంటి ఒక బ్రహ్మయగారి చరిత్ర.

ఆంధ్రదేశంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రుని గురించి విననివారు, తెలియనివారు ఉండరు. ఆయన చరిత్ర అంటే నిరాకారమైన బ్రహ్మం సాకారమై ‘దైవం మానుషరూపేణా’ అన్నట్లు కలియుగంలో, భూలోకంలో అవతరించి కందిమల్లయపల్లెలో కాపురం చేసిన చరిత్ర. అతని పిమ్మట మళ్ళీ అది సంపూర్తి నామధేయంతో కాకపోయినా బ్రహ్మనామాంకితుడై వెలసిన మీVAన్నతుడు ఈ జార్లపాలెం బ్రహ్మయానంద స్వాములవారు.

ఈయన చరిత్రను మొదట ఒక చిన్న పుస్తకంగా తెచ్చినవాడు శ్రీ గోనుగుంట బ్రహ్మయ్యగారు. అది నాసికా త్య్రయంబకంలోని గోదావరి కాగా ఇపుడీ విభావసుగారు రచించిన పరమానంద భారతం ధవళేశ్వరం దగ్గర గోదావరిలా పొంగి పరవళ్ళు తొక్కుతుంది. ఈ చరిత్రకు ఫణిదపు ప్రభాకరశర్మ సూతమునీశ్వరుపాత్ర పోషింపగా జలదుర్గం జగన్నాథచక్రవర్తిగారు కుటుంబ సభ్యులు సూతశౌనకులుగా ఉన్నారు.

శ్రీ ప్రభాకరశర్మగారు ఇంతవరకు యజ్ఞోపవీతం కథ, విశ్వబ్రాహ్మణ గోత్రగాయత్రి, వీరగురునిభారతం, విశ్వకర్మభారతం, సిద్ధయోగి ప్రసిద్ధ భారతం ఈశ్వరీ అమ్మవారి పవిత్రభారతం, గోవిందమాంబా అమ్మవారి ప్రశస్తభారతం, విశ్వకర్మ విజ్ఞాన భారతం, కందుకూరి జడల పిచ్చయానందుల ఆనంద భారతం అను పలువిధాల కృతులు వెలయించి బహుభారత బ్రహ్మగా సుప్రసిద్దులైనారు. కనుక వానివల్ల వీరి విశ్వకర్మలచరిత్రలు యజ్ఞోపవీత కథవల్ల యాజుషప్రయోగవిశేషాలు కొట్టినపిండిగా ఉన్నవి. కనుక అవే ప్రస్తుత బ్రహ్మయానందుల చరిత్రకు  నేపథ్యమైనవి.

రచనారంగంలో కవిత్వం, పద్యం, గద్యం, గేయం అని త్రిపథగా ఉన్నా గద్యాన్ని లాక్షణికులు కవిత్వంగా అంగీకరించలేదు కాని గద్యం కవీనాం నికషం వదంతి గద్యమే కవికి గీటురాయిగా ఉంది.

పద్యకవిత ఆశు, బంధ, చిత్ర, గర్భ కవిత్వాలని నాలుగు విధాలుగా 

ఉంది. దానిలో మళ్లీ ఆశువు మధుర, విస్తర, వస్తుకవిత లని మÖడు 

విభాగాలుగా విభజించడం జరిగింది. ఈనాడు సంకీర్త£నా సాహిత్యమంతా మధురకవితా శాఖకు చెందగా కావ్యంలోని అష్టాదశ వర్ణనలలో దేన్ని ఎత్తుకున్నా అది సాంగోపాంగంగా వివరించటం వస్తుకవిత అని అట్లా కాక ప్రధాన కవితనే వివిథో పకథలతో విస్తరించుకొని పోవటాన్ని విస్తరకవిత అంటున్నారు.

ఈనాడీ విస్తరణ కవితకు సంస్కృతంలో బాణుని కాదంబరి, తెలుగులో పింగళిసూరన కళాపూర్ణోదయం ఉదాహరణలుగా ఉన్నవి. ఆధునికులు గద్య రూపంలో ఈ విస్తరకవితనే ఇపుడు బహుళ ప్రచారంలోనికి తెచ్చినారు. తమిళులిపుడు దీన్ని ‘కదంబరి’ అని అనగా హిందీ వారు “పన్సాల” అంటున్నారు. తెలుగులో దీన్ని కాశీభట్టబ్రహ్మయ్యగారు ‘నవల’ అన్నారు. నవల అంటే నూతనత్వాన్ని కొని తెచ్చింది అని అర్థం. ఇక ఇపుడు చరిత్రలైనా, ఊహాచిత్రాలైనా అన్నీ ఈ మార్గంలోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నవి. అందులో ఇపుడు మిత్రులు బ్రహ్మశ్రీప్రభాకరశాస్త్రిగారి బ్రహ్మయభారతం గూడ చేరుతుంది. ఇందులో కొన్ని పాత్రలు అవసరాన్ని బట్టి కల్పించినా ఇది కల్పితకథగా గాక వాస్తవ చరిత్రగానే ఉంది.

ఈ బ్రహ్మయ్యగారు షిర్డీబాబాగారి పిమ్మట రెండు సంవత్సరాలకు పుట్టినా వారికంటే మÖడు సంవత్సరాల మొదలే మహాసమాధిని పొందినారు. శ్రీ ప్రభాకరశర్మగారు షిర్డీబాబాగారి భక్తుడు. అందువల్ల బ్రహ్మయ్యగారి కాలసమన్వయంలో వీరు షిర్డీబాబాగారిని గూడ స్మరించినారు. ఈ బాబాగారు ప్రపంచ ప్రథమ సంగ్రామకాలంలో జనించి ఆ సంగ్రామం క్రీ.శ. 1914లో ఆరంభమై 1918లో ముగిసింది. అనుక ఆ పిమ్మట వీరు అదే సంవత్సరంలో మహాసమాధిని చెందినారు.

ఈ సంవత్సరంలో శర్మగారు బ్రహ్మయ్యగారి జననం మరియు సమాధి కాలాన్ని చెబుతూ కాలసమన్వయంలో షిర్డీబాబాగారిని పేర్కొని వారు జన్మించింది ప్రపంచ ప్రథమ సంగ్రామం కంటే మొదలే కాబట్టి అప్పటి కాల పరిస్థితిని వివరిస్తూ బ్రిటిషువారి పాలనా విధానాన్ని ఆనాటి సంఘంలో సామాన్యుల జీవితం మరియు పంచదాయిలజీవితం గూడ ఈ చరిత్రానుబందంగా వీరికి వివరించివలసి వచ్చింది.

నాలోను, ఈ ప్రభాకరశర్మగారిలోనూ ఒక దుర్గుణముంది. రచనా వస్తువును గ్రహించిన పిమ్మట దాని సమగ్రత కొరకని వివిధ విషయాలు దానిలో ప్రవేశపెడుతూ విస్తరిస్తూపోతామే కాని సంక్షిప్తతకు అలవాటుపడలేదు. కనుక కథాగమనం కోరే పాఠకులకు మాత్రం ఇది కొంత విసుగుదలను కలిగించవచ్చు. మేం కలం పట్టుకున్న తర్వాత ఎంతదూరం పరుగెత్తుతామో, ఎక్కడ ఆగుతామో తెలియదు కనుక మా పాఠకులు మాత్రం మాయొక్క ఈ అతనితప ఓపికకు పరీక్ష పెడుతున్నందుకు మన్నించవలె.

ఈ పవిత్ర భారతానికి రచనా సంకల్పనాంతరం శ్రీ శర్మగారికి జలదుర్గం చక్రవర్తిగారు లభించటం ఒక విశేష పరిణామం. అది ఆ బ్రహ్మయానందుల సంకల్పమే తప్ప అన్యం కాదు. రచనలో బ్రహ్మయానందుల పట్ల శర్మగారికున్న భక్తిప్రపత్తులు అడుగడుగున వ్యక్తమవుతూనే ఉన్నవి. ఈ చక్రవర్తిగారివల్ల పాఠకులకు శ్రీ బ్రహ్మయ్యానందుల గారి ఆత్మకథ సాకల్యంగా వినే చదివే అవకాశం లభించింది.

శ్రీ ప్రభాకరశర్మగారే ఇందులో మహాభారతం కురుక్షేత్రమాచార్యులుగా అవతారమెత్తారని అంటే అతిశయోక్తి కాదు. శ్రీ ప్రభాకరశర్మగారు ఇంతవరకే బహు భారత బ్రహ్మలు కనుక వారి భారత మణిహారానికి ఇది మరో చేర్పుగా ఉంది. అంతేగాక ఇది మహాభారతాన్ని గురించి “యన్న భారతేతన్న భారతే” అనే సూక్తికి విశ్వకర్మల సంస్కృతి విషయంలో సార్థకంగా ఉంది.

రచనా విషయంలో శర్మగారిని అడుగవలసినపనిలేదు. కథానుగమనంలో గాని దాని తీర్పులోగాని చేయి తిరిగిన కళాకారుడుగా 

ఉన్నాడు. వీరి రచనలో ప్రతిదానిలో ఆనాటి సాంఘికచరిత్ర ఎంతో కొంత పాఠకులకు తెలిసి ప్రాచీన సంస్కృతీసుముఖులను చేస్తుంది. ఇది వీరి కలానికి గల ఒక ప్రత్యేకత. 

కనుక సామాన్యమైన ఒక సాంసారిక జీవితం గడిపి తన యోగసాధనలో జన్మను చరితార్థం చేసుకున్న ఈ బ్రహ్మయానందుల పరమానంద భారతం  శ్రీ విభావసుగారు తనయొక్క లేఖినీమÖలంగా భారతభారతీగభస్తి గౌరవం కలిగించినందుకు వారికి నాపైగల అవ్యాజమైన ఆత్మీయతకు శర్మాజీ అభినందిస్తు, ఆశీర్వదిస్తున్నాను.

భారతీయుని సంస్కృతి ప్రతిఫలించు

బ్రహ్మయానంద వర్యుని భారతంబు

పవలు రేలును చదివెడి మానవులకు

అమృతపదమందు నిస్సంశయంబుగాను