మొత్తం పేజీ వీక్షణలు

19, జూన్ 2026, శుక్రవారం

ఆధునిక కవిత్వం - ఆధునికతకు చిరునామా

 ఆధునికతకు చిరునామా 

ఈ ఇరవయ్యో శతాబ్దం వివిధ అధ్యయన రంగాల్లో తీసుకొచ్చిన క్రాంతి అంతా ఇంతా కాదు. వివిధ శాస్త్రాల్లోను కళల్లోను అధ్యయన రంగాలన్నింటా గత శతాబ్దాలన్నీ కలసి తీసుకొచ్చిన పరిణామానికి ఎన్నో రెట్లు మార్పులు ఊహకందనంత సంకీర్ణంగా వచ్చి విరుచుక పడ్డాయి. క్షణానికో శకటాధిక గ్రంథసంచయం కొత్త కొత్త సిద్ధాంతాలతో మార్గాలతో బయటికొస్తోంది. ఈ పరిస్థితిలో ఆంధ్ర సాహిత్యాధ్యయన రంగంలో అధ్యేతల సమస్యలు మిగతా ప్రపంచంలోని అధ్యేతల సమస్యలకంటే ఏమీ భిన్నంగా లేవు. అయితే ఆంధ్ర సాహిత్యాధ్యయన రంగంలో అన్వేషింప బడుతున్న కొత్త సిద్ధాంతాలు, మార్గాల సంఖ్య, దానికి సంబంధించిన గ్రంథాల సంఖ్య మాత్రం తగినంతగా లేదు. ఈ వ్యాసం సాహిత్య పరిశోధనలో ఇలాంటి ఓ నవ్య పథాన్ని వెతుక్కునే ఒక చిరుత ప్రయత్నం. 

ఆధునిక యుగంలో ప్రపంచమంతటా వచ్చిన మార్పులు తెలుగు కవిత్వంలో ప్రతిబింబంచి, ఆధునిక కవిత్వం అవతరించింది. ఆధునిక యుగ పరిణామాలు, కవిత్వంలో వైచిత్రికి నూతనతకి ఆధారమై కవిత్వ రంగంలోను, విమర్శ రంగంలోను అత్యంత వైవిధ్యాన్ని సాధించి పెట్టాయి. ఆధునికత అన్నది అస్పష్టంగా వాడబడుతున్న అనేక పదాలలో ఒకటి. అందుకే ముందుగా ఆధునిక శబ్ద పరిశీలన చేసి ఆ తర్వాత ఆధునిక యుగంలో వచ్చిన ప్రధానమైన మార్పుల్ని వివరిస్తాను. 

ఆధునిక కవిత్వం అంటే: 

ఆధునిక అన్న పదాన్ని కాలవాచిగానే కాక సంప్రదాయ భిన్నమైనది అనే అర్థంలో కూడా వాడడం కనిపిస్తుంది. ఆధునికతకి పర్యాయంగా నవ్యత అని కూడా ప్రయోగంలో ఉంది. అయితే ఈ రెండు పదాల మధ్య అర్థం లోని వ్యత్యాసం కూడా గమనించాలి. నవ్యతని రీతికి సంబంధించిన అర్థంలో వాడుతూ, వర్తమాన కాలానికి మాత్రమే పరిమితం కానిదని డా. సి. నారాయణ రెడ్డి, ప్రాచీనాంధ్ర కవిత్వం, నవీనరీతులు ఆయా కాలాల్లో తమ పూర్వులకు సాపేక్షంగా కవులు పాటించిన నూతనత్వాన్ని వివరించారు. 

వెల్చేరు నారాయణ రావుగారు ఆధునికతను తాత్త్వికారంలోను, నవ్యతను రీత్యార్థంలోను గ్రహించారు. 

ఆధునికత యుగ ధర్మం నవ్యత వ్యక్తినిష్టం. ఆధునికతలో నవ్యత అంతర్భాగం. ఆధునికత ఒక్కటే అందులో అనేక విధాల నవ్యతలు ఉండవచ్చు. ఈ రెండు పదాలకి వర్తమాన యుగానికి సంబంధించిన, అనే (కాల పరిమితి ఉంది) 

యుగధర్మం ప్రాచీన యుగానికీ ఆధునిక యుగానికీ భేదిస్తుంది. ప్రాచీన సాహిత్యం మత పరమైన నమ్మకాలతో రాచరిక వ్యవస్థలో నిర్మించబడింది. వ్యక్తిపరమైన అస్తిత్వం ఆధారంగా వ్యక్తి స్వేచ్ఛ ఊపిరిగా భావనలో హేతుబద్ధత పునాదిగా అవతరించింది ఆధునిక కవిత్వం. 

“సృష్టిలో, సృష్ట్యాదినుండి కాల నిర్ణయంలో భిన్న రాజ చరిత్ర నిర్ణయంలో, సంఘధర్మ నీతులలో ఆర్థిక రాజకీయాల్లో సారస్వత పథాలలో ఒక విశిష్టమైన సంస్కారంతో కూడిన సిద్ధాంతాలమీద మన జాతి నడిచింది. ఇవ్వాళ అంగిలేయులు మనల్ని ఆక్రమించడం చేత మహా సంస్కారం మీద అభిమానం పోయింది. పాశ్చాత్య దేశీయులు సంస్కారం మీద అభిమానం ప్రబలింది. ఏతభిమాన పురస్కృతములైన భాషాతత్త్వం, చరిత్ర నిర్మాణం, సృష్ట్యాది కాల నిర్ణయం. సంఘధర్మాలు విశ్వాసాలు, వాటిని యేయే గ్రంథం పరామర్శిస్తుందో అదంతా నవ్య సాహిత్యం”. 

ఆధునికత అన్నది, ఏదో ఒక్క విలువ బట్టి నిర్ణయించలేమని ఈ విభిన్న అభిప్రాయాలవల్ల తేలుతోంది. అందువల్ల ఆధునికత అన్నది కొన్ని సాధారణ లక్షణాలు సమాహారంగా భావించి, అందుకు సమకాలీనతని కూడా జోడించినట్లయితే, మరిన్ని సమస్యలు పరిష్కరింపబడతాయి. 

అంతవరకూ ఉన్న కవితా సంప్రదాయాన్ని వ్యతిరేకించిగానీ, స్వీకరించిగాని, కొన్ని నూతన లభణాలను సంవదించుకుంటూ, కవి రచన సాగిస్తాడు. ఆ తరువాత అతని మార్గం సన్మార్గం అయితే) ప్రాచుర్యాన్ని పొంది సంప్రదాయమౌతుంది. అంతకు ముందున్న కవితా సంప్రదాయానికన్నా భిన్నతనూ వినూత్నతనూ కలిగి ఉన్న కారణంగా అది ఆధునిక కవిత్వంగా భావింపబడుతుంది. ఈ దృష్టితో చూచినట్లయితే, ప్రాచీన కవిత్వం కంటే భావ కవిత్వం ఆధునిక కవిత్వం అవుతుంది. అంతకు ముందున్న కవితా సంప్రదాయానికన్నా భిన్నతనూ వినూత్నతను కలిగి ఉన్న కారణంగగా అది ఆధునిక కవిత్వంగా భావించబడుతుంది. ఈ దృష్టితో చూచినట్లయితే, ప్రాచీన కవిత్వం కంటే భావ కవిత్వం ఆధునిక కవిత్వం అవుతుంది. భావ కవిత్వం తరువాత వస్తు, భావ రచనా పరంగా వినూత్నతని సంతరించుకున్న అభ్యుదయ కవిత్వం ఎక్కవగా ప్రజాదరణ పొందింది. ఆధునికతని వ్యక్తి స్వేచ్చగా భావకవువలు భావిస్తే, సమాజం నుండి వేరైన వ్యక్తిస్వేచ్ఛ ఉండబోదని అభ్యుదయ కవులు కవిత్వాన్ని సమాజపరం చేసారు. సమాజ ప్రతిఫలనమే ఆధునిక యుగలక్షణమే భాసించింది. 

అధిక సంఖ్యాకులు గురజాడ ఆధునిక కవిత్వం ఆరంభమైందని అభిప్రాయపడినా, అది ఒక ఒరవడిని సాధించింది. అభ్యుదయ కవిత్వంలోనేనని విశ్వసించారు. ఆధునిక కవిత్వం గురజాడతో ప్రారంభమైనా ఉద్యమ స్ఫూర్తి నందుకొని ప్రవాహంలో అనేక ధోరణులను తనలో కలుపుకుంటూ సాగిపోయింది అభ్యుదయ కవిత్వంలోనే. అలా బయల్దేరిన అభ్యుదయ కవిత్వం ఎన్నెన్నో మలుపులు తిరిగి, ప్రతి మలుపులో ఒక వైచిత్రిని, నూత్నతని సంతరించుకని క్రొత్త క్రొత్త పోకడలు పోయింది. మొత్తంగా చూస్తే ఆధునిక కవిత్వం అంతటా ఒక మÖల సూత్రం పూసల్లో దారంలా సాగడం చూడవచ్చు. త్వరితగతిని మారిపోతున్న సామాజిక పరిస్థితులు కలిగించిన అవసరాలు, రగిలించిన నూత్న అభిరుచులు, కవిత్వ కవులలో ఒకానొక వైచిత్రీ, అభివ్యక్తిలో, ప్రియత్వానికి కారణమయ్యాయి. అవే ఆధునిక కవిత్వం అతంటా ప్రస్ఫురించే ఆధునికత. 

ఎట్లావచ్చిందీ ఆధునికత: 

సమకాలీనంగా జాతీయంగా అంతర్జాతీయంగా జరిగిన పోరాటాలు, పరిణామాలు, వ్యక్తి జీవనంలో తెచ్చిన పరిణామాలు, ఆధునిక కవిత్వానికి, అందులోని అనేక ధోరణులకు ఏర్పరచిన భూమికను పరిశీలించడం అనావశ్యకం కాదు. 

అధునిక దృక్పథంలో వచ్చిన మార్పు ఆధునిక కవిత్వంలో ప్రతిఫలించింది. ఆధునికంగా సంఘంలో ఇహాన్ని గురించిన ఆలోచన పెరిగి, పరాన్ని గురించిన ఆలోచన క్రమంగా తగ్గడం మొదలు పెట్టింది. ఇది ప్రజలతో అప్పుడప్పుడే ఏర్పడుతున్న భౌతిక వాద దృక్పథానికి నిదర్శన. ఫలితంగా వర్ణ వ్యవస్థకి వ్యతిరేకంగా మతంక సంబంధంలేని నూతన మానవతా వాదం తలెత్తింది. జన్మనిభ్య విలువనిచ్చే విధానం పోయి, మనిషిని మనిషిగా చూసే మానవతా దృక్పథం ఏర్పడ సాగింది. 

ఈ విధంగా ఏర్పడిన మానవతా దృష్టికి, పాశ్చాత్య దేశాలలో వచ్చిన సాంస్కృతిక పునరుజ్జీవనం ఆధారం. 1740లో వచ్చిన పారిశ్రామిక విప్లవం, పాశ్చాత్య నాగరికతలో సాహిత్య కళారంగాల ఎన్నో మార్పులను తెచ్చి పెట్టింది. అయితే ఈ మార్పులు ఆంధ్రదేశంలో ప్రతిఫలించడానికి ఆనాడు అటువంటి పరిస్థితులు ఇక్కడ లేకపోవడమే కారణం. బ్రిటీషువారు ప్రవేశపెట్టిన ఆం విద్యాబోధన దేశంలో మధ్యతరగతి విద్యావంతుల్ని తయారుచేసింది పాశ్చాత్య దేశాల్లోని పెట్టుబడిదారీ విధానానికి ఫలితమైన ఆధునిక నాగరికత, ప్రజాస్వామ్యభావనలు, ఇక్కడి మేధావి వర్గాన్ని రచయితల్ని ప్రభావితం చేశాయి. 

“ప్రాచ్య, ప్రాశ్చాత్య భావముల, సాహిత్యముల సంఘర్షణలో పాశ్చాత్యములైన  వానికి గల వైవిద్యము మన వారలను దిగ్భ్రాంతులను గా చేసి, వారి మనోరాజ్యము నేలజొచ్చెను. సాంఘిక రంగమున సంస్కరణాభిలాష, సాహిత్య రంగమున నవ్వసృష్టి, భావనా రంగమున విశృంఖల విహారము, సంప్రదాయ రంగమున వ్యవస్థిత వస్తు ధిక్కారము, ప్రక్రియా రంగమున వైవిద్య ప్రవే శము అనునవి ఈ సంధియుగమున (1800-1900) ధర్మ పంచకము. ఫలితంగా కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు మొదలైన వారిద్వారా సంఘసంస్కరణ రూపాలుగా నిరక్షరాస్యతా నిర్మూలన, మÖఢ విశ్వాస ప్రతిఘటన, వ్యావహారిక భాషోద్యమం మొదలైనవి సామాజికంగా ఉద్యమాలై, సాహిత్యంలో కూడా చోటుచేసుకున్నాయి. 

భారతీయులకు ఆంగ్ల విద్యాభ్యాసం వల్ల పాశ్చాత్యదేశాల్లోని అనేక సాహిత్యవాదాలు పరిచయం కలిగింది. సమాజ మస్తిష్కంలో అనేక వాదాల సారాంశం ఇమిడిపోయింది. డార్విన్ పరిణామ సిద్ధాంతం, ఐన్స్టీన్ సాపేక్షతా సిద్దాంతం, మార్క్స్ గతితార్మిక భౌతికవాదం, ఫ్రాయిఓ మనోవిశ్లేషణ సిద్ధాంతం మొదలైనవన్నీ సమాజంలోనూ, తరువాత సాహిత్యంలోనూ స్థానాన్ని సంపాదించుకున్నాయి. అయితే, పాశ్చాత్య దేశాలలో ఈ వాదాలు వేరూనుకొన్న పరిస్థితులు, ఆంధ్రదేశంలో లేకపోవడం చేత ఇవన్నీ - (దాదాపు ఒకేసారి 1910 నుంచీ ఆంధ్ర సాహిత్యంలో ప్రతిబింబించసాగాయి. 

పారిశ్రామికీకరణ ఫలితమైన ఆధునిక నాగరికత పట్ల ఆకర్షితులై, పల్లెల్ని వదలి, బ్రతుకు తెరువు కోసం పట్టణాలకు వచ్చిన యువకులలో నిరుద్యోగం, చాలీచాలని ఆర్థికస్థితిగతులు విపరీతమైన అసంతృప్తిని రేకెత్తించాయి. ఈ విధమైన అనిశ్చితత్వానికి కారణం జాతీయ, అంతర్జాతీయమైన రాజకీయ పరిస్థితులే. 

అంతర్జాతీయంగా ప్రపంచయుద్దాలు ఈ యుగంలోనే సంభవించాయి. మొదటి ప్రపంచయుద్ధం దేశాలన్నిటిలో విపరీతమైన ఆర్ధిక సంక్షోభానికి కారణమైంది. అదే సమయంలో వచ్చిన అక్టోబరు విప్లవం ఒకే సారి పధ్నాలుగు దేశాల్లో సోషలిస్టు వ్యవస్థ ఏర్పడటం, ఫ్రెంచి విప్లవం యువకులలో కమÖ్యనిస్టు సిద్ధాంతాల పట్ల, మార్క్సిజమ్ పట్ల ఆకర్షణని అభిమానాన్ని రేకెత్తించింది. ఫలితంగా అభ్యుదయ కవిత్వానికి అభ్యుదయ కవిత్వం ఆవిర్భవించింది. రాష్ట్రంలోని తెలంగాణా పోరాటం మరింత స్ఫూర్తి నిచ్చింది. 

ఈ విధమైన అనిశ్చిత సాంఘిక, రాజకీయార్థిక పరిస్థితులు సాహిత్యంలో ఆలోచన కన్నా ఆవేశానికి, యుక్తి కన్నా శక్తికి ప్రాధాన్యం కలిగించాయి. అనేక తాత్వికధోరణులకు సాహిత్యంలో ప్రవేశం దొరికింది. ఇవన్నీ సాహితీ ప్రపంచంలో సంచలనాన్ని కలిగించి వస్తువులోనూ, ప్రక్రియలోనూ, శిల్పంలోనూ ఎంతో మార్పు తీసుకొచ్చాయి. 

ఆధునిక కవిత్వం యొక్క అభివ్యక్తిలోని మార్పుకు మరి ముఖ్యకారణం వుంది. పారిశ్రామిక, యాంత్రిక, సాంకేతిక నాగరిక సామాజిక జీవన విధానానే మిక్కిలి అభివృద్ధిని సాధించి, మార్చివేసింది. మారిన జీవన విధానం వ్యక్తుల మనసుల్ని ఆలోచన గతుల్ని మార్చివేసింది. ఫలితంగా ఒకానొక వేగం, జీవనంలో త్వరితగతి ఆధునిక నాగరికత సాధించి పెట్టింది. ఉదాహరణకు టెలిగ్రాముని తీసుకున్నట్లయితే, టెలిగ్రాముకి విషయం ప్రధానం కాని కర్త, కర్మ, క్రియలతో కూడుకున్న సంపూర్ణ వాక్యం కాదు. ఇది సాంకేతిక విజ్ఞానం సాధించిన ప్రగతి. అయితే ఇందుకు తగినట్లుగానే వ్యక్తి జీవనం కూడా ఉండటంతో అన్వయ క్లిష్టత ఉండదు. ఈ ప్రభావం తెలుగు కవిత్వంలోనూ చూడవచ్చు. 

ముద్రణాయంత్ర ప్రవేశం తెచ్చి పెట్టిన అనేక మార్పుల్లో కవిత్వాభివ్యక్తిలో కవులు సాధిస్తున్న క్లుప్తతని, సంక్షిప్తతని ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలాగే, వాణిజ్య ప్రకటనని తీసుకున్నట్లయితే, అది కవిత్వంలో అయినా, కాకపోయినా సామాజిక నినాద ధోరణికి కొంతవరకు స్ఫూర్తి నిస్తుందని చెప్పవచ్చు వాణిజ్య ప్రకటనలో సరుకు గుణాల్ని కానీ, అమ్మకపు అభ్యర్ధనను కానీ, అతి క్లుప్తంగా తక్కువ మాటల్లో, ఎక్కువగా హృదయానికి హత్తుకునేలా చెప్పాలి. సమర్ధవంతమైన ప్రకటనా సాధనంగా నినాదాన్ని వాణిజ్య ప్రకటన కర్తలు గుర్తించారని చెప్పాలి. 

ఆధునికంగా ప్రపంచం నలుమÖలలా అన్ని జీవితాలనూ ప్రభావితం చేస్తున్నది శాస్త్రీయ వైజ్ఞానిక ప్రగతి విజ్ఞానశాస్త్రం ప్రకృతి లోతుల్ని కొలవడానికి ప్రయత్నిస్తూ పరమాద్భుత విషయాలను వెలువరిస్తోంది ఈ విధమైన పరిశోధనా ప్రియత్వం సాహితీపరుల్ని ది కూడా ప్రపంచవ్యాప్తంగా కుదిపి, నూత్న ప్రయోగాలు ప్రక్రియలు అందించేలా చేస్తోంది. ఫలితంగా కవిత్వం పూర్వంలా కవి అనుభూతిలో నుండి గాక, ప్రధానంగా ఆలోచననూ కేంద్రీకరించుకుని వెలువడుతోంది. కవి అంతర్ముఖుడై, అనుభవించి వ్రాయడం కన్నా బరిర్ముఖుడై భావించి వ్రాస్తున్నాడు. అనుభూతి కన్నా ఆలోచన, తన్మsTÖ భావన కన్నా తర్కం అధికంగా కవిత్వంలో చోటుచేసుకున్నాయి. 

ఆధునిక నాగరికతా ప్రసాదమైన జీవనవేగం కారణంగా ఆధునిక మానవుడికి సుదీర్ఘ కావ్యాలు చదివే ఓపిక కొరవడింది. “ప్రాచీన మహాకావ్యం పద్దెనిమిది పర్వాలైతై, ఆధునిక మహాకావ్యం పద్దెనిమిది పేజీలే. అన్న శ్రీశ్రీ మాటలు ఆధునిక జీవన స్వభావానికి అద్దంపట్టే సువ్యాఖ్యలు. ఈ విధంగా పద్దెనిమిది పేజీల నుండి, పద్దెనిమిది వాక్యాలకు, పద్దెనిమిది వాక్యాలనుండి పద్దెనిమిది అక్షరాలకు మారిన కవితారూపాన్ని మనం మినీకవితలో చూడవచ్చు. 

ఈ విధంగా క్లుప్తతని ఆధారం చేసుకుని పాఠకులందరికీ సులభంగా, తేలికగా అర్ధం అయ్యే విధంగా కవిత్వం ఉండాలంటూ ప్రాచీన ఛందోబద్ధమైన కవిత్వానికి ప్రతిక్రియగా ఛందోరహితమైన ప్రక్రియగా వచనకవిత సాహితీ రంగ ప్రవేశం చేసింది. 


హీరో మహేష్ బాబు తో కలిసి నటించిన హీరోయిన్లు ఎవరు #hero #maheshbabu #actress #heroins #combination #tollywood #movies


 

18, జూన్ 2026, గురువారం

తెలుగు చిత్రాల్లో నటించిన హిందీ నటులు ఎవరు #bollywood #actors #actress #heros #telugu #dubbed #remake


 

చిరంజీవి నటించిన ప్లాప్ సినిమాలు ఏవి #chiranjivi #megastar #flop #movies #disaster #movies #news


 

కపిలవాయి లింగమూర్తి సాహిత్యంలో విశ్వబ్రాహ్మణుల ప్రస్తావన

కపిలవాయి లింగమూర్తి సాహిత్యంలో విశ్వబ్రాహ్మణుల ప్రస్తావన 

కపిలవాయిగారు శతాధిక గ్రంథకర్త. సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలో, వివిధ విషయాలపై సమగ్రమైన రచనలు చేశారు. వారి రచనలన్నీ  పరిశోధానాత్మకంగా వివరాణాత్మకంగా ఉంటాయి. వారు విశ్వకర్మలు. విశ్వకర్మ సాహిత్యంపై, విశ్వకర్మ ప్రముఖులపై ఎన్నో గ్రంథాలు రాశారు. విశ్వకర్మ ప్రముఖుల ప్రత్యేక సంచికలకు కూడా సంపాదకత్వం వహించారు. వారి విశ్వకర్మ సాహిత్య రచనలు మాతృశ్రీ కడియంపాటి గురుగోవిందమాంబచరిత్ర, ఆంధ్రపూర్ణాచార్యుడు, శివరామబ్రహ్మేంద్రయోగి చరిత్ర, నాగశేషమాంబ చరిత్ర, నమఃకవి పంచననాయ, విశ్వకర్మపురాణము, విశ్వబ్రాహ్మణులు - సంస్కృతీ అనుకరణం, స్వర్ణశకలాలు, మాంగళ్యశాస్త్రం, వివాహస్వర్ణోత్సవ సద్దలి, నిదర్శనాలు, విశ్వకర్మ విలాసము,  మా భగోట మొదల్కెనవి. వారు రాసిన వందలాది వ్యాసాలలో  పీఠికలలో చాలా చోట్ల విశ్వకర్మల ప్రముఖులను, ప్రతిభావంతులను, వృత్తులను గురించి ప్రస్తావించారు. వారు స్వయంగా కొంతకాలం వృత్తిపని చేసినందున ఆ మెళకువలన్నీ వ్యాసాలలో ప్రస్తావించారు.

విశ్వకర్మ అంటే పరాత్పరుడ్కెన విశ్వకర్మ అనీ విశ్వకర్మలు అన్నపుడు ఆయన వంశంలో జనించిన వారనే అర్థం రూఢమైంది. వారు మనుమయాది దేవగణంలోని వారైనా, నేటికాలంలోని పంచదాయిలన్కెనా అట్లాగే చూడాల్సి 

ఉంది. విశ్వబ్రాహ్మణ శబ్దమొకటుంది. విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మబ్రాహ్మణ శబ్దాలమీద చర్చ చాలాకాలంగా ఉంది. చర్చచేసే వారిలో వారివారి జిహ్వబలం వారిని నిలబెడుతూ వస్తుంది. ఎంతగా ఎన్నివిధాలుగా చర్చించినా ఈ చర్చంతా ఒక్క పంచదాsTÖ (పంచానన) వర్గంమీదే. బ్రహ్మయై సృష్టించటంతో విశ్వకర్మ విశ్వబ్రహ్మ అయినాడు. దాంతో అతని సంతతి విశ్వబ్రాహ్మణశబ్దంతో గుర్తింపబడిరది. విశ్వకర్మ -  విశ్వబ్రాహ్మణ శబ్దాలు ఒకరకంగా పర్యాయాలే. 

కపిలవాయివారి రచనల్లోకి తొంగిచూసి విశ్వకర్మలను గూర్చి, వారి కర్మను గూర్చి వారేం చెప్పారో తెలుసుకోబోతే మున్ముందుగా చెప్పుకోవలసిన గ్రంథం ‘స్వర్ణశకలాలు’. కావ్యాలలో ముఖ్యంగా ప్రాచీన కావ్యాలలో తాము చూసిన విశ్వకర్మల ప్రసక్తులను ఈ గ్రంథంలో ఎత్తిచూపి వానికి తమద్కెన వ్యాఖ్యానంచేశారు. గ్రంథంపేరే స్వర్ణశకలాలు. ఆ మేరకు స్వర్ణకారులయిన విశ్వజ్ఞవిశ్వకర్మవంశీయుల కర్మ, కర్మఫలాలు వర్ణించబడటం చూస్తామీ గ్రంథంలో.

ఉదాహరణ

“గరళపుముద్ద లోహమవగాఢ మహాశనికోట్లు సమ్మెటల్

హరు నయనాగ్ని కొల్మి, యురగాధిపు కోరలు పట్టుకార్లు ది

క్కరటి శిరంబు దాయ లయకారుడు కమ్మరి వైరివీరసం

హరణ గుణాభిరాముడగు మైలమభీమన ఖడ్గసృష్టికిన్.”

‘ఏఱువభీముని ఖడ్గం’ అనే శీర్షికతో ఉదాహరించిన ఈ పద్యం వేములవాడ భీమకవి చాటువట. ఈ పద్యంలో పేర్కొనబడిన వస్తువులన్నీ శివునిపరంగా ఉండేట్లు చెప్పబడ్డాయి. లోహం శివుని కంఠంలోని గరళం, అశని అంటే పిడుగు. పిడుగుకు హీరమనీ, శివునికి హీరుడనే పేర్లూ ఉన్నాయి. ప్రళయకాలంలో కురిసే పిడుగులు సమ్మెటపోటులు, శివుని నయనాగ్ని  కొలిమి, ఆయన నలంకరించిన ఉరగాల (పాముల) కోరలు పట్టుకారులు, దిక్కరటిశిరం అంటే దిగ్గజశిరం డాకలి. ఈ రహస్యాలన్నీ విప్పిచూస్తే లయకారుడు. అంటే శివుడు. ఆ శివుని కమ్మరిగా ఉపమించి వర్ణించిన ఈ పద్యంలో విశ్వకర్మ ఛాయామాత్రంగా కనిపించటాన్ని విప్పిచెప్పారు కపిలవాయిగారు. శివుణ్ణి భీముడనీ అంటారు. ఓజులు అని విశ్వకర్మీయుల్నంటాం. ఇక్కడ  భీమకవి ఈ భీముణ్ణి (శివుణ్ణి) భీమోజును చేశాడంటారు కపిలవాయిగారు. మొత్తంపై శివుణ్ణి మనుబ్రహ్మగా, విశ్వకర్మగా రూపుకట్టించిన ఈ పద్యానికి వారు చేసినవ్యాఖ్యానంలో తామున్నూ విశ్వకర్మను తలచుకున్నట్లే అయింది.

ఈ వరుసలోనే చిమ్మపూడి అమరేశ్వరుని ‘విక్రమసేనం’ లోని అశోకవృక్షవర్ణన. ‘గణపవరంవారి కమ్మరి’ అనే శీర్షికలో గణపవరపు వెంకటకవి ‘ప్రబంధరాజవేంకటేశ్వర విలాసం’ లో వసంతుణ్ణి కమ్మరిని చేసిన ఘట్టం ఉందని పేర్కొని వివరించారు. ఇట్లే మట్ల అనంతరాజు ‘కకుత్సవిజయంలో’ వర్ణించిన వడ్రంగిని పట్టి చూపించారు. ‘సింహాసనద్వాత్రింశిక’లోని మÖడవకథలో గౌళికుడనే మయకుమారుడు కఱ్ఱతో గరుత్మంతునిచేసి ఏకంగా తాను శ్రీమహావిష్ణురూపాన్ని ధరించి రాకుమారిని వరించిన సందర్భాన్ని ముచ్చటించారు. ‘గణపవరంవారి కొలిమిలో కాలినగుండు’, ‘కొరివిగోపరాజుగారి పడెచ్చు’, ‘అయ్యలరాజుగారి అగసాల’, ‘ఆంధ్రభోజుని అతుకు’ ‘పినవీరన పూతకడియం’, ‘భట్టుమÖర్తిచేసిన బంగారుబొమ్మ’, ‘వడ్డాదివారి వెండికంచం’, ‘నరహరిపండితుని పసిడిపూదె’ ఇట్లాంటి శీర్షికలలో ప్రాచీనకావ్యాల్లోని పద్యాల అచ్చట్లు ముచ్చట్లలో చోటుచేసికొన్న విశ్వకర్మీయులను తమ వ్యాఖ్యానాలతో దర్శింపజేశారు.

గతశతాబ్దంలో గోపాలపేట ప్రభువు తమ కేశంపేట, గోపాలపేటలలో ఆలయాలకు ద్వారాలు, మకరతోరణాలు, దేవతామÖర్తులకు కిరీటకవచాలు చేయటానికి పెదమర్రూరులోని తల్లోజు హనుమంతాచారిని పిలిపించుకున్నాడట. రేమద్దులలో పని సాగుతుండగా ఆ ప్రభువొకసారి పరిశీలనకన్నట్లుగా వచ్చి, హనుమంతుగారూ ! మీరు మంచి పనివారని విన్నాం. మీ పనితనం ఎలాంటిదో మాకెన్నడూ చూపకపోతిరి? అన్నాడట. ఆ తర్వాత ఒకనాడు ఆ ప్రభువు కొలువులో ఉండగా హనుమంతాచారి వెళ్ళాడట. తన దగ్గరున్న రెండు బంగారు తుమ్మెదలను రెక్కలునొక్కి ప్రభువుదిశకు విసిరాడట. అవి ఎగురుతూపోయి ప్రభువుమీద వాలాయట. తనమీద ఏదో పురుగు వాలిందనుకొని ప్రభువు విదలించబోతే హనుమంతాచారి వారించి వెళ్ళి తుమ్మెదలనుతీసి తనజేబులో వేసుకున్నాడట. ఆశ్చర్యమÖ ఆనందము కలుగగా ఆ ప్రభువు ఆ ఆచారికి ఒక యిల్లు బహుమానంగా యిచ్చాడట. ఆ హనుమంతాచారి వంశంవారు ఇప్పటికి గోపాలపేటలో ఉన్నారట.  అట్లే మొలుగర అనే ఊళ్ళోని ఒక విశ్వకర్మ వెండితీగతో చిన్న చేపనుచేసి పళ్ళెంలో నీళ్ళుపోసి ఆ నీళ్ళలో ఆ చేపను వదిలితే పళ్ళెంచుట్టూ తిరిగిందట. ఇట్లాంటి సందర్భాలనూ ప్రోవుచేశారీ గ్రంథంలో. సూటిగా పరాత్పరుడ్కెన విశ్వకర్మను తీసుకోకపోయినా ఆయన ప్రభావాన్ని, ఆయన వంశీయులను ఈ వ్యాసాల్లో పాఠకులముందుకు తీసుకువచ్చారు కపిలవాయివారు.

కపిలవాయివారి సాహిత్యంలో విశ్వకర్మ అనే విషయం చెప్పుకోవలసివస్తే వారు వచనంగా కూర్చిన ‘విశ్వకర్మపురాణం’ చెప్పుకోక తప్పదు. దీనికి మÖలం వేంకటాచార్య కృతమైన పది ఆశ్వాసాల పద్యగ్రంథం. వ్యాసభగవానుని రచనల్లో ఉన్న అనేక కథలలో ఇరుక్కుపోయి ఉన్న విశ్వకర్మసంబంధి విషయాలను చిక్కుల్ని విడదీస్తూ సృష్టించబడిరది ‘విశ్వకర్మపురాణం’. వీపూరి వెంకటాచార్యులు తాను ఒకనాటి ముమ్మనాచార్యుని వంశంవాడనని చెప్పుకున్నాడు. ఈయన కాలక్రమంలో నల్లగొండజిల్లాకు తరలివచ్చి నివాసం చేసుకొని, పెందోటరాజ్యంలో ఉంటూ శ్రీనాథుడు కూడా రాసిన విశ్వకర్మపురాణం ఒకటుండేదని ఆ నాటికి వినికిడే కాని గ్రంథం లభ్యంకాలేదనీ, అందుకే తాను విశ్వకర్మపురాణం వ్రాస్తున్నానని చెప్పుకున్నాడట. ఈ పెందోటరాజ్యం నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో మునిగిపోయి కథల్లోమాత్రమే మిగిలిపోయింది. 

ఇక్కడ నాగరఖండం అనే గ్రంథంగురించి కొంత చెప్పుకోవలసి ఉంది. పెందోట సామ్రాజ్యాన్ని ధవళేశ్వరపు మార్కండేయుడు పాలించిన రోజుల్లో ఆయన కోర్కెపై వ్యాసకృతమైనదీ సంస్కృతంలో ఉన్నదీ అయిన స్కాంద పురాణంలోని నాగరఖండం ఆంధ్రీకరించబడి తాళపత్రాల్లో పద్యగ్రంథంగా కూర్చబడిరదట. పెద్దకాలం పిదప ఆ పద్యగ్రంథానికి కడపజిల్లా కానిస్టేబుల్ రాయవరపు పూర్ణయాచారి ప్రతి రాయించి, మతుకుమిల్లి రామకృష్ణకవి అనే పండితునిచే తాత్పర్యాలు రాయించి నూటామÖడు సంవత్సరాల క్రిందట అచ్చువేయించాడు. ఇటీవల ఆ గ్రంథానికి సనాతనసాహితీసమితి వారు పునర్ముద్రణ తీసుకువచ్చి దానికి మళ్ళీ వందసంవత్సరాల ఆయువుపోసి పుణ్యంకట్టుకున్నారు. ఇక అసలు విషయానికొస్తే  ఆ నాగరఖండంలో ఉన్నదంతా విశ్వకర్మ చరిత్రమే. దీని భూమికమీదే వెంకటాచార్య విశ్వకర్మపురాణం రాశారని ఊహించవచ్చు. అయితే అదీ పద్యగ్రంథమే. కపిలవాయిగారు ఆ గ్రంథాన్ని వచనంగా చేయటానికి ముందే అదేపని కురిచేటి చెంచయ్యగారు చేయగా వారి గ్రంథానికి పీఠిక రాయవలసి వచ్చిందట కపిలవాయిగారికి. ఏమయితేనేం తరువాతికాలంలో తమ చిరకాలసంకల్పం నెరవేరుస్తూ తామును ఈ వచనరూప విశ్వకర్మపురాణం రూపొందించారు. ఇక వారి వచనరచన ఎంత ఆహ్లాదంగా ఉంటుందో కొత్తగా చెప్పేపనిలేదు.

విశ్వకర్మ (వంశీయు) లకు తాము రూపొందించే మాంగల్యంతో విడదీయరాని బంధముంది.  మాంగల్యానికితోడు ముత్తైదువలు ధరించే పవిత్రమైన ఆభరణాలు, తదితర ఆభరణాల విశేషాలతో కూర్చిన గ్రంథం ‘మాంగళ్యశాస్త్రం’. ఆభరణాల తయారీ, వానికి సంప్రదాయాలతో ఉన్న ముడి, ఏయే కాలాలలో ఏయే ఆభరణాలు వాడుకలో ఉండేవి, ఎవరు ఏయే సమయాలలో ఏ ఆభరణాలు ధరించటం శ్రేయం, ఆయా ఆభరణాలకున్న ప్రత్యేకతలు మొదల్కెన విషయాలెన్నో ఏకరువు పెట్టారు కపిలవాయిగారీ గ్రంథంలో. దీనికి మÖలం వారికి తమ యింటిలోనే శిథిలావస్థలో దొరికిన ఒక ప్రాచీనగ్రంథమట. ఆ గ్రంథప్రతిని తీసికొని చూచి డా.జ్ఞానానందగారు కన్నడంలోకి అనువదించారు, ప్రచురించారు. ఆపైన తెలుగులో కపిలవాయిగారి వ్రాతతో ప్రచురణం జరిగింది. దొరికిన మాంగళ్యశాస్త్రరంలోని అంశాలేకాక తమ పరిశోధనలో తేలిన ఎన్నెన్నో విశేషాలను ఈ గ్రంథంలో జతకూర్చి విస్తరింపజేశారు. ఈ గ్రంథంలో ఆభరణాల విశేషాల్తోపాటు అక్కడక్కడ విశ్వకర్మ(వంశీయు)ల ముచ్చట్లును సాగాయి. తమ ‘మాంగళ్యశాస్త్రం’ జ్ఞానానందగారు కన్నడంలోకి అనువదిస్తే,  ఆ జ్ఞానానందగారి కన్నడగ్రంథం ‘విశ్వబ్రాహ్మణులు -  సంస్కృతీ అనుకరణలు’ ను కపిలవాయిగారు తెలుగులోనికి అనువాదం చేశారు. ఇదో చిత్రమైన సన్నివేశం. ఈ గ్రంథనామంతోనే ఇదంతా విశ్వకర్మ, విశ్వకర్మీయుల విశేషాలు, విషయాలతో నిండి ఉంటుందని తెలిసిపోతుంది. విశ్వకర్మసాహిత్యంలో ఇదొక అమÖల్య గ్రంథంగా చెప్పుకుంటారు. 

కపిలవాయి రాసిన ప్రతి గ్రంథంలో అవకాశమున్నచోట విశ్వకర్మీయులను గురించి, విశ్వకర్మను గురించి ప్రస్తావించారు. ఎందరో మరుగునపడిన విశ్వకర్మీయుల చరిత్రలను వెలుగులోకి తెచ్చి ప్రపంచానికి పరిచయం చేశారు.

తిరుపతి లడ్డులో కలిపే పదార్థాలు ఏమిటి #tirupati #laddu #prasadam #venkateshwaraswamy #tirumala