మొత్తం పేజీ వీక్షణలు

24, జూన్ 2026, బుధవారం

బ్రహ్మశ్రీ డా. బొడ్డుపల్లి కాళిదాసు (ఆధ్యాత్మిక కుసుమాలు)

బ్రహ్మశ్రీ డా. బొడ్డుపల్లి కాళిదాసు (ఆధ్యాత్మిక కుసుమాలు)

బ్రహ్మశ్రీ డా. బొడ్డుపల్లి కాళిదాసు గారు ఆధ్యాత్మికా జగత్తులో వికసించిన ధృవతార. మాతా పిత సేవలో తరించిన ఒక ముద్దుబిడ్డ. ధార్మిక, సమాజసేవానిరతిలో నిరంతర కృషీవలుడు. దైవ చింతనలో తపస్వీ, వృత్తిపరంగా వైద్యుడైన ప్రవృత్తి పరంగా ఆధ్యాత్మికా ప్రపంచములో ప్రవచనా చక్రవర్తి.  మానవ సేవయే మాధవ సేవగా ఎంచిన నిస్వార్థ సేవా దురంధరుడు, పేదలపాటి పెన్నిది. 

మహాకవి కాళిదాసు నామదేయమును సార్ధకము చేసుకున్న మీVAన్నతుడు. వీరి కర కమలముల నుండి వెలువడిన ఈ పుస్తకంలో వారి మనోగతాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రీయ విజ్ఞానాన్ని మన కందరికి మకరందంలా పంచారు. ఈ విశాల విశ్వరూప తత్వాన్ని, హిందూమత వైశిష్ట్యాన్ని, ద్విజుడైన విశ్వబ్రాహ్మణుని ఉన్నత విశిష్ట ఔన్నత్య వ్యక్తిత్వాన్ని ప్రాపంచిక విశ్వమానవాళికి ఆవిష్కృతం చేసారు. 

హిందుమత విశ్వాసాలు, దైవారాధనల నియమావళి, ప్రదోష కాల శివాభిషేక ప్రాశస్త్యం, మంత్రశక్తి మహాత్యం, భగవంతుని ప్రసన్నము చేసుకొనే విలక్షణ సూత్రాల నియమావళితో, జీవితాన్ని చైతన్య వంతంగా, ఈ స్వాపి¾్నక జగత్తులో ఎలా సాధించగలమోనని నిరూపించారు. 

దేహమే దేహలయం: ‘అహం బ్రహ్మాన్ని’ అనే ఆది శంకరుని విశ్వవ్యాప్త అద్వైత సిద్ధాంతాన్ని వివరంగా వక్కాణించారు. ‘ఏకం సతివిప్రా బహుదా వదంతి” అను తత్వాన్ని జ్ఞానులు, దైవాన్ని అనేక ఆకారాలుగా ఆవిష్కరించారు. 

ఏ రూపంలో, ఏ విధంగా, ఏ ఏ సమయాలలో, నలు దిక్కుల, ఎక్కడ వ్రతాలు, జపాలు, తపాలు, ఆరాధనలు జరిగినా అవి అన్ని బ్రహ్మలో తరించేవే అనునానుడిని బహు చక్కగా వివరించారు. 

వివిధ స్వరూపాలలో నున్న దేవి, దేవతా మÖర్తుల ఆభరణాలు, ఆయుధాలు మరియు మానవ ఆంగాలలో నున్న దైవ స్థానాల నిక్షిప్తత, వాటి విశిష్టత, ప్రత్యేకత, ప్రయోజనాలు ప్రయోగాత్మకంగా, విశ్లేషించి, అనుమానాలకు, ఆలోచనలకు తావు లేకుండ వివరణ ఇచ్చారు. 

సామాజిక స్పృహ కలిగే విధంగా మననిత్య జీవితంలో ఉపయోగించే పసుపు, కుంకుమ మరెన్నో ఉపకరణాల ప్రయోజనం, కట్టు బొట్టు అలంకరణ ఆచరణ విధానాలలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వాలు ఉన్నాయని అభి వర్ణించారు. 

నిత్య జీవితంలో సమాజ సగౌరవాన్ని పొందాలంటే కావలసిన విలక్షణమైన ‘వకార పంచకం’ లోనున్న అంశాలను సభ్య సమాజానికి విశదీక రించారు. వీటికి తోడుగా సమాజలో మంచి పేరు, పలుకుబడికి స్థానం కావాలంటే, “ప్రియ వాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతన తస్మాత్ తదేక వ్యక్తవ్యం వచనే కాదరిద్రతో’ అంటే అనుకూలతను అభివ్యక్త పరిచే అలవాటు అన్ని విధాల శ్రేయష్కరం అన్నది ఆర్యోక్తి.

శ్రాద్ధకర్మలలో మాంసాహారాన్ని నిషేధించి, ఆహింసా పద్దతిలో నివేదనలు, తర్పణాలు, దానాలు, అర్పిసే పితృ దేవతలు వాటిని, దివంగ తులకు ఏ రూపంలో నున్న వారికి అందించి తృప్తి పరుస్తారు అనే విషయాన్ని తేట తెÉల్లం చేసారు. 

తేనెలొలికె తెలుగు భాషలోని ఔన్నత్యాన్ని వినసొంపుగా, మనస్సునకు హాయిని, అహ్లాదాన్ని ఎంతో వినోదాన్నిస్తుందని ఉదాహరణాలిచ్చారు. ‘వసుదైక కుటుంబము’ లో నున్న విశాల హృదయ తత్వాన్ని, అనందాన్ని ఇంద్ర ధనుస్సు రూపంలో విరజిమ్మారు.

అమ్మకు ఆప్యాయతతో, మధురమైన అనుభూతుల తో, అనురాగ అనుబందాలతో అక్షరాంజలి ఘటించారు. మాతృ మÖర్తియందున్న భక్తి, ప్రేమానురాగాలు పాట రూపంలో, ‘మనస్సుకు  హత్తుకునే విధంగ ఉంది. 

గృహస్తు ధర్మంలోనున్న భాధ్యత, తోబుట్టువులతో నున్న ఆప్యాయత, ఆడపడుచులలోని అనురాగం, కుటుంబంలో జరిగే సీమంతం సంబరాలను అందంగా ఆవిష్కరించారు. సమాజానికి జాగరూకతగా, జీవిత సత్యాన్ని, అత్త ఉన్నకోడులుత్తమురాలుగా స్వీయానుభవముతో కొనియాడారు. 

సాంఘిక సేవా ధర్మంగా నిరుపేదలకు నిర్మించిన ఉచిత విద్యా ఆశ్రమ పాఠశాల ‘కారుణ్వ సింధు” కు అక్షరాభినందనలు కురిపించారు. మన సమాజంలో, ప్రాచీనులలో ఉద్దండులైన ప్రాజ్ఞులు, ఋషి పుంగవులు ఎందరో జన్మత: బ్రాహ్మణేñతరులై, బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణులుగా నీరాజనాలందుకున్న వారి నామాలను స్మరించి వారికి వినయాంజలులు ఘటించారు. 

చివరిగా, సమాజానికి కనువిప్పు సందేశంగా ఆచరణీయ అంశాలను కొన్ని ఉద్ఘాటించారు. అందులోని సత్యం, ధర్మం, నీతి, నిజాయతి, నిస్కామక్రియలను ఆసక్తిగా ఆచరిస్తూ, భక్తి శ్రద్దలతో తల్లి, తండ్రులను సేవిస్తూ, కటుంబము, సంఘం పట్ల ఆదరణ కల్గి, ధార్మిక సేవా కార్యక్రమాలలో నిరంతరం పాల్గొంటూ ఆ భగవంతుని ఆశీస్సులతో తరించాలని ఆశించిన ప్రాజ్ఞుడు, స్థితప్రజ్ఞుడు, శ్లాఘనీయుడు డా. బొడ్డుపల్లి కాళిదాసు గారు. 

వీరి రచన నేటి యువతరానికి సంస్కృతీ సాంప్రదాయాలను తెలిపే కరదీపిక. ఇంత చక్కని రచన అందించిన మా బావగారైన కాళిదాసు గారు ఆయురారోగ్యాలతో కలకాలం వర్థిల్లాలని మనసారా ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాము. వీరి లేఖిని నుండి మరెన్నో ఇలాంటి రచనలు వెలువడాలని మా ఆకాంక్ష.

ఏ దిశలో దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి #deepam #direction #hindu #vastu #deeparadhana #temple #facts


 

వాస్తు ప్రకారం ఇంట్లో స్వస్తిక్ గుర్తు ఎక్కడ ఉండాలి #swastik #symbol #sign #swasticdesign #hindu #astrology #vastu


 

23, జూన్ 2026, మంగళవారం

భారతీయ సాహిత్యం- దళిత సంస్కృతి

 భారతీయ సాహిత్యం- దళిత సంస్కృతి

దళిత కవులు, రచయితలు తమ అస్థిత్వం కోసం, ఆత్మ గౌరవం కోసం కలాలతో కవాతు చేస్తున్నారు. అనాధిగా జరుగుతున్న దాడులను ఖండిస్తూ కలాలో సిరాకు బదులుగా ఆక్రోశాన్ని, ఆవేదనన్ను అన్నింటికి మించి కసిని నింపుకొని సాహిత్య క్షేత్రములో కొత్త కొత్త పంటలని పండిస్తున్నారు. తన ఉనికిని, మనికిని గుర్తించని వ్యక్తుల మీద, వ్యవస్థ మీద ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. మనిషిని మనిషిగా గుర్తించని మను మనుషుల మీద వారి మనస్తత్వం మీద తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు. వర్ణవ్యవస్థ, దేవుడు, విధి, ఆత్మ, పునర్జన్మ, స్వర్గనరకాలు వంటి భావాలతో కూడుకున్న హిందూమతాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ భావాల కారణంగా ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అణచివేయబడిన వారుగా విషయాన్ని దళితులు గుర్తించారు. దళితుల విముక్తికోసం హిందూమత తాత్త్వికతను మౌలికంగా ప్రశ్నించిన చార్వాకులు, బౌద్ధ, జైనాలు వారి శాస్త్రీయ దృక్పథం, దళిత సాహిత్యానికి అవసరమైన తాత్త్వికతను అందించింది.

దళిత సాహిత్యం ప్రాచీనమైన, సాంప్రదాయక స్వభావం కలిగిన సామాజిక నిర్మాణాన్ని తిరస్కరిస్తుంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం వంటి విలువలు ప్రాతిపదికగా నిర్మించబడే సమాజం పట్ల దళిత సాహిత్యం విధేయత కలిగి ఉంటుంది. స్థిరమైన అధికారాన్ని కొనసాగించే మనువాద సాహిత్యానికి ఇది వ్యతిరేకమైనది. దళితసాహిత్యం హేతువాద దృష్టిని కలిగి ఉండి పురాణ భావాలను, మత సిద్ధాంతాలు, అశాస్త్రీయభావాలు వంటివాటిని తిరస్కరిస్తుంది. వాస్తవిక ఆధారమైన భావాలతోనే సాహిత్యం ఉండాలంటుంది. 

సమాజంలో సంస్కరణభావాలు రేకెత్తించే సాహిత్యం ఒక సాధనంగా ఉపయోగపడాలని దళితసాహిత్యం భావిస్తుంది. సాహిత్యం కేవలం వినోదం కోసం కాదని సామాజిక చైతన్యం కలిగించాలని భావిస్తుంది. అందుకే కళకళకోసమే అనే సిద్ధాంతాన్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తూ కళ సమాజం కోసమే అనే దృక్పథం నుండి మాత్రమే సాహిత్యాన్ని సృష్టించాలని దళిత సాహిత్యం అభిప్రాయపడుతుంది. ఇందుచేతే దళితసాహిత్యంలో దళిత అనుభవాల స్పృహ కనిపిస్తుంది. 

దళితసాహిత్యం అనుభూతి విశిష్టమైనది. జీవితాన్ని యధాతధంగా ప్రతిబింబించడం దాని లక్షణంగా కనిపిస్తుంది. ఈ లక్షణం సాహిత్యాన్ని సౌందర్యంతోను, ఔన్నత్యంతోను నింపుతుంది. అందువల్లనే మనం సామాజిక చైతన్యానికి, సౌందర్యాత్మకతకు మధ్య ఒక ప్రత్యేకమైన సమన్యయాన్ని దళిత సాహిత్యంలో గమనిస్తాం. 

కుల, మత, వర్గ, ఆర్థిక, రాజకీయ, ఆధిపత్య స్వభావం నుంచి మనిషికి స్వేచ్ఛను కలిగించే దిశగా సాగడం దళిత సాహిత్యం లక్షణం. అంటే ఇది కులరహిత వర్గరహిత సమాజ స్థాపనకు ఉద్దేశిస్తున్నట్లు భావించవచ్చు. దళిత దృక్పథంలో జీవితమే సాహిత్యం కాబట్టి, సాహిత్యానికి ప్రజలకు మధ్యగల ఖాళీని పూరించేదిగా దళితసాహిత్యం పనిచేస్తుంది. 

మానవతా వాదాన్ని వ్యతిరేకించే సాహితి సంస్కృతులపై దళిత సాహిత్యం నిర్విరామపోరాటం చేస్తుంది. మానవతా వాదం తన ప్రధాన ఇతివృత్తంగా దళిత సాహిత్యం ప్రకటించింది. అందుచేతనే మానవుడు కేంద్రంగా ఈ సాహిత్య సృజన జరుగుతున్నది. మానవుని కష్టసుఖాలలోపాలు పంచుకుంటూ అతనిలో విప్లవ చైతన్యం నింపడం ఇందులో చూడవచ్చు. ఇందుకోసం దళిత సాహిత్యం పీడితుల ఆశలు, ఆశయాలు, అనుభవాలు, అనుభూతులను చిత్రిస్తుంది. 

అణచివేత, దోపిడీలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి సామాజిక ఆర్థిక న్యాయంకోసం పోరాడడం దీని ప్రధాన లక్షణం. అందుచేతనే దళితసాహిత్యాన్ని వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగే తిరుగుబాటుగా పేర్కొన్నారు. ఉనికి కోసం అన్వేషించటం దళిత సాహిత్యంలో మరో లక్షణం. కాబట్టే దళితుల ఐక్యత అవసరాన్ని ఇది గుర్తించింది. ఈ గుర్తింపు దళితుల సామాజిక చైతన్యానికి స్ఫూర్తినిచ్చింది. దళిత సాహిత్యంలో రెండు విభిన్న చైతన్య స్రవంతులను గమనించవచ్చు. ఒకటి మితవాద స్రవంతి. మరొకటి అతివాద స్రవంతి దళిత అనుభవాల వ్యక్తీకరణతో పాటుగా, కులవ్యవస్థలోని అమానవీయత, దురభిమానాలను వర్ణిస్తూ, నూతన సామాజిక, సాంస్కృతిక చైతన్యాన్ని ఆశించడం మితవాద ధోరణిలో కనిపిస్తుంది. 

అతివాద స్రవంతిలో మాత్రం వ్యవస్థపై తిరుగుబాటు, హిందుమతత్త్వం విధించిన పరిమితులను ధిక్కరించే ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. హిందుమతం మౌలిక తత్వాన్ని, అది ప్రచారం చేసే కర్మ, పరమాత్మ, పునర్జన్మ వంటి భావాలను ఈ ధోరణి తీవ్రంగా నిరసిస్తుంది. ఈ తరహా కవులు తమ కవిత్వంలో ఉపయోగించే ప్రతీకలు, అలంకారాలలో సమాజ స్వభావం పట్ల వ్యక్తం చేసే అసహనం, నిరసన స్పష్టంగా కనిపిస్తుంది. అతివాద ధోరణి అధికంగా కవిత్వంలో ప్రతిబింబిస్తే, మితవాద ధోరణి ఎక్కువగా కథలలో, ఆత్మకథలలో ప్రతిఫలించడం గమనించవచ్చు. హిందుమత మౌలిక స్వభావ తిరస్కారం సామాజిక, సాంస్కృతిక మార్పు ఆశించడం అమానవీయత దురభిమానాల వర్ణన సమాజ స్వభావం పట్ల అసహనం ప్రస్తుత జీవితాన్ని తిరస్కరించడం వ్యవస్థపై తిరుగుబాటు, ధిక్కారం, సంస్కరణ అభివృద్ధి ఆకాంక్షించడం ఉంది. 

తిరుగుబాటు, ధిక్కారం జాషువ నుంచే మనం చూస్తాం. జాషువ “కసరి బుసకొట్టుట నాల్గు పడగల హైందవ రాజు” అని వర్ణవ్యవస్థ క్రూరత్వాని వెల్లడించాడు. అంతే కాదు 

“ముసలివాడైన బ్రహ్మకు బుట్టినారు 

నల్వురు కుమారులను మాట విన్నాముగాని 

పసరముకన్న హీనుడభాగ్యుడైన 

ఐదవకులస్తుడెవరమ్మా సవిత్రి” 

అంటూ పంచవవర్ణం పుట్టుక గురించి ప్రశ్నిస్తాడు జాషువా. అట్లాగే అస్థిత్వం ఆత్మగౌరవం కోసం కలేకూరి ప్రసాద్ “పిడికెడు ఆత్మగౌరవం కోసం” అనే కవితలో 

“ఇప్పుడు కరుడుకట్టిన భూస్వామ్యక్రౌర్యం 

నాగుండెలమీద నాగేటి కర్రులతో 

పచ్చబొడిసిన పేరు చుండూరు 

ఇక చుండూరు నామవాచకంకాదు సర్వనామం 

ఇప్పుడు ప్రతిగుండే రగిలే రాచపుండూరు 

నేను జనసమÖహాల గాయాన్ని గాయాల సమÖహాన్ని

తరతరాలుగా స్వతంత్రదేశంలో అస్వతంత్రుణ్ణి

అవమానాలకూ, అత్యాచారాలకూ 

మానభంగాలకూ, చిత్రహింసలకు గురై 

పిడికెడు ఆత్మగౌరవం కోసం తలెత్తిన వాణ్ణి

ధనమదాంధ, కులోన్మత్తుల రాజ్యంలో 

బతకడమే ఒక నిరసనగా బతుకుతున్నవాణ్ణి 

బతికేందుకు పదేపదే చస్తున్నవాణ్ణి

అంటూ ఆత్మగౌరవం కోసం బ్రతకటం కోసం దళితులు నిరంతరం ఎదుర్కొంటున్న హింసను ధిక్కార స్వరంతో వేదనాబరితంగా ఆవిష్కరించాడు. 

ఎండ్లూరి సుధాకర్ ‘దళితాయణం’ అనే ఖండికలో 

శంబూకుడు సింహాసనం మీద నుంచి 

నల్లసూర్యుడై నవ్వుతుంటే 

వర్తమానవాల్మీకి తన దళితాయణంలో 

మొదటి వాక్యం ఇలా రాశాడు. 

దళిత యుగం శంబూకునిరక్త స్వప్నం

అనే మాటల్లో రాజ్యాధికార స్వప్నం కనిపిస్తుంది. 

దళిత ధిక్కార స్వరానికి శివసాగర్ ‘నడుస్తున్న చరిత్ర’ కవిత ఒక గొప్ప 

ఉదాహరణ. అణగదొక్కిన పురాణ పాత్రలపై ప్రతీకారం తీర్చుకోవడం ఇందులో కనిపిస్తుంది. 

శంబూకుడు పెదాల మీద చిరునవ్వుతో 

రాముని వధిస్తున్నాడు 

ఏకలవ్యుడు ద్రోణుడి బొటనవేలును 

గొడ్డలితో నరుకుతున్నాడు 

బలి తన చిరుపాదాలతో వామనుణ్ణి 

పాతాళానికి తొక్కేస్తున్నాడు 

మనువు కళ్లల్లో సూదులు గుచ్చుకుని 

నాలిక తెగ్గోసుకుని 

చెవిలో సీసంపోసుకుని 

శ్మశానంలో దొర్లుతున్నాడు

అంటూ సాగే కవితలో ధిక్కార స్వర తీవ్రత కనిపిస్తుంది. 

ఇదే తీవ్రతా సతీష్ చందర్ ‘పంచమవేదం’ లో కనిపిస్తుంది. 

భాషా ఆప్రవీణులారా ఉలిక్కిపడకండి 

మీరుకుదిర్చిన చందోబద్దకావ్యాలను కాలదన్ని 

వర్ణ క్రమాలు వాడలకు వలసపోతున్నాయి 

పదాలకిప్పుడు నలుగు పెట్టాలి 

నూలు పోగులు లేకుండా నగ్నపరచాలి తరతరాలుగా సాహిత్య సృజన భాషా పాండిత్యం ఒక వర్గంవారి గుప్పెట్లోనే వుంది. దళిత సాహిత్య ఆవిర్భావంతో అది విముక్తి అయింది. అలాగే ప్రసాదమÖర్తి ‘అవధానిగారు అవధరించండి’ అనే కవితలో 

అక్షరం ఇప్పుడు 

కులంతక్కువ వాడి ప్రక్కలో 

కులుకుతోంది

అంటూ తన ధిక్కార స్వరాన్ని వినిపించాడు. 

జులూరి గౌరీశంకర్ మనుషులు వివిధ అంశాలనుంచి పుట్టారన్న అశాస్త్రీయతను ఎండగట్టాడు. 

అసలు ఏ వర్ణానికైనా 

జన్మస్థానమొక్కటే 

మనుషులు మనుషులుగా పుట్టుక 

మనువులై పుడితేనే ప్రమాదం 

కొందర్ని పాదాలనించి పుట్టించే ప్రమాదం 

మనిషి మనువైనప్పుడే జరిగింది 

అని మనిషి మనువైన దుర్మార్గాన్ని బహిర్గతం చేస్తాడు. 

నగేష్ బాబు తన దీర్గ కవిత ‘రచ్చబండ’లో 

ఇప్పుడు మాత్రమే కాదు 

ఇక వీచేగాలులం మేమే 

అవును ఇది కొత్తగాలే 

ఆకులు కాదు ఆత్మలువీస్తున్న గాలి

చెట్లుకాదు చేవదేలిన దేహాలు వీస్తున్న గాలి

ఇన్నాళ్లు పవిత్ర గ్రంథాల ఇనుపజాడీల్లో

మీరు భద్రంగా దాచిన బహుజన ప్రభంజనం

ఇన్నాళ్లు ఏమనుషుల్ని నిషిద్ధుల్ని చేసి 

అసింట అసింట అని జరిగిపోయారో 

ఏ మనుషుల్ని పనిముట్లని చేసి 

మీ పనులన్నీ చక్కదిద్దుకున్నారో 

ఏ మనుషుల్ని మీ బూటకాల చరిత్రకు 

యోజనాల దూరం ఉంచారో 

ఆ మనుషులే చరిత్రలు రాస్తున్నారు

అంటూ తన తిరుగుబాటు స్వరాన్ని వినిపించాడు. మరో చోట ఎండ్లూరి సుధాకర్ ఇలా అంటాడు. 

ఈ పంచ భూతాల తోలుదొలచి 

ఆకాశానికో మేకు / పాతాళానికో మేకు 

సప్త సముద్రాల మీద

చర్మాన్ని నానబెట్టిన నీకు ఆ సూర్యచంద్రులు

చెరో చెప్పూ కావాల్సిందే

ఆకలితోనో అవమానంతోనో 

తలవొంచుకుని 

నీ చర్మపుజోళ్ళు కుట్టుకుంటున్నతాతా 

ఈ ప్రపంచం / ఉంగటంగామారి 

నీ ముంగాలి బొట్టినేలిని

ముద్దుపెట్టుకోవాలని 

కలగంటున్నాను

అని చెప్పటంలో దళిత చైతన్యం కనిపిస్తుంది. 

ఈ దిశలో దళిత సాహిత్యం విస్తృతమైన కృషి చేసింది. దళితేతరులైన ఉన్నత వర్గాలు దళితుల గురించి ఆలోచించేట్లు చేసింది. దళితుల మానసిక దాస్య విమోచనం కోసం ప్రయత్నించడం దళితసాహిత్య మరో ప్రధాన లక్షణం. దళితులు, తామంతా ఒకజాతి అని గుర్తించేందుకు తమ వ్యక్తిత్వాన్ని అవగాహన చేసుకోగల చైతన్యాన్ని కలిగించేందుకు ఈ సాహిత్యం కృషి చేస్తుంది. నిజాయితీ విమర్శనాత్మక ధోరణి కలిగిన దళిత సాహిత్యం దళితులలో గల ఆత్మ న్యూనతా భావంపై దాడిచేసి వారు బానిస మనస్తత్వం నుండి విముక్తి చేసేందుకు సహకరిస్తుంది. దళిత సాహిత్యం జీవిత వైవిధ్యాలన్నింటిని విభిన్న కోణాలలో దర్శించే స్వాభావాన్ని కలిగి ఉండి జీవితాన్ని విప్లవీకరించే దిశగా పయనిస్తున్నది. 

కులవర్గ వైరుద్ధ్యాలతో నిండి ఉన్న ప్రాచీన హిందూ మార్మికతను బ్రద్దలు చేస్తూ, అందుకు ప్రతిగా ప్రత్యామ్నాయ సంస్కృతిని రూపొందించడం దళిత సాహిత్యం తన ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయం ప్రతిపౌరునికి అందించగల నూతన వైజ్ఞానిక వ్యవస్థ దళిత సాహిత్య ఆశ. 

దళిత సమస్యలను అర్థం చేసుకొని అందుకు కారణమైన వాస్తవాలను విశ్లేషించడం, ఆ సమస్యలసాధనకు ఉపకరించే సామాజిక, అభ్యుదయ శక్తులను ప్రోత్సహించటం, తద్వార శతాబ్దాలుగా అజ్ఞానంలో ఉంచబడిన వారిలో సామాజిక, రాజకీయ చైతన్యం కలిగించటం దళిత సాహిత్యం ప్రధాన లక్ష్యంగా భావించవచ్చు. 

సామాజిక అభివృద్ధిలో భాగంగా వ్యక్తి అభివృద్ధి కోసం, జాతి నిర్మాణం కోసం దళిత సాహిత్యం ప్రయత్నిస్తుంది. మానవతావాద దృక్పథంతో, విశ్వజనీన సౌభ్రాతృత్వం లక్ష్యంగా మొత్తం మానవజాతి అభ్యున్నతే ధ్యేయంగా దళిత సాహిత్యం సాగుతున్నది. 

వ్యక్తి సమాజంలో భాగమైనప్పుడు సామాజిక అంశాలు అతని వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతాయి. అలానే అతని వ్యక్తిత్వం కూడా సమాజంపై ప్రభావం చూపుతుంది. ఆ వ్యక్తి రచయిత అయితే ఆ రచయిత సృజించే సాహిత్యం సమాజంపై తన ప్రభావం చూపుతుంది. అందుచేత సాహిత్య అధ్యయనంలో రచయిత వ్యక్తిత్వం రచయితగా ప్రముఖపాత్ర వహిస్తుంది. సామాజిక స్పృహతో రచన చేయటం రచయిత బాధ్యత మాత్రమే కాదు. అది అతని విధి. సాధారణ రచయితకు దళిత రచయితకు ఆలోచనల్లో మాత్రమే కాకుండా అనుభవాలలో, వస్తువు, శైలి భాషలలో సైతం కనిపించే వైరుధ్యం వారి జీవన చిత్రణలో, పాత్రల చిత్రణలో కూడా కనిపిస్తుంది. 

దళితసాహిత్యం దోపిడిని, పీడనను వ్యతిరేకిస్తుంది. కాబట్టి దళిత రచయితలు దోపిడి వ్యవస్థకు చెందిన సామాజిక విలువలను అంగీకరించరు. దళితుల సాంస్కృతిక, సామాజిక, ఆర్ధిక, రాజకీయ అభివృద్ధి విషయంలో సాహిత్యానికి గల బాధ్యతను వీరు గుర్తించారని భావించవచ్చు. 

ఇదివరకే స్థిరపడిన సాహితీ విలువలను, ‘కళ, కళకోసమే’ అన్న సిద్ధాంతంపై ఆధారపడి జరుగుతున్న విమర్శ పద్ధతులను దళిత రచయితలు తిరస్కరించారు. కళ లేదా సృజన యొక్క విలువను గణించటంలో సాంప్రదాయక పద్ధతులను వీరు అంగీకరించలేదు. వీరు జీవితంలో, సాహిత్యంలో సాంప్రదాయక విలువలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. 

దళిత రచయితలు దళిత సంస్కృతీ వారసత్వాలను, వాని ఔన్నత్యాన్ని స్థాపించే ప్రయత్నం చేయటం ద్వారా చరిత్రను సృష్టించదలచుకున్నవారు చరిత్రను విస్మరించకూడదు అన్న దానికి కట్టుబడినారు. సాహిత్యాన్ని వీరు వినోదంగా భావించలేదు. దళిత రచయితల మహాసభలో వీరు ఈ అభిప్రాయం వ్యక్తం చేయటం గమనార్హం. 

కవితా ప్రక్రియలో దళిత కవిత్వం అనేకమైన మౌలిక మార్పులను ప్రవేశపెట్టింది. జీవితం పట్ల స్పష్టమైన భావనలు కలిగిన దళిత కవిత్వం కవితాలోకం యొక్క పరిధులను విస్తృత పరిచింది. సాధారణ కవిత్వం గుర్తించని వ్యక్తిత్వాలను, జీవన విధానాన్ని దళిత కవిత్వం గుర్తించింది. అన్యాయాలను, అసమానతలను, సమర్ధించిన వారికి వ్యతిరేకంగా తన స్వరం వినిపించింది. దళిత జీవితంలోని సుఖ, దుఃఖాలు మొదటిసారిగా శక్తివంతంగా కళాత్మకంగా కవిత్వంలోనే వ్యక్తీకరించబడినాయి. దళిత జీవితానికి విధేయంగా ఉన్న కారణంగా దళిత కవిత్వంలో దళిత అనుభవాల ప్రతిఫలనం కనిపిస్తుంది. దళితకవి స్వీయ అనుభవాల నుండే పదాలు, ప్రతీకలు స్వీకరించి కవితా నిర్మాణం చేస్తాడు. 

దళిత కవిత్వం ప్రాధమికంగా మానవజీవితం కేంద్రంగా, సాగి కుల మత వర్గ జాతి ప్రాంతీయ పరిమితులన్నింటిని అధిగమించింది. దళిత కవిత్వంలో వ్యక్తీకరణ కేవలం వ్యక్తిగతమైనదిగా మాత్రమే కాకుండా విశ్వజనీనమైనదిగా ఉంటుంది. దళిత కవిత్వంలో సంభాషణ రూపంలో, వర్ణనాత్మకంగాను దళిత జీవితం వ్యక్తీకరించబడుతుంది. దళిత కవులు సామాజిక అమానవీయత గురించిన వార్తలను పత్రికలలో చదివి స్పందించి వాటికి కవితారూపం కల్పించటం దళితకవిత్వంలో సాధారణాంశం. మతం కంటే దేవతావిగ్రహాల కంటే, ఏ ఇతర భావాల కంటే కూడా మానవుడే విలువైన అంశంగా భావిస్తూ ఆ దిశగా సమాజ ఆలోచనలలో మార్పు తెచ్చేందుకు దళిత కవిత్వం ప్రయత్నిస్తున్నది. 

ఈ విధంగా సామాజంలోని నియంతృత్వ భావాల్ని, పోకడల్ని ఖండిస్తూ దళిత కవిత్వం మÖడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. 

చంద్రదోష పరిహారాలు ఏవి #చంద్రాష్టమం #చంద్రదశాకాలం #chandra #moon #dosham #remedies #hindu


 

ఏ రాశి వారు ఎలాంటి వ్యాపారాన్ని చేస్తే కలిసొస్తుంది #business #zodiacsigns #astrology #hindu #beliefs #spiritual


 

తిరుమల శ్రీవారికి జరిగే సేవలు ఏవి #వేంకటేశ్వరస్వామి కైంకర్యాలు #arjithaseva #tirumala #services #bakthi