మొత్తం పేజీ వీక్షణలు

5, ఆగస్టు 2026, బుధవారం

తిరుమలేశ శతకం............ తెల్లరాళ్ళపల్లి

ఈగ్రామం కొల్లాపురం తాలూకాలోనిది. చిక్కేపల్లినుండి తమ బాల్యంలో రామచంద్రరావు  మరియు వారి సోదరులు చదువుకొఱకు కొల్లాపురం వచ్చే దినాలలో ఈ తెల్లరాళ్ళపల్లె దగ్గరగల ఊరిముందరి వాగు దగ్గర చద్ది తినేవారట. ఈ వాగు దగ్గర ఒక చిన్నగుట్ట దానిక్రింద ఒక మోస్తరు దరిఉంది. దాన్ని చూసినపుడు రామచంద్రరావుగారికి ఆనాడే ఎప్పటికైనా ఈ దరిక్రింద వేంకటేశ్వరస్వామిని ప్రతిష్ఠ చేయవలెనని అనిపించిందట. కనుక ఆబాల్యంనాటి కోరికను ఆయన నడివయస్సులో నాగర్‌కర్నూలులో పాండురంగ ప్రతిష్ఠచేసిన పిమ్మట తీర్చుకొని అక్కడ వేంకటేశ్వర ప్రతిష్ఠ చేసినాడు. అయితే ఆయన నాగర్‌కర్నూలులో పాండు రంగని ప్రతిష్ఠచేసిన పిమ్మట శతకం వ్రాయిస్తె, యిక్కడ అట్లాకాక దీన్ని ప్రతిష్ఠ నాటికే వ్రాయించి ముద్రింపించినాడు.

ఈ శతకానికాయన పాండురంగస్వామి ఆలయం ముందే కూర్చుని ఒక కాగితంపై నాకు శతకం వ్రాసిఈయవలసిందని ఆజ్ఞాపత్రం వ్రాసియిచ్చి ఈ శతకం పదేనుదినాలలో కావలె. నేను అక్కడ ప్రతిష్ఠ ఫలానానాడు అనుకు న్నాను కాబట్టి ఆనాటికి పుస్తకాలే రావలెనని అన్నాడు. అదివిని మొదటి శత కానికే ఎంతో తిప్పలయిందిగదా ! పదేనుదినాలే అంటున్నాడు మళ్ళి దీని కెంత తిప్పలౌతుందోనని ఆలోచనలో పడినాను. 

ఈనాటికి జాతీయపాఠశాలకు ఇపుడున్న భవనం ఏర్పడింది. అది ఏర్పడిన క్రొత్తలో దాని ఎదురుగా ఈనాటి షాపింగ్‌కాంప్లెక్స్ వెనుక ఒక చిన్న పార్కు అభివృద్ధిచేయబడింది. అందువల్ల ఆనాడు లీజరుపీరియడులో అధ్యాపుకులు తరచుగా ధూమపానానికి ఆ పార్కులోనే ఉంటుండేవారు. అప్పటికి నేనుగూడ ధూమపాయినే. అందుచేత ఎవరు ఉన్నా లేకున్నా లీజరుపీరియడులో నేను మాత్రం స్టాఫురూముకంటె ఆ పార్కులోనే ఎక్కువగా ఉండేవానిని అపుడు ఊరక కూర్చునే బదులు ఏదైనా పద్యసాధనచేస్తె బాగని ఒక కందం, ఒక తేటగీతి, ఒక సీసం అనేవి సాధనగా పెట్టుకున్నాను.

మొలకమామిడిలో ఉన్నపుడు నేను చాలా పద్యాలే వ్రాసినాను కాని అప్పటికి నాకు ఛందోపరిచయంగాని యతిప్రాసల లక్షణాలుగాని తెలి యవు.శతకపద్యాలు బాగా కంఠతః వచ్చేవి కాబట్టి వానిని బట్టియే నాపద్యం ఎక్కడ కుంటుతుందో తెలిసి అక్కడ పదం మార్చుకునే వానిని. కాని యిపుడట్లాకాదు. ఓరియంటల్ పరీక్షల పుణ్యమా అని ఛందోపరిజ్ఞానం, యతిప్రాసల లక్షణం, అలంకారశాస్త్ర పరిచయం ఏర్పడినవి. కాబట్టి యిప్పటికి ప్రతిపద్యం సలక్ష ణంగానే ఉండేది. 

భారతి విధిగా రెండుమÖడుసార్లు చదివేవానిని. ఇంకా యితర పత్రి కలు నేను కొనకున్నా స్టాఫులో ఎవరో ఒకరు ఏదో ఒకటి కొంటూనే ఉండే వారు. దీనికితోడు లైబ్రరీ నాచేతిలో ఉండేది. దినం ఒక క్రొత్తపుస్తకం ఏదైనా చదువవలెననే నియమం ఉండేది కాబట్టి నేను చదివినవానిలో కవితా భావన గల వాక్యాలు లేదా విషయాలు గుర్తుంచుకుని దానిని నేను నియమంగా పెట్టుకున్న కంద గీత సీసాలలో దేనిలో యిమిడితె ఆ విషయం ఆ పద్యంగా వ్రాసికునేవానిని. కందగీతాలు మÖడుపాదాలకే విషయం ముగించేవానిని. నాలుగవపాదం మకుటం కొరకు విడిచినాను. కాలాంతరంలో ఎవరైనా ఏదైనా శతకం కావలెనన్నపుడు వారికి వారు కోరిన మకుటంలో ఈ పద్యాలీయవచ్చు ననుకున్నాను.

సీసాన్ని నాలుగు పెద్దపాదాల పిమ్మట రెండు చిన్నపాదాలలో మాత్రమే ముగించి తక్కిన రెండు మకుటం కొరకు వదలినాను. కనుక చిక్కేపల్లివారి మాటలు విన్న పిమ్మట యింటికి వచ్చి ఆలోచనలోపడగా నా సీసాలు జ్ఞాపకం వచ్చి నవి. కాని అవి దేవతాస్తుతులు కావు పూర్తిగా సామాజికం. అందువల్ల అవి చిక్కేపల్లివారితో అంగీకరింపచేయటం ఎలా? అని మీమాంసలో పడి మిత్రుడు వెల్దండవెంకటరావుగారి దగ్గరకు వెళ్ళి విషయం మొత్తం వివరించి నా దగ్గర కొన్ని పద్యాలున్నవి వినండి. ఇవి వారికి సరిపోతె మకుటంకూర్చి యిస్తానన్నాను. ఆయన ఏదీ వినిపించుమన్నాడు. నేను వినిపించినాను. ఒకరకంగా ఇవి అధిక్షేపాలు. సంఘానికి పెట్టిన చురకలు. వెంకటరావుగారు ఆధునికభావాలు గలవాడు. ఆయనగూడ కవియే. కరణాలను గుఱించి వారి పరిభాషలో ఒక శతకం కరణాలచర్యలన్ని వివరిస్తూ వ్రాసినాడటగాని అది లభించకపోవటం దురదృష్టం. నా పద్యాలు విని ఆయన కొన్నిటికి నవ్వుకొని కొన్నిటికి సంతృప్తిపడి, భేష్ ఈ పద్యాలు బాగానే ఉన్నవి. నేను చిక్కేపల్లివారితో చెప్పి వీని నంగీక రింప చేస్తానన్నాడు. దానితో నాకు కొత్తగా వ్రాసే బెడద తప్ప్పుతున్నందుకు ధైర్యం వచ్చింది. కాని అవి అప్పటికి అరువదిమాత్రమే ఉన్నవి. వెంకటరావుగారు నాకు  మాట యిచ్చినట్లుగానే చిక్కేపల్లివారితో లింగమÖర్తి దగ్గర ప్రస్తుతం ఒక శతకం ఉంది. పద్యాలమోఘంగా ఉన్నవి. అని చెప్పగా వారు నన్ను పిలిచిరి. వినిపించటానికి ఒక ఆదివారాన్ని నిర్ణ యించినాడు.

ఆనాడు చిక్కేపల్లివారింటిలో వెంకటరావుగారు, చెరువు రామా రావుగారు, వకీలు నరసింగరావుగారు సమావేశమై కూర్చుండి నన్ను పిలిపిం చగా కాపి తీసికుని వెళ్ళి వారికి వినిపించసాగినాను. వారిలో చెరువు రామారావుగారు ఉర్దూసాహిత్యంలో దిట్ట. రసహృదయం కలవాడు. కనుక నా పద్యాలు విని ఆ పదాలవెనుక ఉండే హాస్యాన్ని లేదా చురకను గమ నిస్తు చాలా బాగున్నవి చాలాబాగున్నవి అని వాహ్‌వాహ్ అన్నాడు. చిక్కేపల్లి వారు గూడ కొన్నిటికి నవ్వుకున్నారు. అయితె వానిలో నేను కొన్ని పద్యాలలో నీయకులే లంచాలు పడుతున్నారు. త్రాగుతున్నారు. ఇంక సామాన్యుల నెట్లనవలె ` అని చెప్పగా అటువంటివారిని రామచంద్రరావు గారాక్షేపించినారు. నాయకులే లంచగొండులైనారు నిజమే. కాని  కాని మీరు అది నిరూపించగలరా ! త్రాగుబోతులు సరేకాని మీరు అదిగూడ నిరూపించి బహిర్గతం చేయగలరా అన్నాడు. అదివిని నేనవాక్కునైనాను. అపుడు వారు నాయకులవంటివారి దుశ్చర్యలు చెప్పవద్దు. సామాన్యజనులవి దుష్టులవి చెప్పవచ్చు కాబట్టి అవి తొలగించండి అన్నారు. నేను సరేనన్నాను. ఒకపెద్ద బరువు తీరి తృప్తిగా శ్వాసపీల్చుకున్నాను.

తరువాత యిల్లు చేరి ఇంక నలువది పద్యాలు కావలసి ఉన్నవి కాబట్టి వేర్వేరు విషయాలపై వ్రాసిన మరోపదేడుండగా వానిని కలుపుకొని తక్కినవి వ్రాసి అన్నీ ఒక్కముఖంచేసి 108 భర్తీచేసినాను. ఎవరైనా నా పుస్తకాన్ని వేయించినపుడు దానిలో వారి వంశాన్ని సమగ్రంగా చెప్పవలెనని నియమం పెట్టుకున్నాను.  కనుక అది పాండురంగ శతకంలోనే చెప్పవలసింది. కనుక యిపుడైనా చెబుదామని దాన్ని నేను మళ్ళీ క్రొత్తగా వ్రాయటంకంటె రామచంద్రరావుగారు వెనుకట మందడి వెంకటకృష్ణకవిప పాండురంగభక్తవిజయం వ్రాయగా దాని ముద్రణ కానాడు 116/` లు యిచ్చినాడు కనుక ఆయన దానిలో అప్పటివరకు వర్ధిల్లిన రామచంద్రరావువంశాన్ని వర్ణించినాడు. నేను ఇది తెలసి దాన్ని సంపాదించి దానిలోనుండి రామచంద్రరావు వంశాన్ని ఉద్ధరించుకుని దాని తరువాయిగా ‘అనంతరాభ్యుదయం’ అనే పేరున ఆ వంశాన్ని శతకకాలంవరకు పూర్తిచేసి వారికీయగా వారు దాన్ని హైదరాబాదుకు కొనివెళ్ళి ఈ పర్యాయం వాన మామలై వరదాచార్యులతో పీఠిక వ్రాయించి శ్రీ ఎస్.వి. రామారావుగారు అప్పటికొక అచ్చుశాల నడుపుతుండగా దానిలో  ముద్రణకు యిచ్చినాడు. ప్రతిష్ఠనాటికి పీఠికతప్ప విషయమంతా ముద్రణయింది. కాబట్టి ఆయన ఒకిరువది ముప్పది కాపీలు బైండుచేయించి యిచ్చినాడు. ఇట్లా  మొదటిసారిగా నా పుస్తకం ఒకటి వారిచేతుల మీదుగా ముద్రణ జరిగి నేనెవరో రామారావుగారికి, నేనూ, నా చదువు తెలిసివచ్చింది.

రామచంద్రరావుగారు స్వామిప్రతిష్ఠనాడు నన్ను తోడ్కొని వెళ్ళినాడు. కొల్లాపురం లక్క్ష్మణాచార్యులు ప్రతిష్ఠాకార్యక్రమం నిర్వహించినారు. సాయం కాలం కావచ్చింది. అపుడు పుస్తకాలు స్వామి ముందుంచి పూజచేయించి లాంఛనంగా అక్కడనే ఆవిష్కరణ జరిపించినారు. ఇది జరిగిన అనంతరం అక్కడ శ్రీమాన్ రామారావుగారి ప్రెస్ ఏదో పేచీలోపడి పుస్తకా లాగిపోయినవి. నాలుగైదేండ్లు గడిచిన పిమ్మట వారు ప్రెస్‌ను అమ్మివేస్తూ తెల్లరాళ్ళపల్లి శతకం పాఠాలన్ని పుస్తకాలుగా బైండుచేయించి వానితోపాటు పోయింది అనుకున్న వానమామలైగారి పీఠినుగూడ మళ్ళీ భద్రంగా పంపినారు. ఈ తరువాత కీ.శ.1999 లో సీతారామచంద్రరావుగారి తండ్రిగారి శతజయంతి జరిపి పాండురంగ విఠ్ఠలశతకం, తెల్లరాళ్ళపల్లి తిరుమలేశ శతకం రెండు కలిపి ఒక్కటిగా ముద్రింపించినారు. అపుడు నేను దానిలో శ్రీమాన్ వానమామలవారి పీఠికను చేర్చినాను.

ప్రదీప్ రావత్ #pradeeprawat #biodata #family #biography #tollywood #celebrities


 

3, ఆగస్టు 2026, సోమవారం

బంగారం ఎక్కడ తక్కువకు లభిస్తుంది #gold #cheap #price #rate #lowprice #jwellery #ornaments


 

సాహిత్య విద్యార్థులందరికీ గురువు కపిలవాయి...

నేను పాలెం ప్రాచ్యకళాశాలలో 1965-66 , 1966-67 విద్యా సంవత్సరంలో డిప్లమా ఓ.ఎల్.చదివాను. శ్రీ కపిలవాయి లింగమÖర్తి ప్రాచ్యకళాశాలలో ఉపన్యాసకులు. నా చదువు ఆ రెండుసంవత్సరాలే. ఆ తర్వాతవారు ఉపన్యాసకులుగా వచ్చారు. నేను అప్పటికే మాడ్గుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగుపండిట్‌గా చేరాను. అయినా వారు నాకు గురుతుల్యులు. 

నేను 1973 నుండి 1985 మధ్యకాలంలో కామారెడ్డి డిగ్రీ కళాశాలలో తెలుగు ఉపన్యాపకుడిగా పనిచేశాను. 1975-82 మధ్యకాలంతో నేను తెలుగు పొడుపు కథŠలపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని తెలుగుశాఖలో ఆచార్య సి. నారాయణరెడ్డి గారి పర్యవేక్షణలో పిహెచ్.డి.చేశాను. 

ఆ సందర్భంలో రెండు పర్యాయాలు నాగర్‌కర్నూలులో గురువుగారిని కలిశాను. నా పరిశోధన విషయం చెప్పాను. ఆ సందర్భంలో వారు నా సందేహాలు తీర్చారు. అంతేగాక తమ దగ్గర ఎప్పటి నుండో దాచుకొని ఉన్న అచ్చుకాని కొన్ని పొడుపు పద్యాలిచ్చారు. అవి ‘పాపిశెట్టి సీతారామకవి’ వ్రాసినవి. వాటికి కొంత వ్యాఖ్యానం చేర్చి, మరికొన్ని పొడుపు పద్యాలు చేర్చి నేను ‘తెలుగు పొడుపు పద్యములు’ అనే చిన్న గ్రంథం ప్రచురించాను. గురువుగారు చేసిన సహాయాన్ని, ఇచ్చిన పద్యాలను వాటి ఆ పరమార్థాల్ని వివరించాను. పైగా నా పరిశోధనలో అవి యెలా ఉపయోగపడ్డాయో పేర్కొన్నాను. నాకు అర్ధం తెలియని కొన్ని పాదపుపద్యాలకు వారు తెలిపిన విధానాన్ని కూడా తెలిపి గురువు కపిలవాయి లింగమÖర్తికి నమస్కరించి కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలుపుకొన్నాను. ఆ తర్వాత కూడా వారిని అనేక పర్యాయాలు కలిశాను. వారి సాహిత్యంపై అక్కడక్కడ ప్రసంగించాను. 

ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో నేనున్నప్పుడు వారి శతక సాహిత్యంపై శ్రీ అల్పూరి అనంతరాములు, ‘కపిలవాయి లింగమÖర్తి శతకాలు ఒక పరిశీలన’ అనే అంశంపై ఎంఫిల్ నా పర్యవేక్షణలో పూర్తిచేశారు. ఆ విధంగా గురువుగారి ఋణం తీర్చుకొనే అవకాశం నాకు చిక్కింది. వారు విశ్వబ్రహ్మ. వారు పాలమÖరుకే కాదు, తెలుగు సాహిత్యానికే గురువు. పాలమÖరు విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న ఎం.వి.ఎస్. ఆర్ట్స్‌కళాశాల తెలుగుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కపిలవాయి సాహిత్యసమాలోచన సదస్సు’ లో విశిష్ఠాతిధిగా పాల్గొంటూ ఇలా స్మరించుకొంటున్నాను.

కపిలవాయి గారి వ్యక్తిత్వం- మÖర్తిమత్వం

శతాధిక గ్రంథకర్త, అపూర్వ గ్రంథ పరిష్కర్త, ఉత్తమోత్తమ గురువులైన లింగమÖర్తిని ప్రస్తుతిస్తూ వారి శిష్యుడు రుక్మాంగద రెడ్డి వ్రాసిన ఈ పద్యం వారి వ్యక్తిత్యమÖర్తిమత్వాలకు దర్పణంగా నిలుస్తుంది. 

సీ. మనిషిలో నిద్రాణమై యున్న జ్ఞానమ్ము 

మేల్కొల్పగలవాడు మేటి గురువు

కుల మతమ్ముల కూలగొట్టి అభ్యుదయమ్మ 

సాధించుమను వాడు బోధ గురువు

చదువుట సంపద సమమార్చుటకు గాదు

సేవకైయనును విశిష్ట గురువు

మణికిరీటము ధరించిన గర్వమబ్బును 

తలవంచుకొనుమను తత్త్వ గురువు 

ఆ.వె. వెలుగు నిచ్చువాడు తెలివినిచ్చెడివాడు 

అఖిల జనులు సమములనెడు వాడు

మణులుకాదు మట్టి మనకు జీవన మంచు 

బోధ పరిచె లింగమÖర్తి గురుడు

(ఉన్నోళ్లు - పోయినోళ్లు, పుట:32) 

నిజమే! వారు మేటి గురువు, బోధగురువు, విశిష్టగురువు, తత్త్వగురువు, మట్టినే మహత్రనకంగా నమ్మిన మహాగురువు. ఆ గురువుగారికి రుక్మాంగదుని వంటి శిష్యులెందరో ఉన్నారు. 

యోగివేమన బోధను నమ్మినవారి శిష్యులు. 

ఆ.వె. గురువు శిక్షలేక గురుతెట్టు కలుగురా ! 

అజునికైన వాని యబ్బకైన

తాళపు చెవివేక తలుపెట్టులూడరా !

విశ్వదాభిరామ! వినురవేమ! 

అవును! మనకు జ్ఞానం గురువే ప్రసాదిస్తారు. ఈ శరీరం తలిదండ్రు లిచ్చేది. కాని జ్ఞానశరీరం గురువు ద్వారానే లభిస్తుంది. అలాంటి పరమోత్తమ గురువు ‘గురునాం గురువు’ లింగమÖర్తి. 

అంత గొప్ప గురువు సామాన్యునిలో సామాన్యునిగా కనిపించేవారు. వస్త్రధారణలో అతిసాధారణ పండితులుగా ఉన్నా ప్రతిభాపాండిత్యంలో మాత్రం సమున్నత స్థానంలో ఉన్నవారు. లింగమÖర్తిగా కనిపించిన రంగమÖర్తిగా భాషించే హరిహరాద్వైతి వారు. గ్రంథపరిష్కర్తగా ఉభయ రాష్ట్ర పరిష్కర్తల్లో ప్రప్రథమ స్థానంలో నిలిచే శోధకులు. 

ఆయన కూచున్నా, నిలుచున్నా, నడిచినా ఆయన్ను కదిలిస్తే ఓ విజ్ఞాన సర్వస్వంగా కనిపించేవారు. సృజనాత్మక సాహిత్యంలో పద్య, గద్య, వచన, గేయ ప్రక్రియల్లోనూ నిలిచిన సాహిత్య స్రష్ట. అపూర్వలిఖిత ప్రతులసేకర్త. తాళపత్ర గ్రంథాల సమీకర్త. ఒక విధంగా వారు పరిశోధకుల పాలిటి కల్పవృక్షం. 

గ్రంధ గ్రంథులు తెలియని వారికి వివరించి చెప్పిన మహామేధావి.  గ్రామనామాల పరిశోధనలో ఎందరికో మార్గదర్శకులు. భాషా, వ్యాకరణ,  అలంకార, ఛందోలక్షణాది సాహిత్యశాస్త్ర నిష్ణాతులు. వీటన్నిటితోపాటు వారు చారిత్రిక శాస్త్రవేత్త, జానపద విజ్ఞానశాస్త్రవేత్త కూడా. సాహిత్య పద్య, గద్య సంకలనకర్త. దేవాలయ ఆగమ శాస్త్రవేత్త. రాజయోగ, అచలయోగ, కర్మ, జ్ఞాన, భక్తి, ధ్యాన యోగాది తాత్త్విక రహస్యాలు తెలిసిన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. ‘కృషితో నాస్తి దుర్భిక్షమ’ అని నమ్మిన సాధకులు వారు. మొత్తమ్మీద చెప్పాలంటే నిరంతర సాహితీక్షేత్ర కృషీవలుడు.

సాహిత్యం ద్వారా జీవనవికాసం 

వ్యక్తి - కుటుంబం - సమాజం - ప్రాంతం - దేశం- విశ్వం ఇవన్నీ (వ్యక్తులు - సంస్థలు) అన్నీ సాహిత్యం ద్వారానే వికసిస్తాయని నమ్మి అనేక రచనలు చేశారు లింగమÖర్తి. తిరుమలేశ శతకంలోని ఈ పద్యం చూడండి. 

సీ. గీత బోధించెడు రీతిగా నడవక 

హిందువు నేనన్న కందు గాదె

పిటకముల్ బోధించు విధులు పాటించక

బౌద్ధుడనని యన్న పాటియగునె

అల కురాను వచించు నట్టుల నడవక 

మహమదీయుడనన్న మాయగాదె

బైబిలు జెప్పెడి పద్ధతి విడిచియు

క్రైస్తవుండనటన్న కల్లగాదె 

గీ. మతము మనుజుని హితమునే కుతుక పడెను 

గాని sTÖనాడు దానిని గాంతురెవరు?

భక్తజన పోష ! తెలరాలపల్లి వాస!

దితిజవిద్వేష ! బధతోష! తిరుమలేశ! (6.ప) 

హిందూ బౌద్ధ - ఇస్లాం - క్రైస్తవమతాల వారు వారివారి మతగ్రంధాలు బోధించే నీతి-నియమాలను పాటిస్తే మంచిదని వారి అభిప్రాయం. 

మనిషి పశువు నుండి ఎదిగి పశుపతి స్థానానికి చేరుకోవడమే వికాసం. కాని తనచుట్టూ ఉన్న జంతువుల్లాగానే ఉంటే ఎలా? చూడండి ! ఎన్ని జంతువుల గుణశీలాలు మనిషికున్నాయో! 

సీ. నక్కవినయంబులు, కుక్క పంచాయితి 

పిల్లి శీలంబును, పీతÁనడక 

కోతి యల్లరి, మేకపోతు గంభీరము

గాడిద గత్తర, కోడె పొగరు

మర్నాగి బుద్ధులు, మకరపు పట్టును

నల్లికుట్లూసరవిల్లి రంగు

మీను మిడిసిపాటు, మిడుతాట మరియును

కొంగజపంబును, గొఱ్ఱెదాటు 

గీ. మాననందకు జంతువే మానవుండు

నాగరిక మెంత పెరిగిన నాటకంబె 

భక్తజనపోష! తెలరాల పల్లివాస!

దివిజవిద్వేష ! బుధతోష! తిరుమలేశ! (8.ప)

నక్క, కుక్క, పిల్లి, పీతÁ, కోతి, మేక, గాడిద, కోడె, మర్నాగి, మకరం, నల్లి, ఊసరవిల్లి, మీను, మిడుత, కొంగ, గొఱ్ఱె... వీటిగుణాలన్నీ మనిషిలో ఉన్నాయి. ఇవి మాని మనిషి మాధవుడు కావాలన్నదే వారి సందేశం. 

ఇలా వారి ప్రతి గ్రంథం సామాన్యులకూ, సాహిత్యాధ్యయనశీలురకూ మాs్గÁ దర్శనం చేస్తుంది. వ్యక్తి శ్రేయస్సు నుండి విశ్వశ్రేయస్సు వైపుగా పయనింపజేస్తుంది.

(అంతర్జాతీయ సదస్సు ప్రారంభంలో ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డిగారి సందేశము)

హిందువుగా పుట్టినందుకు - దొడ్డ మానవుడవు కసిరెడ్డి

 సీ. హిందువుగా పుట్టినందుకు జన్మ ధ

న్యత నొందెననెడు ఆనంద బలము

తడయక పెక్కు గీతా యజ్ఞములయందు

భాషించినప్పటి ప్రాభవమ్ము 

హాయిగా విష్ణు సహస్రనామావళి

పఠియించినప్పటి పరమనిష్ఠ

వేదాంతమందలి విషయంబు సుజనుల

కందించినప్పటి ఆత్మతృప్తి

నిన్ను నడిపించుచున్నది నిశ్చయముగ

సర్వలోకేశు నమ్మిన జనుడవగుట 

కర్మ సిద్ధాంతమున నెంతొ గౌరవంబు 

దొడ్డ మానవుడవు కసిరెడ్డి నీవు!

ఏ దేవుడిని దేని కోసం పూజించాలి #god #pooja #result #prayer #stuthi #aradhana #bakthi #devotion #hindu #spiritual