మొత్తం పేజీ వీక్షణలు

13, ఆగస్టు 2026, గురువారం

రాజకీయ కుటుంబాల నేపథ్యాల నుండి సినిమాల్లోకి వచ్చిన ప్రముఖులు ఎవరు #politics #tollywood #filmindustry #part -1


 

తెలుగు సినిమా పాటల పరిశోధకుడిగా భైరవభొట్ల నారాయణరావు


తెలుగు సినిమా ఆవిర్భవించి ఇప్పటికి 75 ఏళ్లు పూర్తయింది. ఇటీవలే వజ్రోత్సవాలను కూడా ఘనంగా చేసుకుంది. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమారంగం జాతీయ, అంతర్జాతీయ విజయాలనెన్నింటినో చవి చూసింది. నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు, గాయనీ గాయకులు, గీతరచయితలు, ఛాయా గ్రాహకులు, నటీనటులు ... ఇలా ఎందరెందరో తెలుగు సినిమారంగ ప్రతిష్ఠను విను వీధుల్లో ఎగురవేశారు. గత 75 ఏళ్లుగా తెలుగు సినిమా చరిత్రను, సాహితీ మÖల్యాలను, ఎప్పటి కప్పుడు బేరీజు వేస్తూ తెలుగు సినీ పరిశోధకులు మన సినిమాను కొత్తపుంతలు తొక్కించారు. 

సినిమా పాట ఆధునిక జీవితమంత వైవిధ్యంతో, సంక్లిష్టతతో శాఖోపశాఖలుగా విస్తరించింది. రసావిష్కరణలో వైవిధ్యం సంగతి అలా ఉండగా, మానవులకు ఉండే సహజగుణాలన్నీ సినిమాపాట, గత డెభ్పై ఏళ్ల కాలంలో కనీసం యాభై ఏళ్ల పాటు అద్భుతంగా ఆవిష్కరించింది. నిజానికి ఏ ఇతర సాహిత్య ప్రక్రియ ఇంతటి వైవిధ్యం, ప్రభావం సమకాలీన ప్రజాహృదయాల మీద ముద్రించలేదు. నేడు సినిమా పాట సామాన్యమానవునికి చేరువై వాళ్లను అమితంగా ఆకర్షిస్తున్న ఏకైక సాహిత్య రూపం. సాహిత్య ప్రక్రియలలో వైదగ్ధ్యం చూపిన రచయితలకు కేవలం సినిమా పాటల వల్ల కీర్తి ప్రతిష్ఠలు గుర్తించి ఇటు జన సామాన్యం, అటు ప్రభుత్వం, సినిమా కవులకిస్తున్న ఆదర సత్కారాలు చూస్తే పాటల కుండే ఆకర్షణ తెలుస్తుంది. ప్రజలు గొప్ప సినీ రచయితలు రాసే పాటలకు బ్రహ్మరధం పట్టడం వల్ల సినిమా పాటకుండే గుర్తింపు తెలుస్తుంది. 

సినిమా పాట ప్రాముఖ్యాన్ని గుర్తించిన ఎందరో పరిశోధకులు సినిమా పాటలను, విశ్లేషణాత్మకంగా పరిశోధించారు. భైరవబొట్ల గొప్ప సినిమా పాటల పరిశోధకుడు. తెలుగు సినిమా పాటల పరిశోధన ప్రస్థానంలో భైరవభొట్ల స్థానాన్ని నిర్ధారించే ముందుగా తెలుగు సినిమా పాటల పరిశోధనలో లబ్ధ ప్రతిష్ఠులైన పరిశోధకుల గురించి స్థూలంగా పరిచయం చేసి ఆ తర్వాత భైరవభొట్ల స్థానాన్ని యిందులో విశ్లేషించడం జరిగింది. 

అలాంటి సినీ పరిశోధకుల్లో ఇంటూరి వేంకటేశ్వరరావు, వి.ఏ.కె. రంగారావు, రావి కొండలరావు, స్వామి చిత్రానంద, ఇంద్ర గంటి శ్రీకాంత శర్మ, ఇంద్రగంటి జానకీబాల, తుర్లపాటి కుటుంబరావు, భమిడి పాటి రామగోపాలం, నేమాని సీతారాం, కంపల్లె రవిచంద్రన్ వంటి పరిశోధకులు ఎందరో తెలుగు సినిమాను, తెలుగు సినిమా సాహిత్యాన్ని విభిన్న రీతుల్లో విశ్లేషించారు.

6.1. ఇంటూరి వేంకటేశ్వర రావు : 

తెలుగు సినిమా రంగానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందించాలని కలం పట్టిన తొలి సినీ పాత్రికేయుడు ఇంటూరి వేంకటేశ్వర రావు. 

గుంటూరు జిల్లా, సత్తెనపల్లి సమీపంలోని చంద్రరాజు పాలెంలో ఇంటూరి జన్మించాడు. శ్రీమతి లక్ష్మీకాంతమ్మ, నరసింహం ఈయన తల్లిదండ్రులు. 1930 లో గాంధీజీ పిలుపునందుకుని, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నాడాయన. ఆ సందర్భంగా ఇంటూరి జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఆ తర్వాత కాంగ్రెసు పార్టీలో చేరాడు. బెజవాడ సిటీ కాం గ్రెసు సెక్రటరీగా పనిచేశాడు. రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర వహిస్తూనే మరోవైపు జర్నలిస్టుగా ‘ఆంధ్ర’ పత్రిక’, ‘స్వరాజ్య’ మొదలైన పత్రికలకు వార్తలందించేవాడాయన. 

1936 లో రాజకీయాలకు స్వస్తి పలికి సామాన్యులు ఇష్టపడే చిత్రరంగంలోకి వచ్చాడు ఇంటూరి. గూడవల్లి రామ బ్రహ్మం సలహా మేరకు ఆయన సినిమా జర్నలిజాన్ని వృత్తిగా చేపట్టి, తొలిసారిగా ‘చిత్రకళ’ అనే పత్రికను 1942 లో ప్రారంభించాడు. 1956 లో ‘సినిమా’ అనే పేరుతో ఒక పక్ష పత్రికను స్థాపించి 1975 వరకు నడిపాడు. 

సినిమాలకు సంబంధించి ఆంధ్రా హాలీ ఉడ్, తెలుగు సినిమా వెలుగులు, ఎక్స్‌ట్రా నటి వెంకాయమ్మ, ఎస్వీ విశ్వరూపం మొదలైన రచనలు చేశాడు ఇంటూరి. నటయోగి నాగయ్య పుస్తకా స్వయంగా ముద్రించాడు. రంగస్థలం పై అభిమానంతో ‘నాటక రంగం’ అనే పత్రికను నడిపాడు. 

50 ఏళ్లకు పైగా తెలుగు సినిమారంగానికి ఇంటూరి చేసిన సేవకు గుర్తింపుగా 1985 లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నుండి ‘కళాప్రపూర్ణ’ పొందాడు. 1976 లోనే గూడవల్లి రామబ్రహ్మం అవార్డు, 1982 లో వెటరన్ ఫిలిం జర్నలిస్టు బంగారు పతకం, 1996 లో ఆంధ్ర ప్రభుత్వం నుండి ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డును ఇంటూరి అందుకున్నాడు. 

తెలుగు సినీ జర్నలిజానికి ఓనమాలు దిద్ది దాని పురోగతికి జీవితమంతా కృషి చేసిన ఇంటూరి 07.05.2001 న మృతి చెంది తెలుగు సినీ పరిశోధకుల్లో అగ్రగణ్యుడిగా నిలిచాడు. 

6.2. వి.ఏ.కె.రంగారావు : 

భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్లు వి.ఏ.కె. రంగారావు రికార్డుల చుట్టూ తిరిగే నిత్యాన్వేషి. ఆయన ఇప్పటికి సుమారు 45 వేల రికార్డులకు పైగా సేకరించాడు. ఏ విశ్వవిద్యాలయం, ప్రభుత్వ సంస్థ చేయలేని పనిని ఆయన ఒక్కడే చేయ గలిగాడు. వి.ఏ.కె.రంగారావు 11.06.1935 న జమీందారీ కుటుంబంలో జన్మించాడు. ఆయన చిన్నప్పటి నుండి గ్రాం ఫోను రికార్డులను విపరీతంగా అభిమానిం చేవాడు. చదువుకునే రోజుల్లో, ఇంట్లో వాళ్లు చేతి ఖర్చులకు ఇచ్చే డబ్బును కూడా గ్రాం ఫోను రికార్డులు కొనడానికే వినియోగించేవాడు. అలా ఆయన తన 17వ ఏటనే 20 వేల రికార్డులు పొందుపరచుకోగలిగాడు .

1960లో ‘సినీప్రభ’ అనే పత్రికలో ‘రికార్డు రివ్యూ” అనే శీర్షికతో ప్రారంభమైన వి.ఏ.కె. సాహితీ రచనా వ్యాసంగం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఆయన 1960 లో చెన్నైలో స్థిరపడ్డాడు. బాపు, రమణల ప్రోత్సాహంతో ఆంధ్రపత్రికలో ‘సరాగమాల’, ‘విన వేడుక ‘ సినీ శీర్షికలు నడిపాడు. 1982 లో ‘స్క్రీన’ అనే ఇంగ్లీషు పత్రికలో ‘ది సౌండ్స్ ఆఫ్ ది మÖ్యజిక’ అనే శీర్షిక 112 వారాలు నిర్వహించాడు. ఈయన పర్యవేక్షణలో సుమారు 25 ఎల్.పి. రికార్డులు, క్యాసెట్లు వచ్చాయి. ఈయన ఎన్నో రకాలైన రికార్డులు భద్రపరిచాడు. 

6.3. రావి కొండల రావు : 

రావి కొండలరావు 1931 లో జన్మించాడు. చిన్నతనం నుండే సోదరుడు ఆర్.వి. చలంతో కలసి నాటకాలాడేవాడు. ‘సుకుమార’ అనే పేరుతో ఆర్కెస్ట్గ్రా నడిపేవాడు. ఈయన సినీ రంగానికి రాకమునుపే కథకుడుగా, నాటక కర్తగా, నాటక నిర్వాహకుడుగా తెలుగువారికి చిరపరిచితుడు. 

రావి కొండలరావు సుమారు రెండు దశాబ్దాలపాటు ‘విజయచిత్ర’ కు సంపాదకత్వం వహించాడు. “చల్లని నీడ”, “పెళ్లి పుస్తకం” చిత్రాలకు ఈయనే కథల్ని సమకూర్చడం విశేషం. అలనాటి చిత్రాల విశేషాలను రాసిన రావి కొండలరావు ఉత్తమ సినీ గ్రంథ కర్తగా నంది అవార్డును కూడా అందుకున్నారు.

6.4. పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు : 

తుర్లపాటి కుటుంబరావు తన 14 వ యేటనే జర్నలిజంలోకి అడుగిడిన ఘనాపాఠి. 20 వ ఏటనే ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశంకు కార్యదర్శిగా వ్యవహరించి, ఆచార్య ఎన్.జి.రంగా ‘వాహిని’తో జర్నలిజం జీవితాన్ని ప్రారంభించి, ‘ఆంధ్రజ్యోతి’ లో కొన సాగిన వ్యక్తి, తుర్లపాటి. 

వేలాది పుస్తకాలు రచించి, ఆనాటి గవర్నర్ డా. శంకర్ దయాళ్ శర్మ నుంచి తెలుగు వర్శిటీ ‘ఉత్తమ జీవిత చరిత్ర కారుడు’ పురస్కారం, ప్రధాని పి.వి. నరసింహారావు నుంచి ‘నేషనల్ సిటిజన్ అవార్డు’, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ’, భారత ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ’ బిరుదు పొందిన తొలి తెలుగు పాత్రికేయుడు తుర్లపాటి. 

ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం ఫాన్స్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శిగా రెండు దశాబ్దాల పాటు వ్యవహరించి, రాష్ట్రప్రభుత్వంచే ఏడు సార్లు నంది ఫిలిం అవార్డుల కమిటీలో సభ్యుడిగా నియమించబడి, అసలు ఆ అవార్డుల రూపకల్పనకే దోహదం చేసిన చలన చిత్ర పరిశ్రమ బంధువు తుర్లపాటి ! 

6.5. స్వామి చిత్రానంద (కె.వి.రావు) : 

తెలుగు సినీ పరిశోధకుల్లో చిరస్మరణీయుడు కె.వి.రావు. ఆయన కలం పేరు స్వామి చిత్రానంద. 

పూర్ణా పిక్చర్స్‌లో పబ్లిసిటీ ఇన్ ఛార్జిగా ఉద్యోగం ప్రారంభించిన కె.వి.రావు, అనతి కాలంలోనే ప్రముఖ దర్శక నిర్మాత హెచ్. ఎం. రెడ్డి దగ్గర అసిస్టెంటు స్థాయికి ఎదిగాడు. ఈయన “బీదల ఆస్తి”, “వద్దంటే డబ్బు” చిత్రాలకు సహాయ దర్శకునిగా పనిచేశాడు. అక్కడ నుండి అక్కినేని సంజీవి దగ్గర 2 చిత్రాలకు, ప్రత్యగాత్మ, ఆదుర్తి లకు చెరొక చిత్రాన్ని, బాపు దగ్గర 13 చిత్రాలకు సహాయ దర్శకునిగా పని చేశాడు. 

సినిమా పరిశ్రమలో తానెంత బిజీగా ఉన్నా, సాహితీ వ్యాసంగం మానలేదు స్వామి చిత్రానంద. ఇప్పటి వరకూ ఆయన 60 కథలు, 

3 నవలలు, 2 ధారావాహికలు, ఒక టి.వి. ధారావాహిక, 2 రేడియో నాటికలు రచించాడు. ఇంకా సినిమాలకు సంబంధించిన విషయాలెన్నో ప్రముఖ సినిమా పత్రికైన ‘విజయచిత్ర’, రచన, జ్యోతి మాసపత్రిక), హాసం మొదలైన పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. ఈయన రాసిన సినిమా వ్యంగ్య రచనలు ‘మాయాబజార’ అనే గ్రంథంగా వచ్చాయి. ఈయన 2006లో మరణించి సినీ పరిశోధకుల్లో 

చరితార్థుడయ్యాడు. 

6.6. కంపల్లె రవిచంద్రన్ : 

డెభ్భై ఐదేళ్ల తెలుగు సినీరంగ చరిత్రను, మÖడుపదులు వయసులోనే ఔపోసన పట్టిన ఘనత కంపల్లె రవిచంద్రన్‌కు దక్కుతుంది. 19.03.1979 న చిత్తూరు జిల్లా, పుంగనూరు గ్రామంలో రవిచంద్రన్ జన్మించాడు. 

చిన్నప్పటి నుంచి సినిమాలను విపరీతంగా చూసే వాడీయన. దాంతో సినిమాలలోని పాటలను నిశితంగా పరిశీలించడం నేర్చుకున్నాడు. దానికి తోడు సినిమా పత్రికలైన విజయచిత్ర, సితార మొదలైన సినిమా పత్రికలను చదివి, సినిమా వ్యాసాలు రాసేవిధానం తెలుసుకున్నాడు. వి.ఏ.కె. రంగారావు, స్వామి చిత్రానంద, బొమ్మకంటి సుబ్బారావు, ఇంద్ర గంటి శ్రీకాంత శర్మ, ఆరుద్ర వంటి సినీ సాహితీ పరిశోధకులు రాసిన ఎన్నో వ్యాసాలు చదివి చాలా చిన్నతనంలో నుండే వాటిని సేకరించడం ప్రారంభించాడు. పాటల పుస్తకాలు అన్నింటినీ రవిచంద్రన్ ఈ నాటికీ భద్రంగా దాచి ఉంచాడు. “పుట్టింటి పట్టు చీర” చిత్రం పై రవిచంద్రన్ తొలిసారిగా ఆంధ్రప్రభలో సమీక్ష రాశాడు. బహుముఖ ప్రజ్ఞాశాలి పి. భానుమతి, తొలిసారిగా ఈయనలోని ప్రతిభను గుర్తించి, చాలామంది ప్రముఖులకు పరిచయం చేసింది. 

అలా పరిచయం చేసిన ప్రముఖుల్లో కె.వి.రావు ప్రముఖుడు. ఆయన రవిచంద్రన్ ను ఎన్. టి. రామారావు దగ్గరకు తీసుకెళ్లి, పరిచయం చేశాడు. రామారావు తను అప్పట్లో నిర్మిస్తూ ఉండిన “శ్రీనాథ కవి సార్వభౌమ” చిత్రానికి స్వామి చిత్రానందకు అసిస్టెంటుగా పని చేయమన్నాడు. అలా ప్రారంభమైన రవిచంద్రన్ సినీ జీవిత ప్రస్థానం ఎన్నో మలుపులు తిరిగింది. 

యువచిత్ర అధినేత డా. కాట్రగడ్డ మురారి పర్యవేక్షణలో తయారైన ‘తెలుగు సినిమా నిర్మాతల చరిత్ర’ గ్రంథాన్ని రవిచంద్రన్ రాసిందే. డా. కొంగర జగ్గయ్య గౌరవ అధ్యక్షులుగా వ్యవహరించిన ‘మనస్విని’ సంస్థకు రవిచంద్రన్ అనేక సార్లు న్యాయ నిర్ణేతగా, సలహా దారుడు గా వ్యవహరించాడు. ప్రముఖ సినీ సంగీత దర్శకుడైన ఎం. ఎం. కీరవాణి జీవిత చరిత్రను కూడా రవిచంద్రన్ రచించాడు. ఈయన ఇప్పటికీ వివిధ పత్రికల్లో సుమారు 500 వ్యాసాలను, 25 దాకా కథలను, ఒక నవలికను రచించారు. ఒంగోలు జిల్లా, కనిగిరి నుంచి వెలువడుతున్న ‘ఘంటసాల’ అనే సినీ సంగీత పత్రికకు గౌరవ ఉపసంపాదకులుగా, తి.తి.దేవస్థానం ‘సప్తగిరి’ మాసపత్రిక ఉప సంపాదకులుగా వ్యవహరిస్తున్నాడు. 

ఈయన రచించిన ‘జ్ఞాపకాలు’ అనే గ్రంథం ఇప్పటికి అనేక ముద్రణలకు నోచుకుని, రవిచంద్రన్ కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింపజేసింది. 

పైన పేర్కొన్నవారే కాకుండా ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ఇంద్రగంటి జానకీబాల, గొల్లపూడి మారుతీరావు, హెచ్.ఎస్. బ్రహ్మానంద, ఎస్.వి.రామారావు, హెచ్. రమేష్ బాబు, హాసం’ రాజా, చల్లా సుబ్బారాయుడు, జె. మధుసూదన శర్మ, డా. కె.వి.రావు, ఆచార్య వి. చంద్రశేఖర్ రెడ్డి, వి. బాబూరావు, యం. సంజయ్ కిషోర్, మరియు డా. మేడిపల్లి రవికుమార్ మొదలైన వారంతా తెలుగు సినీ పరిశోధనలకు విశేషమైన కృషి చేశారు, చేస్తున్నారు. వీరందరితో పాటు స్మరించుకోదగిన విశిష్ట పరిశోధకుడు, పరిశోధకులకే మార్గ దర్శకుడు భైరవభొట్ల. 

భైరవభొట్ల నారాయణరావు వృత్తి రీత్యా హిందీ ఉపన్యాసకుడు అయినప్పటికీ, ప్రవృత్తి రీత్యా సినిమా సాహితీ పరిశోధకుడు, తన పరిశోధనల నిమిత్తం కృష్ణాజిల్లా, గుడివాడలో ‘చలన చిత్ర పరిశోధనా కేంద్రాన్ని రెండు దశాబ్దాల క్రితమే ప్రారంభించాడు. ప్రతిపనికీ ఒక ధ్యేయం ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది. లక్ష్య శుద్ధిని బట్టి కార్యసిద్ధి, తదనంతరం ప్రతిఫలం సహజంగా ఉంటాయి. కానీ కేవలం పాటలపైన ఇష్టం. అభిమానం, ప్రేమ ఒక తపనగా మారి ఒక వ్యక్తి చేత ఇంత చేయించడం సాధ్యమా అనిపిస్తుంది. ఎందుకంటే భైరవభొట్ల బాల్యంలో స్కూలుకు వెళ్లే రోజుల్లో ఏ చిరుతిండ్లో కొనుక్కోవడానికి ఇచ్చిన చిల్లర డబ్బులతో సినిమా పాటల పుస్తకాలు కొన్నప్పుడు ఆయన కున్నది కేవలం ఆసక్తి మాత్రమే. భైరవభొట్ల 10 వ తరగతికి వచ్చేసరికి వెయ్యి సినిమాపాటల పుస్తకాలు సేకరించాడు. ఆ తర్వాత అవన్నీ పాతబడి చిరిగి పాతబడి చిరిగి పోతున్నాయనే బెంగతో, ప్రతి పాటల పుస్తకాన్ని చేత్తో రాసుకునే వాడు. అలా అప్పటి నుండి ఇప్పటికి 30 వేల పాటల పుస్తకాలు భద్రపరచగలిగాడు. 

ఇంకా అనేక, వీడియో క్యాసెట్లు కూడా ఆయన సేకరించ గలిగాడు. అంతేగాకుండా అక్షర క్రమంలో సినిమా పాటల పుస్తకాలు బైండు చేయబడినవి. అనగా సినిమాలలోని దేశభక్తి గీతాలు, లాలిపాటలు, నాయక  ప్రేమగీతాలు, యుగళ గీతాలు, భక్తి గీతాలు, భగ్న ప్రేమ గీతాలు వస్తుపరంగా, శ్రీశ్రీ సినీగేయ కోశం, ఆత్రేయ సినీ గీతాలు, సినారె సినీ గేయకోశం మొదలైనవి కవిపరంగా రాత ప్రతులు బైండు చేయబడి ఉన్నాయి. అంతేగాక ప్రముఖ సినీపాటలు కేసెట్ల రూపంలోనూ ఉన్నాయి. ఇవన్నీ కొన్ని సంవత్సరాల కృషికి, శ్రమకు నిదర్శనాలు. 

ఈరోజు ఎందరో సినీ పరిశోధకులకు ఒక పెద్ద సినిమా పాటల ఖజానా గా  ‘భైరవభొట్ల చలనచిత్ర పరిశోధనా కేంద్రం’(గుడి వాడ) నిలిచిపోయిందంటే దాని వెనక ఆయన చేసిన అపూర్వమైన కృషి, ఎదుర్కొన్న ఇబ్బందులు పడ్డ కష్టాలు ఎన్నో ఉన్నాయి. చిన్నప్పుడు సరదాగా ప్రారంభించిన పాటల పుస్తకాల సేకరణను ముందు ముందు ఒక భాద్యతగా చేపట్టిన కర్మయోగి భైరవభొట్ల. 

ఈయన చిన్నప్పటినుంచి వివిధరకాల ఆర్థిక సమస్యలతో, కుటుంబ భాద్యతలతో, మానసిక ఒత్తడులతో సతమతమౌతున్నా సరే, తనకు ఎంతో యిష్టమైన సినిమారంగానికి ఒక పరిశోధనా స్థాయిని కల్పించాలని తపన పడ్డ వ్యక్తి. ఆయన స్థాపించిన పరిశోధనా కేంద్రం కృషి ఫలించింది. ఈ రోజున ఎందరో పరిశో ధకులు, భైరవభొట్ల పరిశోధనా కేంద్రంలోని సినిమా పాటలనే ముడి సరుకుతో ఈరోజున ఎందరో పరిశోధకులు భైరవభొట్ల సహకారాలతో అనేక విశ్వవిద్యాలయాల్లో తెలుగు సినిమా సాహిత్యం, కవుల పైన వివిధ కోణాల్లో పరిశోధన చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. 

పుస్తకాలను సేకరించడం ఒక ఎత్తు. వాటిని భద్రంగా సంరక్షించి భావితరాలకు అందించడం ఒక ఎత్తు. అందుకోసం భైరవభొట్ల పడరాని పాట్లు పడ్డాడు. చెన్నై మహానగరంలో తన జీవితమే ప్రశ్నార్థకమైన రోజుల్లో కూడా తను కష్టపడి సేకరించిన పాటల పెన్నిధిని అతి భద్రంగా కాపాడి తన స్వస్థలమైన గుడివాడకు తరలించిన వైనం భైరవ భొట్ల కృషికి నిదర్శనం. కేవలం పాట, పాట రచయిత పేరు మాత్రమే కాకుండా ఆ పాట ఉన్న చిత్రం పేరు, సంస్థ పేరు, చిత్ర నిర్మాత, దర్శకుల పేర్లు, సంగీత, నృత్య దర్శకులు, గాయనీ గాయకుల వివరాలతో పాటు, చిత్రం విడుదలైన సంవత్సరం వంటి వివరాలు కూడా ఆయన దగ్గర దొరకడం విశేషం. 

మొదటి నుండి తాను సేకరించిన సినిమా పాటల పుస్తకాలను ఆయన జాగ్రత్తగా బైండింగ్ చేయించడమే గాక, ఏ బైండింగ్లో ఏ పాటల పుస్తకం ఉన్నది, ఏ పుస్తకంలో ఏ పాట ఉన్నది తెలుసుకునేందుకు ఆయన ఒక ఇండెక్స్ (విషయ సూచిక)ను కూడా తయారు చేసుకున్నాడు. 

ఆ విధంగా ఏ పాట ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేందుకు వీలుగా ఉంచాడాయన. అంతే గాక సినిమా పాటలను వివిధ వర్గాలుగా విభజించి వాటిని వీడియో, ఆ రూపంలో భద్రపరిచాడు. లాలి పాటలు, జావళి పాటలు, యుగళ గీతాలు, ప్రేమ గీతాలు, విరహగీతాలు, మొదలైన విధాలుగా వర్గీకరించి ఏ వర్గానికి ఆ వర్గంగా తన పరిశోధనా కేంద్రంలో భద్రపరిచాడు. 

హిందీ చిత్ర గీతాల నిఘంటువు (గీత్ కోష్) ను చూసి స్ఫూర్తిని పొంది తెలుగు సినిమాపాటల నిఘంటువును పుస్తక రూపంలో తయారు చేశాడు భైరవభొట్ల. ఇందులో ఒక పాటకు సంబంధించిన అన్ని వివరాలు, పాట రచయిత, సంగీత దర్శకుడు, నృత్య దర్శకుడు, గాయనీ గాయకులు, చిత్రం విడుదలైన సంవత్సరం తదితరాలన్నీ పొందుపరిచాడు. ఈయన రూపొందించిన అన్ని సినిమా పాటల నిఘంటువులు రాత ప్రతుల్లోనే ఉన్నాయి. 

మనసుకవి ఆత్రేయ పాటల్ని భైరవ భొట్ల సహాయ సహకారాలతోనే మనస్విని సంస్థ ముద్రించగలిగింది. భైరవభొట్ల దగ్గర ఉన్నంత సినీ సాహిత్య సామగ్రి పూనాలోని ‘ఫిలిం ఆర్కివ్స’ లో కూడా లభించదంటే అతిశయోక్తి కాదు. ఇంతే గాక చలన చిత్రాలలో వస్తున్న అనూహ్య పరిణామాలను ఎప్పటికప్పుడు బేరీజు వేయడానికి, మార్కెట్టులో విడుదలయ్యే సినీ పత్రికలన్నింటినీ సేకరించి భైరవభొట్ల భద్రపరుస్తున్నాడు. కొత్త సినిమా పాటల సాంకేతిక వివరాలు సేకరించేందుకు గాను వాటిని వి.సి.ఆర్ ద్వారా రికార్డు చేసి క్యాసెట్లలో భద్రపరుస్తున్నాడు. ఇప్పటికే ఈయన, దృశ్యరూపంలో భద్రపరిచిన పాటలు సుమారు 500 వీడియో క్యాసెట్లలో ఉన్నాయి. 

ఈ పరిశోధనా కేంద్రాన్ని స్థాపించి, అభివృద్ధి చేయడానికి ఇప్పటివరకు భైరవభొట్ల సుమారు 10 లక్షల రూపాయలు వెచ్చించాడు. అంత ఆర్థిక స్థోమత లేకపోయినప్పటికీ ఆయన తన పరిశోధనలకు ఖర్చుపెట్టిన ధనం, ఆయనకున్న పరిశోధనాభిలాషకు నిదర్శనం. శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ, సినారె, దేవులపల్లి, వేటూరి, సిరివెన్నెల మహాకవుల పాటలెన్నో ఆయన సేకరించి, ఎంతో శ్రమకోర్చి, ఒంటి చేత్తో వాటిని విభజించి విశ్లేషించాడు. అలా విశ్లేషించిన ఘనత ఆయనకే దక్కింది. 

ఆత్రేయ, ఆరుద్ర వంటి మహామహులెందరో ఈ పరిశోధనా కేంద్రాన్ని స్వయంగా దర్శించి భైరవభొట్లను ఎంతో ప్రశంసించారు. సినీ సాహిత్యానికి పెట్టని కోట ఆయన. శ్రీశ్రీ, ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి, కొసరాజుల పాటల సంకలనాలు వెలువడడంలో ఈయనదే కీలక పాత్ర. భైరవభొట్ల సహాయ సహకారాలతో ఎందరో పరిశోధక విద్యార్థినీ విద్యార్థులు, వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనా గ్రంథాలను సమర్పించి డాక్టరేట్లు పొందారు అనడానికి కింద కనబరచిన జాబితా, భైరవ బొట్ల పరిశోధనా కృషికి నిదర్శనంగా నిలుస్తుంది. 

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆరు, నాగార్జున విశ్వ విద్యాలయంలో ఒకటి, తెలుగు విశ్వ విద్యాలయంలో నాలుగు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఒకటి, మద్రాసు విశ్వవిద్యాలయంలో ఒకటి, బరంపురం విశ్వవిద్యాలయంలో ఒకటి, సెంట్రల్ యÖని వర్సిటీలో ఒకటి, కాకతీయ విశ్వవిద్యాలయంలో ఒకటి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక్కటి సిద్ధాంత గ్రంథాలు వచ్చాయి. వీటన్నిటికీ పరోక్ష మార్గ దర్శకుడు, మÖల సూత్రధారి భైరవభొట్లే ననడంలో సందేహం లేదు. 

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం 

(1) కె.వి. రాఘవాచార్య - కావ్యప్రయోజనములు - మనుచరిత్ర-1988 

(2) పి.మౌలానా - తెలుగు సినిమా పాటలలో శృంగార దృష్టి - 1991 

(3) డి. మల్లన్న ` నార్ల చిరంజీవి గారి రచనలు - 1995 

(4) టి. మునస్వామి ` తెలుగు సినిమా పాటలలో హైందవ - 1999 భక్తి పాటల, వైశిష్ట్యం 

(5) యస్. చిన్నవీరయ్య - దాశరథి సినిమాపాటలు - పరిశీలన 2005

(6) పి. గురుప్రసాద్ - తెలుగు సినిమా పాటల పరిశోశోధకుడు - భైరవ భొట్ల నారాయణరావు 2007

తెలుగు విశ్వవిద్యాలయం 

(1) ఉయÖ్యరు లక్ష్మీ నరసింహారావు - సినారె సినిమాపాటలు-పరిశీలన - 1994 

(2) జయంతి చక్రవర్తి ` వేటూరి సినిమా పాటలు - పరిశీలన 

(3) జె. విజయకుమారి ` జాలాది సినిమా పాటలు 

(4) దామోదర గణపతిరావు - సిరివెన్నెల సినిమాపాటలు - పరిశీలన 

ఆంధ్ర విశ్వ విద్యాలయం 

(1) చిట్టిబోయిన కోటేశ్వరరావు - తెలుగు సినిమా పాటలలో సాహిత్యపు విలువలు - 1988 

నాగార్జున విశ్వ విద్యాలయం 

(1) నల్లూరి రామారావు - కొసరాజు కవితా వైభవం ` 1990

మద్రాసు విశ్వ విద్యాలయం 

1) పైడిపాల - తెలుగు సినిమా పాట `1992

బరంపురం విశ్వవిద్యాలయం 

(1) పంచాళ్ల భానుశ్రీ - తెలుగు చలన చిత్రాలలో దేశభక్తి గేయాలు-1998 

కేంద్రీయ విశ్వవిద్యాలయం

ఏ. మారేశ్వర రావు - తెలుగు సినిమాలలో సామాజిక స్పృహ -1995 

కాకతీయ విశ్వవిద్యాలయం 

(1) వి. వీరాచారి ` సినీ గేయాలపై ఉద్యమాల ప్రభావం 

ఉస్మానియా విశ్వవిద్యాలయం 

(1). టి. ఉమా మహేశ్వరరావు - తెలుగు సినిమా పాటలలో రసపోషణ

ఇలా ఎందరో పరిశోధకులు భైరవభొట్ల చలన చిత్ర పరిశోధనా కేంద్రం నుండి సహాయం పొంది పిహెచ్.డి లు పొందారు.

భైరవబొట్ల ఒక విశిష్ట పరిశోధకుడు. కేవలం తన పరిశోధనను తనవరకే పరిమితం చేసుకోకుండా విశ్వవ్యాప్తం చేసిన విశాల పథికుడు. మంగళ హారతి గీతాలు, పద్మశ్రీ ఘంటసాల సుమధుర గానసుధ, తెలుగు సినిమాల్లో భక్తి పారవశ్య గ్రంధాలు, తెలుగు సినిమాల్లో భక్తి రసాత్మక గీతాలు వంటి అనేక గ్రంథాలను తెలుగు సినిమా పరిశ్రమకు అందించిన ఘనత భైరవభొట్లకే దక్కుతుంది. అంతేకాదు, ఎందరో కవులను, కళాకారులను సన్మానించి సత్కరించిన సహృదయుడీయన. ముఖ్యంగా 1994 సెప్టెంబరు నెలలో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావును సినీ కథా నాయిక లందరూ సత్కరించిన సందర్భంలో భైరవభొట్ల వెలువరించిన ‘అక్కినేని కథానాయికలు’ అనే పరిశోధనాత్మక వీడియో క్యాసెట్టు ఇతని పరిశోధనా పటిమకు గీటురాయి. 

ఈయన తన విశేష సినీ పరిశోధనకు గానూ అనేక అవార్డులు అందుకున్నాడు. ఇటీవల హైదరాబాదులో అత్యంత వైభవంగా జరిగిన తెలుగు సినీ వబ్రోత్సవాల్లో భైరవభొట్లను సినీ ప్రముఖలందరి సమక్షంలో సముచిత రీతిన సత్కరించడం విశేషం. భైరవభొట్లకు ఎన్ని సన్మానాలు జరిగినా, అవి ఆయన విశేష సేవకు చంద్రునికి నూలుపోగు వంటివనే చెప్పుకోవచ్చు. 

ఈరోజున శాఖోపశాఖలుగా విస్తరించిన తెలుగు సినీ పరిశ్రమ గత వైభవమంతా పరిశోధనా గ్రంథాల రూపంలో భైరవభొట్ల నిక్షిప్తం చేశాడు. భైరవభొట్ల చలనచిత్ర పరిశోధనా కేంద్రాన్ని అనేక మంది గొప్పవాళ్లు, ప్రముఖులు సందర్శించినపుడు ఆయనను ప్రశంసించిన తీరు ఆయన బహుముఖ ప్రజ్ఞకు అద్దం పడుతుంది. ఈ వివరాలన్నీ అనుబంధం - 2 లో పొందుపరచడం జరిగింది. 

సృష్టిలో మానవ మేధస్సులో జనించే ఆలోచనను సక్రమ మార్గంలో నలుగురికోసం ఉపయోగించాలనే ఆకాంక్ష, ఆదర్శం, అకుంఠిత దీక్ష అమలు చేయడానికి ప్రయత్నిస్తే, ఏ అంశమైనా నిరుపయోగం కాదని తన సినిమా పాటల పరిశోధన ద్వారా నిరూపిస్తున్న పరిశోధకాగ్రేసరుడు భైరవ భొట్ల అన్నది నిజం.  

భైరవభొట్ల నారాయణరావు అక్షర , శ్రవణ , దృశ్యం ద్వారా సినిమాపాటలు రూపొందించే తీరుతెన్నులు


వజ్రోత్సవాలు జరుపుకున్న తెలుగు సినిమా సంగీత చరిత్రలో అధునాతన సాంకేతిక పరిజ్ఞాన ప్రాబల్యం వల్ల ఎప్పటికప్పుడు నూతన విధానాలు ధ్వని ముద్రణలో చోటు చేసుకుంటూ సినిమా పాటకు నిత్యనూతన శోభను చేకూర్చుతున్నాయి. 

సినీ గీతానికి ఉన్న ఇతర సౌకర్యం విశేషవ్యాప్తి. మొదటి నుండి కూడా సినిమా కళ గొప్ప ప్రసార మాధ్యమమని గుర్తింపబడింది. అయితే రేడియో, టేప్ కార్డరర్, దూరదర్శన్ వంటి శ్రవ్య, దృశ్యరూపాలు ఎంత ప్రభావం చూపినా, సాంకేతిక ఉపకరణాల ప్రవేశంతో సినిమా కళ ప్రాచుర్యం మరింత బలమైంది. ఈ పరిణామ మెంతటిదంటే ప్రపంచమంతటా చలన చిత్రాలు, సమాజం ఒకదానికొకటి విడదీయరానంత ధృడంగా పెనవేసుకున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకత కలగలిసిన సినిమా నేడు అంతర్జాతీయ కళాంశ మంటే అతిశయోక్తి కాదు. 

ప్రపంచంలో ఏ మÖల ఏవిధమైన సంగీతం, నృత్యం తదితర సాంస్కృతి కాంశాలు విశేష జనాదరణకు పాత్రమైతే ఆయా నూతన ధోరణులు వెనువెంటనే చిత్ర జగతిలో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. దీంతో సినిమా అనేది విశ్వవ్యాప్తమైన కళా ప్రక్రియగా వర్ధిల్లడమే గాక జాతీయ సమైక్యతా భావానికి, వసుధైక కుటుంబమనే సత్యానికి నిరూపణగా నానాటికీ స్థిరపడుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన సినిమా పాటల పరిశోధకుడు భైరవభొట్ల తన దగ్గరున్న, తాను సేకరించిన చిత్రగీతాలను ఆడియో క్యాసెట్ల రూపంలోనూ (శ్రవణరూపాలు), ఆ పాటలకు సంబంధించిన చిత్ర సన్నివేశాలను వీడియో క్యాసెట్ల రూపంలోనూ (దృశ్యమాధ్యమాలు) తయారు చేసి భావి పరిశోధకులకు, వారి పరిశోధనా మార్గాన్ని సుగమం చేశాడు. 

అలా చేయడానికి అసలు ప్రేరణ ఏమిటి? ఆయన పాటలను ఆయా విధానాల్లో వర్గీకరించి విశ్లేషించిన విధానం ఏమిటి? మొదలైన అంశాలు ప్రధానంగా ఈ అధ్యాయంలో వివరింప బడుతుంది. 

0.5. ప్రేరణ : 

భైరవభొట్ల, ఏ.ఎన్.ఆర్. కళాశాలలో బి.ఏ. లిటరేచర్ చదివే రోజుల్లో తమ గురువుగారైన డా. బండ్లమÖడి ఆంజనేయులు, ఆత్రేయ “దీక్ష’ (1951) చరిత్రంలో రాసిన- 

“మనుషులంటే వీళ్లేనా, ప్రపంచమంతా ఇంతేనా 

వేషాలకు విలువిచ్చారు, మోసాలకు తలవంచారు” అనే పాటను వినిపించి ఆత్రేయ భాషలోని క్లుప్తత, సరళత, సులభశైలిని పరిశీలించమని, అవగాహన చేసుకోమని భైరవభొట్లకు గురూపదేశం చేశాడు. అప్పటి నుండి భైరవభొట్ల, ఆత్రేయ పాటల్ని సేకరించి, చదవడం ప్రారంభించాడు. దాంతో పాటు తన సహాధ్యాయి అయిన గార సత్యనారాయణమÖర్తి వల్ల కూడా తెలుగు హిందీ సినిమాల్లోని ప్రముఖులందరి గురించి తెలుసుకోవడం ప్రారంభించాడు. 

ఒకవైపు హిందీ సాహిత్యం, మరోవైపు తెలుగు, హిందీ చిత్ర గీతాలను కథావస్తుపరంగా, సన్నివేశపరంగా విడివిడిగా రాసుకొని, ఫైలు చేసుకుని అధ్యయనం చేయడం ప్రారంభించాడు. అలా చదవడం వల్ల సముద్రాల, మల్లాది, పింగళి, ఆరుద్ర, శ్రీశ్రీ వంటి కవులందరూ సినిమాపాటల్ని ఎలా రాస్తారో భైరవ భొట్లకు అర్థమయ్యింది. వీటితో పాటు వెండితెర నవలల్లోని సినిమా సన్నివేశాలు, సందర్భోచిత భాష, శైలి ఇత్యాది అంశాల్ని పరిశీలించడం అలవాటు చేసుకున్నాడు. 

అలా పరిశీలిస్తుంటే, ఇలాంటి వెండితెర నవలలే హిందీలో కూడా ఎక్కడ లభిస్తాయోననే అన్వేషణను ప్రారంభించాడు భైరవభొట్ల. ఆ అన్వేషణలో భాగంగా గుడివాడలోని హిగెన్ బాదమ్ బుక్ స్పాలు లో హిందీ సినిమా పత్రికలైన “నవచిత్రపట్ ‘ప్రియ’, ‘లలిత’ అనే పత్రికలను కొనేవాడు. వాటిల్లోని ఫిలిం వార్తల కంటే విడుదల కాబోయే హిందీ చిత్రాల కథలు, సంభాషణలు, పాటలు భైరవభొట్లను ఆకర్షించేవి. వాటిని కత్తరించి సంవత్సరాల వారిగా 32 బైండ్లలలో సంపుటీకరించాడు. ఆ బైండ్లన్నీ నేటికీ గుడివాడలోని పరిశోధనా కేంద్రంలో సురక్షితంగా ఉన్నాయి. ఆ బైండ్లకు అకారాది క్రమంలో ఒక రిజిష్టరును తయారు చేశాడు. తరువాత హిందీ పాటలను నాయక ప్రేమగీతాలు, నాయిక ప్రేమగీతాలు, యుగళ గీతాలు, నాయికా నాయకుల భగ్న ప్రేమ గీతాలు, నృత్య గీతాలు, భక్తి గీతాలు మొదలైన రకాలుగా వర్గీకరించి, రాసుకొని ఫైలు చేసుకునేవాడు భైరవభొట్ల. ఇలా నిరంతర పరిశీలన వల్ల హిందీ సినీ రంగంలో సుప్రసిద్ధులైన శైలేంద్ర, షకీల్ బదయÖని, రాజేంద్రకిషన్ మొదలైనవారు ఒకే నాయిక ప్రేమగీతాన్ని తమతమ ప్రత్యేకశైలిలో ఎట్లా రచిస్తారో భైరవభొట్లకు అర్థమయ్యింది. 

రానురాను తెలుగు సినిమా పాటల్ని కూడా ఈ పద్ధతిలోనే విడివిడిగా రాసుకుని పరిశీలించడం ప్రారంభించాడు భైరవ భొట్ల. ఇలా రెండు భాషల్లోనూ సినిమా పాటలను తులనాత్మకంగా అధ్యయనం చేయడం పరాకాష్టకు చేరుకుంది. మొదటి నుంచి భైరవభొట్ల సినీ పరిశోధనా, పరిశీలన సినిమాటిక్‌గా కవులు ఎలా రచిస్తారో అనే అంశం మీదే ఆధారపడి ఉండేది. తాను స్వయంగా రాసుకున్న తెలుగు, హిందీ సినిమా పాటల రాత ప్రతులు అన్నీ 30 బైండ్లు, సుమారు నలభై ఐదు సంవత్సరాలు దాటి పోయినా కూడా ఇంకా భైరవభొట్ల చలన చిత్ర పరిశోధన కేంద్రంలో సురక్షితం గానే ఉన్నాయి. 

భైరవభొట్ల బాల్యం నుండే అక్షర, శ్రవణ, దృశ్యరూపాలలో తెలుగు సినిమా పాటలను సంకలనం చేసి పరిశోధించాలని, అది అందరికీ ఉపయోగపడాలని అనుకునేవాడు. అందుకోసం పరిశోధనా కేంద్రాన్ని కూడా స్థాపించాలని, అది ఒక ఖీఱశ్రీఎ Aతీcష్ట్రఱవఙవs గా నిలిచిపోవాలని భావించాడు. ఆ స్థిర సంకల్పంతోనే యాభై ఏళ్ల అమÖల్యమైన కాలాన్ని, ధనాన్ని, శక్తి సామార్థ్యాల్ని వెచ్చించి పరిశోధనా 

యజ్ఞాన్ని విజయవంతంగా కొనసాగించాడు. అయితే ఆరోజుల్లో తగినంత సాంకేతిక పరిజ్ఞానం లేని కారణంగా భైరవభొట్ల, తన సినీ పరిశోధనను ప్రారంభదశలో తెలుగు సినిమా పాటల్ని రాత ప్రతులుగా మాత్రమే సంపుటీకరించాడు. తర్వాత విజయవాడ, జ్యోతి కళాశాలలో హిందీ ఉపన్యాసకుడిగా స్థిరపడిన తర్వాత, రాతప్రతుల్లో ఉన్న సినిమా పాటల్ని ఆడియో క్యాసెట్ల రూపంలోకి, వీడియో క్యాసెట్ల రూపంలోకి మార్చాడు. 

తన పరిశోధనా కేంద్రంలో ఆడియో క్యాసెట్టు నుంచి మరో ఆడియో క్యాసెట్ రికార్డు చేసే Twశీ ఱఅ శీఅ టేపురికార్డును, ఒక వి.సి.ఆర్. ను కష్టార్జితంతో కొన్నాడు. రికార్డు చేసిన వీడియో క్యాసెట్లలోని పాటలను మళ్లీ వేరు వేరు విభాగాలలో వీడియో క్యాసెట్లుగా రికార్డు చేయడానికి 1990 లో మళ్లీ ఒక వి.సి.పి. ని కొన్నాడు. ఇలా తెలుగు సినిమాలకు సంబంధించిన పాటల్ని 1000 దాకా వీడియో క్యాసెట్లలో దృశ్యరూపంలోనూ, 500 దాకా ఆడియో క్యాసెట్లలో శ్రవణ రూపంలోనూ భైరవభొట్ల నిక్షిప్తం చేశాడు. 

భైరవభొట్ల సేకరించిన తెలుగు సినిమా పాటలను కథా వస్తుపరంగా, సన్నివేశపరంగా కింది విధంగా వర్గీకరించి విశ్లేషించవచ్చు. భైరవభొట్ల మొదట తనదగ్గరున్న సినిమాపాటల్ని అక్షర, శ్రవణ, దృశ్య రూపాలుగా వర్గీకరించాడు. వాటిలో మళ్లీ వస్తుపరమైన వర్గీకరణ చేశాడు. తెలుగు సినిమాల్లో శృంగార (శాస్త్రీయ) నృత్యగీతాలు, తెలుగు సినిమాల్లో వాన పాటలు, తెలుగు సినిమాల్లో చందమామ గీతలు అని 3 రకాలుగా వర్గీకరించి వాటిని పరిశీలించడం జరిగింది. 

తర్వాత రెండోభాగంలో భైరవభొట్ల దగ్గరున్న సినిమా పాటల్ని అక్షర, శ్రవణ రూపాలుగా నాయక ప్రేమగీతాలు, నాయిక ప్రేమగీతాలు, నాయికా నాయకుల యుగళ ప్రేమగీతాలు, నాయక భగ్న ప్రేమగీతాలు, నాయిక భగ్న ప్రేమగీతాలు, నాయికా నాయకుల యుగళ భగ్న ప్రేమగీతాలు, ప్రముఖ గాయకీ గాయకులైన జిక్కీ, ఏ.ఎం. దంపతులు పాడిన సినీ గీతాలు, సినీదేశభక్తి గేయ కోశం, తెలుగు సినిమాల్లో మంగళ హారతులు, తెలుగు సినిమాల్లో లాలిపాటలు, కొసరాజు సినీ గేయకోశం అని 11 రకాలుగా వర్గీకరించి పరిశీలించడమైనది. వీటికి దృశ్యరూపం లేదు. 

తర్వాత మÖడో భాగంలో భైరవభొట్ల దగ్గర వున్న సినిమా పాటల్ని కేవలం అక్షర సంపుటాలుగానే సినీభక్తి, గేయ కోశం, ఘంటసాల గానసుధ, సినారె సినీ గేయకోశం, శ్రీశ్రీ సినీ గేయకోశం, ఆరుద్ర సినీ గేయకోశం, దేవులపల్లి కృష్ణశాస్త్రి గేయకోశం, సిరివెన్నెల సినిమా పాటల సంకలనం, వేటూరి సినిమా పాటలు అని వర్గీకరించి పరిశీలించడమైంది. వీటిని మÖడో అధ్యాయంలో చర్చింపబడడం జరిగింది. 

భైరవభొట్ల తెలుగు సినిమా పాటల్ని కథావస్తు పరంగా, సన్నివేశంగా కింది విధంగా వర్గీకరించి విశ్లేషించవచ్చు. ఇలా శీర్షికలను అక్షర, శ్రవణ, దృశ్య రూపాలతో సమన్వయ పరుస్తూ భైరవభొట్ల ఎలా వస్తు పరంగా విభజించి పరిశోధకులకు దిక్సూచి అనడంలో అసత్యం లేదు. ఈ 8 భాగాలను కేవలం అక్షర సంపుటాలుగానే భైరవభొట్ల రూపొందించాడు. 

15. అక్షర, శ్రవణ, దృశ్యరూపాలలో ఉన్న సినిమా పాటలు : 

తెలుగు సినిమా పాటల్ని వస్తుపరంగా వర్గీకరించి ఈ క్రింది విధంగా ఉన్నాయి. 

1. శృంగార (శాస్త్రీయ) నృత్యగీతాలు 

2. తెలుగు సినిమాల్లో వాన పాటలు 

3. తెలుగు సినిమాల్లో చందమామ పాటలు - వీటికి అక్షర రూపం, ఆడియో, వీడియో రూపాలు ఉన్నాయి. 

రెండో భాగంలో అక్షర, శ్రవణ సమన్వయ రూపంలో రూపొందించిన తెలుగు సినిమా పాటల్ని తిరిగి 11 రకాలుగా భైరవభొట్ల వర్గీకరించాడు. అవి - 

1. నాయక ప్రేమగీతాలు 

2. నాయిక ప్రేమ గీతాలు 

3. నాయికానాయకుల యుగళ ప్రేమ గీతాలు 

4. నాయక భగ్న ప్రేమగీతాలు 

5. నాయిక భగ్న ప్రేమగీతాలు 

6. నాయికా నాయకుల యుగళ భగ్న ప్రేమ గీతాలు. 

7. జిక్కీ, ఏ. ఎం. రాజా పాడిన సినీ గీతాలు

8. సినీ దేశభక్తి గేయకోశం 

9. తెలుగు సినిమా మంగళ హారతి గీతాలు 

10. తెలుగు సినిమా లాలి పాటలు 

11. కొసరాజు సినీ గేయ కోశం 

వీటికి దృశ్యరూపం లేదు. 

ఇక మÖడో భాగంలో కేవలం అక్షర రూపంలోనే సంపుటీకరించిన సినిమా పాటల సంకలనాలను గురించి 8 రకాలుగా భైరవభొట్ల వర్గీకరించడం జరిగింది. ఇవన్నీ శ్రవణ, దృశ్య రూపాల్లో లేవు. 

అవి 

(1) సినీ భక్తి, గేయకోశం 

(1) ఘంటసాల గాన సుధ 

(3) సినారె సినీగేయ కోశం - 6 భాగాలు 

(4) శ్రీశ్రీ సినీ గేయకోశం (స్ట్రెయిట్ G డబ్బింగ్) -6 భాగాలు

(5) ఆరుద్ర సినీ గేయకోశం (స్ట్రెయిట్ G డబ్బింగ్) - 4 భాగాలు

(6) దేవులపల్లి సినీ గేయకోశం (27 బాటలు) 

(7) సిరివెన్నెల సినిమా పాటల సంకలనం - 6 భాగాలు 

(8) వేటూరి సినిమా పాటలు ( 2 జిరాక్సు బైండ్లు) 

ఈ 8 భాగాలు కేవలం అక్షర సంపుటాలు గానే భైరవభొట్ల రూపొందించాడు. 

భైరవభొట్ల, చలనచిత్ర పరిశోధనా కేంద్రం అభివృద్ధికి, అక్షర, శ్రవ్య, దృశ్య మాధ్యమ విభాగాలకు లక్షలాది రూపాయలు వెచ్చించాడు. 

తెలుగు సినిమా పాటలకు అంతర్జాతీయ వైభవాన్ని తెచ్చి పెట్టడానికి భైరవభొట్ల, అక్షర, శ్రవ్య, దృశ్య సమన్వయమైన సృజనాత్మక పరిశోధనను చేపట్టి దానిని ఇప్పటికీ పవిత్ర యజ్ఞంలా నిర్వర్తిస్తున్నాడు. 

5.2. శృంగార (శాస్త్రీయ) నృత్య గీతాలు

5.2-1. ఎ). అక్షర రూపం ( ప్రింట్) : 

భైరవభొట్ల, పరిశోధకుల సౌకర్యార్థం తెలుగు సినిమాల్లోని శృంగార (శాస్త్రీయ నృత్య గీతాలను ఒక పరిశోధనాత్మక రాత సంపుటిగా రూపొందించాడు. తెలుగు సినిమాల్లోని చారిత్రాత్మక, జానపద, సాంఘిక చిత్రాల్లోని శాస్త్రీయ నృత్యగీతాలను పొందుపరచడం జరిగింది. ఈ పాటల్ని 2004 లో జె.పి. పబ్లిషర్స్ (విజయవాడ) వారు ముద్రించారు. వాటిని కింది విధంగా ఇవ్వడం జరిగింది. 

చిత్రం పేరు పాట పల్లవి 

1. మల్లీశ్వరి (1951) పిలచిన బిగువటరా! 

2. మిస్సమ్మ (1955) బాలనురా మదనా ! 

3. అప్పు చేసి పప్పుకూడు (1959) జోహారు గైకొనరా దేవా 

4. భట్టి విక్రమార్క (1960) మనసార ప్రేమించి నారా !

5. అమర శిల్పి జక్కన (1964) అందాల బొమ్మతో ఆటాడవా! 

6. బొబ్బిలి యుద్ధం (1964) నిను చేర మనసాయెరా

7. పరమానందయ్య శిష్యుల కథ (1966) కామినీ మదన రారా 

8. వసంతసేన (1967) ఏమివ్వగల దానరా !

9. చిన్ననాటి స్నేహితులు (1971) ఏమని తెలుపనరా 

10. భక్త తుకారాం (1973) సరి సరి వగలు తెలిసెర గడుసరి

5.2.2. శ్రవణరూపం (ఆడియో) : 

భైరవభొట్ల చలనచిత్ర పరిశోధనా కేంద్రంలో పైన పేర్కొన్న (శృంగార) నృత్యగీతాలను 4 ఆడియో క్యాసెట్లుగా శ్రవణ రూపంలో రూపొందించాడు. తెలుగు చలన చిత్రాల్లో ఇంకా ఎన్నో అమÖల్యమైన శాస్త్రీయ నృత్య గీతాలున్నాయి. కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా భైరవభొట్ల మిగతా వాటిని ఇంకా శ్రవణ రూపంలోకి తేలేక పోయాడు. 

5.2.3. దృశ్యరూపం (వీడియో) 

1988వ సంవత్సరంలో పైన పేర్కొన్న శృంగార (శాస్త్రీయ) నృత్యగీతాల అక్షర సంపుటాన్ని, 1992 లో శ్రవణ సంపుటాలను 1993 వ సంవత్సరంలో దృశ్య సంపుటాన్ని ( శ్రవణ సంయుక్త వీడియో క్యాసెట్టు) భైరవభొట్ల రూపొందించాడు. 1993 లో అక్కినేని నాగేశ్వరరావు ఈ 3 రకాల (అక్షర, శ్రవణ, దృశ్య) సంపుటాలను ఆవిష్కరించాడు. ప్రధానంగా భైరవభొట్ల రూపొందించిన దశ్యరూపాన్ని ( వీడియో క్యాసెట్టు) అద్వితీయమైన కృషిగా అభినందించాడు. అదే రోజున విజిటర్లుక్ లో భైరవభొట్లను అక్షరాభినందన చేశాడు. అంతే గాకుండా, ఆయన హైదరాబాదు వెళ్లిన తర్వాత భైరవభొట్ల పరిశోధనా వైవిధ్యాన్ని ప్రశంసిస్తూ ఉత్తరం కూడా రాశాడు. ఈ విధమైన పరిశోధనలో భైరవభొట్లకిది తొలి సోపానమయ్యింది. 

5.3. తెలుగు సినిమాల్లోని వానపాటలు : 

తెలుగు సినిమాల్లో వాన పాటలు, నాయికా నాయకుల శృంగారాన్ని ఉద్దీపన చేయడానికి ఉద్దేశింపబడినవి. ఇవి సాహిత్య, సంగీతాల పరంగానే గాకుండా చిత్రీకరణ పరంగా ప్రేక్షలను శృంగార రసోన్ముఖులను చేస్తాయి. ఆత్రేయ “ఆత్మబలం” (1964) అనే చిత్రంలో రాసిన ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’ అనే పాట వానపాటల్లో తలమానికమైంది. తర్వాత వచ్చిన పాటలకు అది ప్రేరణ అయింది. 

5.3.1. అక్షర రూపం ( ప్రింట్) : 

తెలుగు సినిమాల్లోని ముఖ్యమైన వాన పాటలను భైరవభొట్ల ఈ కింది విధంగా రూపొందించాడు. 

చిత్రం పేరు పాట పల్లవి

1. ఆత్మ బలం (1964) చిటపట చినుకులు పడుతూ ఉంటే 

2. బుల్లెమ్మ బుల్లోడు (1972) కురిసింది వాన నా గుండెలోన

3. ఏజెంటు గోపి (1978) చిటపట చినుకులు మనకోసం 

4. అడవిదొంగ (1985) వాన వాన వందనం

5. నారీ నారీ నడుమ మురారి (1990) ఏం వానో తరుముతున్నది

6. గ్యాంగ్ లీడర్ (1991) వాన వాన వెల్లువాయె

7. కలెక్టర్ గారి అల్లుడు (1992) గిల్లు గిచ్చి అల్లి బుచ్చి

8. ఇనెస్పెక్టర్ ఝూన్సీ (1993) గిల్లు గిల్లు చెమ్మ గిల్లు 

9. అమ్మ కొడుకు (1993) చిన్న చిన్న చినుకుల్లోన 

10. మాయలోడు (1993) చిటపట చిరు సవ్వడిలో

ఈ పాటల సంపుటిలో పైన పేర్కొన్న వాన పాటలే గాకుండా ఇంకా చాలా వానపాటలున్నాయి. కానీ ఆర్థిక కారణాల వల్ల భైరవభొట్ల అక్షర రూపంలోకి వాన పాటల్ని రూపొందించ లేకపోయాడు. 

5.3.2. శ్రవణ రూపం (ఆడియో) : 

భైరవభొట్ల చలనచిత్ర పరిశోధనా కేంద్రంలో పైన పేర్కొన్న తెలుగు సినిమా వానపాటలను శ్రవణ రూపంలో రెండు ప్రత్యేక ఆడియో క్యాసెట్లుగా భైరవభొట్ల రూపొందించాడు. ఇంకా శ్రవణ రూపంలో రాని వానపాటలెన్లో ఆయన దగ్గర ఉన్నాయి.

5.3.3. దృశ్యరూపం (వీడియో) : 

పైన పేర్కొన్న తెలుగు సినిమా వానపాటలను భైరవ బొట్ల ఒక నమÖనా క్యాసెట్టుగా రూపొందించాడు. 15 సంవత్స రాల తర్వాత ఆ వీడియో క్యాసెట్టును రెండు వి.సి.డి.లుగా మార్చాడు. 

5.4. తెలుగు సినిమాల్లో చందమామ పాటలు : 

భైరవభొట్ల, చలన చిత్ర పరిశోధనా కేంద్రంలో సినీ పరిశోధన ప్రయోగాత్మకంగానూ, ప్రయోజనాత్మకంగానూ నిరంతరం ఉపయోగ పడేటట్టు తయారు చేస్తున్నాడు. విశిష్టమైన సృజనాత్మకత ఈ పరిశోధనా కేంద్రం ప్రత్యేకత. ఇందులో భాగంగానే భైరవభొట్ల తెలుగు సినిమాల్లోని చందమామ పాటల్ని “వంద సినీ చందమామలు” అనే శీర్షికతో అక్షర రూపంలో సంపుటీకరించాడు. ఇది రాత ప్రతి రూపంలోనే ఉన్నది. ఈ సంపుటంలో ముఖ్యమైన చందమామ పాటలను భైరవభొట్ల ఈ కింది విధంగా సంపుటీకరించాడు. 

చిత్రం పేరు  పాట పల్లవి

1. మిస్సమ్మ (1955) రావోయి చందమామ 

2. ఇలవేల్పు (1956) చల్లని రాజా ఓ చందమామ

3. జయం మనదే (1956) ఓ చందమామ అందాల భామ

4. రాజనందిని (1958) నీ మీద మనసాయెరా ఓరాజా 

5. మాంగల్య బలం (1959) ఆకాశ వీధిలో అందాల జాబిలి

6. భట్టి విక్రమార్క (1960) ఓ నెలరాజా... వెన్నెల రాజా...

7. గండి కోట రహస్యం (1969) నీలాల నింగి 

8. శివరంజని (1978) చందమామ వచ్చాడమ్మా 

9. రంగూన్ రౌడీ (1979) ఓ జాబిలి వెన్నెల ఆకాశం 

10. సిరివెన్నెల (1986) చందమామ రావె.. జాబిల్లి రావె 

తెలుగు సినిమా పాటల్లో ఇలాంటి చందమామ పాటలెన్నో ఉన్నాయి. వాటన్నింటినీ భైరవభొట్ల ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల అక్షర రూపంలో సంపుటీకరించలేని పరిస్థితిలో ఉన్నాడు. 

5.4.1. శ్రవణ రూపం (ఆడియో) : 

పైన పేర్కొన్న సినీ చందమామ పాటలను భైరవ భొట్ల శ్రవణ రూపంలో ఒక ప్రత్యేక ఆడియో క్యాసెట్ గా రూపొందించాడు. కానీ తనకున్న ఆర్థిక దుస్థితి కారణంగా మిగతా పాటలను భైరవభొట్ల శ్రవణ రూపంలో రూపొందించ లేక పోయాడు.

5.4.2. దృశ్య రూపం (వీడియో) 

భైరవ భొట్ల పైన పేర్కొన్న తెలుగు సినీ చందమామ పాటలను 15 సంవత్సరాల క్రితమే చలనచిత్ర పరిశోధనా కేంద్రంలో ఒక నమÖనా వీడియో క్యాసెట్టుగా రూపొందించాడు. 

ఇప్పటి వరకు అక్షర, శ్రవణ, దృశ్య రూపాలలో నిక్షిప్తమై ఉన్న సినిమా పాటలను గురించి వివరించడం జరిగింది. ఇంకా కొన్ని అక్షర, శ్రవణ, సమన్వయ సంపుటాలుగా ఉండి దృశ్యరూపాలలో లేని పాటలు ఈ కింది విధంగా ఉన్నాయి. 

1. నాయక ప్రేమ గీతాలు 

2. నాయిక ప్రేమ గీతాలు 

3. నాయికా నాయకుల యుగళ ప్రేమగీతాలు 

4. నాయక భగ్న ప్రేమ గీతాలు 

5. నాయిక భగ్న ప్రేమ గీతాలు 

6. నాయికా నాయకులు యుగళ భగ్న ప్రేమ గీతాలు

7. జిక్కీ, ఏ. ఎం. రాజాలు పాడిన సినీ గీతాలు 

8. సినీ దేశభక్తి గేయ కోశం 

9. తెలుగు సినిమాల్లో మంగళహారతి గీతాలు 

10. తెలుగు సినిమాల్లో లాలి పాటలు 

11. కొసరాజు సినీగేయ కోశం. 

5.5. నాయిక ప్రేమగీతాలు : 

5.5.1. అక్షర రూపం (ప్రింట్) : 

ఈ సంపుటంలో సంగీత సాహిత్యాలకు పెద్దపీట వేసిన ఆనాటి సుప్రసిద్ధమైన, ఉదాత్తమైన, మధుర గీతములనీ సంపుటంలో పొందు పరిచాడు. ఇందులో నాయక ప్రేమగీతాలు ప్రసిద్ధమైనవిగా కింది విధంగా ఇవ్వబడ్డాయి. ఇది భైరవభొట్ల రూపొందించిన పరిశోధనాత్మక రాత సంపుటి. 

చిత్రం పేరు పాట పల్లవి 

1. బతుకు తెరువు (1953) అందమె ఆనందం 

2. సంతానం (1954) చల్లని వెన్నెలలో

3. జయభేరి (1959) రాగమsTÖ రావే

4. ఆరాధన (1962) నా హృదయంలో నిదురించే చెలి 

5. గుండమ్మకథ (1962) మౌనముగా నీ మనసు పాడిన

6. అమర శిల్ప జక్కన (1964) నిలువుమా నిలువుమా నీలవేణి 

7. పాండవ వనవాసం (1965) నా చందమామ నీవే భామ 

8. ప్రేమనగర్ (1971) తేట తేట తెలుగుల 

9. అద్దాల మేడ (1981) నా జీవిత గగనములో 

10. అంతం కాదిది ఆరంభం (1981) అబ్బలాలో అమ్మలాలో

5.5.2. శ్రవణ రూపం (ఆడియో) : 

పైన పేర్కొన్న ప్రసిద్ధమైన సంగీత సాహిత్యాల పరిశోధనాత్మక విలువ కలిగిన 15 పాటలను ప్రత్యేక శ్రవణ రూపంలో రికార్డు చేయడం జరిగింది. ఈ విభాగంలో ఈ విధమైన నాయక ప్రేమ గీతాలు వందల కొద్దీ ఉన్నాయి. అంతేగాక పరిశోధనకు ఒక నమÖనాగా చూపించాలనే భావంతో sTÖ ఆడియో క్యాసెట్టును రూపొందించాడు భైరవభొట్ల.

5.6. నాయిక ప్రేమ గీతాలు : 

5.6.1 అక్షర రూపం ( ప్రింట్) : 

భైరవభొట్ల పరిశోధనా కేంద్రంలో ఉన్న నాయిక ప్రేమ గీతాల సంపుటంలో ఉత్తమ సాహిత్యానికి, కర్ణపేయమైన సంగీతానికి, మనోహరమైన దృశ్యాల్ని ప్రతిబింబించే నాయిక ప్రేమ గీతాలను ఈ కింది విధంగా పొందు పరిచాడు. ఇది కేవలం పరిశోధనాత్మక రాత సంపుటే. 

చిత్రం పేరు పాట పల్లవి 

1. అన్నపూర్ణ (1960) తళతళ మిల మిలా 

2. జగదేక వీరుని కథ (1961) జలకాలాటలలో 

3. గుండమ్మకథ (1962) సన్నగవీచే చల్ల గాలికి 

4. చదువుకున్న అమ్మాయిలు (1963) వినిపించని రాగాలే 


5. ఆడపడుచు (1967) మది తుళ్లి తుళ్లి 

6. మేఘ సందేశం (1982) ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై 

7. మేఘసందేశం (1982) నిన్నటి దాకా శిలనైనా 

8. సాగర సంగమం (1983) మౌనమేలనోయి 

5.6.2. శ్రవణ (ఆడియో) రూపం : 

పైన పేర్కొన్న రాత ప్రతిలోని నాయిక ప్రేమ గీతాలను మొత్తం 18 పాటలను ఆడియో క్యాసెట్టుగా రూపొందిం 

చడం జరిగింది. 

5.1. నాయికా నాయకుల యుగళ ప్రేమగీతాలు : 

5.7.1. అక్షర రూపం (ప్రింట్) : 

భైరవభొట్ల చలనచిత్ర పరిశోధనా కేంద్రంలోని నాయిక నాయకుల యుగళ ప్రేమ గీతాల సంపుటిలో ఉదాత్తమైన, సంస్కార వంతమైన సాహిత్యాన్ని, సుమధుర సంగీతాన్ని, కను విందైన దృశ్యాన్ని ప్రస్ఫుటింప జేసే ఈ కింది యుగళ గీతాన్ని భైరవభొట్ల రూపొందించాడు. 

చిత్రం పేరు పాట పల్లవి 

1. అనార్కలి (1955) రాజశేఖరా నీపై మోజు తీరలేదురా

2. దొంగరాముడు (1955) చిగురాకులలో చిలకమ్మా 

3. ఇలవేల్పు (1957) చల్లని రాజా ! ఓ చందమామ! 

4. అప్పు చేసి పప్పుకూడు (1959) ఎచటి నుండి వీచెనో

5. చదువుకున్న అమ్మాయిలు (1963) కిలకిల నవ్వులు చిలికిన 

6. మÖగనోము (1969) పగడాల జాబిలి చూడు 

7. అడవి రాముడు (1977) కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి 

8. అందమైన అనుభవం (1979) హలో! నేస్తం బాగున్నావా! 

9. అమర జీవి (1983) శ్రీ రంగనాథా ! 

10. ఆనందభైరవి (1984) పిలిచిన మురళికి 

5.7.2. శ్రవణ (ఆడియో) రూపం 

అక్షర రూపంలో పేర్కొన్న ఈ పాటల్లో ఒక పాటల్ని శ్రవణ రూపంలో రూపొందించడం జరిగింది. కానీ ఆర్థిక కారణాల రీత్యా sTÖ విభాగంలోని అన్ని పాటలను భైరవ బొట్లు రూపొందించలేక పోయాడు. 

5.8. నాయక భగ్న ప్రేమ గీతాలు

5.8.1. అక్షర రూపం ( ప్రింట్) 

తెలుగు సినిమాలలోని కథలలో ప్రియురాలికి దూరమై, ప్రేమలో విఫలమై, విధిరాతకు బలియై, వేదనతో రోధించే నాయక భగ్న ప్రేమ గీతాలను ఈ సంపుటంలో పొందుపరచడం జరిగింది. భైరవభొట్ల చలనచిత్ర పరిశోధనా కేంద్రంలో ఉండే నాయక భగ్న ప్రేమ గీతాలను కింది విధంగా పొందు పరచడం జరిగింది. 

చిత్రం పేరు పాట పల్లవి

1. దేవదాసు (1953) కుడి ఎడమైతే పొరబాటు 

2. జగదేక వీరుని కథ (1961) రారా కనరారా కరుణ మాని నారా 

3. టాక్సీరాముడు (1962) శోకించకోsTÖ 

4. పెండ్లి పిలుపు (1962) నాలోని అనురాగమంతా 

5. అమర శిల్పి జక్కన (1964) మధురమైన జీవితాల

6. ఆడ బ్రతుకు (1965) తనువుకెన్ని గాయాలైనా

7. కన్నెమనసులు (1967) ఓ హృదయం లేని ప్రియురాలా 

8. భాగ్యచక్రం (1968) ఆశ నిరాశను చేసితివా 

9. ప్రేమనగర్ (1971) మనసు గతి యింతే.. 

5.8.2. శ్రవణ(ఆడియో) రూపం : 

పైన పేర్కొన్న నాయక భగ్న ప్రేమ గీతాలు 30 పాటలను శ్రవణరూపంలో రెండు ఆడియో క్యాసెట్లు గా రికార్డు చేయడం జరిగింది. భైరవభొట్ల కొన్ని ఆర్థిక కారణాల వల్ల వీటిని శ్రవణరూపంలో రూపొందించలేక పోయాడు. 

5.9. నాయిక భగ్న ప్రేమ గీతాలు : 

5.9.1. అక్షర రూపం ( ప్రింట్) : 

భైరవభొట్ల చలనచిత్ర పరిశోధనా కేంద్రంలో నాయిక భగ్న ప్రేమ గీతాలు ఎన్నో అక్షర రూపంలో నిక్షిప్తమై ఉన్నాయి. సముద్రాల, దేవులపల్లి, శ్రీశ్రీ, ఆత్రేయ, ఆరుద్ర మొదలైన వారు రచించిన ఎన్నో పాటలు సినీ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోయాయి. అలాంటి సాయిక భగ్న ప్రేమ గీతాలు ఈ సంపుటంలో కింది విధంగా రూపొందించడం జరిగింది. 

చిత్రం పేరు పాట పల్లవి 

1. లైలా మజ్ను (1949) నినుబాసి పోవుదానా 

2. మల్లేశ్వరి (1951) ఎవరు ఏమని విందురో ... 

3. దేవదాసు (1953) అంతా భ్రాంతి యేనా 

4. ఆరాధన (1962) నీ చెలిమి నేడె కోరితిని 

5. భార్యాభర్తలు (1962) ఏమని పాడెదనో 

6. పరువు ప్రతిష్ఠ (1962) కనులుండి చూడలేను 

7. మÖగమనసులు (1964) మాను మారును కాకు 

8. ఆత్మబలం (1964) నాలుగు కన్నులు రెండైనాయి 

9. మనుషులు మమతలు (1965) కన్ను మÖసింది లేదు 

5.9.2. శ్రవణ (ఆడియో) రూపం 

భైరవభొట్ల చలన చిత్ర పరిశోధనా కేంద్రంలో పైన పేర్కొన్న నాయిక భగ్న ప్రేమ గీతాలు 24 పాటలను ఒక నమÖనా ఆడియో క్యాసెట్టుగా రూపొందించడం జరిగింది. ఈ పాటలే గాకుండా ఇంకా ఎన్నో నాయిక భగ్న ప్రేమ గీతాలు తెలుగు సినిమా పాటలలో వున్నాయి. భైరవభొట్ల తనకున్న దుర్భరమైన ఆర్ధిక పరిస్థితుల వల్ల ఈ విభాగంలోని పాటలను శ్రవణరూపంలో రూపొందించలేక పోయాడు. 

5.10. నాయికా నాయకుల యుగళ భగ్న ప్రేమ గీతాలు :

5.10.1. అక్షర(ప్రింట్) రూపం : 

భైరవభొట్ల తన పరిశోధనా కేంద్రంలో నాయికా నాయకుల యుగళ భగ్న ప్రేమ గీతాలు అక్షర సంపుటిలో పొందుపరచడం జరిగింది. ఆ పాటలను కింది విధంగా పొందు పరచడం జరిగింది. 

చిత్రం పేరు పాట పల్లవి 

1. మల్లీశ్వరి ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు 

2. దేవదాసు (1953) చెలియ లేదు చెలిమి లేదు 

3. చిరంజీవులు (1956) కనుపాప కరువైన కనులెందుకో 

4. మాయాబజార్ (1957) నీ కోసమె నీ జీవించునది 

5. మాంగల్యబలం (1959) పెను చీకటాయె లోకం 

6. ఋణాను బంధం (1960) నిండు పున్నమి వెన్నెల 

7. శభాష్ సూరి (1964) ఈ వెన్నెల ఈ పున్నమి వెన్నెల 

8. చక్రవాకం (1974) తీగలేని వీణను 

5.10.2. శ్రవణ (ఆడియో) రూపం : 

నాయికా నాయకులు భగ్న ప్రేమ గీతాలను భైరవభొట్ల శ్రవణ రూపంలో ఒక నమÖనా ఆడియో క్యాసెట్టు గా మాత్రమే రూపొందించాడు. ఆర్ధిక కారణాల రీత్యా దీన్ని శ్రవణ రూపంలో రూపొందించలేక పోయాడు. 

5.11. జిక్కి, ఏ.ఎం. రాజాం సినీగేయ సంకలనం : 

5.11.1. అక్షర(ప్రింట్) రూపం : 

భైరవభొట్ల చలనచిత్ర పరిశోధనా కేంద్రంలో 1991 వ సంవత్సరంలో జిక్కీ గారి సంగీత విభావరి కోసం జిక్కి, ఏ. ఎం. 

రాజాల పాటల రాత సంపుటిని తయారు చేయడం జరిగింది. ఈ సంకలనాన్ని 2004 వ సంవత్సరంలో జె.పి. పబ్లికేషన్స్ (విజయవాడ) వారు శాస్త్రీయ నృత్యగీతాలతో కలిపి ప్రచురించారు. ఇందులోని జిక్కీ, ఏ. ఎం. రాజా ముఖ్యమైన పాటలను కింది విధంగా ఇవ్వబడ్డాయి. 

చిత్రంపేరు పాటల పల్లవి 

1. సంసారం (1950) కల నిజమాయెగా 

2. ప్రేమ లేఖలు (1953) పందిట్లో పెళ్లవుతున్నది

3. కళ రాజు పేద (1954) కళ్లు తెరచికనరా 

4. రోజులు మారాయి (1955) ఏరువాకా సాగారో 

5. దొంగరాముడు (1955) లేవోయి చిన్నవాడా 

6. అర్ధాంగి (1955) ఎక్కడమ్మా చంద్రుడూ

7. పెళ్లికానుక (1960) పులకించని మది పులకించు 

8. పెళ్లికానుక (1960) వాడుక మరచద వేలా 

9. శ్రీ కృష్ణ పాండవీయం (1966) ఛాంగురే బంగారు రాజా 

10. ఆదిత్య 369 (1991) జాణవులే నెరజాణవులే

5.11.2. శ్రవణ (ఆడియో) రూపం : 

1991 వ సంవత్సరంలో జిక్కీ సంగీత విభావరి కోసం పైన పేర్కొన్న పాటలను అక్షర రూపంలో పాటల సంపుటిని శ్రవణ రూపంలో ఒక ఆడియో క్యాసెట్టు గా మాత్రమే భైరవభొట్ల రూపొందించి దానిని చెనై లో ఉన్న జిక్కీకి పంపించాడు. అవి ఆమెకు ఎంతగానో ఉపయోగ పడ్డాయి. కానీ దీన్ని శ్రవణ రూపంలో మాత్రం తీసుకు రాలేక పోయాడు. 

5.12. సినీ దేశభక్తి గీతాలు : 

5.12.1. అక్షర (ప్రింట్) రూపం : 

భైరవ భొట్ల రూపొందించిన ‘తెలుగు సినిమా దేశభక్తి’ గీతాలు’ అనే పుస్తకాన్ని జ్ఞానవికాస్ సంస్థ (విజయవాడ) వారు 15.08.2007న ఆవిష్కరించారు. ఇటువంటి దేశభక్తి గీతాల సంకలనంలో ముఖ్యమైన పాటలను భైరవభొట్ల ఈ కింది విధంగా రూపొందించడం జరిగింది. 

చిత్రం పేరు పాట పల్లవి 

1. మాలపిల్ల (1938) కొల్లాయి గట్టితేనేమి 

2. మాల పిల్ల (1938) మాలలు మాత్రం మనుషులు కారా? 

3. భక్తిమాల (1941) మనకేలా మధుపానము 

4. పల్లెటూరు (1952) చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా

5. పుట్టిల్లు (1953) మనది భారతదేశమమ్మా 

6. అగ్గిరాముడు (1954) జై ఆంధ్ర జనని

7. మేనరికం (1954) పండుగ దినమిదిరా 

8. పరాశక్తి (1954) మాతెలుగు తల్లికి మల్లె పూదండ

9. మనదే (1956) వీర గంధము తెచ్చినామయా 

10. వెలుగు నీడలు (1961) పాడవోయి భారతీయుడా 

అయితే ఈ దేశభక్తి గీతాల సంకలనాన్ని ఒక నమÖనాగా మాత్రం తయారు చేసిందే. 

5.12.2. శ్రవణ(ఆడియో) రూపం : 

పైన పేర్కొన్న దేశభక్తి గీతాలను 1990 వ సంవత్సరంలో శ్రవణ రూపంలో ఒక ఆడియో క్యాసెట్టు గా మాత్రమే భైరవభొట్ల రూపొందించాడు. 1992 వ సంవత్సరంలో భైరవభొట్లు పరిశోధనా కేంద్రం గౌరవాధ్యక్షుడైన డా. కొంగర జగ్గయ్య ఈ క్యాసెట్టును ఆవిష్కరించాడు. 

5.13. తెలుగు సినీ మంగళహారతి గీతాలు : 

5.13.1అక్షర రూపం (ప్రింట్) : 

భైరవభొట్ల చలనచిత్ర పరిశోధనా కేంద్రం తెలుగు సినిమాల్లో వచ్చిన సకల దేవతా మÖర్తులను వర్ణించిన భక్తి గీతాలను, స్త్రీల పాటలను ‘మంగళ హారతి గీతాలు’ అనే పేరుతో 1988లో రూపొందించింది. బాలాజీ పబ్లికేషన్స్ (విజయవాడ) వారు దీన్ని ముద్రించారు. ఆంధ్రదేశంలోని ప్రతి ఇంట్లోనూ ఈ గ్రంధం పరాయణ గ్రంథంగా శోభిల్లుతోంది. ఈ పుస్తకాన్నే గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్ (రాజమండ్రి) వారు ముద్రించారు. సినిమా పాటల సంకలనాల్లో ఇదే పెద్ద రికార్డు. ఈ సంకలనం లోని పాటలను భైరవ భొట్ల కింది విధంగా రూపొందించాడు. 

చిత్రం పేరు పాట పల్లవి 

1. సంతానం (1954) అమ్మా మాయమ్మ

2. భాగ్యరేఖ (1957) నీ వుండేదా కొండపై 

3. నర్తనశాల (1963) జనని శివకామిని 

4. రహస్యం (1967) శ్రీ లలితా శివ జ్యోతి 

5. అందరి కంటే మొనగాడు (1971) మంగళ గౌరీ దీవెనలు 

6. మీనా (1974) శ్రీరామనామాలు శతకోటి

7. చిల్లరదేవుళ్లు (1978) శ్రీ లక్ష్మీ నీ మహిమలు

8. గృహప్రవేశం (1982) శ్రీసత్యనారాయణుని సేవకు 

9. దేవి శ్రీ దేవి (1982) మంగళ గౌరికి హారతులు 

5.13.2. శ్రవణ(ఆడియో) రూపం : 

భైరవభొట్ల చలనచిత్ర పరిశోధనా కేంద్రంలో 1988వ సంవత్సరంలోనే పైన పేర్కొన్న మంగళహారతి గీతాల్లోని 18 పాటలను శ్రవణ రూపంలో ఒక ప్రత్యేక ఆడియో క్యాసెట్టుగా మాత్రమే భైరవభొట్ల రూపొందించాడు. ఇది పరిశోధన కోసం రూపొందించిన నమÖనా క్యాసెట్టు మాత్రమే. 

5.14. తెలుగు సినిమాల్లో లాలి పాటలు

5.14.1. అక్షర రూపం (ప్రింట్) 

భైరవభొట్ల చలన చిత్ర పరిశోధన కేంద్రంలో 1988 వ సంవత్సరంలోనే మాతృత్వానికి ప్రతీకలైన తల్లుల హృదయాల్ని, పిల్లలకు తల్లిదండ్రులు పాడే లాలి పాటల్ని పొందుపరిచాడు. భైరవభొట్ల ఈ సంపుటిలో పేర్కొన్న ముఖ్యమైన లాలి పాటలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 

చిత్రం పేరు పాట పల్లవి 

1. వెలుగు నీడలు (1961) చల్లని వెన్నెల సోనలు 

2. భీష్మ (1962) జోజో గారాల బాల 

3. ఆడబ్రతుకు (1965) బుజ్జి బుజ్జి పాపాయి

4. సత్యహరిశ్చంద్ర (1965) అందాల తనయా 

5. తోడు నీడ (1965) అత్త ఒడి పూవు వలే 

6. మనసే మందిరం (1966) అల్లారు ముద్దుగదే 

7. నిర్దోషి (1967) చిన్నారి క్రిష్ణయ్య 

8. చదరంగం (1961) తారంగం తారంగం

9. చల్లని నీడ (1968) మల్లెల కన్నా, జాబు కన్నా 

10. నిండు హృదయాలు (1969) రామలాలి మేఘశ్యామలాలి 

ఇది భైరవ భొట్లు రూపొందించిన సినీ లాలిపాటల అక్షర సంపుటి. 

5.14.2. శ్రవణ రూపం (ఆడియో) : 

భైరవభొట్ల, ఫిలిం రీసెర్చి సెంటర్ లో పైన పేర్కొన్న తెలుగు సినిమా లాలి పాటలను 1987 వ సంవత్సరంలోనే శ్రవణ రూపంలో 4 ఆడియో క్యాసెట్లుగా రూపొందించి భద్రపరిచాడు. 

5.15. కొసరాజు సినీ గేయ కోశం : 

5.15.1. అక్షర రూపం : (ప్రింట్) 

ఒక విశ్వవిద్యాలయంలో పిహెచ్.డి. నిమిత్తం కొసరాజు సినీ గేయ కోశాన్ని మÖలాధార గ్రంధంగా 1990 వ సంవత్సరంలో 3 భాగాలుగా భైరవభొట్ల దీన్ని రూపొందించాడు. 

5.15.2. శ్రవణ రూపం (ఆడియో) 

కొసరాజు సినీ గీతాలను 1991 వ సంవత్సరంలో 4 ప్రత్యేక ఆడియో క్యాసెట్లుగా శ్రవణ రూపంలో రూపొందించాడు భైరవభొట్ల. 

20.06.2017 న కొసరాజు వర్ధంతి సందర్భంగా ఆయన పాటల్ని ఆడియో వీ.P.3. గా ఆవిష్కరింపజేశాడు భైరవభొట్ల. ఆ వీ.P.3. లను పుట్టా జగన్మోహనరావు, కొసరాజు తాను ప్రసాద్ లకు ఆ భైరవభొట్ల అందజేశాడు. 

అక్షర, శ్రవణ, దృశ్య సమన్వయంతో భైరవభొట్ల రూపొందించిన సినిమా పాటలను మొదటి విభాగంలో శృంగార (శాస్త్రీయ) నృత్యగీతాలు, తెలుగు సినిమా వాన పాటలు, తెలుగు సినిమాల్లో చందమామ గీతాలు చర్చించడం జరిగింది. 

రెండో విభాగంలో నాయక ప్రేమ గీతాలు, నాయిక ప్రేమ గీతాలు, నాయికా నాయకుల యుగళ ప్రేమ గీతాలు, నాయిక భగ్న ప్రేమ గీతాలు, నాయక భగ్న ప్రేమగీతాలు, నాయికా నాయకుల యుగళ భగ్న ప్రేమ గీతాలు, ప్రముఖ గాయనీ గాయకులైన జిక్కీ, ఏ. ఎం. రాజా పాడిన సినీ గీతాలు, సినీ దేశభక్తి గీతాలు, మంగళహారతి గీతాలు, లాలిపాటలు, కొసరాజు సినీ గేయకోశం మొదలైన వాటిని అక్షర శ్రవణ రూపంలో చర్చించుకోవడం జరిగింది. 

మÖడో విభాగంలో కేవలం అక్షర సంపుటాలు మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ శ్రవణ, దృశ్య రూపంలో లేవు. 

1. సినీ భక్తి గేయ కోశం 

2. ఘంటసాల గాన సుధ 

3. సినారె సినీ గేయకోశం 

4. శ్రీశ్రీ సినీ గేయ కోశం 

5. ఆరుద్ర సినీగేయ కోశం 

6. దేవులపల్లి కృష్ణ శాస్త్రి, సినీ గేయకోశం 

7. సిరివెన్నెల సినిమా పాటల సంకలనం 

8. వేటూరి సినిమా పాటలు 

మÖడో విభాగంలో పైన పేర్కొన్న ఈ అక్షర సంపుటాల గురించి మÖడో అధ్యాయంలోనూ (సినీ గేయ కోశాల నిర్మాణం - పరిశీలన) నాల్గో అధ్యాయంలోనూ ( తెలుగు సినిమా పాటలు - కథా వస్తు పరంగా విశ్లేషణ) సవిస్తారంగా చర్చించడం జరిగింది. ఈ విభాగంలో ఇచ్చిన శీర్షిక తాలుకు సంకలనాలు భైరవభొట్ల అక్షర రూపంలో మాత్రమే పొందు పరిచాడని పరిశోధక మిత్రులకు చెప్పడం జరుగుతుంది. 

భైరవభొట్ల సినీ పరిశోధన గురించి డా. పరుచూరి గోపాల కృష్ణ అన్నట్లు భైరవభొట్ల హిందీ మాష్టారే కాదు, హిందూ మహా సముద్రమంత మహా స్టార” - ఈ పలుకులు అక్షర సత్యాలు. 

భైరవభొట్ల తెలుగు సినిమా పాటలను అక్షర, శ్రవణ, దృశ్య సమన్వయ రూపాలలో రూపొందించడమే గాకుండా తన సినీ పరిశోధనను ప్రత్యేకించి శ్రవణ రూపాలలోనూ, దృశ్యరూపాలలోనూ మైలురాళ్లుగా నిలబెట్టాడు. 

5.16. శ్రవణ రూపంలో రూపొందించిన సినిమా పాటలపై భైరవ భొట్ల కృషి : 

భైరవభొట్ల కేవలం సినిమా పాటలు సేకర్తగానే కాకుండా ఒక పరిశోధకుడిగా కూడా అనన్య సామాన్యమైన కృషి చేశాడు. తనకున్న అభిరుచికి, సృజనాత్మకతను జత కలిపి అనేక సినీ సాహితీ ప్రయోగాలు చేశాడు. వాటిలో ముఖ్యంగా ఒకే రాగంలో హిందీ, తెలుగు సినిమాపాటలు, అంత్యాక్షరి, అక్కినేని కథానాయికా గీతాల సమాహారం, చిత్ర గీతాలలో సైకోథెరపీ అనే అంశాలు చెప్పుకోదగ్గవి. 

5.16.1. ఒకే రాగంలో హిందీ, తెలుగు సినిమా పాటలు : 

డా. ఉయÖ్యరు లక్ష్మీనరసింహారావు రెండో పిహెచ్.డి సిద్ధాంత గ్రంధమైన ‘డా. సినారె సినిమాపాటలు - పరిశోధన’ అనే అంశానికి మÖలాధార గ్రంథాన్ని భైరవభొట్ల తయారు చేయటం జరిగింది. ఈ సినీ గేయకోశం తయారు చేయడమే గాకుండా ఆ పరిశోధనా గ్రంథంలో 12 వ అధ్యాయానికి సంబంధించిన అనుకరణ గీతాల్లోని ‘లయాను కరణం’ అనే ఉపశీర్షికకు ఉపయోగపడే ఒకే రాగంలోని హిందీ తెలుగు సినిమా పాటల వివరాలనూ, ముఖ్యంగా సినారె రచించిన కొన్ని పాటలకు హిందీ సినిమా పాటల మÖలాలు ఎక్కడ ఉన్నాయో, వాటిని పరిశీలించడం జరిగింది. ఇలాంటి వివరాలను భైరవభొట్ల ఈ కింది విధంగా రూపొందించాడు. 

“మంగమ్మ శపథం”(1965) చిత్రంలోని ‘ఒయ్యారమొలికే చిన్నది’ అనే పాటను సినారె రచించాడు. దీనికి మÖలం “షహారా” (1963) అనే హిందీ చిత్రంలోనిదిగా భైరవభొట్ల పరిశోధించాడు. 

‘ఫంకే ీVAతేతో ఉడ్ ఆతిరే 

రసియా ఓ జాలియా’ అనే పాట పల్లవినే తీసుకుని సి. నారాయణ రెడ్డి హిందీ రాగంలోనే తెలుగులో ‘వయ్యార మొలికే చిన్నది’ 

అనే పల్లవితో తెలుగులో రాశాడు. ఇలా 22 తెలుగు సినిమా పాటలకు హిందీ సినిమా పాటల మÖలాలనూ, వాటి రాగాలకూ భైరవభొట్ల 

ఆ సిద్ధాంత గ్రంథంలోని 12వ అధ్యాయానికి సిద్ధాంత గ్రంధంలో హిందీ తెలుగు పాటల వివరాల పట్టికను తయారు చేసి డా. ఉయÖ్యరు లక్ష్మీ నరసింహరావుకు అందజేశాడు. 

పైన పేర్కొన్న ఒకే రాగంలోని హిందీ, తెలుగు సినిమా పాటల వివరాలు సేకరించిన తర్వాత భైరవభొట్లకు దాన్ని ఒక రీసెర్చు ప్రాజెక్టుగా చేయాలని సంకల్పం కలిగింది. అందుకోసం ఒకే రాగంలో హిందీ, తెలుగు సినిమా పాటలు” అనే అంశానికి చెందిన తెలుగు, హిందీ పాటల్ని 12 క్యాసెట్లుగా శ్రవణ రూపంలో సిద్ధం కున్నాడు. అదే విధంగా హిందీ, తెలుగు డబ్బింగ్ చిత్రాల్లోని పాటలను కూడా 24 క్యాసెట్లలో 24 క్యాసెట్లలో రూపొందించాడు. 

ఒకే రాగంలోని హిందీ తెలుగు సినిమా పాటల పరిశోధనలోని పాటలను పాటలను సి.డీ. రూపంలోకి మార్చాడు భైరవభొట్ల. ఈ ఆడియో సి.డి.ని 22.02.2005లో హైదరాబాదులో డా. సినారె ఆవిష్కరించాడు. ఆ పాటలు ఈ కింది విధంగా రూపొందించబడ్డాయి. 

తెలుగు సినిమా పాటలు 

చిత్రం పేరు పాట పల్లవి 

1. ఆమె ఎవరు ? (1964) ఓ నా రాజా 

2. అభిమానం (1960) ఓీVA బస్తీ దొరసాని

3. ఉమాసుందరి (1956) నమ్మకురా ఇల్లాలు పిల్లలు

4. శభాష్ రాముడు (1959) హల్లో డార్లింగ్ మాటాడవా 

5. ధనమా? దైవమా? (1974) నీ మది చల్లగా

6. ప్రేమ పావురాలు (1989) నీ జతలేక పిచ్చిది కాక

7. రంగేళి (1990) హాయిరే హాయ్ ..

హిందీ సినిమా పాటలు 

చిత్రం పేరు పాట పల్లవి 

1. ఓకౌన్ థి ? నయానాబర్ సే రింజిం 

2. సి.ఐ.డి లేకే పెహలా పెహలా ప్యార్ 

3. నాస్తిక్ దేక్ తేరే ఇన్ సాన్‌కి 

4. సి.ఐ.డి ఏదిల్ ముష్కిల్ జీనా మహా 

6. షర్మిలి ఖిల్‌తే హై గులియహా 

6. మైనే ప్యార్ కియా దిల్ దివానా బిన్ సజనాకే 

7. రంగీలా యాయిరే యాయిరే జోర్

భైరవ భొట్ల కొనసాగిస్తున్న ఈ పరిశోధనా యజ్ఞం భావితరంలోని పరిశోధక విద్యార్థులకు బాగా ఉపకరిస్తుంది అనడంలో సందేహం లేదు. అందుకనే భైరవభొట్లను ‘నిరంతరం నడిచే గ్రంథాలయం’ అని చెప్పుకోవచ్చు. 

5.16.2. అంత్యాక్షరి పోటీలకు ఆడియో ప్రశ్నా పత్రం : 

విజయవాడలోని సిద్ధార్థ కళాశాల వారు ఇంటర్ కాలేజ్ సాంస్కృతికోత్సవాల సందర్భంగా వివిధ రకాలైన పోటీలు నిర్వహించారు. ఆ పోటీలన్నీ కళాశాల పూర్వసంఘం విద్యార్థి నాయకుడైన ఎన్.ఆదిత్య (“మనసంతా నువ్వే” దర్శకుడు) ఆధ్వర్యంలో జరుగుతుండేవి. ఆయన, అంత్యాక్షరీ పోటీలకు భైరవభొట్లను వరుసగా 5 సంవత్సరాల పాటు న్యాయ నిర్ణేతగా ఆహ్వానించాడు. ఆ సందర్భంగా ఒక శ్రవణ ప్రశ్నావళిని భైరవభొట్ల తయారు చేశాడు. 10 పాటలకు ముందువచ్చే వాద్య సంగీతాన్ని ఒక క్యాసెట్ గాను, తర్వాత 50 పాటలకు ముందు వచ్చే వాద్య సంగీతాన్ని కూడా ఒక క్యాసెట్ గాను రికార్డు చేశాడు. ఆ ఆడియో ప్రశ్నావళిని సిద్ధార్థ కళాశాల వారు 5 సంవత్సరాల పాటు బాగా ఉపయోగించుకున్నారు. 1997 వ సంవత్సరంలో ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం కుమారుడు అయిన చరణ్ వివాహానికి భైరవభొట్ల ఈ ఆడియో ప్రశ్నావళిని పెళ్లి కానుక గా సమర్పించాడు. 

భైరవభొట్ల రూపొందించిన దృశ్యరూపంలోని (శ్రవణ సంయుక్త వీడియో క్యాసెట్లు) సినీ పరిశోధనలు కూడా అపురూపమైనవి, అఖండమైనవి. దీనిలో భాగంగానే (1) అక్కినేని నాగేశ్వర రావు 50 మంది కథానాయికలతో నటించిన వీడియో క్యాసెట్ (1) ‘అమర శిల్ప జక్కన్న’, “పునర్జన్మ”, “అర్ధాంగి” చిత్రాలలో ‘సైకోథెరపి’ అనే వీడియో క్యాసెట్టు. 

పైన పేర్కొన్న దృశ్యరూపంలో రూపొందించిన భైరవ బొట్ల సినీ పరిశోధన గురించి కింది విధంగా చర్చించడం జరుగుతుంది. 

5.16.3. అక్కినేని సినిమాల్లో నటించిన కథా నాయికలు : 

1994వ సంవత్సరం సెప్టెంబరు నెలలో అక్కినేని కథా నాయికలు అందరూ అక్కినేని సన్మానించడం జరుగుతుందని వంశీ రామరాజు (హైదరాబాదు) భైరవభొట్లకు తెలియజేసాడు. అప్పుడు భైరవభొట్లకు ఒక ఆలోచన వచ్చింది. వచ్చిన వెంటనే భైరవభొట్ల అక్కినేని తో నటించిన కథానాయికల జాబితాను తయారు చేశాడు. ఆ తర్వాత తనకు లభ్యమైన వీడియో క్యాసెట్ల ఆధారంగా “బాలరాజు” చిత్రంలో అక్కినేనితో కలిసి నటించిన ఎస్. వరలక్ష్మి దగ్గరి నుంచి “కాలేజీ బుల్లోడు” చిత్రంలో నటించిన రోజా వరకు ఆయనతో నటించిన కథానాయికల చిత్రాలన్నిటినీ సంవత్సరాల వారీగా రూపొందించి ఒక వీడియో క్యాసెట్‌ను తయారు చేశాడు. అందులో ఒక్కొక్క చిత్రంలో నుంచి ఒక్కో పాటను తీసుకుని, ఆ పాట పై భాగాన చిత్రం పేరు, విడుదలైన సంవత్సరం, కథానాయిక పేరు ఇవ్వడం జరిగింది. ఆకాశవాణి (విజయవాడ) లో న్యూస్ రీడర్‌గా పని చేసే ప్రయాగరామకృష్ణ ఆ వీడియో క్యాసెట్‌కి ఉపోద్ఘాతం చెప్పాడు. 

సుమారు 2 నెలల కాలవ్యవధిలో తయారైన ఆ వీడియో క్యాసెట్ను 11.09.2004 న విశాఖపట్నంలో దాసరి నారాయణ రావు ఆవిష్కరించాడు. ఆ సభలో కథానాయికలంతా అక్కినేనిని స్మనానిస్తే, భైరవభొట్లను అక్కినేని సన్మానించాడు. ఈ విషయం అప్పట్లో ప్రధాన పత్రికల్లో వార్తగా వచ్చింది. భైరవభొట్ల 2000 సంవత్సరంలో అక్కినేని కథానాయికల వీడియో క్యాసెట్‌ని విసిడిలోకి మార్పించాడు. దాన్ని ఏ.ఎన్.ఆర్. కళాశాల గ్రంథాలయానికి ఒక పూర్వ విద్యార్థి కానుకగా అందించాడు. అది ఇప్పటికీ ఏ.ఎన్.ఆర్. కళాశాల గ్రంథాలయంలో సురక్షితంగా ఉంది.

5.16.4. తెలుగు సినిమా పాటల్లో సైకోథెరపీ - భైరవ భొట్ల కృషి :

“అర్ధాంగి”, “అమరశిల్ప జక్కన”, “పునర్జన్మ’ చిత్రాల్లో సైకో థెరపి అనేది ముఖ్యమైన పరిశోధన. భైరవభొట్ల చలన చిత్ర పరిశోధన కేంద్రంలో అనేక ప్రయోజనాత్మక, ప్రయోగాత్మక సినీ పరిశోధనలు జరిగాయి. దానిలో ముఖ్యమైనది, ప్రముఖ మానసిక వైద్యనిపుణులు, (విజయవాడ) డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి రచించిన మానసిక వైద్య గ్రంధాలు ఆధారంగా తయారు చేసిన ఈ వీడియో క్యాసెట్ సైకో థెరపీ పై పరిశోధన చేసే పరిశోధకులకు మÖలధారమైనది. 

కష్టాలకు కృంగిపోవడం, సుఖాలకు పొంగిపోవడం మానవ నైజం. ఇదే నైజం మనకు సినిమాల్లో కూడా కన్పిస్తుంది. భైరవ బొట్ల సినీ గీతాల మీదే కాకుండా, పాత్రల మీద, ముఖ్యంగా మనస్తత్వ చిత్రీకరణ మీద కూడా ఓ వీడియో క్యాసెట్‌ను రూపొందించాడు. 

‘అర్ధాంగి” చిత్రంలో బొత్తిగా లోకజ్ఞానం తెలిని అమాయకుడైన కథానాయకుడు, ప్రతినాయకుని అంతు ఎలా చూస్తాడో, తన భార్య చేయÖతతో ఎలా విద్యావంతుడౌతాడో, అతని జీవితం ఎలా ఆదర్శ పాత్రమవుతుందోనన్న సన్నివేశాలనూ, 

అమరశిల్పి జక్కన” చిత్రంలో జక్కన భగ్న హృదయుడై. వికల మనస్కుడై మళ్లీ మామÖలు మనిషయ్యే దాకా ఉన్న సన్నివేశ దృశ్యాలనూ,

“పునర్జన్మ” చిత్రంలో కథానాయకుడు అగ్ని ప్రమాదంలో మతిస్థిమితం పోగొట్టుకుని ఎట్లా ప్రవర్తిస్తాడో, ఒక నర్తకి ద్వారా ఎలా పునర్జన్మను పొందుతాడో, ఆ దృశ్యాలన్నింటినీ క్రమపద్ధతిలో, కథాపరంగా, సన్నివేశపరంగా భైరవభొట్ల రూపొందించాడు. దానిని చూచి శ్రీ ఇండ్ల రామ సుబ్బారెడ్డి స్పందించి “ సైకాలజీ” అంటే ఏమిటో తెలీని భైరవభొట్ల దీన్ని రూపొందించడం మహాద్భుతం. ఇది ప్రత్యేకమైన పరిశోధనా మేధస్సుకు ఒక ఉదాహరణ. మున్ముందు భైరవభొట్ల యింకా యిలాంటి పరిశోధనాత్మక ప్రయోగాలు చెయ్యాలని, ఆయనకు నా ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని” చెప్పాడు. 

ఈ పరిశోధనాత్మకమైన వీడియో క్యాసెట్టు గురించి అప్పటి పత్రికలన్నీ చాలా విశేషంగా ప్రచురించాయి. 1997, మే నెలలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ దీని గురించి చాలా గొప్పగా రాసింది. అప్పటి నుండి చాలా మంది పరిశోధకుల దృష్టి భైరవ బొట్ల మీద పడింది. ఈనాడు తెలుగు చిత్రాలలో ‘సైకో థెరపీ’ అనే అంశం ఎందరో భావి పరిశోధక విద్యార్థులకు మÖలాధార గ్రంధమయ్యింది. భైరవ బొట్లను భవిష్య ద్రష్టగా చేసింది కూడా ఈ చలన ప్రయోగం అని చెప్పుకోవచ్చు. 

కథావస్తుపరంగా భైరవభొట్ల చేసిన సినీ పాటల పరిశోధన

సినిమాపాటలు కథా వస్తుపరంగా వర్గీకరణ - పరిశీలన 

4. తెలుగు సినిమాపాటలు కథా, వస్తుపరంగా వర్గీకరణ - భైరవభొట్ల కృషి 

మనిషికి వినోదాన్ని విజ్ఞానాన్ని ఒకేసారి అతి స్వల్పకాలంలో అందించే చిత్రమైన సాధనం సినిమా. సినిమా కళతో కూడుకొన్న వ్యాపారం. అటు సాంకేతిక పరిజ్ఞానంతో ఇటు సృజనాత్మక దృష్టితో కలగలిసి ఏర్పడిన కళ యిది. సినిమాకు సాంకేతికత బాహ్యశరీర నిర్మాణమైతే, సృజనాత్మకత ఆత్మభూతమైంది. ఆత్మలేని శరీరం శవప్రాయమైనట్లే, సృజనాత్మకత లేకుండా సాంకేతికంగా నిర్మింపబడిన కళ నిర్జీవంగా ఉంటుంది. సినిమాకళకు సాహితీపరమైన సృజనాత్మకత ప్రాణం. తెలుగు సినిమా సాహితీ రచన మÖడు విధాలుగా కనిపిస్తుంది. అది కథాసాహిత్యంగా, సంభాషణ సాహిత్యంగా, పాటల సాహిత్యంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ మÖడు ప్రధానాంశాల్లోనూ చెప్పుకోదగిన అంశం ‘పాటల సాహిత్యం’ 1. 

4. సినిమా పాట : 

మాటల్లో చెప్పలేని ఏ అనుభూతినైనా అందంగా మనసుకు హత్తుకునేలా చెప్పడానికే పాట! దీనినే ‘గోరింటా’ కు (1979) చిత్రంలో ఓ పాటలో వేటూరి తన కవితా పరిభాషలో ‘మనసు మాటకందని నాడు మధురమైన పాటవుతుంది’ అన్నారు. పని- పాట అనేది అనాదిగా వస్తున్న మాట. పనితో తమ

(1. యువచిత్ర పాటలు - సాహిత్య విలువలు - కంపల్లె రబిచంద్రన్ పుట:59)

శ్రమను మర్చిపోవడానికి ఉపశమన సాధనంగా ప్రారంభమైన పాట క్రమంగా వినోద సాధనంగా మారింది. అలా జనంలో పుట్టి పెరిగిన పాట పదమై భక్తినీ, రక్తినీ పుణికి పుచ్చుకొని అన్నమయ్య ద్వారా, క్షేత్రయ్య ద్వారా పరువు, పరువం తెచ్చుకొని త్యాగరాజాదుల వాక్కుల్లో కృతియై, మరికొంచెం ముందుకు వచ్చి సొంకం బింకం పొదువుకుని జావళీ అయి, రంగమండపం ఎక్కి, అక్కడి నుంచి కూడా మహారాష్ట్ర మెట్లతో నాటక రంగస్థలం మీద గొంతు సవరించుకొని సినిమాల్లోకి ఒక్క ఉరుకు ఉరికి మహా ప్రవాహంగా పరిణమించింది 1

4.1 సినిమా పాటలు - ఆవశ్యకత : 

· ప్రంబంధాల్లో ఆష్టాదశ వర్ణనల్లాగా ‘సినిమా’ అనే సరికి కూడా కొంత పోపు సామాగ్రి మనకు స్ఫురిస్తుంది. ఇది కేవలం ఇతివృత్తం, పాత్ర కల్పన, సన్నివేశాల కల్పలన వంటి వాటికే పరిమితం కాదు. ప్రేక్షజన మనోరంజనం ముఖ్యాశయంగా విస్తరిస్తుంది. ఇలాంటి పోపు సామాగ్రిలో ముఖ్యమైనది పాట. 

(1. పాట మోసుకు వస్తున్నది అలనాటి సౌరభాల్ని - మోహిని (వ్యాస సంకలనం) ఇంద్రగంటి శ్రీకాంత శర్మ పుట - 99, 100) 

ఒక కవి ఒక సన్నివేశాన్ని ఉద్దేశించి రాస్తే, దానిని సంగీత దర్శకుడు ‘ధని’ ద్వారా ఆవిష్కరిస్తే గాయనీగాయకులు సమర్థతను బట్టి, ఆ పాట ఫలవంతం అవుతుంది. డెభ్భై ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో గుర్తుంచుకోదగిన గొప్ప చిత్రాలను ప్రేక్షకుల మనస్సుల్లో అజరామరంగా నిలిపినవి మాత్రం పాటలే. ఒక రచయిత, దర్శకుడు ఏమి చెప్పదలచుకున్నారో దాని సారాన్ని మÖడున్నర నిమిషాల పాట గొప్పగా నిలబెట్టిన సందర్భాలున్నాయి. ఒక చిత్ర దర్శకునీ, నిర్మాతనీ, కడకు రచయితనీ, సంభాషణలనీ ప్రేక్షకులు మర్చిపోవచ్చునేమో కానీ, ఒక పాటనీ, దాని చిత్రీకరణలో ఇమిడివున్న అనుభూతిని తొందరగా జనం మరచిపోరు. ఇలా చిత్రాలకు ప్రాణప్రతిష్ట చేసిన ఖ్యాతి మన సినిమా పాటల రచయితలందరికీ దక్కుతుంది. ఆ పాటలకు సంగీతంలో చైతన్యం కలిగించిన సంగీత దర్శకులకు, గాయనీగాయకులకు చెందుతుంది.1 

సాధారణంగా ఏ సినిమాకైనా ప్రేక్షకుణ్ణి ఆహ్వానించే సింహద్వారం కథ అయితే మిగతా గృహద్వారాలు నాటకీయ సన్నివేశాలు. పాట మాత్రం వెల్లడిగా వెలుగూ, గాలి వచ్చే కిటికీ. ఆ గాలీ వెలుగు వల్ల ప్రాణానికి కలిగే అనుభవం వర్ణనా తీతం. అందుకేనేమో కొన్ని పాటలు యుగకర్తృత్వాన్ని మోస్తే కొన్ని పాటలు జ్ఞాపకాల్లో తీయని బాధలుగా గడిచిన కాలంలో అనుభవాల గుర్తులుగా శ్రోతలకు మిగిలే వుంటాయి. ఉదాహరణకి - లైలామజ్ను (1949), మల్లీశ్వరి (1951), పాతాళ భైరవి (51), దేవదాసు (53), రోజులు మారాయి (55), మాయబజార్ (57), భూకైలాస్ (57), ‘వెలుగనీడలు’ (61), లవకుశ (63), మÖగమనుషులు (64), సిరి సిరిమువ్వ’ (76), సీతామాలక్ష్మి (78) శంకరాభరణం (80), సాగ- రసంగమం’ (83), ‘సిరివెన్నెల’ (86) మరి ఇటీవల మనసంతా నువ్వే (2000) వంటి చిత్రాల్లో పాటలు ఆయా కాలాల్లో యుగకర్తృత్వం వహించాయి. ఈ పాటల పాదాలు కొన్ని సామెతలంత ప్రసిద్ధిపొందాయి. 

(1. యువచిత్ర పాటలు - సాహిత్య విలువలు, కంపల్లె రవిచంద్రన్ పుట. 62) 

ఏ చిత్రంలోనైన, ఒక సన్నివేశంలో, కేవలం సంభాషణల ద్వారా, చిత్రీకరణ ద్వారా ఒక అనుభూతి కలిగించడం చాలదనుకున్నప్పుడు, అక్కడ పాట అవసరమవుతుంది. ఏ అనుభూతి కోసమైతే పాటను అక్కడ కలిగిస్తామో ఆ అనుభూతిని ఆపాటలో స్థిరింపజేస్తే ఆ పనికి ప్రతిఫలం ఉంటుంది. కథాంశ వివరణ కోసమో, సంఘటన విశదీకరించడం కోసమో, పాత్రగాని, పాత్రలు పొందిన ప్రాధాన్యం తెలపడం కోసమో, కథా సంవిధానం కోసమో, నేపథ్య స్థితి కోసమో, పాట సినిమాలో అవసరం అవుతుంది. కథా భాగమో, కథా వ్యాఖ్యానమో, భావమో, వర్ణనమో ఉంటుంది. ఆ సందర్భంలో సన్నివేశం రసవత్తరంగా బలపడటానికి పాట ఉద్దిష్టం కావచ్చు 1

(1. సాహిత్య దర్శనం ఆచార్య కొలకలూరి ఇనాక్ - పుట- 61)

మన చలన చిత్రాల్లో సన్నివేశబలం కలిగిన పాటలు ఎక్కువగా వచ్చాయి. అందువల్ల వస్తువైవిద్యం ఉండడానికి అవకాశం కలిగింది. పాట లేకపోతే కథ ముందుకు సాగనంతగా పాటకు ప్రాధాన్యం ఉండేది. అసలు పాట లేనిదే సినిమా లేదు. సినిమాలో పాటలు సంగీత ధర్మం, సాహిత్య గుణం మాత్రమే సంతరించుకొని లేవు. సినిమా స్వరూపంలోని కళా ధర్మాలన్నీ పాటల్లో దర్శనమిస్థాయి. అందువల్ల సమాంతర కళారూపమైన పాట సినిమాకు ప్రాణం. అంతేగాక మానవ శరీరానికి రక్తప్రసరణ వంటిది.

4.2. సినిమా పాటలు - ప్రయోజనం : 

సినిమాపాట జీవితంలో ఒక భాగమైపోయింది. సుమతి, వేమన శతకాలలోని ఏదో ఒక పద్యం రానివాడు కూడా ఈనాడు ఏదైనా సినిమా పాట చరణాన్ని, రాగాన్ని మననం చేసుకోకుండా ఉండలేడు. అంటే పద్యం రానివాళ్ళు వుండ వచ్చు గాని పాటలలోని ఒకటి రెండు పంక్తులైనా రానివాళ్ళరుదు. సాహిత్య ప్రక్రియలలో విశేష పాండిత్యం (వైదగ్ధ) చూపిన రచయితకు కేవలం సినిమా పాటల వల్ల కీర్తిప్రతిష్టలు రావడం పాట ప్ర యోజనాన్ని తెలియజేస్తుంది. సినిమా సాహిత్యానికి దానిలో భాగమైన పాటను గుర్తించి ఇటు ప్రభుత్వం, అటు జనసామాన్యం సినిమా కవులకిస్తున్న గౌరవసత్కారాలు చూస్తే పాటకుండే ప్రయోజనం వ్యక్తమవుతుంది. మాటల్లో చెప్పలేని ఏ అనుభూతినైన అందంగా మ- నసుకు హత్తుకునేలా చెప్పటం పాట ప్రయోజనం. 1

(1. డా. సినారె సినీగీతాల సంపుటి ‘పగలే వెన్నెల’ సౌందర్య దృష్టి పుట -20)

తొలినాటి సినిమాలలో ఉపశమనం, ఉత్సాహం, కథానిర్వహన పాటలు ప్రయోజనాలు. అయితే వాటిలో అధిక శాతం వాచ్యంగా ఉండేవి. రామరాము సినిమా పాట ధ్వని, క్లుప్తత, ఆప్తత, ప్రసన్నత తదితర లక్షణాలను అలవర్చుకొని ప్రేక్షకుల తలలో నాలుకైంది, సినిమాకు ప్రాణమైంది. సినిమాల వల్ల పాటలకు పాటల వల్ల సినిమాలకు జనంలో ఆదరణ పెరిగింది. పాటలు లేని సినిమాలు ఊహించలేని పరిస్థితి ఏర్పడింది. చలనచిత్ర సంగీతం నేడు ప్రజాసంగీతం. 

సినిమా పాట అనేది వ్యాపార ప్రక్రియే అయినా అందులోనూ ఏ గొప్ప కవిత్వానికి తీసిపోని సినిమా పాటలున్నాయి. అటు సినిమా పాటల్ని యిటు సినీయేతర సాహిత్య ప్రక్రియలను ఏలిన ఎందరో రచయితలకు ఆ సాహిత్య ప్రక్రియల్లో కంటే సినిమా పాటల వల్ల వచ్చిన గుర్తింపే ఎక్కువ. పూర్వం సినిమాలకు పాటలు రాసిన వారిలో పాండిత్య ప్రకర్ష, సాహిత్యంలో అభినవేశం వున్న వాళ్ళే ఎక్కువ. 

(1. తెలుగు సినిమా పాట - డా. పైడిపాల, పుట : 17)

సినిమా వ్యాపార పరిశ్రమ అయినా పాటల్లో సాహితీ విలువలు లేకపోలేదు. శ్రీశ్రీ ఒక చోట చెప్పినట్లు న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే కానీ, గెలిచినదంతా న్యాయం కాదు. అదే విధంగా సినిమాలు ఎన్నో వచ్చినా, అందులో ఎన్నో పాటలు వినిపించినా చౌకబారు వన్నీ గతించిపోయాయి. కళాత్మకమైనవి మాత్రమే కాలమనే గీటురాయిపై నిగ్గుదేలి కలకాలం నిలిచి ఉన్నాయి, ఉంటాయి కూడా కాల పరీక్షకు నిలబడిన ఎన్నో పాటల ఆధారంగా సినిమా పాటల్లో సాహితీ విలువల్ని, కవితా సౌం దర్యాన్ని అంచనా వేయవచ్చు. ఇలాంటి పరిశోధనలెన్నింటిలో కేంద్ర బిందువుగా నిలిచినది. భైరవభొట్ల చలనచిత్ర పరిశోధన కేంద్రం. ఈ కేంద్రంలో భద్రపరచబడివున్న అమÖల్యమైన సినీ గేయకోశాలను భైరవభట్ల ఎంతో శ్రమించి, కథాపరంగా, అందులోని వస్తువైవిద్యపరంగా విభజించి భావి పరిశోధకుల కోసం నిక్షిప్త సినీజ్ఞాన సంపదను మనకు అందించాడనుట నిజం. తెలుగు సినిమా పాటల్లో కథావస్తు పరంగా భైరవభొట్ల చేసిన వర్గీకరణ లోని వైశిష్ట్యతను, పరిశోధన విషయాన్ని వివరించటం ఈ అధ్యాయంలో జరుగుతుంది. 

కొన్ని విశ్లేషించే ముందుగా ఈ రకమైన క్లిష్ట పరిశోధనకు భైరవభొట్లకు ప్రేరణగల పూర్వరంగాన్ని వివరించడం సముచితం. 

4.3. పూర్వరంగం : 

భైరవభొట్లకు చాలా చిన్నతనం నుంచే పాటలు విని పరవశించే గుణం వుండేది. ఆ పారవశ్యంలో ఏీVAటల్లో తెల్లవారు జామున సినిమాలకు సంబంధించిన గ్రామ్ ఫోన్ రికార్డులు వేసినపుడు, పెళ్ళిళ్ళకు సన్నాయితో సినిమా పాటలు వినిపించేటపుడు, సినిమా పాటల గాత్ర కచ్చేరీలు వినేటపుడు, తనువును, మనసును భైరవభొట్లు మరచిపోవటం సర్వసాధార ణమైనది. పసితనంలో జోలపాటలు విన్న బాల్యంలో సంగీత మాష్టారు చెప్పే పాటలు విన్న, హైస్కూల్ చదివేటపుడు వార్షి- కోత్సవాల్లో సినిమా పాటలు ఎవరు పాడినా తనకు తెలియ- కుండానే మనస్సు అటు వెళ్ళిపోయేది. బాల్యంలో తాను చూసిన ‘మల్లీశ్వరి (1951), ‘రోజులు మారాయి’ (1955), విప్రనారాయణ (1955), సువర్ణ సుందరి (1957), ‘అల్లా ఉద్దీన్ అద్భుత ద్వీపం (1957), మాయాబజార్ (1957) చిత్రాల్లోని పాటలు వినగా వినగా వాటి తాలుకు పాటల పుస్తకాల కోసం కొనుక్కొని చదువుతుండేవాడు. అలా చదవడంలో ఎంతో మధురానుభూతి పొందేవాడు. జూన్ 1963 లో ఏ. ఎన్. ఆర్ కాలేజీలో బి.ఏ., లిటరేచర్ లో చేరిన రోజు నుంచి డా. బండ్లమÖడి ఆంజనేయలు (రిటైర్డ్ హిందీ లెక్చరర్, ఏ.ఎన్.ఆర్ కాలేజీ, గుడివాడ) మరియు గార సత్యనారాయణ మÖరి ఆనాటి తన సహపాఠి, ఈ నాటి మేటి సినీ దర్శకులు). వీరిద్దరి హిందీ తెలుగు సాహిత్యం ద్వారా, సినిమా పాటల ద్వారా భైరవ భొట్లలోని పరిశోధకుడు క్రమక్రమంగా పరిణితి చెందాడు. 

డా. బండ్లమÖడి ఆంజనేయులు హిందీ సాహిత్య పాఠాలే కాకుండా శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ, గజ్జెల మల్లారెడ్డి, డా. సి.నారాయణరెడ్డి మొదలైనవారి రచనలను వినిపించి భైర వభొట్ల చేత చదివించాడు. అప్పటిదాకా చిన్నచిన్న హిందీ గేయాలు రాస్తున్న భైరవభొట్ల తెలుగులో కూడా గేయాలు రాయమన్నాడు. మనస్సులోకి వచ్చిన భావావేశాన్ని కాగితం మీద వెంటనే పెట్టి తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు. భైరవభట్ల రాయడానికి సంకోచించినపుడు భయాన్ని పోగొట్టి ధైర్యంతో గేయాలను రాయటానికి బండ్లమÖడి ఆంజనేయులు ప్రేరేపిం చాడు. అట్లాగే భైరవభొట్ల తన మనస్సులోకి వచ్చిన భావావేశాల్ని కాగితం మీద పెట్టి రోజు కాలేజు ఆయిపోయిన తరువాత ఆంజనేయులు ఇంటికి వెళ్ళి చూపించేవాడు. ఆంజనేయులు ప్రతి పదాన్ని సరిదిద్ది సరియైన పదాన్ని ఎక్కడ వాడాలో, భావానికి భాష ఎంత కావాలో ఉదాహరణగా చెప్పేవాడు. ఒక్కోసారి భావానికి భాష సరిపోకపోతే దానికి సరిపడే గ్రంథాలు ఇచ్చి చదవమనేవాడు. ఇట్లా శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ గేయాలు, ఆ గేయాలు రోజు భైరవ బొట్ల చేత చదివించే వాడు. ఇలా చదవటం, రాయటం ఒక వ్యవనంగా మారింది. ఆంజనేయులుగారు సరిదిద్దిన తెలుగు గేయాలను పత్రికలకు ప్రచురణార్థం భైరవభొట్ల పంపించేవాడు. పంపించిన గేయాలు మరల తిరుగు ప్రయాణంలో వస్తుండేది. కానీ 1-9-1963న హైదరాబాద్ నుంచి వెలువడిన పంచాయత్ అనే మాసపత్రి భైరవభొట్లు రచించిన ‘ధన్యజీవి అనే గేయం ప్రచురింపబడింది. ఆ గేయం ప్రచురింపబడిన తరువాత ఇంకా రాయాలనే ఉత్సాహం పెరిగింది. ఆ ఉత్సాహంతోనే తమ కళాశాల పత్రికల్లో ‘ బంగారుపాప’, ‘ఆశాకిరణం’, ‘భారతవీరా రావేలా’ మొదలగునవి ప్రచురింపబడ్డాయి. 

గార సత్యనారాయణ మÖర్తి బి.ఏ., తరగతిలో మÖడు సంవత్సరాలు తనకు క్లాస్ మేట్. ఈ మÖడు సంవత్సరాల కాలంలో హిందీ సినిమా ప్రముఖుల గురించి, ఖాళీ దొరికినప్పుడల్లా సినిమా పాఠాలు చెప్పి ముఖ్యంగా హిందీ తెలుగు సినిమా కవుల రచనల పట్ల ఆసక్తి పెంచాడు. 

ఆరు సంవత్సరాల కాలంలో ఒక ప్రక్క హిందీ సినిమా పాటల పుస్తకాలు, మరో ప్రక్క తెలుగు సినిమా పాటల పుస్తకాలు కొనుక్కొని పాటలను విడివిడిగా రాసుకోవటం ఆయ నకు అలవాటు అయింది. ఒకే సన్నివేశంలో హిందీ సినీ కవి ఎట్లా రాశారో, అదే సన్నివేశానికి తెలుగు సినీకవి ఎట్లా రాశారో రెండు పాటలను విడివిడిగా రాసుకొని తులనాత్మకంగా పరిశీ- లించడం ఆనాడే ప్రారంభమైంది. 

ఆదే విధంగా ఒక నాయక ప్రేమగీతం, దేవులపల్లి ఎట్లా రాసారో  మల్లాది కృష్ణశాస్త్రి, సముద్రాల, పింగళి, ఆరుద్ర, ఆత్రేయ, శ్రీశ్రీ మొదలగువారు కూడా ఏ విధంగా రాశారో, వాటినన్నింటిని విడివిడిగా రాసుకొని ఒక క్రమ పద్ధతిగా చేసుకొని చదవటం ప్రారంభించేవారు. ఇదే విధానం ఒకే సందర్భానికి హిందీ సినిమా కవులైన షకీల్ బదయుని ‘శైలేంద్ర’, ‘రాజేంద్ర కిషన’, ‘సాహిర’, ‘ప్రదీప’ మొదలగువారు  పాటలను విడివిడిగా రాసుకొని హిందీ భాషలో కూడా తులనాత్మక పరిశీలన ప్రారంభించాడు. ఇట్లా హిందీ సినిమా కవుల గురించి, తెలుగు సినిమా కవుల గురించి కథావస్తుపరంగా హిందీ పాటలను, తెలుగు పాటలనూ విడివిడిగా రాసుకొని ఫైలు చేసుకోవడం ఒక అలవాటుగా భైరవ భొట్లకు అయింది. 

ఆ రోజుల్లో గ్రామఫోను రికార్డులు, పాటల పుస్తకాలు మినహా ఈ నాటిలాగా ఆడియో, వీడియో క్యాసెట్లు, ఆడియో, వీడియో సి.డిలు, డి.వి.డిలు లేవు. అందరికీ ఆ రోజుల్లో అందుబాటులో ఉండేవి హిందీ సినిమాలకైనా, తెలుగు సినిమాలకైనా పాటల పుస్తకాలే. పాటల పుస్తకాలు చదవటం దశనుండి అవి విడివిడిగా రాసుకొని వాటిని ఫైలు చేసుకొని చదవటం అనే అలవాటు 1963 సంవత్సరంలోనే భైరవభొట్లకు ప్రారంభమైంది. 

హిందీ తెలుగు సినిమా పాటల తులనాత్మక అధ్యయనానికి చేసిన సహాయక రచయిత కృషి అటు హిందీ, తెలుగు కవుల దగ్గర భైరవభొట్ల శ్రమ ఆర్థికంగా స్థిరపడడానికి ఉపయోగపడలేదు. ఇటు మహెచ్.డి డిగ్రీ కూడా పూర్తికాలేదు. కాని కృష్ణా జిల్లా గుడివాడలో 1988 వ సంవత్సరంలో భైరవభొట్ల చలనచిత్ర పరిశోధన కేంద్రం స్థాపించిన నాటినుండి నేటిదాకా తెలుగు సినిమా పాటల పరిశోధకులకు ఈ పరిశోధన కేంద్రం వరప్రసాదమైంది. 

4.4. గీతాల వర్గీకరణ : 

భైరవభొట్ల నారాయణరావు తెలుగు సినిమా పాటలను పి.హెచ్ కథావస్తు పరంగా ఈ క్రింది విధముగా వర్గీక- రించాడు. వీటిలో కొన్ని మాత్రమే ముద్రితమయ్యాయి కూడా. 

1. నాయక ప్రేమ గీతాలు 

2. నాయిక ప్రేమ గీతాలు 

3. యుగళ ప్రేమ గీతాలు 

4. నాయక భగ్న ప్రేమ గీతాలు 

5. నాయిక భగ్న ప్రేమ గీతాలు 

6. నృత్య గీతాలు 

7. శృంగార (శాస్త్రీయ) నృత్య గీతాలు 

8. భక్తి గీతాలు 

9. లాలి గీతాలు/ జోల పాటలు 

10. దేశభక్తి గీతాలు 

4.4.1. నాయక ప్రేమగీతాలు : 

“ప్రణయ శబ్దమును ప్రాచీన కవులు లాక్షణికులు, స్త్రీ, పురుషుల మధ్య గల శృంగారంలోనే కాక సాధారణ స్నేహమును వాడిరి.1 “ప్రేమ, స్నేహం, అనురాగం, మన అర్థంలోను సౌహార్థం మొదలైన వివిధ నామములతో పేర్కొనబడెడి ఏ మథుర కోమల భావం. ఈ విశ్వంలోని చరాచర భూత జాలము నందుడు ఏక సూత్ర బద్దం చేయుట కవి యత్నించుచుండునో, ఆనిర్వచనీయమైన ఆ హృదయమునకు ప్రణయం 2 అని అంటారు. కాగా కాళిదాసు తన కుమార సంభవంలో ప్రణయాన్ని స్నేహార్థంలో ప్రయోగించినట్లు క్రింది శ్లోకాన్ని బట్టి తెలుస్తుంది. 

‘అపి ప్రసన్నం హరిణేఘతేమన: కరస్థ దర్భ ప్రణయాపహారిఘ’ 3

శృంగారం అంగికమని, ప్రణయం పరస్పర భావ సంబంధమున్న ఇద్దరు జీవుల మధ్య ఉండే ఇష్టమని చెప్పవచ్చు. అంతమాత్రాన శృంగార స్పర్శ ఉండదని కాదు. అది అంతర్లీనంగా మాత్రమే ఉండి నాయికా నాయకులు విషయానికొస్తే నాయికా నాయకులు ఇష్టపడి పాడుకునే ప్రేమగీతాలే ప్రణయ గీతాలని చెప్పాలి. 

1. ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయము - ప్రయోగములు డా. సి.నా.రె. పుట: 112 )

2. సాహిత్య శిల్ప సమీక్షబీ పింగళి లక్ష్మీకాంతం, పుట : 35)

3. కుమార సంభవం - పంచమ సర్గ 

శృంగారాన్ని తెరమీద చూపవలసి వచ్చినపుడు పడకిల్లు, ఉద్దీపనాలూ, శృంగార చేష్టలూ, మన్మధావస్థలూ ప్రదర్శించవలసి ఉంటుంది. ప్రణయ గీతాల్లో ఇవేవీ ఉండనక్కరలేదు. ప్రేయసీ ప్రియులు ఉద్యానవనాల్లోనో, తమకిష్టమైన ఏకాంత ప్రదేశాల్లోనో ఒకరిపై మరొకరికి గల ఇష్టాన్ని చూపులతోనూ, చిరు స్పర్శలతోనూ వ్యక్తం చేస్తూ పాడుకునే ఈ పాటలే ప్రణయగీతాలు. 

తెలుగు సినిమాలలో ప్రణయ సన్నివేశానికి అనుగుణంగా నాయకుడు పాడే ప్రేమ గీతాలను ఈ సంపుటిలో భైరవభొట్ల పొందుపరిచాడు. గుణసుందరి కథ (1949) చిత్రం నుంచి అల్లుడే మేనల్లుడు (1970) సినిమా దాకా లభ్యమవుతున్నాయి. ఈ సంపుటిలో ప్రసిద్ధమైన పాలు ఈ క్రింది ప్రకారము యివ్వబడ్డాయి. 

చిత్రం పేరు పాట పల్లవి 

1. సంతానం (1954) దేవి శ్రీదేవి 

2. జయం మనదే (1956) చల్లని వెన్నెల 

3. మంచి మనసుకు మంచి రోజులు (1958) నా చెలియా ... 

4. జయభేరి (1959) రాగమయి రావే, అనురాగమయి రావే

5. గుండమ్మకథ (1962) మౌనముగా నీమనసు పొడిన 

6. ఆరాధన (1962) నాహృదయంలో నిదురించే చెలి 

7. తోబుట్టువులు (1963) సాగేను జీవిత నావ

8. పునర్జన్మ (1963) ఓ సజీవ శిల్పసుందరి 

9. దాగుడు మÖతలు (1964) గోరంక గూటికి చేరేవు చిలుక 

10 దేశద్రోహులు (1964) జగమే మారినది మధురముగా ఈ వేళ 

11. పూజాఫలం (1964) నిన్నలేని అందమేదో 

తెలుగు సినిమా సంగీత సాహిత్యాలకు పట్టం కట్టిన కాలంలోని అమÖల్యమైన ఉత్తమ గీతాలను భైరవభొట్ల ఇందులో 

ఎంపికచేసి గ్రంథస్థం చేశాడు. 

4.4.2. నాయిక ప్రేమ గీతాలు : 

నవయవ్వనుల హృదయాల్లో ప్రేమోదయం ప్రకృతి సహజం. అట్టి తరుణంలో యువతీయువకులు తమకు కాబోయే ప్రియుడు లేదా జీవిత భాగస్వామి గురించి అందమైన కలలు కంటూ మధురమైన ఆశలు మనసులో పెంచుకోవడం సర్వ సాధారణం. ఈ విషయమై కథానాయిక పాత్రలకు మాత్రమే నిర్ధేశింపబడిన సోలో గీతాలనూ భైరవభట్ల ఒక గ్రంథరూపంలో సంపుటీకరించాడు. ఈ సంపుటిలో మల్లీశ్వరి (1951) దగ్గరి నుంచి కుటుంబాల కథ (1970) మధ్య కాలంలో ఉన్న ప్రసిద్ధమైన సంగీత సాహిత్యాలకు సమన్వయమైన నాయిక ప్రేమ గీతాలను 3 సంపుటిలో పొందుపరిచాడు. యథాప్రకారంగా పాట పై భాగంలో పాట రచించిన కవిపేరు, పాడినవారి పేరు ఇవ్వ బడ్డాయి. ఈ సంపుటిలో ప్రసిద్ధమైన పాటలు ఈ క్రింది ప్రకారంగా ఉన్నాయి. 

చిత్రం పేరు పాట పల్లవి

1. మల్లీశ్వరి (1951) మనసున మల్లెల మాల లూగేనే 

2. దొంగరాముడు (1955) అనురాగము విరిసెన ఓరే రాజా 

3. మిస్సమ్మ (1955) ఏమిటో ఈ మాయ 

4. భలే అమ్మాయి (1956) అందాల రూపము ఆనంద దీపము 

5. అన్నా తమ్ముడు (1957) మ్రోయింపవే హృదయ వీణా

6. దొంగల్లో దొర (1957) వన్నెల మోహనుడేడమ్మా

7. సారంగధర (1958) అడుగడుగో అల్లడుగో అభినవ నారీ మన్మధుడు

8. రాజ నందిని (1958) నీ మీద మనసాయే రా 9. శాంతినివాసం (1960) కలనైనా నీ వలపే 

10. పెళ్ళి కానుక (1960) పులకించని మది పులకించు

11. గుండమ్మకథ (1962) కనులు మÖసినా నీవాయె

12. ఇద్దరు మిత్రులు (1962) పాడవేలా రాధికా

13. చదువుకొన్న అమ్మాయిలు (1963) వినిపించని రాగాలే. 

14. పూజాఫలం (1964) పగలే వెన్నెల జగమే ఊయల 

15. కథా నాయకుడు (1969) ముత్యాల ఝల్లు కురిసే 

4.4.3. యుగళ ప్రేమగీతాలు : 

తెలుగు సినిమాల్లో కథలో ప్రేమ సన్నివేశాన్ని బట్టి ప్రేమను పరస్పరం తెలుసుకునేందుకు, ప్రేమ ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు నిర్మలమైన, నిస్వార్థమైన ప్రేమను ప్రతిపాదించేందుకు కథలో ప్రేక్షకుడికి మనోల్లాసాన్ని కలిగించేందుకు కథా గమనాన్ని పెంచేందుకు ఈ యుగళ ప్రేమగీతాలు రచింపబడతాయి. 

ఇద్దరు గాయనీగాయకులు లేదా ఇద్దరు గాయకులు లేదా ఇద్దరు గాయనీ మణులు గానీ కలిసి ఆలపించే గీతాలను సాధారణంగా ‘యుగళగీతాలని అంటారు. కథాపరమైన సందర్భ సన్నివేశాలు, పాత్రల స్వభావ స్థితిగతులు వంటి అంశాలు సినీ గీతానికి మÖల ప్రేరణలు. వీటిని అనుసరించి గీతాలను రచించే సంప్రదాయం ప్రసిద్ధంగా పాటింపబడిన రోజుల్లో వెలువడిన శృంగార యుగళ గీతాలలో కూడా మానవజీవితంలో ప్రధానపాత్ర వహించే అనుబంధాలు, ఆత్మీయతలు, సామాజిక కట్టుబాట్లు, సాంప్రదాయకమైన ఆలోచన సరళి ఇత్యాది ప్రధానాంశాలను హృద్యంగా ప్రకటించడం జరిగింది. 

తెలుగు సినిమా స్వర్ణయుగంలో కవుల చేత రచింపబడ్డ దర్శకులచే చిత్రింపబడ్డ ఈ పాటలను “పాతాళభైరవి (1951) దగ్గరనుంచి విజయం మనదే (1970) దాకా వున్న యుగళగీతాలను సంపుటిలో భైరవభట్ల పొందుపరిచాడు. ఈ సంపుటిలోని ప్రసిద్ధమైన పాటలు ఇక్కడ ఉదహరించడం జరిగింది. 


చిత్రం పేరు పాట పల్లవి రచయిత

1. పాతాళభైరవి (1951) ఎంత ఘాటు ప్రేమయో పింగళి 

2. దొంగరాముడు (1955) చిగురాకులలో చిలుకమ్మ సీ. సముద్రాల 

3. మాయ బజార్ (1957) చూపులు కలిసిన శుభవేళ పింగళి 

4. తోడికోడళ్లు (1957) ఆడుతూ, పాడుతూ పనిచేస్తుంటే కొసరాజు 

5. భలే అమ్మాయిలు (1957) మది ఉయ్యాల లూగే సదాశివబ్రహ్మం

6. పాండురంగమహాత్యు (1957) నీవని నేనని తలచితిరా జూనియర్ సముద్రాల 

7. మాంగల్యబలం (1959) ఆకాశ వీధిలో అందాల జాబిలి శ్రీ శ్రీ 

8. పెళ్ళి సందడి (1959) రావే ప్రేమలత జూ. సముద్రాల 

9. భట్టి విక్రమార్క (1960) ఓ నెలరాజా వెన్నెల రాజా అనిసెట్టి 

10. ఇద్దరు మిత్రులు (1961) ఖుషీ ఖుషీగా నవ్వుతూ దాశరథి 

11. భార్యాభర్తలు (1961) మధురం మధురం ఈ సమయం శ్రీశ్రీ 

12. గుండమ్మ కథ (1962) ప్రేమ యాత్రలకు బృందావనము పింగళి 

13. మంచి చెడు (1963) రేపంటి రూపం కంటి ఆత్రేయ

14. శ్రీకృష్ణార్జున యుద్ధం (1963) మనసు పరిమళించెనే పింగళి

15. చదువుకున్న అమ్మాయిలు (1963) కిలకిల నవ్వులు చితికిన సినారె

16. ఆత్మబలం (1964) చిటపట చినుకులు పడుతూ వుంటే ఆత్రేయ 

1. రాముడు భీముడు(1964) తెలిసిందిలే తెలిసిందిలే సినారె 

18. గుడు మÖతలు (1964) అడగకనే ఇచ్చిన మనసే ముద్దు ఆత్రేయ 

19. వారసత్వం (1965) ప్రేయసి మనోహరీ ఆరుద్ర

20. విజయం మనదే (1970) నామదిలో ఉందకు మందిరమా 

4.4.4. నాయక భగ్న ప్రేమ గీతాలు: 

తెలుగు సినిమాలలో కథావస్తుపరంగా సన్నివేశాన్ని బట్టి, నాయకుని భగ్న ప్రేమను తెలిపే గీతాలు ఇవి. వీటినే ‘విప్రలంభ శృంగార గీతాలు’ అంటారు. విప్రలంభ శృంగారానికి ‘వియోగశృంగారం’ అని పేరు. పరస్పర కలయికకు దూరమై, ఆ కలయిక పొందలేని ప్రేయసీ ప్రియులు, నాయికా నాయకుల లేదా యువతీ యువకుల మధ్య అనురాగం, అభీష్టం, ఆలింగనం వంటివి దూరమైతే అందమైన విరహం పొందడమే విప్రలంభ శృంగారం. అంటే స్త్రీ పురుషులు లేదా ప్రేయసీ ప్రియులు ఒకరినొకరు విడిచి దూరంగా ఉంటూ, ఎడబాటు కలిగితే అది విప్రలంభ లేదా వియోగ శృంగారాన్ని సూచిస్తుంది. 

ఈ పాటల్లో కథలో పాత్రను బట్టి, నాయకుడు తన దురదృష్టాన్ని గురించి బాధపడుతాడు. తన అమాయకత్వాని రోధిస్తాడు ప్రకృతిని నిలదీస్తాడు. దేవుణ్ణి కూడా ప్రశ్నిస్తాడు. ఒకోసారి ఈ భగ్న ప్రేమలో నాయిక సుఖ సంతోషాలను కోరుకుంటారు. ఒకసారి ఓడిపోయిన మనసును వేదాంతంలోకి మార్చుకొంటాడు. తెలుగు సినిమా చరిత్రలో విషాద గీతాలకు గాని, నాయక భగ్న ప్రేమగీతాలకు గాని మంచి గుర్తింపు వుంది. సన్నివేశం విషాదమైన ప్రేక్షకులకు శ్రోతలకు విషాదమే వేదాంతాన్ని బోధిస్తుంది. దుఃఖాన్ని ప్రతిరోజు చూస్తే, దుఃఖాన్ని వింటే, దుఃఖం మనిషి దగ్గరకి రాదంటారు. పాశ్చాత్య శాస్త్రజ్ఞుల యుగళ ప్రేమగీతాలు ఎట్లాగైతే ప్రచారం పొందాయో భగ్నప్రేమ గీతాలు కూడా అట్లా ప్రచారాన్ని పొందాయి. ఈ నాయక భగ్న ప్రేమ గీతాల సంపుటిలో దేవదాసు (1953) దగ్గరి నుంచి ప్రేమలు - పెళ్ళిళ్ళు (1974) దాకా భగ్న ప్రేమ గీతాలను పొందుపరచడం జరిగింది. ఈ సంపుటిలో ప్రసిద్ధమైన నాయక భగ్న ప్రేమ గీతాల పాటలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 

చిత్రం పేరు పాట పల్లవి రచయిత

1. దేవదాసు (1953) జగమే మాయ బ్రతుకే మాయ సీ. సముద్రాల 

2. పెళ్ళికానుక (1960) తీరెనుగా నేటితో నీ తియ్యని గాధ ఆత్రేయ

3. పెండ్లి పిలుపు (1961) నాలోని అనురాగమంతా 

4. జగదేక వీరుని కథ (1961) రారా కనరారా పింగళి

5. పరువు ప్రతిష్ట (1963) ఇలా ఇలా జీవితం పోతేపోనీ... 

6. డాక్టర్ చక్రవర్తి (1964) ఎవరో జ్వాలను రగిలించారు ఆత్రేయ

7. మురళీకృష్ణ (1964) నీ సుఖమే నేవోరుతున్నా ఆత్రేయ

8. ఆడ బ్రతుకు (1965) తనువుకి ఎన్ని గాయాలైనా 

9. ఉయ్యాల జంపాల (1965) ఏటిలోని కెరటాలు ఏరు విరిచి పోవు ఆరుద్ర

10. కన్న మనషులు (1967) ఓ హృదయం లేని ప్రియురాలా 

11.రాము (1968) మంటలు రేపే నెలరాజా దాశరథి 

12. భాగ్యచక్రం (1968) ఆశను నిరాశ చేసితివా పింగళి

13. పెళ్ళిరోజు (1968) అలనాటి చెలిమి ఒక వేళ 

14 మÖగసోము (1969) నిజమైన కల అయిన నిరాశ ఒకటిలే దాశరథి 

చిత్రం పేరు పాట పల్లవి రచయిత

15. ప్రేమనగర్ (1971) మనసుగతి ఇంతే ఆత్రేయ

16.పగ బట్టిన పడుచు (1971) అనుకొన్నది ఏమైనది 

11. మనువు మనసు (1973) ఎవరులేరు నీకు ఎవరు లేరు 

18. బంగారు బాబు (1973) ఏమనుకొన్నావు నన్నేమను కొన్నావు ఆత్రేయ 

19. ప్రేమలు పెళ్ళిళ్ళు (1974) మనసులేని దేవుడు ఆత్రేయ 

4.4.5. నాయిక భగ్న ప్రేమగీతాలు : 

తెలుగు సినిమాలలో కథా వస్తుపరంగా, సన్నివేశ ప్రధానంగా ప్రేమను పొందలేకపోయిన ప్రేమమÖర్తి అయిన నాయిక తన ప్రియునితో ఎడబాటు కలిగినపుడు నాయిక శోకిస్తూ పాడుకొనే పాటలు నాయిక భగ్నప్రేమ గీతాలు అంటారు. ఈ రకమైన పాటలన్నింటిని భైరవభొట్ల సంపుటీకరించాడు. 

ఇందులో దేవదాసు (1953) నుంచి భార్యాబిడ్డలు (1972) దాకా మధ్యలో ఉన్న నాయిక భగ్నప్రేమ గీతాలను పొందుపరచటం జరిగింది. యథాప్రకారంగా పాట పై భాగాన ఆపాట రచించిన కవి పేరు, పాట పాడినవారి పేరు, చిత్రం పేరు ఇవ్వబడ్డాయి. 

చిత్రంపేరు పాట పల్లవి రచయిత

1. దేవదాసు (1953) తానే మారిన గుణమే మారిన సీ. సముద్రాల

2. దేవదాసు (1953) అంతా భ్రాంతియేనా, జీవితాన

3. అర్ధాంగి (1955) ఎక్కడమ్మా చంద్రుడు ఆత్రేయ

4. పెండ్లి పిలుపు (1962) మారెను ప్రేమ సుధ విషముగా

5. భార్యాభర్తలు (1962) ఏమని పాడెదనో ఈవేళ శ్రీశ్రీ

6. పరువు ప్రతిష్ట (1962) 1. కన్నులు ఉండి చూడలేను

2. ఆమబ్బు తెరల్లో దాగుంది చందమామ

7. ఆరాధన (1962) నీ చెలిమి నీడే కోరితి నార్ల చిరంజీవి 

8. సవతి కొడుకు (1963) ఆనాటిహాయి ఏమాయినో 

9. మÖగమనుసులు (1964) మానుమాకును కాను ఆత్రేయ 

10. ఆత్మబలం (1964) నాలుగు కళ్ళు రెండై నాయి ఆత్రేయ 

11. సి. ఐ.డి. (1965) జగము చీకటాయినే పింగళి 

12 . మనుషులు మమతలు (1965) కన్ను మÖసింది లేదు దాశరథి

13. వివాహబంధం (1965) ఆలు మగలు విడిపోయినంతనే సి.నా.రె. 

14. అడుగుజాడలు(1966) మÖగబోయిన హృదయ వీణ 

15 ఆత్మగౌరవం (1966) బ్రతుకే నేటితో బరువైపోయెతే 

16. పూలరంగడు (1967) నీవు రావు నిదురరాదు 

17. దసరాబుల్లోడు (1971) చేతిలో చెయ్యేసి చెప్పు బావ ఆత్రేయ 

4.4.6 నృత్య గీతాలు : 

సినిమాకున్న Vఱsuaశ్రీ attతీactఱశీఅ వశ్రీవఎవఅts లో అత్యంత ప్రధాన పాత్ర వహిస్తున్న కళాంశమే నృత్యం. నేడు దేశవ్యాప్తంగా నిర్మితమవుతున్న ఏ భాషా చిత్ర గీతానికి చెందిన దృశ్యరూపానికైనా ప్రాణం, ఆయా నటీనటుల నటనాకౌశలానికి కొలమానం నృత్యమేనని సినీ పెద్దల అభిప్రాయం. 

నేడు సినిమారంగంలో హీరో, హీరోయిన్లుగా స్థానం సంపాదించుకోవాలన్నా, సంపాదించుకొన్న స్థానం సుస్థిరం చేసుకోవాలన్నా ఆయా నటీనలులకు నృత్యమే శరణ్యం. అంటే సినిమారంగాన్ని పాలించే నటులు ఇమేజ్ ను ్పుశీఎఎaఅd చేస్తున్న జూశీwవతీfuశ్రీ ఎవdఱa నృత్యం అనడంలో అతిశయోక్తి లేదు. ఆనంద మయమైన భావావేశాన్ని గానీ విషాదమయమైన మనోద్వేగాన్ని గానీ అభివ్యక్త పరచడానికి నాట్యం ఒక బలమైన సాధనం. అట్టి నాట్యం మానవునికి ప్రకృతిచ్చిన వరం. ప్రాక్తన మానవుని యొక్క సుఖదుఃఖానుభూతులను ప్రేరణ ఫలితంగా పాటతో పాటే పుట్టిన లయాత్మకమైన చిందులే నాట్యానికి బీజాలు. గానంతో పాటే నాట్యానికి ఒక ప్రత్యేకమైన సృజనశీల కళారూపాన్ని ప్రసాదించింది మానవుడే అని పండితులు నిర్ధారణ. 

‘తెలుగు టాకీయుగం ప్రారంభమైన తొలిదశలో (1937-38) అంటే వెండి తెరపై కదిలే బొమ్మలను చూడటానికి జనం అలవాటుపడుతున్న రోజుల్లో సినిమా ప్రదర్శనను మధ్యలో ఆపుజేసి, అదే వేదికపై శాస్త్రీయ నృత్యాలను మరియు మ్యాజిక్ షోలను వినోదార్థమై ప్రదర్శించేవారు’ 1. ఆవిధంగా ఒకనాడు సినిమా కంటే ప్రజారంజకమైన కళగా భాషించిన నృత్యం. నేడు సినీగీతాలకే కీలక కళాంశంగా స్థిరపడింది. అందుకు ముఖ్య కారణం నృత్యకళలో నిక్షిప్తమై వున్న ప్రధాన ఆకర్షణే. 

(1. పోణంకి శ్రీరామ అప్పారావు - తెలుగు నాటక వికాసము పుట: 10,11,12) 

తెలుగు సినిమా భాంగ్రా పాటలలో కథావస్తుహారంగా శాస్త్రీయ నృత్యాలు, జావళీ నృత్యాలు, పంజాబీ నృత్యాలు, పాశ్చాత్య నృత్యగీతాలు, సామÖహిక నృత్యగీతాలు మొదలగునవి చోటుచేసుకున్నాయి. భైరవభొట్ల రూపొందించిన పాటల సంపుటిలో అనేక రకాల నృత్యగీతాలను, నృత్య నాటికలను సంపుటీకరించారు. శాస్త్రీయ నృత్యాలకు ప్రత్యేకంగా ఒక సంపుటిని భైరవభొట్ల తయారుచేశాడు. ఆ సంపుటి వివరాలు గురించి తరువాతి శీర్షికలో చర్చించడం జరుగుతుంది. తెలుగు సినిమాల్లో ప్రఖ్యాత నర్తకీమణులైన లలిత, పద్మిని, రాగిణి, సరోజ, కుచలకుమారి, ఎల్. విజయలక్ష్మి, జ్యోతిలక్ష్మి, జయమాలిని, హలం మొదలగు నర్తకీమణుల ప్రసిద్ధ నృత్యగీతాలను కూడా ఈ సంపుటిలో 

పొందుపరచడం జరిగింది. 

యథాప్రకారంగా ఈ నృత్యగీతాల సంపుటికి కూడా పాట రచించిన కవిపేరు, పాడినవారి పేరు, సినిమా పేరు ఇవ్వటం జరిగింది. ఇందులో ‘గుణసుందరి (1949) నుంచి ‘మంచివాడు (1974) చిత్రం దాకా ఉన్న ఎన్నో నృత్యగీతాలను పొందుపరచటం జరిగింది. ఈ పాటల సంపుటిలో ప్రసిద్ధమైన నృత్యగీతాలు క్రింది విధంగా ఉన్నాయి. 

చిత్రంపేరు పాట పల్లవి  రచయిత

1. గుణసుందరికథ (1949) చల్లని దొరవేలే చందమామ పింగళి 

2. దేవదాసు (1953) అందం చూడవయా సీ. సముద్రాల 

3. తెనాలిరామకృష్ణ (1956) ఇచ్చకాలు నీకు నాకు అన్నమయ్య

4. పెళ్ళిసందడి (1956) హైలేలో నారాజ జూ. సముద్రాల

5. తోడికోడళ్ళు (1955) పొద్దైనా తిరగకముందే కొసరాజు

6. తోడికోడళ్ళు (1955) తింటానికి కూడు చాలదే కొసరాజు

7. మాయబజార్ (1957) ఒకటే మావయసు పింగళి

8. భూకైలాస్ (1958) సుందరాంగ అందుకోరా సీ. సముద్రాల 

9. జయభేరి (1959) నీ వెంత నెరజాన వగురా మల్లాది

10. భట్టి విక్రమార్క (1960) నటించన జగాలనే జయించనా అనిసెట్టి 

కన్నెపిల్ల సొగసు చూడు మహరాజు అనిసెట్టి

11. వెలుగు నీడలు (1961) సరిగంచు చీరకట్టి కొసరాజు 

12. ఇద్దరు మిత్రులు (1961) నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకేయివ్వాలి దాశరథి 

13. భార్యాభర్తలు (1961) రంగరంగేళి ఆరుద్ర 

14. గులేబకావళికథ (1962) మదనా సుందరా నా దొర సి.నా.రె. 

15. కులగోత్రాలు (1962) ఓ వన్నెల చిన్నెల కన్నెయ దాశరథి 

16. డాక్టర్ చక్రవర్తి (1964) ఓ ఉంగరాల మంగూరాల రాజా దాశరథి 

17 బాల మిత్రుల కథ (1973) పుట్టమీద పాల పిట్రోయ్ నాస్వామి 

4.4.7. శృంగార (శాస్త్రీయ) నృత్యగీతాలు (జావళీలు) : 

‘జావళి” అనేది శృంగార గీత రచనా ప్రక్రియ. ఈ ప్రక్రియ దాదాపు నాలుగైదు వందల సంవత్సరాలకు పూర్వం నాటి దేవదాసి వ్యవస్థలో మిక్కిలి ప్రాచుర్యం పొందిందని పండితుల అభిప్రాయం. ముఖ్యంగా సాత్వికాభినయ ప్రధానమైన ఈ సాహిత్యరూప ప్రదర్శనలో ముఖకవలికలు, కనుబొమల కదలికలు మరియు దరహాసాదుల ద్వారా నాయిక తన మనోగతాన్ని వెల్లడించవలసి వస్తుందనీ, తెలుగునాట ఒకప్పుడు క్షేత్రయ్య పదాలను జావళీలుగా పాడుకోవడం జరిగింది. సినారె గారు ఒక సందర్భంలో వివరించారు. 

చలనచిత్ర గీతాల్లోనూ ఈ విషయం స్పష్టంగా నిరూపించబడింది. క్షేత్రయ్య మరియు శీనయ్య వంటి వాగ్గేయకారుల రచనలను యథాతదంగా స్వీకరించి వాటిని జనరంజకమైన సినీగీతాలుగా మలచడం జరిగింది. 

‘ఇంతా తెలిసియుండి ఈ గుణమేలరా 

పంతమా మువ్వాగోపాలా నాస్వామి - దేవదాసు (1953) 

క్షేత్రయ్య 

“శివదీక్షా పరురాలనురా - నే 

శివదీక్షా పరురాలనురా - పూజాఫలం (1964) శీనయ్య వంటి గీతాలే ఇందుకు నిదర్శనాలు. 60వ దశకంలో శ్రీశ్రీ, ఆరుద్ర, సినారె వంటి వారిచే అన్ని తరహా చిత్రాల్లోనూ ఈ జావళీలను ఎక్కువగా రాయడం జరిగింది. నేడు సినిమా గీతాల్లో జావళీలకు కొంత కాలం చెల్లిపోయిందనవచ్చు. 

తెలుగు సినిమా పాటల్లో శ్రావ్యమైన, మంత్రముగ్దమైన శాస్త్రీయ నృత్యగీతాలు “మల్లీశ్వరి” (1951) చిత్రంలోని ‘పిలిచిన బిగువటరా’ లో మొదలయ్యాయి. అప్పటి నుంచి దాదాపు మÖడు దశాబ్దాలపాటు నృత్యగీతాలు జనాన్ని బాగా ఆకట్టుకొ అనేకమంది నాట్యాచార్యులకు ఇవి పాఠ్యగ్రంథాలయ్యాయి. భైరవభొట్లకు బాల్యం నుంచి నృత్యాలంటే ఒక ఆకర్షణ. అందువల్లనే ఆయన తన కోసం కాకుండా పరిశో ధకుల నిమిత్తం ఇరవయ్యేళ్ళనాడే దీనిని నృత్యగేయ కోశంగా రూపొందించాడు. ఈ గ్రంథం 23.12.2004 సంవత్సరమున హైదరాబాద్ లోని ఎస్. పి. బాలసుబ్రమణ్యం సమక్షంలో ఆవిష్కరింపబడింది. దీని తాలూకు వీడియో క్యాసెట్టుకూడా 17. 10. 1993 న అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా విశాఖపట్టణంలో ఆవిష్కరింపబడింది. ఈ పాటల సంపుటిలో మొత్తం అరవై నృత్యగీతాలున్నాయి. ఈ సంపుటిని కూడా సినీగేయ ప్రక్రియలో రూపొందించడం జరిగింది. ఈ సంపుటిలో ప్రసిద్ధమైన శృంగార (శాస్త్రీయ) నృత్యగీతాలు క్రింది విధంగా ఉన్నాయి. 

చిత్రంపేరు పాటపల్లవి రచయిత

మల్లీశ్వరి (1951) పిలిచిన బిగువట రా దే. కృష్ణశాస్త్రి 

మిస్సమ్మ (1955) బాలనురా మదన పింగళి

అప్పుచేసి పప్పుకూడు (1959) జోహారు గైకొనరా  పింగళి

సీతారామకళ్యాణం (1961) సరసాల జవరాలను సీ. సముద్రాల

అమరశిల్పి జక్కన (1964) అందాల బొమ్మతో ఆటాడవా దాశరథి

అమరశిల్పి జక్కన (1964) నగుమోము చూపించవా దాశరథి

బొబ్బిలియుద్ధం (1964) నినుచేర మనసాయెరా శ్రీశ్రీ

మంగమ్మ శపథం (1965) అందాల నారాజు అలకేలరా సినారె

పరమానందయ్య శిష్యుల కథ (1966) కామిని మదనరారా సినారె

డాక్టర్ ఆనంద్ (1966) నీలమోహనరారా కృష్ణశాస్త్రి 

భక్త ప్రహ్లాద (1967) రారా ప్రియ సుందరా దాశరథి 

కంచుకోట (1967) సరిలేరు నీకెవ్వరూ సినారె 

వసంతసేన (1967) ఏమివ్వగల దానరా

విచిత్ర కుటుంబం (1969) నలుగురు నవ్వేరు రా సినారె 

చిన్ననాటి స్నేహితులు (1971) ఏమి తెలపను రా సినారె

భక్త తుకారాం (1973) పూజకు వేళాయరా సినారె

భక్తతుకారాం (1973) సరిసరి వగలు తెలిసేరా గడుసరి సినారె

అభిమాన వంతులు (1973) ఎప్పటివలె కాదురా 

సిరిసిరి మువ్వ (1974) రారా స్వామి రారా 

మయÖరి (1985) అందెలు పిలిచిన 

ఈ సంపుటి ద్వారా భైరవబొట్లకు ఆంధ్రదేశంలో పండిత పామరులనుంచి, కళాకారుల నుంచి, నటీనటుల నుంచి ఎన్నో ప్రశంసలు లభించాయి . 

4.4.8. భక్తి గీతాలు: 

“పూజ్యపూజక భావమే భక్తికి మÖల బీజము వంటిది. పూజ్య పదార్థమును పొందుటకు భక్తుడు చేయు ప్రయత్నము సాధన. ఈ సాధన అనేక రూపముల నుండి వచ్చును. దాస్యభక్తి, సఖ్యభక్తి, వాత్సల్య భక్తి, మధురభక్తి మున్నగునవి దీని రూపాంతరములు. 1

(1. సి. నా.రె. ఆధునికాంధ్ర కవిత్వం (1977) - సంప్రదాయములు ప్రయోగములు పుట : 432)

ఈ భక్తికి సంబంధించిన గీతాలు మన తెలుగు సినిమాల్లో అపారంగా ఉన్నాయి. అందుకు కారణం ఆంధ్రులు ఆధ్యాత్మిక ప్రియులు కావడమే. ముఖ్యంగా 1931 నుండి 1971 వరకు దాదాపు మన చిత్రరంగంలో భక్తి చిత్రాలే రాజ్యమేలాయి. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో దర్శక నిర్మాతలు విరివిగా భక్తిగీతాలు చిత్రీకరించారు. ఈ చిత్రాలన్నింటిలో శివభక్తి గీతాలు, శ్రీమహావిష్ణువు దశావతారాలకు సంబంధించిన కీర్తనలు, బ్రహ్మదేవునికి సంబంధించిన తత్త్వాలు, త్రిమÖర్తుల పత్నులకు సంబంధించిన భక్తిగీతాలు, ఇతర దేవతలు వినాయకుడు, కుమారస్వామి మొదలగు వారి గీతాలు, పెరటి వేల్పు తులసిమాతకు సంబంధించిన గీతాలు, హైందవేతర అల్లా, ఏసు ప్రభువుకు సంబంధించిన గీతాలు కూడా మన తెలుగు చలనచిత్రాల్లో భక్తి గీతాలుగా కనిపిస్తాయి. సీనియర్ సముద్రాల, బలిజేపల్లి లక్ష్మీకాంతం, చందాల కేశవదాసు, తాఫీ ధర్మారావు, పింగళి, ఆరుద్ర, ఆత్రేయ, జూనియర్ సముద్రాల, వేటూరి, సినారె, దాశరథి, వేటూరి, వంటి అతిరథ మహారథులు ఎందరో భక్తి గీతాలను రచించి తెలుగు చలనచిత్ర సీమను సుసంపన్నం చేశారు. 

ఈ భక్తి గీతాలన్నింటిని భైరవభొట్ల అక్షర సంపుటీకరణమే కాకుండా శ్రవణ సంపుటీకరణ కూడా చేశాడు. బాల్యం నుంచి తయారు చేసుకొన్న ఈ పరిశోధన 1963 నాటికి తెలుగు సినిమా పాటల భక్తి గీతాల సంపుటి’ తయారు అయింది. 

త్యాగదుర్గం మునస్వామి అనే ఆయన 1997లో తెలుగు సినిమా భక్తి గీతాలపై ఉగ్రాణం చంద్రశేఖర రెడ్డి (రీడర్, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి) పర్యవేక్షణలో పరిశోధన చేసే నిమిత్తం భైరవభొట్లను సంప్రదించడం జరిగింది. ఆయన కోరిక మేరకు భైరవభొట్ల భక్తిగీతాల కోశాలు తయారు చేశాడు. ఈ భక్తి గేయకోశాన్ని 1999 సంవత్సంలో ఆవిష్కరించారు. టి. మునస్వామి పరిశోధన విషయమై దీనిని ఆధార గ్రంథంగా స్వీకరించి “తెలుగు సినిమాలలో హైందవ భక్తి పాటలు - వైశిష్ట్యం’ అనే అంశం మీద 2001లో పి. హెచ్‌డి పట్టాకూడా పొందారు. 

జె. పి. పబ్లికేషన్ (విజయవాడ) అనే ప్రచురణ సంస్థ 2004లో సినీభక్తి గేయ కోశాన్ని “తెలుగు సినిమాలలో భక్తి పారవశ్య గీతాలు’ ‘తెలుగు సినిమాలలో భక్తి రసాత్మక గీతాలు” అనే రెండు పుస్తకాలుగా ముద్రించారు. ఈ రెండు పుస్తకాలలోనూ 32 రకాల భక్తిగీతాల్ని, వాటికి సంబంధించిన పాటల్ని పొందుపరచడం జరిగింది. 

హైదరాబాద్ నగర కేంద్ర గ్రంథాలయ ఆవరణంలో భక్తి గీతాలు ఆవిష్కరణ సభ జరిగింది. ఆనాటి సభకు ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్. పి. బాలసుబ్రమణ్యం ముఖ్య అతిథిగా విచ్చేశాడు. డా. తుర్లపాటి కుటుంబరావు, వాసిరాజు ప్రకాశం. డా. టి. గౌరీశంకర్ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేశారు. ఆ కార్యక్రమం మరుసటి రోజున దినపత్రికలో విశేష వార్తలుగా ప్రచురించి, ప్రశంసింప బడింది. ఈ సంపుటిలో ప్రసిద్ధమైన భక్తిగీతాలు క్రింది విధంగా ఉన్నాయి. అందుకే భైరవభొట్ల సినీ పరిశోధనా భక్తుడు. 

చిత్రం పేరు పాట పల్లవి 

భక్త పోతన (1942) సర్వ మంగళ నామ 

గుణసుందరికథ (1949) ఉపకారగుణాల యవై 

సంసారం (1950) అమ్మ శ్రీ తులసి

భాగ్యరేఖ (1957) నీవుండేదా కొండపై 

జయభేరి (1959) మది శారదా దేవి

ఇద్దరు మిత్రులు (1961) శ్రీరామ నీనామ మెంతోరుచిరా 

గులేబకావళికథ (1962) మాత జగన్మాత

లవకుశ (1963) వినుడు వినుడు రామాయణగాధ 

లవకుశ (1963) జయజయ రామ శ్రీరామ 

విశాల హృదయాలు (1965) జయజయ నటరాజు 

పరమానందయ్య శిష్యుల కథ (1966) ఓం నమశ్శివాయ

పరమానందయ్య శిష్యుల కథ (1966) ఓ మహాదేవ నీపద సేవ 

రంగుల రాట్నం (1967) నడిరేయి ఏ జాములో 

నిండుమనసులు (1967) ఆపద మొక్కుల వాడా 

దేవకన్య (1968) ఈశ, గిరీష మహేశ 

ఆడజన్మ (1970) శ్రీ వేంకటేశా

రామాలయం (1971) జగ దబి రామ

అంతా మన మంచికే (1972) తిరుమల మందిరా సుందరా

మల్లమ్మ కథ (1973) అంతా శివమయమే 

4.4.9. తెలుగు సినీ లాలిపాటలు/జోలపాటలు : 

తెలుగు చలన చిత్రాలలో లాలి పాటలు అధికంగా చోటుచేసుకొన్నాయి. సాధారణంగా పసిపాపలను నిద్రపుచ్చుతూ పాడే పాటే లాలిపాట ఉయ్యాలలూపుతూ తన బిడ్డని చూస్తూ పొంగిపోతూ లోకాన్ని మరచిపోతూ తన బిడ్డ తనకు వరప్రసాదం అని, తన జీవితం ధన్యమని, తన కుటుంబం ధన్యమనీ తల్లి పాడే పాటలు లాలిపాటలు. 

నిరాశ నిస్పృహలలో నాయకుడు, నాయిక తన బాబుని, పాపని చూస్తూ తమ దుఃఖాన్ని మరచిపోతూ పాడే లాలి పాటలు పిల్లలకు వారి భవిష్యత్ జీవితం మీVAన్నతంగా ఉండాలని చాటిచెప్పే సందేశాత్మక ప్రభోదాలు, వేదాంత ధోరణులు ఈ లాలిపాటల్లో కొంత చోటు చేసుకుంటాయి. బాల్యం నుంచి భైరవభొట్లకు లాలిపాటల్లోని సందేశాలు, ప్రభోదాలు జీవన వేదంగా భావించేవారు. అందువల్లనే 1963 వ సంవత్సరంలోనే భైరవభొట్ల ఈ లాలిపాటల సంపుటిని తయారు చేశాడు. దీన్ని అక్షర సంపుటిగానే కాకుండా శ్రవణ సంపుటిగా కూడా రూపొందించాడు. లాలిపాటలలో ఆత్రేయ రచించిన సంగీత లక్ష్మి (1966) చిత్రంలోని 

‘పాప పాప కనుపాప 

పుత్తడిపాప నెలపాప’ అనే పల్లివి గల పాటలో 

‘తప్పటి అడుగులు ఇప్పుడు ముద్దు 

జీవితాన ఇవి రానే వద్దు 

నడక నేర్పిన అమ్మానాన్న 

నీ నడత చూసి మురియాలమ్మా’ అనే చరణాన్ని ఇప్పటికీ భైరవభొట్ల స్మరిస్తూ ఉంటాడు. ఇలాంటివి లాలిపాటల్లో చాలా ఉన్నాయి. ‘చంద్రహారం’ (1954) చిత్రం నుంచి ‘కన్నవారి కలలు’ (1974) వరకు తెలుగు సినిమాలోని లాలిపాటల్ని భైరవ భొట్ల అక్షర సంపుటీకరణ చేశాడు. ఈ సంపుటిలోని లాలాపాటలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 

చిత్రంపేరు పాట పల్లవి 

చంద్రహారం (1954) తనయా వినవయ్య 

సంతానం (1955) నిదురపోరా తమ్ముడా 

శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం (1960) చిరుచిరు నగవుల చిలికే తండ్రి 

వెలుగు నీడలు (1960) చల్లని వెన్నెల సోనలు 

మహామంత్రి తిమ్మరుసు (1962) జయ అనరే, జయజయ అనరే 

భీష్మ (1962) జోజోజో జో రాగాల బాల 

వారసత్వం (1964) చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటీ 

వారసత్వం (1964) మన గుట్టే నిలుపుకోవాలి 

ఆడబ్రతుకు (1965) బుజ్జి బుజ్జి పాపాయి 

తోడు, నీడా (1965) అత్తబడి పూవువలె మెత్తనమ్మా 

సత్యహరిశ్చంద్ర (1965) అందాల తనయా ఆనంద నిలయా 

డాక్టర్ ఆనంద్ (1966) చక్కని చల్లని ఇల్లు 

సంగీతలక్ష్మి (1966) పాపపాప కనుపాప

మనసే మందిరం (1966) అల్లారు ముద్దుగదే

భక్త ప్రహ్లాద (1967) సిరిసిరిలాలి చిన్నారిలాలి 

స్త్రీ జన్మ (1967) చేయని నోమై అడగని వరమై

నిర్దోషి (1967) చిన్నారి కృష్ణయ్యరారా

చదరంగం (1967) తారంగం మాబాబు తారంగం 

మన సంసారం (1968) చిన్నారి నాతల్లి లాలి 

పాపకోసం (1968) కొండలపైన, కోనలపైన గోగులు పూసే 

తెలుగు సినిమా పాటలలో తల్లి లాలిపాటలతో జాబిలి నిద్రపుచ్చుతుంటే భైరవభొట్ల పరిశోధనా లాలితో మనల్ని మైమరపింపజేస్తున్నాడు. 

4.4.10. తెలుగు సినిమాలలో దేశభక్తి గీతాలు : 

భైరవభొట్ల తన జీవితంలో మొట్టమొదటగా రచించినది దేశభక్తి గీతమే. అది ధన్యజీవి పేరుతో 01.09.1963వ తేదీన హైదరాబాద్ నుండి వెలువడిన పంచాయత్ అనే మాస పత్రికలో ప్రచురింపబడింది. 

భైరవభొట్ల ఏ. ఎన్. ఆర్ కాలేజీలో బి.ఏ ద్వితీయ సంవత్సరం చదివేటపుడు 1966వ సంవత్సరంలో కళాశాల పత్రికలో ‘భారతవీరా రావేలా’ అనే భక్తిగేయం ప్రచురింపబడింది. 1969 లో విజయవాడలోని అమరవాహినికేతన్ స్కూల్లో తెలుగు గేయాల రచనాపోటీలలో భైరవభొట్ల ‘వీరప్రభోదం’ అనే గేయానికి మొదటి బహుమతి వచ్చింది. 

ప్రభోదమంటే ‘మేలుకొలుపు’ మారాల్సిన పరిస్థితులను, చేరాల్సిన ఉత్తమ గమ్యాలను నిర్దేశిస్తూ చేసే మేలుకొలుపే ప్రభోదం. ఆధునిక సాహిత్యంలో ప్రభోదాని పెద్దపీటే వేయబడినది.” కవిత్వంలో ప్రభోదగీతాలు, ప్రచార గీతాలు ఎన్నో కనబడతాయి. ఆనాటి కాలపరిస్థితులకు, సంఘపరిస్థితులకు స్పందించిన కవులు జాతీయ భావాన్ని, ఆంధ్రాభిమానాన్ని ప్రభోదిస్తూ ఎన్నో పద్యాలు, గీతాలు రాశారు. వాటిలో రాయప్రోలు “ఏదేశమేగినా ఎందుకాలిడినా, దువ్వూరి ద్రౌపదీ సందేశము’ మొదలైనవి భారత జాతీయతను ప్రబోధించినవి కాగా ఆంధ్ర ప్రశస్తిని, ఆంధ్ర పౌరుషాన్ని, తెలుగు తేజస్సును వర్ణిస్తూ ఆంధ్రాభిమానాన్ని ప్రభోదించినవి మరికొన్ని గీతాలు కూడా కనిపిస్తాయి. గాంధీ గురించి. రాట్నం గురించి, స్వరాజ్యం గురించి, వివిధ జాతీయోద్యమాలను గురించి ప్రచార గీతాలన్నీ ఆనాడు వచ్చాయి. స్వాతంత్య్ర సిద్ధి, సంఘ సంస్కరణ ఆనాటి ప్రభోద గీతాలకు వస్తువు. తదుపరి కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన అభ్యుదయ కవిత్వానికి విప్లవ ప్రభోదమÖ, వీరగాథా కథనమే వస్తువైంది. సమకాలీన సమాజం దీనికి నేపథ్యం. 1

(1 యువచిత్ర పాటలు- సాహిత్య విలువలు - కంపల్లె రవిచంద్రన్` పుట: 145)

ఇక సినీగీతాల విషయానికి వస్తే సామాన్య ప్రజలను ప్రభోదితులను చేయడంలో సినీకవులు కూడా తమ వంతు కర్తవ్యం నిర్వర్తించారని చెప్పవచ్చు. వినోదార్థ సినిమాలకు వెళ్ళే ప్రేక్షకుడు తెలియకుండానే ప్రభోదాన్ని పొందుతాడు. మంచినీ, మానవ ప్రగతినీ, ఉత్తమ వ్యక్తిత్వలక్షణాలను ప్రభోదించిన దేశభక్తి గీతాలు, ఆంధ్ర అభ్యుదయ గీతాలు మన చలన చిత్రాల్లో చాలా ఉన్నాయి. వీటన్నింటిని భైరవభొట్ల ఒక గ్రంథం ద్వారా అక్షర సంపుటీకరణ చేశాడు. 

1992వ సంవత్సరంలో కొంగర జగ్గయ్య చలన చిత్ర పరిశోధనా కేంద్రంను సందర్శించినపుడు భైరవభొట్ల రూపొందించిన తెలుగు సినిమాల్లో దేశభక్తి గీతాలు అనే శ్రవణ సంపుటిని ఆవిష్కరించాడు. తరువాతి కాలంలో బరంపురం విశ్వవిద్యాలయంలో ఒక పిహెచ్‌డి గ్రంథాల కోసం మÖలాధార గ్రంథమైన ‘తెలుగు సినీ దేభక్తి గేయ కోశం’ తయారు చేశారు. 

జ్ఞానవికాస్ (విజయవాడ) ప్రచురణలు అనే సంస్థవారు ఆగష్టు 15, 2007 సంవత్సరంలో స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా తెలుగు సినిమా దేశభక్తి గీతాల సంపుటి ని ప్రచురించింది దీన్ని గుంటారు ఎం. ఎల్. ఏ., తాడిశెట్టి వెంకట ప్రసాద్ ఆవిష్క రించాడు. ఇందులో మాలపిల్ల (1938) చిత్రం దగ్గరనుంచి బాలమురళి ఎం.ఏ., (1988) దాకా విడుదలైన దేశభక్తి గీతాలను, తెలుగు సాహిత్యంలో ప్రముఖులైన గురజాడ అప్పారావు, వేములపల్లి శ్రీకృష్ణ, విశ్వనాథ సత్యనారాయణ, రాయప్రోలు సుబ్బారావు మొదలగువారి దేశభక్తి గేయాలను కూడా పొందుపరిచాడు. ఈ సంపుటిలో ప్రసిద్ధమైన దేశభక్తి గేయాలు ఈ క్రింది ప్రకారంగా కన్పిస్తాయి. 

చిత్రంపేరు పాట పల్లవి 

మాలపిల్ల (1938) కొల్లాగట్టితేనేమి మనగాంధీ

మాలపిల్ల (1938) మాలలు మాత్రము మనుషులు కారా 

పంతులమ్మ (1943) జైజై మహేంద్రా జననీ

బాలరాజు (1948) నవోదయం, శుభోదయం

సొంత ఊరు (1950) మన ఊరే భారతదేశం, మనమంతా భారతీయులం

పల్లెటూరు (1952) చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా

పుట్టినిల్లు (1953) మనది భారతదేశం వమ్మా 

అగ్గిరాముడు (1954) జై ఆంధ్ర జననీ, విశాలాంధ్ర ధరణీ 

అంతామనవాళ్ళే (1957) పాడురా ఓ తెలుగు వాడా 

మేనరికం (1954) పండుగ దినమిదిరా, భారత స్వాతంత్య్ర దినమిదిరా 

కన్యా దానం (1955) ఓరోరి తెలుగువాడా, వయ్యారి తెలుగువాడా

జయం మనదే (1956) వీరగంధము తెచ్చినాము 

జయం మనదే (1956) వినవోయి బాటసారి

వీరకంకణం (1957) కట్టండి వీరకంకణం 

పరాశక్తి మా తెలుగు తల్లికి మల్లెపూదండ

వెలుగు నీడలు (1961) పాడవోయి భారతీయుడా

పదండి ముందుకు (1962) మేలుకో! సాగిపో! బంధనాలు తెంచుకో 

తెలుగు సినిమా పాటల కథావస్తుపరంగా సందర్భాన్ని బట్టి ఇంకా ఎన్నో సినీ గీతాలు భైరవభొట్ల చలనచిత్ర పరిశోధనా కేంద్రంలో ఆముద్రిత, అక్షర సంపుటాలలో సురక్షితంగా ఉన్నాయి. భావి పరిశోధకుల కోసం అవి ఎదురుచూస్తున్నాయి. భైరవభొట్ల దేశభక్తుడే కాదు, సినీ పరిశోధన భక్తుడు కూడా. 

పై విధంగా భైరవభొట్ల తన అభిరుచికి పరిశోధనా ప్రతిభను జోడించి విభిన్న వస్తువులతో నిరంతరం వైవిధ్యాన్ని పాటిస్తూ ఎన్నో రకాలుగా తెలుగు సినిమా పాటల పరిశోధనను పరిపుష్టం చేశాడు. భైరవభొట్ల సాగించిన ఈ పరిశోధన వ్యవసాయం భవిష్యత్తులో మరిన్ని వంగడాలను సృష్టిస్తుంది అనడం అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటి వరకు కథావస్తుపరంగా భైరవభొట్ల చేసిన సినీ పాటల పరిశోధన గురించి చర్చించుకున్నాం.