మొత్తం పేజీ వీక్షణలు

16, జూన్ 2026, మంగళవారం

యాదాద్రి అన్నప్రసాదంలో వడ్డించే పదార్థాలేవి? #yadadri #annaprasadam #lakshminarasimhaswamy #yadadri


 

అక్షర తపస్వి కపిలవాయి లింగమూర్తి విశిష్టత

కలం బరువును మాత్రమే మోయగల శరీరం సాహిత్య లోకాలన్నింటినీ తడిమి చూడగల క్రాంత దర్శిత్వం... అబ్బురపరచే పరిశోధనా గ్రంథాలు అవతరిస్తాయి. అవీ ఒకటా రెండా శతాధికం. ఆ మహారచయితే డా. కపిలవాయి లింగమÖర్తి.

సాహిత్యంలోని క్లిష్టమైన ప్రక్రియలు అనగా చిత్రపది, బంధాలు, శబ్దపది, అలంకారాలు, యతులతో చమత్కారాలు వంటివి వీరిరచనలలో చాలా కనిపిస్తాయి. భాషాసముద్రపు లోతుల్లోకి దిగి తెలుగుపలుకుబడిపై ప్రత్యేకాధికారం పొందారు. ఉమ్మడిపాలమÖరు జిల్లాలో విd్తŸృతంగా పర్యటించి మరుగునపడిన శాసనాలు, చరిత్ర, జానపదులనోళ్ళలో నానే అపూర్వమైన, విలువైన విషయాలను గ్రంథŠస్థంచేశారు. 

‘ఒక్క సిరా చుక్క.... లక్ష మెదళ్ళ కలయిక’ అన్న కాళోజి వాక్యంతో అన్వయిస్తే కపిలవాయి సృజించిన వేల అక్షరాలు ఎంతమంది మెదళ్ళకు పదును పెట్టినవో.

లింగమూర్తిగారు 1928 మార్చి 31 వ తేదీన (ప్రభవ మాఘ శుద్దనవమి నాడు) నాగర్‌కర్నూలు జిల్లా బలుమÖరు మండలం జినుకుంట గ్రామంలో ఒక పండిత వంశమున శ్రీమతి మాణిక్యాంబ వెంకటాచలంగారల గర్భశుక్తిముక్తా ఫలంగా జన్మించినారు. అమరాబాదులో మేనమామగారైన చేపూరు పెద్దలక్ష్మయ్యగారి దగ్గర పెరిగి విద్యాబుద్ధులు నేర్చి సంస్కృతాంధ్ర నిఘంటువులు, పురాణేతిహాసాలు, కావ్యనాటకాలు, జ్యోతిష్య, శ్రౌతాది భాగాలు నేర్చారు. వారు మొదలు కొంతకాలం వృత్తిపనిచేసి తర్వాత ఉద్యోగజీవితంలోకి మారి అపూర్వమైన సాహిత్య సృజన చేశారు.

నిత్యసాహితీ కృషీవలుడైన కపిలవాయి లింగమూర్తి 157 గ్రంథాలు వ్రాసారు. వీనిలో వివిధ ప్రక్రియలలో వెలువరించినవి 94. పరిష్కృత, సంపాదక, సంకలనాల రచనలు 63. ప్రక్రియలలో శతకాలు, కావ్యాలు, ఉదాహరణలు, సంకీర్తనలు, హరికథలు, వచనగేయ పద్యకృతులు 41. వచనరచనలలో ఆధ్యాత్మికరచనలు, కథలు, నవలలు, నాటికలు, స్థలచరిత్రలు, జీవితచరిత్రలు, నిఘంటువులు, అనువాదరచనలు మొత్తం 53.

లింగమూర్తిగారు వివిధ విషయాలపై వందలాది వ్యాసాలు వ్రాసారు. అవి చాలా పత్రికలలో ప్రచురింపబడ్డాయి. వానిలో సాహిత్య, ఆధ్యాత్మిక, చారిత్రక, పుస్తకపరిచయాలు, కవులపరిచయాలు, విశ్వకర్మ సాహిత్యవ్యాసాలు ఉన్నాయి. అవి అన్ని ముద్రితాలు, అముద్రితాలు కలిపి 430. వీరు చాలామంది రచయితల పుస్తకాలకు ముందుమాటలు, పీఠికలు, అభిప్రాయాలు వ్రాసారు. చాలా పుస్తకాలు పరిష్కరించి వాటికి వివరమైన పీఠికలు వ్రాసారు. అవి అన్ని కలిపి 320.

ప్రచురించిన గ్రంథాలలో ఆర్యశతకము (చిత్రపదిపదాల గారడి), దుర్గాభర్గ శతకము (అలంకారయతి లక్షణాలు), ఉమామహేశ్వరం హరికథ, సుబ్రహ్మణ్యోదా హరణము (పాలెంసుబ్బయ్య జీవితచరిత్ర), ప్రబోధ పటాహము (సామాజిక గేయాలు), శ్రీమత్ప్రతాపగిరిఖండము (అమరబాదు స్థలచరిత్ర) కుటుంబగీత (కుటుంబ నియంత్రణ ఆవశ్యకతను తెలిపే కావ్యం), భాగవతకథాతత్వము (పది భాగవతకథలకు వ్యవహారికమైన వివరణ), గీతాచతుష్పథం(భగవద్గీత, ఉత్తరగీత, ఉద్దవగీత, భ్రమరగీతల సారాంశము), జీవుడు దేవుడు (పురాణాలలోని సంఘటలనను నేటి సమాజానికి అన్వయిస్తూ వ్రాసిన విశ్లేషాత్మకరచన), పాలమÖరుజిల్లా దేవాలయాలు (జిల్లాలోని 300 ప్రాచీన, ఆధునికదేవాలయాల చరిత్ర), గురుగోవిందమాంబ చరిత్ర, ఉమ్మడిపాలమÖరు కవిపండితవంశాలు యోగులు, ఉప్పునూతల కథ, ఆంధ్ర పూర్ణాచార్యులు (చారిత్రక నవల), పద్యకథాపరిమళం, కపిలవాయి కథానికలు, కావ్యగణపతి అష్టోత్తరము (కావ్యాలలోని 108 గణపతి స్తుతులకు వ్యాఖ్యానం), స్వర్ణశకలాలు (90 కావ్యాల్లోని స్వర్ణాభరణాలను గురించిన వివరణ), రుద్రాధ్యాయము (సామాజిక చారిత్రక వ్యాఖ్యానం) మాంగల్యశాస్త్రము (ప్రాచీన ఆభరణాల విశేషాలు వివరాలు), హనుమచ్చహస్రము (హనుమంతుడి వేయినామాలకు వ్యాఖ్యానము)

మాభగోట (సవివర కుటుంబ చరిత్ర), రాజరథం (నాటకం), పీఠికలు (330 పుస్తకాలకు వ్రాసినవి), పామర సంస్కృతము (6000పాలమÖరు మాండలికాల సేకరణ), విశ్వ బ్రాహ్మణులు సంస్కృతీ అనుకరణము (కన్నడ నుండి అనువాద రచన) కొన్ని మాత్రమే.

పరిష్కృత రచనలలో సాలగ్రామశాస్త్రము, (సాలగ్రామం పుట్టుక వాని భేదాలు, మహత్యము, పూజావిధానము వివరించిన రచన) యోగసక్తా పరిణయము, యయాతిచరిత్ర (అచ్చతెలుగుకావ్యం), ఆరు అముద్రితశతకాలు, మనో బుద్ధిర్వివాదము, సంక్షిప్త ఆబ్దికవిధానము, శ్రీ మదాంధ్ర పూర్ణాచార్య ప్రభావము ముఖ్యమైనవి.

కపిలవాయి ఏడుదశాబ్దాల సాహితీకృషికి గుర్తింపుగా పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం, హైదరాబాద్ 13వ స్నాతకోత్సవంలో 30-08-2014 నాడు గౌరవ డి.లిట్ పురస్కారాన్ని అందించారు. తెలంగాణరాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిడాక్టరేటు అందుకున్నది వీరే.

తెలంగాణ పదకోశాల్లో ‘పామర సంస్కృతం’ విశిష్టమైంది. దశాబ్దాలపాటు పల్లెప్రజలతో మమేకమై ఈ పదాలను, జాతీయాలను, సామెతలను సేకరించారు. ఈ పదకోశనిర్మాణానికి డా. కపిలవాయి లింగమÖర్తిగారిని గడియారం రామకృష్ణశర్మ, వావిలాల గోపాలకృష్ణయ్య గార్లు ప్రోత్సహించారు.

ఇక్కడ పామరులు అనగా జానపదులు. ఎలా ఉంటే తెలంగాణ పల్లె ప్రజలు శిష్టవ్యావహారిక పదాలని తమకు అనుగుణంగా మార్చుకొని మాట్లాడతారు. ‘పామర సంస్కృతం అనగా పామరుడు తాను సంస్కరించుకున్న భాష అనే అర్థంలో ఈ పేరుంచాను” అని లింగమÖర్తి పేర్కొన్నారు.

పామర సంస్కృతంలో పదాలకు అర్థాలతో పాటు పద్యపాదాలు, పాటల పల్లవులు, నానార్థాలు, పర్యాయపదాలు, జాతీయాలు, సామెతలు, న్యాయాలు, పదవివరణ, రూపసాధన, పదవ్యుత్పత్తి, అన్యదేశ్యాలు అనుబంధంలో ఇచ్చినవాటిని స్థాలీపులాకన్యాయంగా పరిశీలించినారు.

ఇక రెండవది సాలగ్రామం. ఇది వారి కుటుంబచరిత్ర. మా భగోటాకు సంక్షిప్తీకరణ. ఈ ఆత్మకథలో అటు స్వర్ణశిల్పంతోపాటు మరిన్ని విద్యలలో రాణించిన ఒక స్త్రీమÖర్తి కనబడుతుంది. ఆమె మేడిపూరు గోవిందమ్మ. చిన్నతనంలో భర్త చనిపోవడంతో తండ్రి, అన్నలవద్ద స్వర్ణశిల్పంతో పాటు అన్నివిద్యలు నేర్చుకున్న ప్రతిభావంతురాలు ఆమె. 

ఆమె లింగమూర్తిగారి తాతగారైన సింగవట్నానికి స్వర్ణశిల్పంలో శిక్షణ ఇచ్చింది. తోలుబొమ్మలాట ఆడేవారిలో ఉన్న చిత్రకారులతో పౌరాణికచిత్రాలు గీయించి సింగవట్నానికి వాటిద్వారా చెక్కడం పనికి కావలిసిన చిత్రలేఖనం నేర్పించింది. ఆ కాలంలో ఇటువంటి స్త్రీలు అరుదు. 

సాలగ్రామం చదివినప్పుడు ఆనాడు విశ్వకర్మలు ఉగాది, దసరా పండుగలను ఎలా జరుపుకునేవారో తెలుస్తుంది. ఆ కాలంలో లింగమÖర్తిగారింట్లో ఉగాది, దసరా పండుగలు నవరాత్రులుగా సాగేవట. ఉగాదికి తమ పనిముట్లను పూజించేవారట. ఉగాదినాడు పనిముట్లనన్నింటిని కడిగి, తుడిచి, చమురు (నూనె) పూసి వాటికి గంధంతో తిర్యక్పుండ్రాలు, చంద్రరేఖలు తీర్చి కుంకుమతో అలంకరించేవారట. ఉగాది దినాలలో విశ్వకర్మపురాణం పగటిపూట, భజన రాత్రిపూట ఉండేదట.  1937 ప్రాంతంలోనే బడులలో ‘బడితోటల’ పెంచే సంస్క ృతి ఉన్నదని ఈ ఆత్మకథ తెలుపుతుంది. 

‘నా మొలకమామిడి నివాసం’ శీర్షికలో లింగమÖర్తి గారి చదువరితనం వెల్లడవుతుంది. రాత్రి 8 గంటలకు మొదలుపెట్టి తెల్లవారి నాలుగు గంటలవరకు ఎక్కడా విడువకుండా వేయిపడగలు నవలను చదవడం మనను సంభ్రమాశ్చర్యాలకు లోనుచేస్తుంది. 

‘పాలెంలో పదేండ్లు’ అధ్యాయంలో లింగమÖర్తిగారి మిత్రబృందం సాహిత్యకృషి కనబడుతుంది. తెలకపల్లె విశ్వనాథశర్మ, సీతారామశాస్త్రి, రామకృష్ణశాస్త్రి, శ్రీరంగాచార్యులు, మామిడన్న సత్యనారాయణ మొదలైన కవిపండితుల సాహచర్యంలో ఆయనకు కలిగిన శబ్దజ్ఞానం, పరిష్కరణ సాధకబాధకాల  పరిజ్ఞానం భవిష్యత్తులో ఎంతగానో తోడ్పడినట్లు తెలిపారు.

బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన ఒక మారుమÖల పల్లెటూరు పిల్లవాడు తన క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల, కృషి, నిజాయితీలతో ఏ విధంగా రాష్ట్రం మెచ్చుకునే కవిపండితుడయ్యాడో ఈ ఆత్మకథ మనకు తెలుపుతుంది. 

చిత్రకారునిగా, జ్యోతిశ్శాస్త్రవేత్తగా, యోగసాధకునిగా, పుస్తకాల పురుగుగా, శిల్పిగా, నాటకాలకు వస్తువులు తయారు చేసిన సృజనశీలిగా, కవిగా, పండితునిగా, పరిశోధకునిగా, చరిత్రకారుడిగా, పరిష్కర్తగా, సంపాదకునిగా విభిన్న పార్శ్వాలు గల కపిలవాయి లింగమÖర్తిగారి జీవితాన్ని ఆవిష్కరించే గ్రంథం ఇది.

తర్వాత వారి మరో అపూర్వ గ్రంథం మాంగళ్యశాస్త్రం. ఇది తాళపత్రాలలో వారి తాతగారి గ్రంథాలయంలో దొరికింది. మన ఆభరణాలు వాని చరిత్ర తెలుగువారి సొమ్ములు, స్వరూపాలు అలంకారాలు వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. స్త్రీల కాలిమెట్టెలు, చేతిగాజుల గురించి సవివరంగా తెలిపారు. ఆయన అధ్యాపకత్వానికి ముందు బంగారం పనిచేసినవారే. అందుకే ఆయన సాహిత్య స్వర్ణసౌరభ కేసరి అయ్యారు. ఆయన రచనలూ బంగారమే! ఆయన నడక, నడత...బంగారమే! 

ఎందరో ఔత్సాహికులకు శిష్యులకు, మిత్రులకు కవితారంగంలో ఓనమాలు దిద్దించి దశ, దిశా నిర్దేశనం జరిపారు. ఆయన సాహిత్యకృషికి గుర్తింపుగా హైద్రాబాద్‌లో జరిగిన 32వ హైద్రాబాద్ బుక్‌ఫెయిర్‌కు ‘కపిలవాయిలింగమూర్తి ప్రాంగణం’ అని నామకరణం చేసి గౌరవించారు. ఆ పుస్తకప్రదర్శన ప్రారంభోత్సవంనాడు (15.12.2018) వీరి ఆత్మకథ ‘సాలగ్రామం’ ను శ్రీ  యం.వెంకయ్యనాయుడుగారు, (భారత                       ఉపరాష్ట్రపతి) ఆవిష్కరించారు.

ఆరోగ్యం కాపాడే దైవ మంత్రాలు ఏవి #hymns #healthmantras #ailment #disease #arogyam #benefits #treatment #interestingfacts


 

నందమూరి బాలయ్య వదులుకున్న సినిమాలు ఏవి #balakrishna #missed #movies #tollywoodnews #rejected #cinemas