భారత దేశంలో పెరుగుతున్న మత మార్పిడులు
ప్రతి శతాబ్దంలో ఓ ఖండాన్ని 'క్రైస్తవఖండంగా' మార్చిన క్రైస్తవ చీకటి సామ్రాజ్యం ఆసియా ఖండాన్ని టార్గెట్ చేసింది. ఈ ఖండంలో చైనా వాళ్ళు కమ్యూనిష్టులు క్రైస్తవ సంస్థలను దగ్గరకు రానివ్వరు. ముస్లిం దేశాల్లో క్రైస్తవుల పప్పులు ఉడకవు. ఇక మిగిలింది భారతదేశంలోని అమాయక హిందువులే. ఇక్కడి భిన్న భాషలు, భిన్న సంస్కృతిని దెబ్బతీసి క్రైస్తవ మతవ్యాప్తే వారి లక్ష్యం. ఇందుకు వాళ్ళు ఈస్ట్ ఇండియాకాలం నుండే పునాదులు వేసుకున్నారు. భారతదేశాన్ని క్రైస్తవదేశం చేయాలని 1813లో బ్రిటీష్ పార్లమెంట్ 'హౌస్ ఆఫ్ కామర్స్” చర్చ జరిగింది. అంటే వాళ్ళు మనదేశానికి వచ్చింది కేవలం వ్యాపారం కోసమే కాదు క్రైస్తవమత వ్యాప్తి కోసం అని అర్థమవుతుంది. భారత్ క్రైస్తవమయం చేయడానికి మొట్టమొదట రాయబారి 'థామస్ రో'ను పంపింది. అలాగే భారతదేశం క్రైస్తవదేశంగా మారడానికి పరిపూర్ణంగా స్థిరంగా ఉందో లేదో తెలుసుకోవడానికి జూన్ 24 1813లో బ్రిటన్ పార్లమెంట్ 'హౌస్ ఆఫ్ కామర్స్” భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చే చట్టం రూపొందించిది. ఈ చట్టం తర్వాత మత ప్రచారకులను విస్తృతంగా భారత్ కు పంపించారు.
క్రైస్తవమత ప్రచారం కోసం క్రైస్తవపాఠశాలలు తెరచి హిందువుల మనస్సులను చిన్ననాడే క్రైస్తవీకరణ చేశారు. భారతదేశంలోని క్రైస్తవ క్రియాశీలకమైన సంస్థలన్నీ బీదవాళ్ళున్న స్థలాల్లోనే పనిచేస్తాయి. విద్య, వైద్యం, అనే సేవా ముసుగును అవి తొడుక్కుంటాయి. ఉపాధి లేని ప్రజలు, ఆదివాసులను, దళితులను వాళ్ళు టార్గెట్ గా చేసుకొని పనిచేస్తున్నారు. 'సేవ' అందమైన పదం క్రైస్తవమత వ్యాప్తి కోసమే వారు ఎంచుకున్నారు. ఒకపక్క బీదలకు సేవ అంటూనే వారిని కేథలిక్కులుగా మార్చేస్తున్నారు. ఆ సేవంతా కేథలిక్ చర్చి అధికారాన్ని పెంచేందుకే తప్ప బీదత్వం పోగొట్టడానికి కాదు. కేవలం బీదలకు సేవ పేరుతో 600 మిలియన్ల కేథలిక్కులను తయారు చేసినట్లు ఓ అంచనా. ఆ సేవ అంతా ఉద్దేశపూర్వకంగా ఏదో ప్రయోజనం ఆశించి చేస్తున్నదే. పెట్టుబడిదారులు - మల్టీ నేషనల్ కంపెనీలుగా చలామణి అవుతూ విరాళాలు ఇస్తే ఇవి బీదవాళ్ళను బీవాళ్ళుగానే ఉంచాయి కానీ వారి మతం, సంస్కృతి మాత్రం మారిపోయింది.
బీదలపై ఇంత ప్రేమను కురిపించే క్రైస్తవ సంస్థలు సోమాలియా, ఉగాండా లాంటి దేశాలకు వెళ్ళి ఎందుకు సేవ చేయరు? అంతెందుకు అత్యంత ధనికదేశమైన అమెరికా వీధుల్లో కూడా మూడు మిలియన్ల మంది బీదరికంతో చస్తున్నారు కదా? దేవుని రాజ్యానికి వారసులైన వారిని ఎందుకు కేథలిక్ సంస్థలు పట్టించుకోవు. ప్రపంచంలోని ప్రజలనంతా క్రైస్తవులుగా మార్చాలన్నదే చర్చ్ ధ్యేయం. పూర్వం క్రైస్తవదేశాలు తయారు చేసే వస్తువులపై ఎలాంటి సుంకం ఉండకపోవటం వల్ల వాటి ధరలు తక్కువ. భారతీయ ఉత్పత్తులపై బ్రిటీషు వారు అనేకరకాల పన్నులు విధించడం వల్ల మన వస్తువుల ధరలు ఎక్కువై కం పెనీలు మూతబడేవి. ఇపుడు కూడా సరళీకరణ ఆర్థిక విధానాల వల్ల పాశ్చాత్య దేశాల వస్తువులకు మనం 'ట్యాక్స్ ఫ్రీ' అంటున్నాం. వాళ్ళు దానిని ఆసరాగా చేసుకొని మనదేశంలో జోరుగా క్రైస్తవీకరణ చేస్తున్నారు. 1991లో మనదేశంలో పేదవారి సంఖ్య 32 కోట్లు, 1997లో 40 కోట్లు వాళ్ళందరినీ క్రైస్తవ మతంలోకి మార్చే ఉధృతంగా సాగుతుంది. సెంటిమెంట్ ను, అస్తిత్వాలను, భావోద్వేగాలను రెచ్చగొట్టి మతమార్పిడి చేస్తున్నారు.
ఆంగ్లేయుల కాలం నుండే దేశాన్ని క్రైస్తవమయం చేయడానికి ఇక్కడి పేదరికం, ఆకలి, నిరుద్యోగం పెంచి పోషించారు. స్వాతంత్ర్యానంతరం కూడా ఓటుబ్యాంక్ రాజకీయాలతో హిందువులను బీదవారుగానే ఉంచారు. అలాగే 'సెక్యులరిజం' పేరు మీద మన చరిత్ర, సంస్కృతి, వీరుల చరిత్రలు మాయం చేసి దేశవ్యతిరేక మనస్తత్వం ఉండే వ్యక్తులుగా మార్చారు. ఇందుకోసం కుహనా మేధావులను తయారు ఏసి సమాజంలోకి వదిలారు. వారెప్పుడూ ప్రచార ప్రసార మాధ్యమాల్లో కవుల పేరుతో రచయితల పేరుతో, మేధావుల పేరుతో హిందూ సంస్కృతిపై దాడిచేస్తారు. హిందూ సాంస్కృతిక పరంపరపై ద్వేషం, ధార్మికత విషయాలను మూఢ విశ్వాసాలుగా ప్రచారం చేయడం హిందూ మతాన్ని సైన్సుకు వ్యతిరేకమని ప్రచారం చేయడం, హిందువుల్లో కులవ్యవస్థను బూచిగా చూపించి దళితులను వేరు చేయడం, పురాణ కథలకు తలాతోక లేకుండా వ్యాఖ్యానం చేసి అబద్దాలు ప్రచారం చేయడం ఈ మేధావుల పని. వీళ్ళకు సహకరించే మీడియా వ్యవస్థ కూడ చైతన్యంగా ఉంది. వీళు , చెప్పే ప్రతి విషయానికి 'అభ్యుదయం' అనే ముసుగు తొడుగుతారు.
మేధావి ముసుగులు తొడుక్కొన్న ఫాస్టర్లు. పైకి అంబేద్కర్, బుద్దుని చూపిస్తూ లోపల యేసుక్రీస్తును ఆరాధిస్తారు. క్రైస్తవమతం మహమ్మారిలా హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తుంటే మన పాలకులు మాత్రం 'దళిత క్రైస్తవులకు' ఎస్టీ హోదా ఇస్తాం' అని ఎన్నికల హామీలు గుప్పిస్తున్నారు. క్రైస్తవులకు ఎస్సీ హెూదా ఇవ్వాలనుకొంటే రాజ్యాంగం రచన చేసిన మేధావి అంబేద్కర్ ఇవ్వకపోయేవాడా? హిందూ మతంలోని కొందరు కరుడు గట్టిన కులవాదులను మార్చాలని ప్రయత్నించిన అంబేద్కర్ విసిగి చివరకు భారతదేశంలో పుట్టిన, హిందూ మత అంతర్భాగమైన బౌద్దాన్ని స్వీకరించాడు. విదేశాల్లో పుట్టిన క్రైస్తవాన్ని స్వీకరించలేదు!
క్రైస్తవ సంస్థలు క్రైస్తవాన్ని ప్రచారం చేయడం వల్ల మనదేశంలో వారి సంఖ్య పెరుగుతుంది. ఈ ప్రయత్నం వల్ల విదేశీ కంపెనీలను సమర్థించే వారి సంఖ్య పెరుగుతుంది. దేశంలోని సహజవనరులు వారి వ్యాపారంలోకి వెళ్ళునట్టు, క్రైస్తవులు తమ వ్యాపారాన్ని వివిధ ఛానళ్ళ ద్వారా మన మెదళ్ళలోకి ఎక్కిస్తున్నారు. బ్రిటన్, అనేక ఐరోపా దేశాల్లోన్ని ఫ్రీ సెక్స్ - విచ్చలవిడి శృంగారం ఎక్కిస్తున్నారు. గేకల్చర్, పబ్ కల్చర్, క్లబ్ కల్చర్ పేరుతో మనల్ని ధ్వంసం చేస్తున్నారు. ఎన్నడూ తల్లితండ్రులతో ఉండని పాశ్చాత్య క్రైస్తవులు వృద్ధశ్రమాల్లో తమ తల్లిదండ్రులను సంవత్సరానికి ఒసారి వస్తువులు, ధనం పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసుకొన్న ఫాదర్స్ డే, మదజ్డ్ లను మన నెత్తిన రుద్దుతున్నారు.
ఎలాంటి ఖగోళ, చారిత్రక, శాస్త్రీయ ఆధారం లేని ఋతు మార్పులు లేని జనవరి ఫస్టనాడు కోట్లాది రూపాయల వ్యాపారం విదేశీ క్రైస్తవ కంపెనీలు నిర్వహిస్తున్నాయి. హిందువులను మద్యం మత్తులో ముంచుతున్నారు. ఇలా అనేక దుశ్చర్యల ద్వార 'క్రైస్తవం' భారతదేశంలో చొచ్చుకుపోతున్నది. ప్రస్తుతం చిన్నకుగ్రామాల్లో సైతం ఒకటి, రెండు చర్చిలు నిర్మిస్తున్నారు. లక్షల ఖర్చుతో సువార్త స్వస్థత సభలు, కూటములు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లాంటి నగరంలో వలస వచ్చి గుడిసెలు వేసుకొన్న 'స్లమ్' పరిసరాలను లక్ష్యంగా చేసుకొంటున్న క్రైస్తవ సంస్థలు ప్రతి ఆదివారం మందు, మటన్, చికెన్, బిర్యానీ, వస్త్రాలు, డబ్బు ప్రలోభాల ద్వారా శుభకార్యాలు జరుగని సమయంలో నగరంలోని ఫంక్షన్హాళ్ళను అద్దెకు తీసుకొని మతమార్పిళ్ళు చేస్తున్నారు. 'లవ్ జీహాదీ' పేరుతో క్రైస్తవ యువతులు హిందూ యువకులను ఆకర్షించి వలలో వేసుకొని మతం మార్చి పెళ్ళి చేసుకొంటున్నారు. ఇక్కడా అక్కడా మోసపోతున్నది హిందువులే!
పాశ్చాత్య దేశాల మార్కెట్లో ధర పడిపోయిన క్రైస్తవమతాన్ని భారత విపణిలో అమ్మాలనుకొంటున్నారు. అక్కడి ప్రసిద్ధమైన చర్చిలనెన్నింటినో మన 'హరేహరే కృష్ణ' లాంటి సంస్థలు కొంటున్నాయి. క్రీస్తు మందిరాలను కృష్ణమందిరాలుగా మారుస్తున్న మనకెందుకు ఈ మతమార్పిడి? కానీ భారతదేశ లౌకిక ఉదారభావాలను, భిన్నత్వ భావాలను, అతిథి దేవో భవ మర్యాదను క్రైస్తవ సంస్థలు ఆసరాగా తీసుకొని మతమార్పిడి కుట్రను సాగిస్తున్నాయి. గొట్టెలకాపరిగా చెప్పే క్రీస్తుకు ' గొట్టె మనస్తత్వం' ఉన్నవాళ్ళను - అంటే గుడ్డిగా ఒకే దాటుడుగా వెళ్ళే ప్రజలను ఎరవేస్తున్నారు. క్రైస్తవమతం ప్రచారం చేయలని నియమించే ఫాస్టర్లకు శిక్షణ, వేతనం ఇవ్వటం వల్ల వాళ్ళు 'పూర్తి సమయం అదే పని చేస్తున్నారు. ఆధునిక పరిశోధనల్లో క్రైస్తవమతం ' డొల్లతనం' పాశ్చాత్యులు గ్రహిస్తున్నారు.
బైబిల్ లో చెప్పిన సృష్టిక్రమం కానీ, జీవనవిధానం కానీ ఆధునికతకు సరిపోని విధంగా ఉన్నాయని ఎందరో పాశ్చాత్యులు పరిశోధనా గ్రంథాలు వెలువరించారు. అందువల్ల అక్కడ చెల్లని క్రైస్తవాన్ని ఇక్కడ మన మార్కెట్లో వాళ్ళు అమ్ముకుంటున్నారు. సేవ ముసుగులో క్రైస్తవ సంస్థలు భారతదేశంలో మతమార్పిడి చేస్తున్నాయి. వాళ్ళు చేసే సేవకన్నా మతమార్పిడి వల్ల కలిగిన నష్టం ఎక్కువ. ఇటీవల కాలంలో వాళ్ళు పెట్టిన కాన్వెంట్లు, కార్పోరేటు కళాశాలల మాయలో కొట్టుకుపోయాము. క్రైస్తవ సంస్థల ఆస్తులను మతమార్పిడికి వినియోగిస్తున్నారు. 'మదర్ థెరిస్సా' మతమార్పిడి చేయడంలో దిట్ట. ఆమె చేసిన సేవకు లేని దైవత్వం , కరుణ ఆపాదించి 'శాంతిదూత' గా మన హిందువులే ప్రచారం చేస్తున్నారు. చివరకు మనం ఎంత దిగజారిపోయామంటే వివిధ హస్పత్రుల్లో మదర్ తెరిస్సా ఫోటో పెట్టి పూజించేంతగా దిగజారిపోయాం . మన హాస్పటల్లో చరకుడు, శుశ్రుతుడు, ధన్వంతరి, అశ్వనీ దేవతల ఫోటోలు పెట్టుకోవాలి. 2500 ఏళ్ళ క్రితమే చరకుడు, గొప్ప 'చరకసంహిత'ను అందించాడు. 2500 సంవత్సరాల క్రితమే శుశ్రుతుడు 'శస్త్రచికిత్స' చేశాడు. ధన్వంతరి, అశ్వనీదేవతలు దేవతలకే వైద్యం చేశారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి