రవి కుల పావనుం డయిన
రామ నరేంద్రుని సచ్చరిత్రమున్
కవి యను పేరు సార్థకము
గాగను వాల్మికి కావ్య మల్లగా..
పవిధరుడున్, మునుల్, జనులు
భక్తి నిబద్ధతఁ గేలు మోడ్వగా..
చెవికి పసందుగా వినుచుఁ
జేష్టలు దక్కెను వాయుపుత్రుడున్
కవి యనే పేరు సార్థకం అయేటట్టు వాల్మీకి కావ్య మల్లగా... పవిధరుడు (దేవేంద్రుడు), మునులు, జనులు భక్తితో కేలు మోడ్వగా (చేతులు జోడించగా)... వాయుపుత్రుడైన ఆంజనేయుడు సూర్య వంశ పావనుడైన రాముని సచ్చరిత్రను చెవులారా వింటూ (పారవశ్యంతో) చేష్ట లుడిగి అలా వుండిపోయినాడు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి