మోహనాంగుడైన పురుషోత్తముని రాము
క్షణము సేపు సీత గాంచి మురిసె
మిగుల దొడ్డ ధనువు మేలుగా విరిగి ద
వ్వు దవులందు గుండె లదరినపుడు..
రాముడు శివ ధనుర్భంగం గావించినాడు. ధనువు విరిగినపుడు దవ్వు దవ్వులందు (దూర దూరములందు) నున్న వారి గుండెలు కూడ అదరిపోయినవి. అంతగా ప్రతిధ్వనించింది.
అప్పుడు సీత రాము ణ్ణొక్క క్షణం చూసి మురిసిపోయినది. రాముడు మోహనాంగుడే గాక పురుషోత్తముడు కూడా అని ఆమె గ్రహించింది. ధనువు విరగడం మేలే అనుకున్నది. (తండ్రిగారి ఆశయమూ ఫలించింది గదా!)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి