వశి.. వనధి దాటెఁ..బనిఁ జేసె..ఫల మడుగడు..
వైనతేయ నిభ వరిష్ఠుడైన హనుమ..
ఎవరు ద్రవిణమునం దాశ యెరుగ? రొకడు
దక్క..నాకలిం గమలాప్తు దాకు హనుమ..
ఆంజనేయుడు వశి. (ఇంద్రియాలను వశమునం దుంచుకున్నవాడు). వైనతేయుని (గరుత్మంతుని) వంటి వరిష్ఠుడు (శ్రేష్ఠుడు). అనంతమైన సముద్రాన్ని లంఘించగలిగినాడు. లంకలో ప్రవేశించ గలిగినాడు. జానకి జాడ కనుక్కో గలిగినాడు. తన ప్రతాపాన్ని చూపగలిగినాడు. తిరిగి రాగలిగినాడు. ఇవన్నీ ఎవ్వడూ చేయలేని పనులే! పైగా నిష్కామంగా చేశాడు.
ద్రవిణము (ధనము)నం దాశ ఎవ రెరుగరు? ఆకలితో కమలాప్తుని (సూర్యుని) తాక బోయే హనుమ ఒక్కడు తప్ప.
బాల్యంలో సూర్యుని పం డనుకొని మింగ బోయాడు హనుమ.
(పదాలు అన్యార్థంలో ప్రయోగించ బడినవి.)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి