"సాగ దింక మాయ.. సంహరించెదను.. ల
క్ష్య మిపు డింద్రజిత్తె" యని శరము సు
మిత్ర సూను డేసె, మిత్తి జేర్చె నరి, న
మ్ముల పొది నొదిగె.. జనములు మురిసిరి
ఆకాశంలో అదృశ్యరూపుడై ఇంద్రజిత్తు శర వర్షం కురిపిస్తున్నాడు. అతని రాక్షస మాయ ముందు వానరులు నిలువలేక పోతున్నారు. సుమిత్రా సూనుడైన లక్ష్మణు డిది గ్రహించి తీవ్రస్థాయిలోనే ఎదుర్కోవా లని నిశ్చయించుకొన్నాడు.
"నే డింద్రజిత్తును సంహరించాల్సిందే! లక్ష్యం ఆతడే!" అని శర ప్రయోగం చేసినాడు. అది అరిని (శత్రువును) మిత్తి (మృత్యువును) జేర్చినది. తిరిగివచ్చి లక్ష్మణుని అమ్ములపొదిలో దూరినది. జనాలు మురిసిపోయినారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి