చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
Useful Guide for Hyderabad Telugu People...General Awareness for All ...Education....Movies.... Politics... Social...Cultural.....Events.....and many more things to know updates......
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
కుబేరునికి పూజ చేయడం వల్ల చాలీసాను పఠించడం వల్ల జీవితంలోని అన్ని బాధలు తొలగి సకల శుభాలు కలుగుతాయి
చాలీసాను పారాయణం చేయడం వల్ల డబ్బు, ధాన్యం, సుఖ సంతోషాలు కలుగుతాయి.
కుబేరున్ని తృతీయ తిథికి అధిపతిగా జ్యోతిష్యశాస్త్రం పేర్కొంది.
కుబేర స్వామికి అక్షింతలు, చందనం, పూలు, పండ్లు మొదలైనవి పూజా కార్యక్రమంలో సమర్పించాలి
ఓం కుబేరాయ నమః
ఓం ధనదాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం యక్షేశాయ నమః
ఓం గుహ్యకేశ్వరాయ నమః
ఓం నిధీశాయ నమః
ఓం శంకరసఖాయ నమః
ఓం మహాలక్ష్మీనివాసభువే నమః
ఓం మహాపద్మనిధీశాయ నమః
ఓం పూర్ణాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం యక్షేశాయ నమః
ఓం గుహ్యకేశ్వరాయ నమః
ఓం నిధీశాయ నమః
ఓం శంకరసఖాయ నమః
ఓం మహాలక్ష్మీనివాసభువే నమః
ఓం మహాపద్మనిధీశాయ నమః
ఓం పూర్ణాయ నమః
ఓం లక్ష్మీసామ్రాజ్యదాయకాయ నమః
ఓం ఇలపిలాపత్యాయ నమః
ఓం కోశాధీశాయ నమః
ఓం కులోధీశాయ నమః
ఓం అశ్వారూఢాయ నమః
ఓం విశ్వవంద్యాయ నమః
ఓం విశేషజ్ఞాయ నమః
ఓం విశారదాయ నమః
ఓం నలకూబరనాథాయ నమః
ఓం మణిగ్రీవపిత్రే నమః
ఓం గూఢమంత్రాయ నమః
ఓం వైశ్రవణాయ నమః
ఓం చిత్రలేఖామనఃప్రియాయ నమః
ఓం ఏకపింగాయ నమః
ఓం అలకాధీశాయ నమః
ఓం బౌలస్థాయ నమః
ఓం నరవాహనాయ నమః
ఓం కైలాసశైలనిలయాయ నమః
ఓం రాజ్యదాయ నమః
ఓం రావణాగ్రజాయ నమః
ఎవని కారుణ్యలేశాన నివ్వసుధను
సూతుడును సద్గురుండయి సొంపు మీరె..
నట్టి పూజ్యుని, మునులలో నపర హరిని,
నాత్మవిదుని, వేదవ్యాసు నభినుతింతు
వేద వ్యాసుడు అష్టాదశ పురాణాలు సంతరించాడు. అతని శిష్యుడైన సూతుడు వాటిని ప్రవచించాడు. అందుకే సూతుడు శౌనకాది మహామునుల కిట్లనియె.. అని ఆరంభ మౌతాయి పురాణాలు. అందరికీ విద్యను ప్రసాదించే సద్గురువైన వ్యాస భగవానుని కృపా ప్రసాద లేశం చేత నిమ్న జాతికి చెందిన సూతుడు సైతం శౌనకాది మహామునులకు ప్రవచించే స్థాయికి చేరుకున్నాడు. అటువంటి మహానుభావుడైన వేదవ్యాస మహర్షికి నమస్సుమాంజలులు.
Salutations to Veda Vyasa,
the lotus-eyed lord Vishnu among the sages,
whose mere glimpse of kindness transformed an ordinary Suta into a revered Guru.
సందియంబె! వైరి శరణు వేడగను నా
దేశ మిత్తు నతని కాశ పడక..
శరణు వేడు వాని దరిఁ జేర్చి కాచుటే
ముఖ్య మగును నాకు..
విభీషణునికి శరణ మిచ్చి లంకకు రాజుగా నభిషేకించారు. ఒకవేళ రావణుడే శరణాగతుడైతే..!" అని సుగ్రీవుడు సందేహిస్తే "రావణునికి నా కోసల దేశ మిస్తాను. శరణాగతుణ్ణి రక్షించటమే నాకు ముఖ్యం." అన్నాడు రాముడు. ఇదీ పద్యంలో వున్నది.
అనఘ చరిత్ర మీకు శర
ణాగత రక్ష కులవ్రతంబు, మీ
సునిశిత బాణజాలముల
చోకున కోర్వక వచ్చి తా దశా
నను డభయంబు వేడికొని
నం దగ వె ట్లగు" నన్న న వ్విభుం
డిన సుతుఁ జూచి యట్లయిన
నిచ్చెద వాని కయోధ్య నావుడున్
....రాముని కళ్యాణగుణాలకు, అనుకూల మైనదియే! శరణాగత వత్సలుడైన రాముడు, శర ణనిన రావణుని అనుగ్రహించడంలో అతిశయోక్తి ఏమీ లేదు. అవసరమైతే ఆయోధ్యను త్యజించే త్యాగగుణం రామునికి లేనిదీ కాదు.
చైతన్య రామాయణము 2 వ భా. పు. 298
పలికె త్రిజట "సోదరునితో, పత్నితోడఁ
మేటి పుష్పకమున దిశల్ మెరయ నుత్త
రమున కేగెడు రాముని, ప్రళయ కాల
మృడుని కనుగొంటి.. నంతట మేలు కొంటి"
అశోకవనంలో సీతను భయపెడు తున్న రాక్షస స్త్రీలతో వృద్ధ రాక్షసియైన త్రిజట సీతను భయపెట్టవ ద్దని ఆమె కనుకూలంగా ఎన్నో శుభ శకునాలు కనిపిస్తున్నా యని చెబుతూ తనకు వచ్చిన కల గురించి ఇలా చెప్పింది.