మొత్తం పేజీ వీక్షణలు

28, జూన్ 2026, ఆదివారం

ఈలపాట రఘురామయ్య మెమోరియల్ గ్రంధాలయము


పద్మశ్రీ కళ్యాణం (ఈలపాట) రఘురామయ్య మెమోరియల్ గ్రంధాలయము, సుద్దపల్లి, చేబ్రోలు మండలం, గుంటూరు జిల్లా, నిర్మించిన వారు : శ్రీ కల్యాణం నరసింహారావు, బి.టెక్ (మెకానికల్), శ్రీ తోట రామాంజనేయులు, (బిల్డరు)

ఈ గ్రంధాలయము కీ?శే? పద్మశ్రీ కల్యాణం (ఈలపాట రఘురామయ్య కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు మరియు ఉపాధ్యక్షులు రఘురామయ్య గారి అన్న గారు కీ?శే? కోటయ్య గారి కుమారుడు శ్రీ కె. నరసింహారావు గారు, రిటైర్డ్ సీనియర్ మేనేజర్, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, హైదరాబాదు వారి కుమారుడు శ్రీ కె. రమణ్ రావు (యు.యస్.ఎ).

మరియు తోట రామాంజనేయులు గారు (రఘురామయ్య గారి మనుమడు) మరియు వారి కుమారుడు శ్రీ బ్రహ్మయ్య (యు.యస్.ఎ) సంయుక్తముగా సమపాళ్ళ ఖర్చుతో నిర్మించటమైనది.

శ్రీ కట్టా భానుమÖర్తి గారు రిటైర్డ్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, శ్రీ మట్టుపల్లి రామకృష్ణ కిషోర్ బాబు, రిటైర్డ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, మరియు నల్లనూకల వెంకటేశ్వర్లు గారు రిటైర్డ్ హైస్కూలు టీచరు గ్రంధాలయమునకు కావలసిన పుస్తకములు, బీరువాలు, కుర్చీలు, టేబుల్స్ సమకూర్చినారు.

శ్రీ కట్టా భానుమÖర్తి గారు గవర్నమెంటు అధికారులు మరియు సుద్దపల్లి గ్రామ పంచాయితీ వారితో సంప్రదించి ప్రభుత్వం తరపున గ్రంధాలయ పర్యవేక్షకునిగా నెలవారీ జీతముతో శ్రీ మట్టుపల్లి శ్రీనివాసరావు గారిని నియమించినారు. గ్రంధాలయమునకు 3 తెలుగు దినపత్రికలు వచ్చునట్లు మంజూరు చేయించినారు. ఈ గ్రంధాలయము ది. 20.03.2022వ తేదీన గౌ|| శ్రీ కిలారి వెంకట రోశయ్య గారు (అప్పటి శాసనసభ్యులు, పొన్నూరు) మరియు శ్రీ బత్తుల దేవానంద్, ఛైర్మన్ గుంటూరు జిల్లా గ్రంధాలయ సంస్థ వారిచే ప్రారంభోత్సవము జరిపించబడినది.

శ్రీ గోవాడ మోహన్రావు, రిటైర్డ్ అసిస్టెంటు ఇంజనీరు (ఇరిగేషన్ డిపార్ట్మెంట్), ప్రెసిడెంటు సమైక్య గ్రామాభివృద్ధి సేవా సంఘం, కోశాధికారి శ్రీ రఘురామయ్య కల్చరల్ అసోసియేషన్.

శ్రీ మట్టుపల్లి గోపిచంద్ గారు రిటైర్డ్ సీనియర్ సెక్షన్ ఇంజనీరు (సౌత్ సెంట్రల్ రైల్వేస్) సెక్రటరీ సమైక్య గ్రామాభివృద్ధి సేవా సంఘం.

శ్రీ కల్యాణం సత్యనారాయణ, రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజనీరు, బి.యస్.యన్.యల్, ప్రెసిడెంట్ రఘురామయ్య కల్చరల్ అసోసియేషన్.

శ్రీ నల్లనూకల రంగారావు గారు రిటైర్డ్ పోస్ట్మస్టరు, కోశాధికారి సమైక్య గ్రామాభివృద్ధి సేవా సంఘం.

శ్రీ వెలగా నరేష్ కుమార్ గారు, శ్రీ తోట శివనాగేశ్వరావు గారు (కార్యనిర్వహక సభ్యులు) ఈ రెండు సంస్థలు మరియు సుద్దపల్లి ప్రజల సమైక్య కృషితో గ్రామమునకు కావలసిన అభివృద్ధి కార్యక్రమములన్నియÖ దిగ్విజయముగా చేయబడుచున్నవి.

బ్రాహ్మణకోడూరు వాస్తవ్యులు ఈలపాట గాయకులు శ్రీ ఎ.ఆర్. లయగారు అనేక ఈలపాట కచేరీలు చేయుచున్నారు. వారి ప్రతిభను గుర్తించి ఈలపాట రఘురామయ్య కల్చరల్ అసోసియేషన్, సుద్దపల్లి వారిచే రఘురామయ్య గారి కాంశ్య విగ్రహము ఆవిష్కరణ సందర్భముగా 2014 సం||లో వారిచే ప్రంశంసా పత్రము యిచ్చి సత్కరించినాము.

గమనిక : సమైక్య గ్రామాభివృద్ధి సంఘము అసోసియేషన్ పద్మశ్రీ (ఈలపాట రఘురామయ్య కల్చరల్ అసోసియేషన్ మరియు సుద్దపల్లి గ్రామ ప్రజలు కీ?శే? దంటు లక్ష్మి కాంత శాస్త్రి గారితో మాట్లాడినపుడు వారు ఉదార స్వభావముతో 660 గ? స్థలమును సమైక్య గ్రామాభివృద్ధి సంఘమునకు విరాళముగా రిజిష్టరు చేసి, యిచ్చిన స్థలములో షిరిడి సాయి దంటు త్రిపురాంబ గ్రామ కల్యాణ | మండపము, షిరిడి సాయిబాబా వారి గుడి, గ్రంధాలయము మరియు రఘురామయ్య గారి కాంశ్య విగ్రహము నిర్మించటమైనది.

కీ.శే. దంటు లక్ష్మి కాంత శాస్త్రి గారు మహానుభావుడైన పద్మశ్రీ కల్యాణం రఘురామయ్య గారి కాంశ్య విగ్రహము మరియు వారికి మందిరము నిర్మాణము జరిగినందుకు సేవా సంఘముల వారిని మన:స్ఫూర్తిగా అభినందించారు.

ఈ కళ్యాణ మండపములో పేరుగాంచిన రంగస్థల నటులతో గుంటూరు వారిచే వారము రోజులు నాటక పోటీలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతులు అందజేసి సత్కరించటము జరిగినది. ఈ పోటీలలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో వివిధ ప్రాంతములు వారు పాల్గొని విజయవంతముగా ప్రదర్శించినారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి