మొత్తం పేజీ వీక్షణలు

31, జులై 2022, ఆదివారం

క్లైబ్యం మాస్మగమః పార్థనైతత్త్వ య్యుపపద్యతే

 క్లైబ్యం మాస్మగమః పార్థనైతత్త్వ య్యుపపద్యతే

క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరన్తప. (2-3) 

ఓ అర్జునా అధైర్యమును (భయమును) పొందకుము. ఇట్టి పిరికితనము నీకు తగదు. నీచమగు ఈ హృదయ దౌర్బల్యమును విడనాడి లెమ్ము!! కర్తవ్యమునకు గడంగుము !!

ఈ ఒక్క శ్లోకమును చదివినచో గీతయంతయు చదివిన ఫలితమును  మనుజుడు పొందగలడు. ఏలయనిన, గీత యొక్క సందేశమంతయు ఈ ఒక్క  శ్లోకములోనే ఇమిడియున్నది.

If one reads this one sloka he gets all the merits of reading the entire Gita ; For, in this one sloka lies imbedded the whole Message of the Gita

హృదయములో వెలుగు

 వేల వేలు వెలగల నోట్లను మీరు చూచియున్నారుగదా ! ఆ కాగితపు తునకకు మీరు గౌరవము చేయుటలేదు. ! దానిలోగల ముదలకుగదా వేలకొలది రూపాయ లిచ్చుచున్నారు. 

ఆలాగున జనులజాతి, కుల, ఆశము, ఆడంబరములకు కాదు భక్తులు చూడవలసినది, వారి హృదయములో వెలుగుచుండు

ఆ దివ్యదైవజ్ఞానమున కుండవలయు, నోటు కాని చిత్రవిచిత్ర రంగులతో కూడిన సబ్బుబిళ్ళ మొదలైన వస్తువులకు చుట్టివచ్చెడు కాగితములుపయోగము లేనట్లు కుల ఆశ్రమాది బహిరంగములను చూచి మోసపోకుడు.

joy of freedom

సాంఘిక, రాజకీయ స్వాతంత్య్రాలను పొందినా, ఇంద్రియ కింకరులమై ఉంటే - యదార్ధ స్వాతంత్య్రం, సౌఖ్యం అనుభవించలేం.

One may gain political and social independence but if he is a slave to his passions and desires he cannot feel the pure joy of freedom

స్వరూపజ్ఞానము ద్వారా మోక్షము

ఈ దినమున బ్రతికి రేవు చనిపోవనున్న నీవు ఇపుడే ఈశ్వరుని ధర్మశాసనముననుసరించి నడచుకొందునని ప్రతిజ్ఞ చేసితివా నీ అంతరాత్మ ఇపుడే ప్రజ్వరిలును. 

ఇతరులపై ఆధారపడి వారి కష్టముల మీదనే బ్రతు కదలంచితివా నీకు - నరకప్రాపప్తియే

అధికమైన ధ్యానముతో మననము చేసినచో భ్రమను , జయించవచ్చును. మోక్షమును స్వరూపజ్ఞానము ద్వారా తప్ప ఇతర మార్గముల ద్వారా పొందలేము.

ఇతరుల మంచి లక్షణములనే చూడుము

ప్రపంచములోని మహాపురుషులు లేక భగవంతుడు అయినా ఎంత ఉపదేశము చేసినను లాభము లేదు. 

ఎంత వరకు తన్ను తానుపదేశించుకొనడో, అంతయు నిష్ప్రయోజనమే, ఇతరుల ఉపదేశము ఏ మాత్రము లాభకారికాదు. 

ఈ క్షణములో నీవు సాక్షాత్కారము పొందవచ్చును. మోహము పరిత్యజించుము. 
అసూయా ద్వేషములను పెరికి పారవేయుము. 

మీ ఆత్మను మీరు గౌరవించినచో ప్రతి వ్యక్తి మిమ్ములను గౌరవించును. 

ఇతరుల దోషములను చూడకుము. నీ దోషములనే చూచుచుండుము. 

ఇతరులనుద్దరించుదునను విచారము విడువుము. 

ఇతరుల మంచి లక్షణములనే చూడుము. అహంకారముండరాదు.

నీవు వృక్షానివి అయితే నేను పక్షిని అవుతాను.

స్వామీ! 

నీవు వృక్షానివి అయితే నేను పక్షిని అవుతాను. 

నీవు సరోవరానివి అయితే నేను చేపను అవుతాను. 

నీవు పర్వతము అయితే నేను నెమలిని అవుతాను. 

నీవు వెన్నెలవు అయితే నేను చకోరాన్ని అవుతాను.


మనుజ ధర్మము

మానవుడు తన నియమములను తప్పి ప్రవర్తించు కారణము వల్లనే కలిపురుషుడు పట్టుకొని బాధించును. మానవుడు 25 సంవత్సరముల వరకు ఆధ్యయనము గురుశుశ్రూష గాయత్రి మంత్ర జపము, బ్రహ్మచర్యము శీలించుట చేయవలయును. తర్వాత గృహస్థాశ్రమము స్వీకరించి గృహస్థ జీవితమును ఏబది సంవత్సరముల వరకు శాస్త్రవిధి ప్రకారమున నడుపుకొనుట తరువాత పండ్రెండు సంవత్సరములు అనగా 62 సంవత్సరముల వరకు వాన ప్రస్థాశ్రము గడుపుట ఆ పెని అన్నిటిని వదలి సన్యాసిjైు ఆత్మభావములో ఉండి తనువును చాలించుట ఇదియే మనుజ ధర్మము.