మొత్తం పేజీ వీక్షణలు

3, జులై 2022, ఆదివారం

విభవము లెల్ల వీడి, పతి వెంటనె కారడవుల్ గమించి

    విభవము లెల్ల వీడి, పతి

       వెంటనె కారడవుల్ గమించి, గొ

    ప్ప భయము లొక్కపెట్టునను

        ప్రాణములన్ బెకలింప జూచినన్

    ప్రభు వగు రామునే మదిని

        భద్రముగా నెలకొల్పి మించెనే!

    త్రిభువనముల్ ప్రియంబుగ ను

        తించెనె అగ్ని పునీత జానకిన్!

 రావణవధానంతరం అయోధ్య కేతెంచిన సీతా రామ లక్ష్మణులను దర్శించి సంభాషించి జరిగిన సంఘటనలను ఆనం దాశ్చర్యాలతో విని పులకించి అయోధ్యలోని ముత్తైదువు లిలా సీతాదేవిని కొనియాడినారు.

   "జానకి అయోధ్యా నగర జీవితమూ వదలి పెట్టింది. అంతః పుర కాంతగా పొందే రాజ భాగా లన్నీ విడిచి పెట్టింది. క్రూర మృగాలూ రాక్షసులూ సంచరించే నిర్జ నారణ్యాలలో నివసించడానికి భర్తయైన రాముని వెంట వెళ్లిపోయింది. రామ లక్ష్మణులు తనను వరించకపోతే శూర్పణఖ ప్రాణాలు పెకలింప జూసినా.. తనను వరించకపోతే ప్రాణాలు తీస్తా నని రావణుడు బెదిరించినా.. రాముణ్ణే మనసులో స్థిరంగా నిలుపుకొని సీతమ్మ తొణకలేదు బెణకలేదు. అగ్నిపరీక్ష లోకూడ ఉత్తీర్ణురాలై నిలిచి నారీలోకానికే ఆదర్శప్రాయురా లయింది. మూడులోకాలూ ఆమెను కొనియాడినవి"


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి