హనుమ యబ్ధి దాటి యవనిజాతను జూచె..
హనుమ వెనుక నుండినందువలన
వానరులకు గౌరవ మ్మెంతయొ వరించె
లెక్క మీద సున్న లెక్కినట్లు
వనవాసానంతరం సీతా రామ లక్ష్మణు లయోధ్యను చేరుకోగా పౌరు లిలా ముచ్చటించుకొన్నారు.
"సీతాన్వేషణ మనే గొప్ప పని హనుమచేత మాత్రమే సాధింపబడినది. హనుమంతునివలన వానరులకు గౌరవ మెంతో కలిగినది ఒకటి పక్కన సున్నలు చేరినట్టు." ~~~~~~~~~
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి