మొత్తం పేజీ వీక్షణలు

26, సెప్టెంబర్ 2022, సోమవారం

వరగుణుండు వశిష్ఠుతో మహి భర్త మాటలు విన్న వా

   వరగుణుండు వశిష్ఠుతో మహి

       భర్త మాటలు విన్న వా

   రరయగా పురమందు జెప్పిరి..

       యార్య పుత్రుని తల్లి చా

   ల రహి మీర బహూకరించె వి

       లాస మొప్పగ.. భక్తి ల 

   క్ష్మి రభసంబున నర్చ జేసెను

        మేలు గోరి కుమారుకున్


వశిష్ఠునితో మహిభర్త (దశరథుడు)  రేపే రాముని రాజును చేస్తా నన్న సమాచారం పురమంతా పాకిపోయింది. ఆర్యపుత్రుని (రాముని) తల్లి కౌసల్య ఆ శుభవార్త అందించిన వారికి రహి (ఆనందం) మీర బహుమానము లిచ్చింది. రామచంద్రుని మేలుకోసం భక్తితో రభసముగా (వెంటనే) లక్ష్మీదేవిని పూజించింది. 

    (కౌసల్యా పుత్రవత్సలా.. లక్ష్మీం పర్యచర ద్దేవీం రామస్యార్థ ప్రసిద్ధయే.. అధ్యాత్మ రామాయణము బా.కాం. 2-42)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి