తెలిసినది చెప్పు టది యొప్పు.. తెలుపకున్న
చెరువుకొనుచున్న జడ నున్న విరుల యాన..
ఊరకుంట మ రేలనే! ఓ ప్రియ సఖి!
చెప్పవే! సత్వరం బా విశేష మేమొ!
రామచంద్రాభిషేచనం..
శ్వో భవిష్యతి తే నాద్య సర్వతోఽలంకృతం పురం
(అధ్యాత్మ రామాయణము అయోధ్యా కాండము 2-50,51)
(శ్రీ రాముని పట్టాభిషేకము రేపు జరుగుతుంది. అందుకే నగరమంతా అలంకరించబడింది.) అన్న మాటలు వినగానే మంథర కైకేయి మందిరానికి వెంటనే వెళ్ళింది.
"ఒక గొప్ప విశేషం జరుగబోతోంది." అని ఉపక్రమించింది. ఎలా చెప్పాలో తోచలేదు. నాన్చుతున్నది. అప్పుడు జడలో పూవులు చెరువు (తురుము) కుంటున్న కైక ఉత్సుకతతో ఇలా అడిగింది.
చెరువు = పూలు మొదలైనవి కొప్పున దూర్చు.. గ్రుచ్చు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి