అధికార మది మాకు నావశ్యకమె గాని
"అగునె సద్వినియోగ" మనగ రాదు..
ధన మన్నదే మాకు దండిగా కావలె
"నగునె ధర్మార్జన" మ్మనగ రాదు..
ప్రజల ఓట్లే మాకు నిజముగా కావలె
వారి సుఖము మాట పలుకరాదు..
మాట నెగ్గుట యదే మాకు కావలె గాని
పలుకులో సత్యంబు పనికిరాదు..
ఇట్టి నాయకాళి మట్టిగొట్టుకుపోవ
గట్టి నాయకాళి కావలయును
నిర్భయముగ ప్రజలు నిశ్చింతతో నుండు
రమ్యమైన దినము రావలయును. 2
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి